ఏ కథనయినా సరిగా అనుసరించాలంటే కథలోని ప్రధానపాత్రల ప్రాథమిక పరిచయం అవసరం. ప్రాథమిక పరిచయం అంటే పేరు ఒకటే కాదు. దానికన్నా ముఖ్యం ‘నేను’ కి చెందిన ఇతర వివరాలు. ప్రథమపురుష కథనంలో ఈ వివరాలన్నీ కథలో ప్రధానపాత్రలు ప్రవేశించినప్పుడో, ఆ తర్వాత కొద్దిసేపటికో సందర్భానుసారంగా తెలుస్తాయి. ఈ పాత్రల్తో పోలిస్తే ఉత్తమపురుషలో కథలో ప్రధానపాత్ర అయిన ‘నేను’ పూర్తిగా భిన్నమయినది.

పాపులర్ రచనలను పట్టించుకోవడం అనేది చాలామంది మంచి విమర్శకులు సైతం విస్మరిస్తున్న పని. ‘సాధారణ పాఠకుడి’ పఠన రీతుల్ని మలచగల శక్తి, మలచాల్సిన బాధ్యత విమర్శకున్నాయి. ఈ పనిని చేసిన వాళ్ళు కొద్దిమందే, కొడవటిగంటి కుటుంబరావుగారి వంటి వాళ్ళు. (డీటీఎల్సీవారు నిర్వహించిన విమర్శావ్యాస పోటీలలో మూడవ బహుమతి గెల్చుకున్న వ్యాసం.)

విస్తారమైన సంస్కృత సాహిత్యంలో లభిస్తున్న అనేక శాస్త్ర, సామాజిక గ్రంథాలలోని వివిధ అంశాల మీద దృష్టి సారిస్తూ, వాటి ద్వారా ప్రస్తుత కాలంలోని మేధోస్థాయిని పెంచుకోడం మానవాళికి ఎలా ఉపయోగకరమనే విషయం మీద అనేక శోధపత్రాలు, విశేషజ్ఞుల అభిప్రాయాల మేళవింపుతో ఈ సంగోష్ఠి ఆసక్తికరంగా సాగింది.

పదిహేనేళ్ళ అమృతకి, ఆ వయసుకి తగ్గట్టే తన రూపరేఖలపై ప్రత్యేకదృష్టి ఉండేది. సంప్రదాయాన్ని తోసిరాజనే కొత్త ఫేషన్లు, ప్రయోగాలు ఇష్టపడేది. పారిస్ నగరంలో అడుగుపెట్టాకనే షేర్-గిల్ ఆత్మాకృతి చిత్రణ పూర్తిగా వికసించింది. మొత్తం పందొమ్మిది చిత్రాలను ఆమె అక్కడే గీసింది. ఒక కళాకారిణిగా తోటి కళాకారుల మధ్య జీవించే, పనిచేసే అవకాశం అక్కడ ఆమెకి దొరికింది.

లైన్ డ్రాయింగ్ ఎంత అద్భుతమైన విషయమో తెలుసా? రేఖ ఎంత అద్భుతమైన భాషో తెలుసా? ఒక వస్తువును అది అర్థం చేసుకున్నంతగా మరే కళ ఈ ప్రపంచాన్ని చూడలేదు. వాస్తవాన్ని చప్పున గాలికూదేసి రేఖ చేసే మహా మాయే లైన్ డ్రాయింగ్. రేఖ అనేదేదీ లేని ఈ వస్తు ప్రపంచంలో అది మనం ఉందనుకున్న మరో కొత్త లోకాన్ని సృష్టించింది.

అలా పరవశించిన తిరుగుడులో అజంతా, ఎల్లోరా, తంజావూరు, మహాబలిపురం, పట్టడకల్ చిత్ర శిల్పాలు, కంచు శిల్పాలు, తాళపత్ర చిత్రాలు, దక్షిణాది ఫ్రెస్కోల్లోని ఆకుపచ్చ, నీలి, ముదురు పసుపు, చామనచాయల్లో అందగత్తెలయిన దేవతలలో చూసింది పౌరాణిక దృశ్యాల్లో ఆధునిక రేఖల వొంపుల విన్యాసాలను, చైతన్యం తొణికిసలాడే లయనీ!

సృజన సాహిత్య విమర్శ వాంఛనీయమైన ఆలోచన చేయడానికి అటు రచయితకూ, ఇటు చదువరికీ కూడా ప్రేరణ ఇచ్చేదిగా ఉండాలి. రచనలో పాఠకునికి ఏ మూలపదార్థం అనుభూతిదాయకమౌతుందో చెప్పగలగాలి. రచయితకి రచన ఔన్నత్యాన్ని భంగపరిచే ఏ లక్షణాల్ని పరిహరించుకోవాలో చెప్పేదిగా ఉండాలి. (డీటీఎల్సీవారు నిర్వహించిన విమర్శావ్యాస పోటీలలో రెండవ బహుమతి గెల్చుకున్న వ్యాసం.)

విమర్శ అంటే ఒక సృజన యొక్క విశ్లేషణాత్మక పరిశీలన అని నిర్వచించుకుందాం. సృజన అంటే ఏమిటి? తన అనుభూతులకు, అనుభవాలకు, ఆలోచనలకు, ఒక కళాకారుడు ఇచ్చే రూపం సృజన. ఇది ఎన్నో లలిత కళారూపాల్లో ప్రకటితమవుతుంది. ఇప్పుడు మనముందున్న మొదటి ప్రశ్న: సాహిత్యాన్ని ఎలా పరిశీలించాలి? ఎలా అర్థం చేసుకోవాలి?

ఎనభైలలో, ఫలానా సినీతారకి ‘ఆలిండియా అభిమాన సంఘ అద్యక్షుడు’గా ఉండడం అన్నది ఒక వృత్తిగా మారుతున్న రోజులలో, వసూళ్ళు మందికొడిగా మొదలైన సినిమాని ఒక తోపు తోయడానికి ఈ అభిమాన సంఘాల ద్వారా ఆ తారలే పెట్టుబళ్ళు పెట్టి ప్రధాన సెంటర్లలో ‘టికెట్లు కోయించడం’ (అంటే టికెట్లు మొత్తం వీరే కొని, హవుస్ ఫుల్ బోర్డు పడేట్టుగా చేయడం) మంచం దింపిన సినిమా నోట్లో తులసి తీర్థం పోయడం లాంటిది.

ఎక్‌ఫ్రాసిస్ నిజంగా తెలుగువారికి తెలియని ప్రక్రియేనా? తెలుగు పద్యసాహిత్యం అంటే కవిత్వం అనుకుంటే, తెలుగు కవిత కృతి అయితే,వాటికి మరే ఇతర కళారూపంలోనూ అనుకృతులు సృజించబడలేదా? లేదంటే, ఇతర కళారూపాల్లో ఉన్న తెలుగు కృతులకి, తెలుగు కవిత్వం రూపంలో అనుకృతులు సృష్టించబడలేదా?

సామాజిక పరిస్థితులు రచయత సాహిత్య తాత్విక దృక్పథాన్ని, రస మాధ్యమాన్ని రూపొందిస్తే, సాహిత్య తాత్విక దృక్పథం రచయిత ఎంచుకునే వస్తువును ప్రభావితం చేస్తుంది. సమాజం యెడల బాధ్యతాస్పృహ నైతికతతో ముడిపడిన సౌందర్యాభిరుచికి దారి తీస్తుంది. ప్రజలపట్ల పట్టింపు రచయిత ప్రయోగించే భాషను, శైలిలో సరళతను నిర్ణయిస్తుంది.

మాటలలో బొమ్మలు కట్టడం, వాటిని అంత అందంగానూ ఆకాశవాణి ద్వారా శ్రోతలకు చూపించడం వారికి తెలుసు. యస్వీ రేడియో ప్రసంగాలు మహత్తర చిత్రకృతులు, కనువిందు చేసే కొండపల్లి బొమ్మలు. నిజానికి శర్మ అచ్చులకు రాసింది తక్కువ. హల్లులకు, అంటే ప్రసంగ పాఠాలకు రాసిందే ఎక్కువ. కృష్ణశాస్త్రి బడి, పలుకుబడితో పాటు వొద్దిక వొబ్బిడితనం కలిసిన దినుసు యస్వీది.

2015లో దాసరి అమరేంద్ర ఆక్టివా స్కూటరు మీద దక్షిణభారతదేశమంతా తిరిగారు. ఆ అనుభవాలు ‘కొన్నికలలు ఒక స్వప్నం’ అన్న పేరుమీద పుస్తకంగా ఈ నెల వస్తున్నాయి. ఆ సందర్భంగా ఆ పుస్తకం నుంచి ఒక అధ్యాయం ఈమాట పాఠకుల కోసం.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దక్షిణ భారతంలో గణపతి చాలావరకు బ్రహ్మచారిగా కనిపిస్తే, ఉత్తర భారతంలో ఒక భార్యతో గానీ ఇద్దరు భార్యలతో కానీ కనిపించడం కద్దు. ఒక భార్యతో కనిపించే విగ్రహాలలో కనిపించే సతిని లక్ష్మీదేవిగా, శక్తిగా పరిగణించడం ఉత్తర భారతదేశంలో సర్వసాధారణంగా కనిపిస్తుంది.

ఒక సినిమా బతికి బట్టకట్టి, ప్రేక్షకులని చేరి, వారి దూషణ-భూషణలు, సత్కార-చీత్కారాలు, ఆదరణ-తిరస్కరణలు మున్నగు ద్వంద్వ సమాసాలకు గురికావడానికి పైన పేర్కొన్న వాటిలో ఏ ఒక్క పనికి మాలిన, అసంబంధిత కారణమైనా చాలు. ఇదే సినీ వైకుంఠపాళి.

ఆ రోజుల్లో, కళ కళ కోసమే అని వాదించే అబ్సర్డిస్టులు, నాటకాన్ని సాంఘిక, రాజకీయ మార్పుకి వేదిక కావాలని వాదించే బ్రెఖ్టియన్ల మధ్య వాదోపవాదాలు వాడిగా వేడిగా నడిచేవి. కెనెత్ టైనన్ అబ్సర్వర్ పత్రిక నడిపేవాడు. అతను ఉద్యమకారుల పక్షాన, ఐనెస్కో కళాకారుల పక్షాన ఉండేవారు. ఐనెస్కో కళాకారుల కవిత్వకాల్పనికతను సమర్థించేవాడు. మొదటినుంచి ఐనెస్కోనే నా హీరో.

సంస్కృత కావ్యసాహిత్యం అనగానే మనకు ముందుగా కాళిదాసు (క్రీ. శ. 4వ శతాబ్ది) గుర్తుకు వస్తాడు. శివ పార్వతుల పుత్రుడైన కుమారస్వామి జననాన్ని వర్ణించే కాళిదాసు రచన కుమారసంభవమ్ కావ్యంలో కథ అంతా శివ పార్వతుల గురించే అయినా ఎక్కడా గణేశుని గురించి దీనిలో ప్రస్తావన కనిపించదు. ఏకాదశ సర్గలో చేసిన వర్ణన ద్వారా కుమారస్వామి జననం ద్వారానే పార్వతి మొదటిసారి తల్లి అయ్యిందని కవి మనకు విస్పష్టంగా తెలియజేస్తాడు.

అరిచి గీపెట్టి, తనకు కావలసిన విధంగా కథ తయారు చేయించుకుని, పాటలు తన అభిరుచికి తగ్గట్టు సంగీత దర్శకుని నుంచి రప్పించుకుని, తన కష్టాన్నంతటినీ దర్శకుడి చేతిలో పెట్టి, మంచి సినిమా తయారు కావడానికి ఇతోధిక సాయం చేసి, ఆనక పక్కకు తప్పుకునేవాడు– ఒక విధంగా ఉత్తమ నిర్మాత.

తెలుగు, కన్నడము, హిందీ, మరాఠీ మున్నగు భాషలలో గణములను జ్ఞాపకములో ఉంచుకొనడానికి య-మా-తా-రా-జ-భా-న-స-ల-గం అనే ఒక సులభసూత్రము వ్యాప్తిలో నున్నది. ఛందస్సు నేర్చుకొనే విద్యార్థికి ఇది తెలిసిన విషయమే. గణము యొక్క పేరు ముందే ఉండడము వలన అందులోని గురు లఘువులను తెలిసికొనుట సులభము అవుతుంది.

ఈ పరిస్థితులున్న సమాజంలో భావ వ్యక్తీకరణ, వాక్‌-స్వాతంత్రము ఇవన్నీ నాగరిక ప్రపంచంలో మాటలుగానే వాడబడుతున్నాయి. కులవ్యవస్థ పాతుకుపోయున్న సమాజంలో ఈ కొత్త నిర్వచనాలేవీ చొచ్చుకుపోయి ప్రభావితం చేసేంతగా బలపడలేవు. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది చదువు లేకపోవడం. రెండవది, మనకు లభించే చదువుల నాణ్యత.