ఆ రోజుల్లో, కళ కళ కోసమే అని వాదించే అబ్సర్డిస్టులు, నాటకాన్ని సాంఘిక, రాజకీయ మార్పుకి వేదిక కావాలని వాదించే బ్రెఖ్టియన్ల మధ్య వాదోపవాదాలు వాడిగా వేడిగా నడిచేవి. కెనెత్ టైనన్ అబ్సర్వర్ పత్రిక నడిపేవాడు. అతను ఉద్యమకారుల పక్షాన, ఐనెస్కో కళాకారుల పక్షాన ఉండేవారు. ఐనెస్కో కళాకారుల కవిత్వకాల్పనికతను సమర్థించేవాడు. మొదటినుంచి ఐనెస్కోనే నా హీరో.

ప్రాణసఖిగా అతని జీవితంలోకి ప్రవేశించి, ప్రేయసిగా మారిన ఆమె ఉన్నట్టుండి ఒకనాడు తన జీవితాన్నుండి అతన్ని బహిష్కరించింది ఎందుకెందుకెందుకెందుకని అడిగేందుకు వీలివ్వకుండానే. ఒకే చరణం పదే పదే పాడే అరిగిపోయిన గ్రామఫోను రికార్డ్ లాగా ఆమెనూ, ఆమె జ్ఞాపకాలనూ మించి ఆలోచించలేకపోయాడు అతను.

సంస్కృత కావ్యసాహిత్యం అనగానే మనకు ముందుగా కాళిదాసు (క్రీ. శ. 4వ శతాబ్ది) గుర్తుకు వస్తాడు. శివ పార్వతుల పుత్రుడైన కుమారస్వామి జననాన్ని వర్ణించే కాళిదాసు రచన కుమారసంభవమ్ కావ్యంలో కథ అంతా శివ పార్వతుల గురించే అయినా ఎక్కడా గణేశుని గురించి దీనిలో ప్రస్తావన కనిపించదు. ఏకాదశ సర్గలో చేసిన వర్ణన ద్వారా కుమారస్వామి జననం ద్వారానే పార్వతి మొదటిసారి తల్లి అయ్యిందని కవి మనకు విస్పష్టంగా తెలియజేస్తాడు.

వీటిలో కొమ్మూరి ఎక్కడున్నారో? కొవ్వలి ఎక్కడున్నారో? ఎంతోమంది నేరస్థులని ఒంటి చేత్తో మట్టికరిపించిన ఆ డిటెక్టివ్ యుగంధర్ రుబ్బురోట్లో నలిగిపోతుంటే… పాపం ఎంత యమయాతన పడ్డాడో. అయ్యో… అయ్యో… ఆ క్రిజ్లర్ కారు ఎలా పచ్చడయిపోయిందో? విక్రమార్కుడి భుజంమీది ఆ భేతాళుడన్నా చెట్టెక్కి తప్పించుకున్నాడా? లేకపోతే వాడూ రోట్లో పడి పచ్చడయిపోయేడా?

నిందాస్తుతి అంటే పైకి తిడుతున్నట్టు, గేలి చేస్తున్నట్టు, కనిపిస్తూనే స్తుతి చేయడం. నిందాస్తుతిని సమర్థంగా నిర్వహించాలంటే కవికి మంచి చమత్కారం ఉండాలి, భాషపై గొప్ప పట్టు ఉండాలి. భాషపై పట్టు అంటే కేవలం పాండిత్యం కాదు, సజీవమైన వాడుక. మాట్లాడే భాషలో ఉండే కాకువు దీనికి ప్రధానమైన సాధనం. కోపం, వెటకారం, భయం మొదలైన భావాలు స్వరం ద్వారా ధ్వనించే శక్తిని కాకువు అంటారు.

పంట కోసినప్పటి నుంచి
నారు పోసిందాకా
అనుభవిస్తూనే వుంది
ఓ మాటైనా పలకలేనితనాన్ని
మూగపోయిన కవిలా
నేల!

ఆళ్ళేమో నీకు లిఫ్ట్ దగ్గిరే ఎదురౌతారు డవ్వు సబ్బు వాసనల్తో నీలి మబ్బు నురగలో కాలు జారి పడ్డ వేళ నీకు నిద్దరే నో నో అనేసి న్యూడ్ బార్స్‌లో లాప్పులమ్మా, అప్పల్నర్సమ్మా నువ్వెళ్ళి సాగర సంగమం, శంకరాభరణం సూసుకో బుజ్జమ్మా, మేవలా పోయొస్తామని–చిలిపి చిలిపి కవ్వింత కబుర్ల కళ్ళతో అలాలాలా లిఫ్టు దిగిపోతా ఉంటే, ఆళ్ళు కుర్రోలమ్మా…

ఒకసారి ఓడిపోయిన పద్యం ఇక
మళ్ళీ ఎప్పటికీ గెలవకపోవచ్చు.
తలవంచి కనులు దించిన దీనిని
ఓటమి, గెలుపులు నాకొకటేనంటూ
ఓదార్చాలనిపిస్తుంది.

ఈ వ్యవహారం అంతు తేలనప్పటికీ మా బండల మీది సంబంధాల్లో మాత్రం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మిత్రులు శత్రువులవుతున్నారు. ఒకరి మొహం ఇంకొకరు చూసుకోడానికి కూడా ఇష్టపడని వాళ్ళు ప్రాణ స్నేహితులయిపోతున్నారు. కొత్త రొమాన్సులు మొదలవుతున్నాయి. అత్తగారి ఆరళ్ళ గురించిన కబుర్లకి అంతమే లేదు. బండలు మాత్రం నిర్వికారంగానే గమనించాయి అంతా.

నిన్ను చూసి అరుస్తుందీ లోకం
అన్నా! వదలకు ఆత్మస్థైర్యం
రెండు నాలుకల బుసకొడుతుందది
గుండె దిటవుచెయ్ తమ్మీ! బెదరకు
రెండు మాటలీ లోకం పోకడ
విచిత్రమైనది భాయ్, తెలుసుకో!

చిన్నప్పుడోసారి ఇంట్లో నన్నొదిలి నాలుగురోజులు ఎటోపోయి తర్వాత ఇంటికొచ్చారు అమ్మా నాన్నా. నేను ఆడుకొంటూ పట్టించుకోలేదు, కానీ కాసేపటికి అనుమానమొచ్చి లోపలికెళ్ళి చూశాను. అమ్మ వళ్ళో ఓ పాప పడుకొని ఉంది. ఎవరోలే పాపం అని నా మానాన నేను ఆడుకొంటూ కొంచెం సేపయ్యాక మళ్ళీ చూస్తే అదింకా ఆ ఫోజు లోనే ఉంది.

అరిచి గీపెట్టి, తనకు కావలసిన విధంగా కథ తయారు చేయించుకుని, పాటలు తన అభిరుచికి తగ్గట్టు సంగీత దర్శకుని నుంచి రప్పించుకుని, తన కష్టాన్నంతటినీ దర్శకుడి చేతిలో పెట్టి, మంచి సినిమా తయారు కావడానికి ఇతోధిక సాయం చేసి, ఆనక పక్కకు తప్పుకునేవాడు– ఒక విధంగా ఉత్తమ నిర్మాత.

ఇంతలో హడావిడిగా సుబ్బారావు అచ్చటికి వచ్చెను. నావైపుకి అభిముఖుడై వచ్చుచూ ఏమాలోచించుచున్నారని అడిగెను. భళారే విచిత్రం పాటను గూర్చి ఆలోచించుచుంటినని, అటులనా, ఎంతైనా నా ముందు తరము వారు కదా! అని వెటకారముగ బలికి నవ్వెను. వంకాయవంటి కూరయు వంకజముఖి సీత వంటి భార్యామణియు అన్న నానుడి తెలుసునా అనగా తనకు సంస్కృతము రాదనెను.

మేఘం మనిషైతే ఎంత బాగుండును
నాలుగు మాటలు చల్లగా విన్పించేది
మనిషైనా మేఘమైతే బాగుండును
వేచిన ఏ మనసుపైనో పన్నీటి జల్లు కురిసేది

తెలుగు, కన్నడము, హిందీ, మరాఠీ మున్నగు భాషలలో గణములను జ్ఞాపకములో ఉంచుకొనడానికి య-మా-తా-రా-జ-భా-న-స-ల-గం అనే ఒక సులభసూత్రము వ్యాప్తిలో నున్నది. ఛందస్సు నేర్చుకొనే విద్యార్థికి ఇది తెలిసిన విషయమే. గణము యొక్క పేరు ముందే ఉండడము వలన అందులోని గురు లఘువులను తెలిసికొనుట సులభము అవుతుంది.

ఈ పరిస్థితులున్న సమాజంలో భావ వ్యక్తీకరణ, వాక్‌-స్వాతంత్రము ఇవన్నీ నాగరిక ప్రపంచంలో మాటలుగానే వాడబడుతున్నాయి. కులవ్యవస్థ పాతుకుపోయున్న సమాజంలో ఈ కొత్త నిర్వచనాలేవీ చొచ్చుకుపోయి ప్రభావితం చేసేంతగా బలపడలేవు. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది చదువు లేకపోవడం. రెండవది, మనకు లభించే చదువుల నాణ్యత.

గడినుడి 12 కూడా ఎవరూ చివరిదాకా పూర్తిగా చేయలేకపోయారు, సరిచూపు ఆప్షన్ ఇచ్చేదాకా, ఒక్కరు మినహా. ఆ ఏకైక విజేత సతీష్‌కు మా అభినందనలు. సరిచూపు ఆప్షన్ ఉపయోగించుకొని గడి పూర్తిగా నింపిన మొదటి నలుగురు: ఉరుపుటూరి శ్రీనివాస్, వేదుల సుభద్ర, భమిడిపాటి సూర్యలక్ష్మి, పూల రమాదేవి.

గడి నుడి – 12 సమాధానాలు, వివరణ.

“మేడమ్, మీ తీయని స్వరంలో రిపోర్ట్ అన్న మాట రావచ్చా? ఈ శాఖ మొదలైనప్పట్నుండి నేను బిల్లులన్నీ సరిగ్గానే చెల్లిస్తూ వస్తున్నాను. నాకు దేశభక్తి, భూభక్తి, భూగురుత్వాకర్షణభక్తి మెండుగానే ఉన్నాయి. గురుత్వాకర్షణ గురించి ఒక కవితైనా చదవకుండా ఏ రోజూ నేను నిద్రపోయినవాడిని కాను. మేడమ్, ఎలాగైనా నేను ఈ బిల్లు చెల్లించేస్తాను.”