పూర్వరంగం
కథాసంగ్రహం
ఆసన్నమైయున్న మహాయుద్ధం నిమిత్తమై మంత్రాలోచన చేసేందుకు సభను ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు. భీష్ముడిని తమ సర్వసైన్యాధిపతిగా ఎన్నుకున్న కాస్సేపట్లో పాండవదూతగా శ్రీకృష్ణుడు వచ్చేస్తాడు, సంధి పొసగదన్న నిశ్చయంతోనే.
దూతను అమర్యాద చేద్దామనుకున్న దుర్యోధనుడి పథకం కృష్ణమాయ ముందు చతికిలపడుతుంది. కుశలప్రశ్నలతో మొదలవుతుంది సంభాషణ. కృష్ణుడి నయోక్తుల, భయోక్తుల వానను దులిపేసుకున్న దుర్యోధనుడు (మూల)కథాప్రకారం కృష్ణుణ్ణి బంధించబోతాడు; భంగపడతాడు. క్రుద్ధుడైన కృష్ణుడు దుర్యోధనుడిని సంహరించడానికి సుదర్శనచక్రాన్ని ఆహ్వానిస్తాడు. సుదర్శనం సమయానికి తగు మాటలాడి ఆయన్ని శాంతింపజేస్తుంది. ఆ చక్రమూ, తనను అనుసరించి వచ్చి నాటకాన్ని కొంచెం సాగదీసిన గదాఖడ్గాదులు తిరిగి వెళ్ళిపోయాక, కృష్ణుకు కూడా బయల్దేరబోతుండగా ధృతరాష్ట్రుడు వచ్చి క్షమాపణ వేడుకుంటాడు. అతణ్ణి మన్నించేసి కృష్ణుడు భరతవాక్యం చదవడంతో నాటకం పూర్తవుతుంది.
కొన్ని విశేషాలు
- ఇదీ వ్యాయోగమే: ఏకాంకిక; వీరరసప్రధానం; ఐతిహాసికేతివృత్తం; ప్రఖ్యాతుడూ, దివ్యుడూ అయిన నాయకుడు; కథాకాలం ఒకే ఒక్క రోజు.
- నాటకారంభంలో వచ్చే మంగళశ్లోకంలో “నముచి అనే రాక్షసుణ్ణి కొనగోటితో ఆకాశంలోకి చిమ్మివేసిన ఉపేంద్రుడి (వామనుడి) పాదం మనను కాపాడుగాక” అని ఉంటుంది. ఋగ్వేదంలోనూ, మహాభారతంలోనూ, భాగవతంలోనూ కనబడే కథల్లో నముచిని ఇంద్రుడు హతమారుస్తాడు, ఉపేంద్రుడు కాదు. మరి భాసుడు నముచివధను ఉపేంద్రుడి ఖాతాలో ఎందుకు వేసాడు?
“ఋగ్వేదంలో వచ్చే నముచి మొదలైన రాక్షసులు మేఘాలలో నివసిస్తూ వర్షజలం భూమికి చేరకుండా అడ్డుపడుతుంటారు. ఇంద్రుడు ఆ రాక్షసులను సంహరించి వర్షధారలను ప్రవహింపజేస్తాడు. ఆకాశాన్ని ఆక్రమించిన వామనపాదపు కొనగోరు ఆ నముచిని చిమ్మే ఉండాలి,” అని వ్యాఖ్యానించారు “ఒక అనుభవజ్ఞులైన విశ్వవిద్యాలయాచార్యులు.”
- ఈ నాటకంలో, దుర్యోధనుడి సభలో భీష్మాది సభాసదులు కనబడరు. దుర్యోధనుడు వారిని ప్రశ్నిస్తూ, వాళ్ళ మాటలను వింటున్నట్లు నటిస్తూ తన మాటల్లో అప్పజెబుతూ ఉంటాడు. ఈ సంభాషణాప్రక్రియను ఆకాశభాషితం అంటారు.
- ద్రౌపదీపరాభవపు చిత్రపటం ఆధారంగా వెనకటి కథను గుర్తుకు చేయడం భాసుడి ఊహావైచిత్రికి తార్కాణం. ఈ ఫ్లాష్బాక్, వేగంగా సాగే కథకు లోతును సమకూరుస్తుంది, ప్రేక్షకుల ఆసక్తిని చెదరకుండా కాపాడుతుంది, దుర్యోధనుడి స్వభావంలోని వికృతులను నొక్కి చెబుతుంది కూడా.
- కాలికేస్తే మెడకేసి మాట్లాడడంలో దిట్ట అయిన దుర్యోధనుడు ఒకచోట “తృణాన్తరాభిభాష్యో భవాన్” (తమరు గడిపరక కన్నా హీనం అనే అర్థంలో) అని నిరసిస్తాడు కృష్ణుడిని. ఆ మాట చదివినప్పుడు, రావణుడితో మాట్లాడేప్పుడు సీత గడ్డిపోచను నడుమన ఉంచుకొని మాట్లాడిన వైనం గుర్తుకు వచ్చింది.
- “సముద్రందాకా విస్తరించినదీ, హిమాలయాలూ, వింధ్యపర్వతమూ కుండలాలుగా కలదీ అయిన భూమిని రాజసింహుడు పరిపాలించుగాక” అనే భరతవాక్యంతో ఈ నాటకం ముగుస్తుంది. భాసనాటకచక్రంలోని ఏడు నాటకాల భరతవాక్యాలలో రాజసింహుడి పేరు వస్తుంది. మూడింట రాజసింహుడి పేరూ, హిమవద్వింధ్యకుండల అనే ఉత్ప్రేక్షా కనబడతాయి. “ఎవరీ రాజసింహుడు?” “హిమవద్వింధ్యకుండల, సాగరపర్యంత అనే మాటలు అతడి రాజ్యపు విస్తృతిని సూచిస్తాయా?” వంటి ప్రశ్నలు “భాససమస్య”లో భాగాలే.
పాత్రలు
- కంచుకి – బాదరాయణుడని పేరు
- దుర్యోధనుడు
- వాసుదేవుడు
- ధృతరాష్ట్రుడు
- సుదర్శనము – వాసుదేవుడి చక్రము
సూత్రధారః:
వ్యావిద్ధో నముచిర్యేన తనుతామ్రనఖేన ఖే ।। 1 ।।
ఏవమార్యమిశ్రాన్విజ్ఞాపయామి । అయే కిం ను ఖలు మయి విజ్ఞాపనవ్యగ్రే శబ్ద ఇవ శ్రూయతే? అఙ్గ, పశ్యామి ।
సూత్రధారుడు:
పూజ్యులైన మీకు మనవి చేసుకుంటున్నాను… అరె, ఇదేమిటి? ప్రేక్షకులకు నా మనవి వినిపించబోతుండగా, ఏదో శబ్దం వినబడుతున్నది? చూస్తాను.
భో భోః ప్రతిహారాధికృతాః! మహారాజో దుర్యోధనః సమాజ్ఞాపయతి ।
ఓ ద్వారపాలకులారా, దుర్యోధనమహారాజు ఆజ్ఞాపిస్తున్నాడు.
సూత్రధారః:
ఉత్పన్నే ధార్తరాష్ట్రాణాం విరోధే పాణ్డవైః సహ ।
మన్త్రశాలాం రచయతి భృత్యో దుర్యోధనాజ్ఞయా ।। 2 ।।
స్థాపనా ।
సూత్రధారుడు:
పాండవులతో వైరం కలిగింది. ఆ విషయమై సమాలోచనం చేసేందుకు, దుర్యోధనుడి ఆజ్ఞ మేరకు, సేవకుడు సభను సిద్ధం చేస్తున్నాడు.
(స్థాపన)
కాఞ్చుకీయః:
అయే అయం మహారాజో దుర్యోధన ఇత ఏవాభివర్తతే । య ఏషః,
శ్యామో యువా సితదుకూలకృతోత్తరీయః
సచ్ఛత్రచామరవరో రచితాఙ్గరాగః ।
శ్రీమాన్ విభూషణమణిద్యుతిరఞ్చితాఙ్గో
నక్షత్రమధ్య ఇవ పర్వగతః శశాఙ్కః ।। 3 ।।
కంచుకి:
నల్లనివాడు. యువకుడు. తెల్లని పట్టు ఉత్తరీయాన్ని ధరించి, మహారాజోచితమైన ఛత్రచామరాలతో, చందనపు మైపూతతో, నగలలోని మణుల వెలుగులో మెరుస్తున్న దేహంతో ఉన్నవాడు. శ్రీమంతుడు. చుక్కల నడుమన పున్నమి చంద్రుడిలా ఉన్నవాడు.
దుర్యోధనః:
ప్రాప్తం రణోత్సవమిమం సహసా విచిన్త్య ।
ఇచ్ఛామి పాణ్డవబలే వరవారణానా–
ముత్కృత్తదన్తముసలాని ముఖాని కర్తుమ్ ।। 4 ।।
దుర్యోధనుడు:
కాఞ్చుకీయః:
కంచుకి:
దుర్యోధనః:
దుర్యోధనుడు:
ఏమీ, ఏమంటున్నారు మీరిద్దరూ? ఇది చాలా పెద్ద విషయం కదా. సంప్రదింపుల తరువాత చెప్పడం ఉచితమని అంటున్నారా. మంచి మాటే. రండి మరి, సభామందిరంలోనికి ప్రవేశిద్దాము.
ద్రోణాచార్యా! నమస్కరిస్తున్నాను. సభలోనికి రండి. శకుని మామా! మీకు నమస్కరిస్తున్నాను, సభలోనికి రండి. వైకర్ణా! వర్షదేవా! మీరూ రండి. అందరు రాజులారా, నిస్సంకోచంగా ప్రవేశించండి. మిత్రమా కర్ణా! మనమూ ప్రవేశిద్దాము.
సేనానినాదపటహస్వనశఙ్ఖనాదై–
శ్చణ్డానిలాహతమహోదధినాదకల్పైః ।
గాఙ్గేయమూర్ధ్ని పతితైరభిషేకతోయైః
సార్ధం పతన్తు హృదయాని నరాధిపానామ్ ।। 5 ।।
తీవ్రమైన గాలిచేత కొట్టబడిన సముద్రపు హోరును తలపింపజేస్తూ సైనికుల జయధ్వానాలు, భేరీధ్వనులు, శంఖనాదాలు మోగుతూ ఉండగా భీష్ముడి తలపై పడుతున్న అభిషేకజలాలలాగా శత్రురాజుల గుండెలు నేలఁ జారి పడిపోవుగాక!
కాఞ్చుకీయః:
కంచుకి:
దుర్యోధనః:
దుర్యోధనుడు:
కాఞ్చుకీయః:
కంచుకి:
దుర్యోధనః:
దుర్యోధనుడు:
కాఞ్చుకీయః:
కంచుకి:
దుర్యోధనః:
దుర్యోధనుడు:
కాఞ్చుకీయః:
కంచుకి:
దుర్యోధనః:
గ్రహణమస్యాత్ర హితం పశ్యామి ।
గ్రహణముపగతే తు వాసుభద్రే
హృతనయనా ఇవ పాణ్డవా భవేయుః ।
గతిమతిరహితేషు పాణ్డవేషు
క్షితిరఖిలాపి భవేన్మమాసపత్నా ।। 6 ।।
అపి చ యోఽత్ర కేశవస్య ప్రత్యుత్థాస్యతి స మయా ద్వాదశసువర్ణభారేణ దణ్డ్యః । తదప్రమత్తం భవన్తు భవన్తః ।
దుర్యోధనుడు:
వాసుదేవుణ్ణి బంధించితే, పాండవులు కళ్ళు పోగొట్టుకున్నవాళ్ళవుతారు. గతీ మతీ లేని ఆ పరిస్థితిలో పాండవులుండగా, ఏ పోటీ లేకుండా, భూమి యావత్తూ నాదే అవుతుంది.
ఇంకో మాట – కృష్ణుడు సభలోకి ప్రవేశిస్తుండగా లేచి నిలబడి లేదా ఎదురేగి స్వాగతించినవారు పన్నెండు కావళ్ళ బంగారాన్ని అపరాధశుల్కంగా చెల్లించాల్సి ఉంటుంది. కనుక మీరంతా హెచ్చరికగా ఉండండి.
కాఞ్చుకీయః:
కంచుకి:
దుర్యోధనః:
దుర్యోధనుడు:
కాఞ్చుకీయః:
కంచుకి:
దుర్యోధనః:
దుఃశాసనపరామృష్టా సంభ్రమోత్ఫుల్లలోచనా ।
రాహువక్త్రాన్తరగతా చన్ద్రలేఖేవ శోభతే ।। 7 ।।
దుర్యోధనుడు:
దుశ్శాసనుడి చేత చిక్కి తత్తరపాటుతో విప్పారిన కళ్ళతో రాహువు నోటబడ్డ నెలవంకలా ప్రకాశిస్తున్నది.
సత్యధర్మఘృణాయుక్తో ద్యూతవిభ్రష్టచేతనః ।
కరోత్యపాఙ్గవిక్షేపైః శాన్తామర్షం వృకోదరమ్ ।। 8 ।।
సత్యమూ, ధర్మమూ, కరుణా ఉన్నవాడే. జూదం కారణంగా బుద్ధి భ్రష్టమైనవాడు. కృద్ధవృకోదరుడిని తన కడగంటి చూపులతో శాంతింపజేస్తున్నాడు.
రోషాకులాక్షః స్ఫురితాధరోష్ఠ–
స్తృణాయ మత్వా రిపుమణ్డలం తత్ ।
ఉత్సాదయిష్యన్నివ సర్వరాజ్ఞః
శనైః సమాకర్షతి గాణ్డివజ్యామ్ ।। 9 ।।
ఏష యుధిష్ఠిరోఽర్జునం నివారయతి ।
కోపంతో కలవరపడిన కన్నుల వాడు. క్రింది పెదవి వణుకుతున్నవాడు. శత్రుసమూహాన్ని గడ్డిపరకలా పరిగణించి, రాజులందరినీ నశింపజేసేందుకా అన్నట్లు నెమ్మదిగా గాండీవపు నారిని లాగుతున్నాడు.
యుధిష్ఠిరుడు అతణ్ణి నిలువరిస్తున్నాడు.
కృతపరికరబన్ధౌ చర్మనిస్త్రింశహస్తౌ
పరుషితముఖరాగౌ స్పష్టదష్టాధరోష్ఠౌ ।
విగతమరణశఙ్కౌ సత్వరం భ్రాతరం మే
హరిమివ మృగపోతౌ తేజసాభిప్రయాతౌ ।। 10 ।।
నడుమును బిగించి కట్టుకొని, కత్తినీ డాలునూ చేత పూని ఉన్నారు. కర్కశత్వంతో వీరిద్దరి ముఖాలు ఎఱ్ఱబడ్డాయి. క్రింది పెదవిని గట్టిగా పంటితో అదిమిపెట్టారు. మరణశంకను విడిచిపెట్టారు. సింహం పైకి ఉరుకుతున్న లేడి పిల్లలలా దుశ్శాసనుడి వైపుకు వేగంగా కదులుతున్నారు.
నీచోఽహమేవ విపరీతమతిః కథం వా
రోషం పరిత్యజతమద్య నయానయజ్ఞౌ ।
ద్యూతాధికారమవమానమమృష్యమాణాః
సత్త్వాధికేషు వచనీయపరాక్రమాః స్యుః ।। 11 ।।[
ఇతి ।
“యుక్తాయుక్తవిచక్షణ నశించిన వాడిని, ఎంతటి నీచుడను నేను! ధర్మాధర్మాలు తెలిసినవారు మీరు. కోపాన్ని వదిలిపెట్టండి నేడు, జూదంలో ఓడిపోవడంవల్ల కలిగిన అవమానాన్ని సహించక గెలిచినవారిపై తమ పరాక్రమాన్ని చూపేవారు వీరుల నిందకు పాత్రులవుతారు.” అని అంటూ.
అక్షాన్ క్షిపన్ సకితవం ప్రహసన్ సగర్వం
సఙ్కోచయన్నివ ముదం ద్విషతాం స్వకీర్త్యా ।
స్వైరాసనో ద్రుపదారాజసుతాం రుదన్తీం
కాక్షేణ పశ్యతి లిఖత్యపి గాం నయజ్ఞః ।। 12 ।।
ఈ ద్యూతనిపుణుడు తన అక్షవిద్యాప్రావీణ్యపు కీర్తితో శత్రువుల సంతోషాన్ని కుంచింపజేస్తున్నట్లుగా పాచికలను విసురుతూ, సగర్వంగా కుటిలపు నవ్వు నవ్వుతూ, ఎవ్వరినీ లక్ష్యపెట్టకుండా కూర్చొని, ఏడుస్తూ ఉన్న ద్రౌపదిని క్రీగంట చూస్తూ, నేల మీద ఏదో వ్రాస్తున్నాడు.
కాఞ్చుకీయః:
కంచుకి:
దుర్యోధనః:
దుర్యోధనుడు:
కాఞ్చుకీయః:
కంచుకి:
దుర్యోధనః:
ప్రాప్తః కిలాద్య వచనాదిహ పాణ్డవానాం
దౌత్యేన భృత్య ఇవ కృష్ణమతిః స కృష్ణః ।
శ్రోతుం సఖే! త్వమపి సజ్జయ కర్ణ! కర్ణౌ
నారీమృదూని వచనాని యుధిష్ఠిరస్య ।। 13 ।।
దుర్యోధనుడు:
మలినబుద్ధి అయిన కృష్ణుడు పాండవుల మాటమేరకు సేవకుడిలా వచ్చాడీనాడు… సఖా, కర్ణా! ఆడవాళ్ళ మాటల్లా కోమలంగా ఉండే యుధిష్ఠిరుడి మాటలను వినేందుకు నీ చెవులను సిద్ధంగా ఉంచుకో.
వాసుదేవః:
కృష్ణాపరాభవభువా రిపువాహినీభ–
కుమ్భస్థలీదలనతీక్ష్ణగదాధరస్య ।
భీమస్య కోపశిఖినా యుధి పార్థపత్త్రి–
చణ్డానిలైశ్చ కురువంశవనం వినష్టమ్ ।। 14 ।।
వాసుదేవుడు:
శత్రుసేనల ఏనుగుల కుంభస్థలాలను బద్దలుచేసే నిర్దాక్షిణ్యమైన గదను ధరించిన భీముడి క్రోధాగ్ని ద్రౌపదీపరాభవం కారణంగా రగులుకొన్నది. ఆ దావాగ్నివలనా, అర్జునుడి బాణాలనే ప్రచండపవనాలవలనా కురువంశమనే అడవి నశింపనున్నది.
ఆవాసాః పార్థివానాం సురపురసదృశాః స్వచ్ఛన్దవిహితా
విస్తీర్ణాః శస్త్రశాలా బహువిధకరణైః శస్త్రైరుపచితాః ।
హేషన్తే మన్దురాస్థాస్తురగవరఘటా బృంహన్తి కరిణ
ఐశ్వర్యం స్ఫీతమేతత్ స్వజనపరిభవాదాసన్నవిలయమ్ ।। 15 ।।
భోః!
తమ తమ ఇష్టాలకు అనుగుణంగా నిర్మించుకున్న రాజభవనాలు అమరావతీనగరపు భవనాలను పోలి ఉన్నాయి. ఆయుధాగారాలు విశాలంగా, రకరకాల పనిముట్లతో, ఆయుధాలతో నిండి ఉన్నాయి. అశ్వశాలలలో ఉన్న శ్రేష్ఠమైన గుఱ్ఱాల గుంపులు సకిలిస్తున్నాయి. ఏనుగులు ఘీంకరిస్తున్నాయి. స్వజనపరాభవం కారణంగా ఈ సంపద అంతా త్వరలోనే నశించనున్నది. అయ్యో!
సుయోధనో హి మాం దృష్ట్వా నైవ కార్యం కరిష్యతి ।। 16 ।।
కాఞ్చుకీయః:
కంచుకి:
వాసుదేవః:
వాసుదేవుడు:
దుర్యోధనః:
దుర్యోధనుడు:
వాసుదేవః:
వాసుదేవుడు:
దుర్యోధనః:
ఉత్సాహేన మతిం కృత్వాఽప్యాసీనోఽస్మి సమాహితః ।
కేశవస్య ప్రభావేన చలితోఽస్మ్యాసనాదహమ్ ।। 17 ।।
అహో బహుమాయోఽయం దూతః । (ప్రకాశమ్) భో దూత! ఏతదాసనమాస్యతామ్ ।
దుర్యోధనుడు:
సందేహాలకు అతీతంగా బుద్ధిని స్థిరం చేసుకొని అప్రమత్తంగా కూర్చొని ఉన్న నేను కేశవుడి ప్రభావం కారణంగా ఆసనంనుంచి జారిపడ్డాను.
అహో! పలు మాయలవాడు ఈ దూత. (ప్రకాశంగా) ఓయీ దూతా, ఇదిగో ఆసనం, కూర్చోవచ్చును.
వాసుదేవః:
సుయోధనోఽయం స్వజనావమానం
పరాక్రమం పశ్యతి బాలిశత్వాత్।
కో నామ లోకే స్వయమాత్మదోష–
ముద్ఘాటయేన్నష్టఘృణః సభాసు ।। 18 ।।
ఆః అపనీయతామేష చిత్రపటః ।
వాసుదేవుడు:
ఈ సుయోధనుడు మూర్ఖత్వం కొద్దీ తనవారి అవమానాన్ని తన పరాక్రమమన్నట్లుగా భావిస్తున్నాడు. ఏవగింపు లేకుండా, తన దోషాలను తానే సభలో ప్రకటించుకుంటారా ఎవరైనా?
ఛ, ఛ. ఈ చిత్రపటాన్ని ఇక్కణ్ణుంచి తొలగించండి.
దుర్యోధనః:
దుర్యోధనుడు:
కాఞ్చుకీయః:
కంచుకి:
దుర్యోధనః:
ధర్మాత్మజో వాయుసుతశ్చ భీమో
భ్రాతార్జునో మే త్రిదశేన్ద్రసూనుః ।
యమౌ చ తావశ్విసుతౌ వినీతౌ
సర్వే సభృత్యాః కుశలోపపన్నాః ।। 19 ।।
దుర్యోధనుడు:
ధర్మజుడు, వాయునందనుడైన భీముడు, నా తమ్ముడూ దేవేంద్రతనయుడూ అయిన అర్జునుడు, అణకువతో మెలగే ఆ కవలలు –- అశ్వినీసుతులు –- వీరందరూ, వారి భృత్యులతో సహా కుశలంగా ఉన్నారు కదా?
వాసుదేవః:
అనుభూతం మహద్దుఃఖం సమ్పూర్ణః సమయః స చ ।
అస్మాకమపి ధర్మ్యం యద్ దాయాద్యం తద్ విభజ్యతామ్ ।। 20 ।।
ఇతి ।
వాసుదేవుడు:
“ఎంతో దుఃఖాన్ని అనుభవించాము. ద్యూతసందర్భపు ఒప్పందాలకు పూర్తిగా కట్టుబడ్డాము. ధర్మం ప్రకారం దాయాదులుగా మాకు రావలసినదానిని పంచి ఈయగలవు,”
అని మనవి చేస్తున్నారు.
దుర్యోధనః:
వనే పితృవ్యో మృగయాప్రసఙ్గతః
కృతాపరాధో మునిశాపమాప్తవాన్ ।
తదా ప్రభృత్యేవ స దారనిఃస్పృహః
పరాత్మజానాం పితృతాం కథం వ్రజేత్ ।। 21 ।।
దుర్యోధనుడు:
అడవిలో మా చిన్నాన్న వేట సందర్భంలో తప్పు చేసి ముని శాపాన్ని పొందాడు. అప్పటినుంచి తను భార్యాసాంగత్యకాంక్షను విడిచిపెట్టాడు. ఇతరులవలన కలిగిన సంతానాన్ని ఆయన సంతానమని ఎలా అంటాము?
వాసుదేవః:
విచిత్రవీర్యో విషయీ విపత్తిం
క్షయేణ యాతః పునరమ్బికాయామ్ ।
వ్యాసేన జాతో ధృతరాష్ట్ర ఏష
లభేత రాజ్యం జనకః కథం తే ।। 22 ।।
మా మా భవాన్ ।
ఏవం పరస్పరవిరోధవివర్ధనేన
శీఘ్రం భవేత్ కురుకులం నృప! నామశేషమ్ ।
తత్ కర్తుమర్హతి భవానపకృష్య రోషం
యత్ త్వాం యుధిష్ఠిరముఖాః ప్రణయాద్ బ్రువన్తి ।। 23 ।।
వాసుదేవుడు:
మరి, విపరీతకామాసక్తుడైన విచిత్రవీర్యుడు క్షయగ్రస్తుడై నశించిపోయినప్పుడు, అంబికకు వ్యాసుడివల్ల జన్మించిన నీ తండ్రి ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని ఎలా పొందాడు?
వద్దు, నీవలా అనవద్దు.
ఈ విధంగా పరస్పరం శత్రుత్వం పెరగడంవల్ల కురువంశం పేరుకు మాత్రమే మిగులుతుంది. అందుచేత నీవు నీ కోపాన్ని అదుపులో పెట్టుకొని, యుధిష్ఠిరాదుల స్నేహపూర్వకమైన మాటలకు అనుగుణంగా నడుచుకో.
దుర్యోధనః:
రాజ్యం నామ నృపాత్మజైః సహృదయైర్జిత్వా రిపూన్ భుజ్యతే
తల్లోకే న తు యాచ్యతే న తు పునర్దీనాయ వా దీయతే।
కాఙ్క్షా చేన్నృపతిత్వమాప్తుమచిరాత్ కుర్వన్తు తే సాహసం
స్వైరం వా ప్రవిశన్తు శాన్తమతిభిర్జుష్టం శమాయాశ్రమమ్ ।। 24 ।।
దుర్యోధనుడు:
గుండెబలం ఉన్న రాజకుమారులు శత్రువులను గెలిచి రాజ్యాన్ని సాధించుకుంటారు. అది యాచించదగ్గది కాదు, దీనుడికి ఇచ్చేదీ కాదు. అనతికాలంలోనే రాజవ్వాలనే కోరిక ఉంటే, వాళ్ళు యుద్ధం చేయాలి. లేదా తమంతకు తామే – మత్సరభావాన్ని వదిలి – శాంతి కోసం మునివాటికలకు వెళ్ళిపోవాలి.
వాసుదేవః:
పుణ్యసంచయసంప్రాప్తామధిగమ్య నృపశ్రియమ్ ।
వఞ్చయేద్ యః సుహృద్బన్ధూన్ స భవేద్ విఫలశ్రమః ।। 25 ।।
వాసుదేవుడు:
పుణ్యాన్ని పోగుచేసుకోవడంవల్ల లభించే రాజ్యసంపదను పొందినవాడు, బంధుమిత్రులను మోసగించితే, అతడి శ్రమ అంతా విఫలమవుతుంది.
దుర్యోధనః:
కథమస్మాకమేవం స్యాత్ తేషు నిత్యాపకారిషు ।। 26 ।।
దుర్యోధనుడు:
వాసుదేవః:
కృత్వా పుత్రవియోగార్తాం బహుశో జననీం మమ ।
వృద్ధం స్వపితరం బద్ధ్వా హతోఽయం మృత్యునా స్వయమ్ ।। 27 ।।
వాసుదేవుడు:
అనేకపర్యాయాలు నా తల్లికి పుత్రవియోగదుఃఖాన్ని కలిగించి, వృద్ధుడైన తన తండ్రిని బంధించి అతడు తనంతకు తానే మృత్యువుకు లోనయ్యాడు.
దుర్యోధనః:
జామాతృనాశవ్యసనాభితప్తే
రోషాభిభూతే మగధేశ్వరేఽథ ।
పలాయమానస్య భయాతురస్య
శౌర్యం తదేతత్ క్వ గతం తవాసీత్ ।। 28 ।।
దుర్యోధనుడు:
అల్లుడి మరణంవల్ల కలిగిన దుఃఖంతో తపించిన జరాసంధుడు కోపపరవశుడైనప్పుడు భయపడి పారిపోయావే, అప్పుడు నీ శౌర్యం ఎక్కడికి పోయింది?
వాసుదేవః:
కర్తవ్యో భ్రాతృషు స్నేహో విస్మర్తవ్యా గుణేతరాః ।
సమ్బన్ధో బన్ధుభిః శ్రేయాన్ లోకయోరుభయోరపి ।। 29 ।।
వాసుదేవుడు:
అన్నదమ్ములతో స్నేహంతో వ్యవహరించాలి. దోషాలను మరిచిపోవాలి. చుట్టాలతో మంచి సంబంధం ఇహపరాలలో శ్రేయోదాయకమవుతుంది.
దుర్యోధనః:
పిష్టపేషణమేతావత్ పర్యాప్తం ఛిద్యతాం కథా ।। 30 ।।
దుర్యోధనుడు:
వాసుదేవః:
ప్రసాద్యమానః సామ్నాయం న స్వభావం విముఞ్చతి ।
హన్త సంక్షోభయామ్యేనం వచోభిః పరుషాక్షరైః ।। 31 ।।
(ప్రకాశమ్) భో సుయోధన! కిం న జానీషేఽర్జునస్య బలపరాక్రమమ్ ।
వాసుదేవుడు:
(పైకి) ఓ సుయోధనా! అర్జునుడి బలపరాక్రమం గురించి నీకు తెలియదా?
దుర్యోధనః:
దుర్యోధనుడు:
వాసుదేవః:
కైరాతం వపురాస్థితః పశుపతిర్యుద్ధేన సన్తోషితో
వహ్నేః ఖాణ్డవమశ్నతః సుమహతీ వృష్టిః శరైశ్ఛాదితా।
దేవేన్ద్రార్తికరా నివాతకవచా నీతాః క్షయం లీలయా
నన్వేకేన తదా విరాటనగరే భీష్మాదయో నిర్జితాః ।। 32 ।।
వాసుదేవుడు:
యుద్ధం చేసి, కిరాతుడి రూపంలో ఉన్న పశుపతిని సంతోషపరిచాడు. అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహిస్తూ ఉన్నప్పుడు కురిసిన పెనువానను బాణాల కప్పుతో నిలువరించాడు. లీలామాత్రంగా, దేవేంద్రుడిని బాధిస్తున్న నివాతకవచులను నశింపజేశాడు. ఒక్కడే కదా, ఆనాడు విరాటనగరంలో భీష్మాదులను ఎదిర్చి గెలిచాడు!
నను త్వం చిత్రసేనేన నీయమానో నభస్తలమ్।
విక్రోశన్ ఘోషయాత్రాయాం ఫల్గునేనైవ మోక్షితః ।। 33 ।।
ఘోషయాత్ర సందర్భంలో, చిత్రసేనుడి చేత ఆకాశమార్గాన తీసుకుపోబడుతున్నప్పడు కేకలు పెడుతూ ఉండిన నిన్ను విడిపించిందీ అర్జునుడే కద?
దాతుమర్హసి మద్వాక్యాద్ రాజ్యార్ధం ధృతరాష్ట్రజ ।
అన్యథా సాగరాన్తాం గాం హరిష్యన్తి హి పాణ్డవాః ।। 34 ।।
ధృతరాష్ట్రనందనా, నా మాట విని రాజ్యంలో అర్ధభాగాన్ని ఇవ్వు. లేదా సముద్రందాకా విస్తరించి ఉన్న యావద్భూమినీ పాండవులు లాగేసుకుంటారు.
దుర్యోధనః:
ప్రహరతి యది యుద్ధే మారుతో భీమరూపీ
ప్రహరతి యది సాక్షాత్ పార్థరూపేణ శక్రః ।
పరుషవచనదక్ష! త్వద్వచోభిర్న దాస్యే
తృణమపి పితృభుక్తే వీర్యగుప్తే స్వరాజ్యే ।। 35 ।।
దుర్యోధనుడు:
కటువుగా మాట్లాడడం నేర్చినవాడా! భీమరూపియైన వాయుదేవుడు నన్ను యుద్ధాన దెబ్బతీసినా, స్వయానా ఆ ఇంద్రుడే అర్జునరూపం దాల్చి నాపై దాడి చేసినా, నీ మాట విని, నా తండ్రి చేత అనుభవించబడినదీ, నా పరాక్రమంతో కాపాడబడినదీ అయిన నా రాజ్యంలోని గడ్డిపరకను కూడా ఇవ్వను.
వాసుదేవః:
వాసుదేవుడు:
దుర్యోధనః:
అవధ్యాం ప్రమదాం హత్వా హయం గోవృషమేవ చ ।
మల్లానపి సునిర్లజ్జో వక్తుమిచ్ఛసి సాధుభిః ।। 36 ।।
దుర్యోధనుడు:
చంపదగని స్త్రీని, గుఱ్ఱాన్ని, ఎద్దును, మల్లయోధులను సైతం చంపి, సాధుపురుషులతో నిర్లజ్జగా మాట్లాడగోరుతున్నావు.
వాసుదేవః:
వాసుదేవుడు:
దుర్యోధనః:
దుర్యోధనుడు:
వాసుదేవః:
వాసుదేవుడు:
దుర్యోధనః:
దుర్యోధనుడు:
వాసుదేవః:
వాసుదేవుడు:
దుర్యోధనః:
అహమవధృతపాణ్డరాతపత్రో
ద్విజవరహస్తధృతామ్బుసిక్తమూర్ధా ।
అవనతనృపమణ్డలానుయాత్రైః
సహ కథయామి భవద్విధైర్న భాషే ।। 37 ।।
దుర్యోధనుడు:
నేను రాజోచితమైన శ్వేతఛత్రాన్ని ధరించినవాడిని, బ్రాహ్మణశ్రేష్ఠులచే అభిషిక్తమైన శిరస్సు నాది. నా సామంతులకు భృత్యుడివైన నీతో మాట్లాడనని అంటున్నాను.
వాసుదేవః:
శఠ! బాన్ధవనిఃస్నేహ! కాక! కేకర! పిఙ్గల! ।
త్వదర్థాత్ కురువంశోఽయమచిరాన్నాశమేష్యతి ।। 38 ।।
భో భో రాజానః! గచ్ఛామస్తావత్ ।
వాసుదేవుడు:
మొండివాడా! బంధువులపట్ల స్నేహభావం లేనివాడా! పరుషంగా మాట్లాడే కాకీ! మెల్లకన్నూ! కోతీ! నీవల్ల ఈ కురువంశం తొందరలోనే నాశనాన్ని పొందనున్నది.
దుర్యోధనః:
దుఃశాసన! న సమర్థః ఖల్వసి ।
కరితురగనిహన్తా కంసహన్తా స కృష్ణః
పశుపకులనివాసాదానుజీవ్యానభిజ్ఞః ।
హతభుజబలవీర్యః పార్థివానాం సమక్షం
స్వవచనకృతదోషో బధ్యతామేష శీఘ్రమ్ ।। 39 ।।
అయమశక్తః । మాతుల! బధ్యతామయం కేశవః । కథం పరాఙ్ముఖః పతతి । భవతు, అహమేవ పాశైర్బధ్నామి । (ఉపసర్పతి ।)
దుర్యోధనుడు:
దుశ్శాసనా! నీవూ అందుకు సమర్థుడవు కావా?
ఏనుగును, గుఱ్ఱాన్ని చంపినవాడు, కంసుణ్ణి చంపినవాడూ, పశుపాలకుల ఇంటిలో పెరిగినందున సేవకుడు మెలగాల్సిన విధం తెలియనివాడు, భుజబలపరాక్రమం నశించినవాడు, రాజసమక్షంలో తప్పుగా మాట్లాడినవాడు అయిన ఇతడిని వెంటనే బంధించండి.
ఈ దుశ్శాసనుడివల్లా కావడం లేదు. మామా! ఈ కృష్ణుడిని బంధించు. ఇదేమిటి, పెడమొగంతో పడిపోతున్నాడు? సరే, నేనే తాళ్ళతో కట్టేస్తాను (కృష్ణుడిని సమీపిస్తాడు.)
వాసుదేవః:
వాసుదేవుడు:
దుర్యోధనః:
సృజసి యది సమన్తాద్ దేవమాయాః స్వమాయాః
ప్రహరసి యది వా త్వం దుర్నివారైః సురాస్త్రైః ।
హయగజవృషభాణాం పాతనాజ్జాతదర్పో
నరపతిగణమధ్యే బధ్యసే త్వం మయాద్య ।। 40 ।।
దుర్యోధనుడు:
దేవమాయలను, నీ సొంత మాయలను అంతటా సృష్టించినా సరే, ఎదిరింపజాలని దివ్యాస్త్రాలతో బాధించినా సరే – అశ్వాన్ని, గజాన్ని, వృషభాన్ని నేలకూల్చానని విర్రవీగుతున్న నిన్ను ఈ రాజులందరి నడుమన కట్టివేస్తాను ఇవాళ.
ర్విద్ధక్షరత్క్షతజరఞ్జితసర్వగాత్రమ్।
పశ్యన్తు పాణ్డుతనయాః శిబిరోపనీతం
త్వాం బాష్పరుద్ధనయనాః పరినిఃశ్వసన్తః ।। 41 ।।
(నిష్క్రాన్తః ।)
(వెళ్ళిపోతాడు)
వాసుదేవః:
వాసుదేవుడు:
సుదర్శనః:
శ్రుత్వా గిరం భగవతో విపులప్రసాదా–
న్నిర్ధావితోఽస్మి పరివారితతోయదౌఘః ।
కస్మిన్ ఖలు ప్రకుపితః కమలాయతాక్షః
కస్యాద్య మూర్ధని మయా ప్రవిజృమ్భితవ్యమ్ ।। 42 ।।
సుదర్శనము:
భగవంతుడి పలుకును విని, మిక్కుటమైన ఆయన ప్రసన్నత తోడ్పడగా మబ్బుల దొంతరను పక్కకు నెట్టుకుంటూ పరుగు పరుగున వచ్చాను. ఎవ్వరిపై కినుక పూనాడీ తమ్మికన్నుల దేవర? ఎవరి తలను త్రుంచేందుకు చెలరేగాలి నేడు నేను?
అవ్యక్తాదిరచిన్త్యాత్మా లోకసంరక్షణోద్యతః।
ఏకోఽనేకవపుః శ్రీమాన్ ద్విషద్బలనిషూదనః ।। 43 ।।
మొదలెక్కడో తెలియనివాడు, ఆలోచనకు అందని ఆత్మస్వరూపుడు, లోకాలను కాపాడేందుకు పూనుకున్నవాడు, ఒకే ఒక్కడు, అనేకరూపాలను ధరించినవాడు, లక్ష్మీయుతుడు, శత్రుసైన్యసంహారకుడు —
ఇదిగో, జలస్రావం. (ఆచమనం చేసి, కృష్ణుడిని సమీపించి) భగవంతుడైన నారాయణుడికి జయమగుగాక! (నమస్కరిస్తాడు)
వాసుదేవః:
వాసుదేవుడు:
సుదర్శనః:
సుదర్శనము:
వాసుదేవః:
వాసుదేవుడు:
సుదర్శనః:
కిం మేరుమన్దరకులం పరివర్తయామి
సంక్షోభయామి సకలం మకరాలయం వా ।
నక్షత్రవంశమఖిలం భువి పాతయామి
నాశక్యమస్తి మమ దేవ! తవ ప్రసాదాత్ ।। 44 ।।
సుదర్శనము:
మేరుపర్వతాన్ని, మందరపర్వతాన్ని అటుదిటు చేయాలా? మొసళ్ళకు నెలవైన సముద్రాన్ని అతలాకుతలం చేయాలా? నక్షత్రాలనన్నింటిని నేల రాల్చాలా? దేవా! మీ అనుగ్రహంవల్ల నాకు అసాధ్యమనేది లేదు.
వాసుదేవః:
యది లవణజలం వా కన్దరం వా గిరీణాం
గ్రహగణచరితం వా వాయుమార్గం ప్రయాసి ।
మమ భుజబలయోగప్రాప్తసంజాతవేగం
భవతు చపల! చక్రం కాలచక్రం తవాద్య ।। 45 ।।
వాసుదేవుడు:
చపలచిత్తుడా! సముద్రంలోనికి, కొండగుహలోకి, గ్రహపథాలలోకి, వాయుమార్గంలోకి – నీవు ఎక్కడి వెళ్ళినా సరే, నా భుజబలం కారణంగా సంక్రమించిన వేగంతో ఉన్న ఈ చక్రం నేడు నీ పాలిట కాలచక్రమే అగుగాక.
సుదర్శనః:
మహీభారాపనయనం కర్తుం జాతస్య భూతలే।
అస్మిన్నేవ గతే దేవ! నను స్యాద్ విఫలః శ్రమః ।। 46 ।।
సుదర్శనము:
ఈ దుర్యోధనుడిని ఒక్కడినే ఈవిధంగా అంతమొందిస్తే భూభారాన్ని తగ్గించేందుకు అవతరించిన మీ శ్రమ విఫలమవుతుంది కదా.
వాసుదేవః:
వాసుదేవుడు:
సుదర్శనః:
సుదర్శనము:
తనుమృదులలితాఙ్గం స్త్రీస్వభావోపపన్నం
హరికరధృతమధ్యం శత్రుసఙ్గైకకాలః ।
కనకఖచితపృష్ఠం భాతి కృష్ణస్య పార్శ్వే
నవసలిలదపార్శ్వే చారువిద్యుల్లతేవ ।। 47 ।।
భో భోః! ప్రశాన్తరోషో భగవాన్ నారాయణః । గమ్యతాం స్వనిలయమేవ । హన్త నివృతః యావద్గచ్ఛామి ।
స్త్రీసహజమైన సన్నని మృదువైన ఆకారంతో ఉన్నదీ, విష్ణువుచే పట్టుకోబడిన మధ్యభాగం కలదీ, శత్రుసమూహానికి మృత్యుసమానమైనది, వెనకవైపున బంగారం పొదగబడినదీ అయిన ఈ విల్లు కృష్ణుడి సమీపాన, కొత్త వానమబ్బు పక్కన మెరుపువలె ఉన్నది.
శార్ఙ్గమా! నారాయణుడు శాంతించాడు. నీవు స్వస్థానానికి వెళ్ళు. సరే, వెళ్ళిపోయింది. ఇక నేనూ వెళతాను.
మణికనకవిచిత్రా చిత్రమాలోత్తరీయా
సురరిపుగణగాత్రధ్వంసనే జాతతృష్ణా।
గిరివరతటరూపా దుర్నివారాతివీర్యా
వ్రజతి నభసి శీఘ్రం మేఘవృన్దానుయాత్రా ।। 48 ।।[
హే కౌమోదకి! ప్రశాన్తరోషో భగవాన్ నారాయణః। హన్త నివృత్తా ।
బంగారంతో, మణులతో రంగులీనుతూ ఉన్నదీ, రంగురంగుల పూలదండ తనకు ఉత్తరీయంవలె అమరినదీ, దేవతల శత్రుసమూహాల దేహాలను ధ్వంసం చేయాలనే కోరిక కలిగినదీ, కొండ చరియ ఆకారంవలె ఉన్నదీ, ఎదురింపలేనిదీ, శక్తిమంతమైనదీ అయిన కౌమోదకి ఆకాశంలో మేఘాలు వెంబడిస్తుండగా వేగంగా వస్తున్నది.
హే కౌమోదకీ! నారాయణుడు శాంతించాడు. నీవు స్వస్థానానికి వెళ్ళు. ఆఁ, వెళ్ళిపోయింది. ఇక నేనూ వెళతాను.
పూర్ణేన్దుకున్దకుముదోదరహారగౌరో
నారాయణననసరోజకృతప్రసాదః ।
యస్య స్వనం ప్రలయసాగరఘోషతుల్యం
గర్భా నిశమ్య నిపతన్త్యసురాఙ్గనానామ్ ।। 49 ।।
హే పాఞ్చజన్య! ప్రశాన్తరోషో భగవాన్। గమ్యతామ్ । హన్త నివృత్తః ।
నిండు చంద్రుడిలా, మల్లెపూవులా, కలువపూవు అంతర్భాగంలా, ముత్యాలహారంలా తెల్లగా, నారాయణుడి ముఖపద్మపు ప్రసన్నతవలె ఉన్నది ఈ పాంచజన్యం. ఈ శంఖపు ధ్వని ప్రళయకాలసముద్రఘోషకు సమానమై, అసురస్త్రీలకు గర్భవిచ్ఛిత్తి కలుగజేస్తుంది.
ఓ పాంచజన్యమా! భగవానుడు శాంతించాడు. నీవు వెళ్ళు. ఆఁ, వెళ్ళిపోయింది.
వనితావిగ్రహో యుద్ధే మహాసురభయఙ్కరః ।
ప్రయాతి గగనే శీఘ్రం మహోల్కేవ విభాత్యయమ్ ।। 50 ।।
హే నన్దక! ప్రశాన్తరోషో భగవాన్ । గమ్యతామ్ । హన్త నివృత్తః । యావద్ గచ్ఛామి ।।
స్త్రీరూపాన్ని తలపించేదీ, యుద్ధంలో మహాసురులకు భయం కలిగించేదీ, ఆకాశమార్గంలో వేగంగా వస్తున్నది. పెద్ద ఉల్కలాగా ప్రకాశిస్తున్నది ఈ నందకం.
ఓ నందకమా, భగవానుడు శాంతించాడు. వెళ్ళు. ఆఁ, వెళ్ళిపోయింది. ఇక నేనూ వెళతాను.
సోఽయం ఖడ్గ ఖరాంశోరపహసితతనుః స్వైః కరైర్నన్దకాఖ్యః
సేయం కౌమోదకీ యా సురరిపుకఠినోరః స్థలక్షోదదక్షా ।
సైషా శార్ఙ్గాభిధానా ప్రలయఘనరవజ్యారవా చాపయష్టిః
సోఽయం గమ్భీరఘోషః శశికరవిశదః శఙ్ఖరాట్ పాఞ్చజన్యః ।। 51 ।।
తన తళతళలతో సూర్యబింబాన్ని అపహసిస్తుంది నందకమనే పేరుగల ఈ ఖడ్గం. కౌమోదకి అనే ఈ గద, దైత్యుల కఠినమైన వక్షస్థలాలను ఛేదించగలిగినది. శార్ఙ్గమనే ఈ సన్నని వింటియొక్క నారి టంకారధ్వని ప్రళయమేఘరవాన్ని పోలి ఉంటుంది. చంద్రకిరణాల తెలుపుతో ఉండి గంభీరంగా ఘోషిస్తుంది శంఖాలకు రాజైన ఈ పాంచజన్యం.
దైత్యాన్తకృన్నన్దక! శత్రువహ్నే! ।
ప్రశాన్తరోషో భగవాన్ మురారిః
స్వస్థానమేవాత్ర హి గచ్ఛ తావత్ ।। 52 ।।
హన్త నివృత్తాః । యావద్గచ్ఛామి ।
హమ్మయ్య! వెళ్ళిపోయారు. ఇంక నేనూ వెళతాను.
అయే అయం భగవతో వాహనో గరుడః ప్రాప్తః ।
సురాసురాణాం పరిఖేదలబ్ధం
యేనామృతం మాతృవిమోక్షణార్థమ్ ।
ఆచ్ఛిన్నమాసీద్ ద్విషతో మురారే
స్త్వాముద్వహామీతి వరోఽపి దత్తః ।। 53 ।।
హే కాశ్యపప్రియసుత! గరుడ! ప్రశాన్తరోషో భగవాన్ దేవదేవేశః । గమ్యతాం స్వనిలయమేవ । హన్త నివృత్తః । యావద్ గచ్ఛామి ।
అరె, భగవానుడి వాహనమైన గరుత్మంతుడు ఇటే వస్తున్నాడు.
తన తల్లి దాస్యవిమోచనం కోసం, సురాసురులు ఎంతో శ్రమించి సాధించిన అమృతాన్ని తన శత్రువైన ఇంద్రుడి దగ్గరనుంచి ఎత్తుకొని వచ్చినవాడు ఈ గరుడుడు. వాహనమై నిన్ను మోస్తానని విష్ణువుకు వరమిచ్చినవాడు.
కాశ్యపప్రియకుమారుడా! గరుడా! దేవదేవేశుడైన భగవంతుడి కోపం శాంతించింది. నీ నెలవుకు నీవు వెళ్ళు. ఆఁ, వెళ్ళిపోయాడు. నేనూ వెళతాను.
దేవాశ్చ సంభ్రమచలన్మకుటోత్తమాఙ్గాః ।
రుష్టేఽచ్యుతే విగతకాన్తిగుణాః ప్రశాన్తం
శ్రుత్వా శ్రయన్తి సదనాని నివృత్తతాపాః ।। 54 ।।
యావదహమపి కాన్తాం మేరుగుహామేవ యాస్యామి । (నిష్క్రాన్తః ।)
ఇంక నేనూ అందమైన మేరుపర్వతగుహకు వెళ్ళిపోతాను. (వెళ్ళిపోతాడు)
వాసుదేవః:
వాసుదేవుడు:
న ఖలు న ఖలు గన్తవ్యమ్ ।
వద్దు, వద్దు. వెళ్ళవద్దు.
వాసుదేవః:
వాసుదేవుడు:
ధృతరాష్ట్రః:
మమ పుత్రాపరాధాత్ తు శార్ఙ్గపాణే! తవాధునా ।
ఏతన్మే త్రిదశాధ్యక్ష! పాదయోః పతితం శిరః ।। 55 ।।
ధృతరాష్ట్రుడు:
ఓ శార్ఙ్గపాణీ! దేవతలకు అధినాథుడా! నా కుమారుడి అపరాధం కారణంగా నేను ఇప్పుడు నా తలను నీ పాదాల చెంత వాలుస్తున్నాను.
వాసుదేవః:
వాసుదేవుడు:
ధృతరాష్ట్రః:
ధృతరాష్ట్రుడు:
వాసుదేవః:
వాసుదేవుడు:
ధృతరాష్ట్రః:
ధృతరాష్ట్రుడు:
వాసుదేవః:
వాసుదేవుడు:
ధృతరాష్ట్రః:
ధృతరాష్ట్రుడు:
ఇమాం సాగరపర్యన్తాం హిమవద్విన్ధ్యకుణ్డలామ్।
మహీమేకాతపత్రాఙ్కాం రాజసింహః ప్రశాస్తు నః ।। 56 ।।
(నిష్క్రాన్తాః సర్వే)
దూతవాక్యం సమాప్తమ్।।
సముద్రందాకా విస్తరించినదీ, హిమవత్పర్వతాన్ని, వింధ్యపర్వతాన్ని కుండలాలుగా ధరించినదీ, ఒకే గొడుగు క్రిందన ఉన్నదిగా గుర్తింపబడ్డదీ అయిన ఈ భూమిని మా రాజసింహుడు పాలించుగాక!
(అందరూ నిష్క్రమిస్తారు)
‘దూతవాక్యము’ ముగిసింది.