కోవెల సంపత్కుమార


సొంత ఊరు:
వరంగల్
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

కోవెల సంపత్కుమారాచార్య కవి, రచయిత. తన పదమూడవ యేటనే సోదరుని కుమారుడు కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి జంటగా కవిత్వం చెప్పనారంభించారు. 1950 ప్రాంతంలో విశ్వనాథ సత్యనారాయణతో పరిచయం ఏర్పడింది. అతని సాహిత్య ప్రభావం సంపత్కుమారపై జీవితకాలం పనిచేసింది. వ్యాకరణ, ఛందోగ్రంథాలను, విమర్శను, ఖండకావ్యాలను, సాహిత్య చరిత్రను, శతకాలను, ప్రాచీన గ్రంథాల పరిష్కరణలను, విపులమైన పీఠికలను, నాటికలను ఎన్నో వ్రాశారు. ‘మరుగునపడిన మన పండితులు’ పేరిట జనధర్మలో ధారావాహికంగా 52 వారాలు వ్రాశారు. అనేక పురస్కారాలను అందుకున్నారు.


 

[వేలూరి వేంకటేశ్వర రావు పరిచయంతో…]

వారణమాయిరం ప్రత్యేక గ్రంథం కాదని, అది నాచ్చియార్ తిరుమొళిలో ఒక ఖండమనీ, ఆ ఖండంలో గోదాదేవి రంగనాథునితో తనకు కలలో జరిగిన పెండ్లి చెలికత్తెకి వివరించిందనీ తెలిసింది. సంపత్కుమారకి ఆ ‘పెండ్లి కల’ తెలుగులోకి తేవాలనీ కోరిక కలిగింది.

ఒక్క అంశం మాత్రం ఇక్కడ అవసరంగా చెప్పవలసి వస్తున్నది – వచన పద్య ప్రయోక్త లందరూ వచన పద్యాన్ని ఒక ఛందోరూపంగానే భావిస్తున్నారు తప్ప కేవలం వచనంగానో, లేక గద్యంగానో భావించటం లేదు.

మాత్రాఛందస్సులను దాటివచ్చి, తనంతట తానే వచన పద్యం ఛందస్సాంప్రదాయంలో చోటు చేసుకున్నది. కాగా, నేను చేసింది ఆ చోటు యొక్క స్వరూపాన్ని స్పష్టం చేయటమే. ఛందస్సూ, గణ విభజనా ఉన్నంత మాత్రాన ఏ ‘పద్యా’నికీ అదనపు ‘గౌరవం’ రాదు.

వచన పద్యానికి నేను చెప్పిన లక్షణమే లక్షణమని, ఇది మాత్రమే నిర్దిష్టమయిందని కాని వాదించే అతిశయం నాకు లేదు. నాకు స్ఫురించిన ఒక పద్ధతిని సూచించటం మాత్రమే నా తాత్పర్యం.

“పద్యం తెలుగువారి ఆస్తి” అంటూ తరుచుగా వినవచ్చేమాట ఏదో చమత్కారంగా, నవ్వులాటగా కొందరికి అనిపిస్తే అనిపించవచ్చుగాని, తెలుగు పద్యం సంపాదించినంత సౌందర్యం మరెక్కడా పద్యం […]