“నువ్వు ఏమిటి తింటున్నావో చెప్పు, నువ్వు ఎవరివో చెబుతాను” అనే జనవాక్యం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. మంచి ఆహారం మంచి ఆరోగ్యానికి మొదటి మెట్టు అని మనలో చాలామంది నమ్ముతాం.
Category Archive: వ్యాసాలు
షేక్స్పియర్ కన్నా బేకన్ ఆధునికుడు; బేకన్కి స్పష్టమైన చారిత్రక అవగాహన ఉంది; షేక్స్పియర్కి అది బొత్తిగా లేదు. పదిహేడో శతాబ్దంతో శాస్త్రీయ యుగం మొదలయిందని గ్రహించిన బేకన్, అరిస్టాటిల్ తాత్త్వికతని పూజించడానికి బదులు ప్రకృతిపై ప్రత్యక్షమైన పరిశోధనలు జరగాలని కోరాడు
భారతదేశంలో అసలు మతం ఉందా? ఈ ప్రశ్న ప్రధానంగా పాశ్చాత్య వలసవాద తాత్వికుల నుండి ఉద్భవించింది. భారతదేశానికి చరిత్ర, న్యాయం, చట్టం వంటి భావనలు ఉన్నాయా అని ప్రశ్నించిన క్రమంలోనే భారతీయులకు మతం ఉందా అనే ప్రశ్న మొదలైంది. అసలు భారతీయులు అంటూ ఉన్నారా, వారిని ఎలా నిర్వచించాలి అనే ప్రశ్న కూడా దీని అంతర్భాగమే.
రామారావు గారు ఒక పుష్కర కాలంలో భూనభోంతరాలు నిండిపోయేలా అనువాదాలు చేశారు – ఒకటా రెండా? తెలుగులోకి రాని భాష లేదు, ప్రాంతం లేదు, కేవలం అనువాదాలే లేదు – కవుల చుట్టూ, కవితల చుట్టూ ఉన్న భోగట్టాను పట్టుకొచ్చారు.
ప్రవాసంలో ఉండటం అనేది ప్రవాసంలో ఉన్న టిబెట్ వాసులు ఎదుర్కొంటున్న అత్యంత శక్తివంతమైన వాస్తవికత. వారి హృదయాలు మాతృభూమి కోసం తహతహలాడుతున్న సమయంలో, వారు తెలియని దేశాలలో జీవితాన్ని నిర్మించుకునే సవాలును ఎదుర్కొంటున్నారు. మతం పురాణాల ద్వారా మాత్రమే తెలిసిన భూమికి తిరిగి పోవాలనే వారంతా కోరుకుంటున్నారు. కానీ అక్కడి పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు.
కవిత్వసౌందర్యం గురించి ఎవరు ఎన్ని చెప్పినా, చెప్పడానికి ప్రయత్నించినా అది భాస్కరశతకకారుడు చెప్పినట్టు చేతి పాత్రతో నదీ ప్రవాహంలో నీటిని పట్టుకోవడం లాంటిది. పంచతంత్రంలో గుడ్డివాళ్ళు ఏనుగును నిర్వచించడంలాంటిది.
ఇంగ్లీషు విద్య చదివిన మన యువకులు తమకు తెలుగురాదనీ, తెలుగు చదవమనీ చెప్పుకోవటం గర్వం. ఇందులో గర్వించటానికేమీలేదు.
‘మరి మీ కుటుంబంలో ఎవరైనా భిక్షువులయ్యారా?’ అన్నది మా తదుపరి ప్రశ్న. నవ్వేశాడు పిసాంగ్. ‘నేను పదేళ్ళ వయసులో భిక్షువునయ్యాను. ఇరవై ఏడేళ్ళదాకా కొనసాగాను. రెండేళ్ళ క్రితమే మళ్ళా మామూలు ప్రపంచంలో పడ్డాను,’ అని సమాధానం చెప్పాడు.
చలాన్ని దూషణ భూషణ తిరస్కరణలు చేసేవాళ్లంతా కూడా మైదానం నవల చదివారు, ఇక ముందు కూడా చదువుతారు. పూర్వం పడకగదుల్లో దిండు కింద దాచుకుని ఎవరికీ తెలియకుండా కూడా చదివేవారట. ఇప్పటికీ నేమో. మైదానం నవల ఆకర్షణ అంతటిది.
ఏది రాశాడో అదే చలం. ఏది నమ్మాడో అదే అతను రాశాడు. ఏది రాశాడో అదే అతను చెప్పాడు. అంటే ఏ దశలో గానీ, ఏది రాశాడో దానినుంచి ముఖ్యంగా వైమనస్యం గానీ, వైముఖ్యం గానీ, చలానికి సంబంధించినంత వరకు ఏదీ మనకు కనపడదు. వర్తమాన కాలంలో తద్విరుద్ధమైన రచయితలు చాలామంది ఉంటారు. ఆ తీరుగా చలం ‘ఆత్మలోకంలో దివాలా’ తీయలేదు.
‘ఆరుగురు గుడ్డివాళ్ళు – ఏనుగు’ అన్న కథలో లాగ చలాన్ని రకరకాలుగా అర్థాలో, అపార్థాలో మనవాళ్ళు చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. నేను రెండు మూడు సార్లు చలంగారు వుండగా తిరువణ్ణామలై వెళ్ళాను. ఆంధ్ర దేశం నుండి ప్రేయసీ ప్రియులు పెళ్ళి చేసుకుందామనుకునేవారు తిరువణ్ణామలై వచ్చి చలంగారి ఎదురుగా దండలు మార్చుకునేవారు. నాకు ఆశ్చర్యం వేసింది. చలంగారేమో నవ్వుతున్నారు. ఎందుకంటే చలంగారికి వివాహ వ్యవస్థ మీద మొట్టమొదటి నుండి ఏవగింపు.
మా దగ్గరకొచ్చేకొలదీ అతని శరీరం త్వరత్వరగా పెరగసాగింది. అలా పెరిగే క్రమంలో నేను అతని అనేక రూపాలని చూశాను: టెలెస్కోప్ని ఆకాశం వైపు తిప్పడం, పైనుండి క్రిందకి పడే రాయి వేగాన్ని లోలకంతో లెక్కకట్టడం, పాదరసం ఉన్న గొట్టంతో పీడన కొలవడం. అతని రూపం బ్రహ్మాండమైంది: తల ఆకాశాన్ని అంటింది; కాళ్ళు పాతాళం లోతులని చూశాయి; చేతులు రెండు దిశలనీ తాకాయి. అతని చేతిలోని దీపం ఆకాశం అంతటా, అగాధాలలో, నేల నలు మూలలా, వెలుగు ప్రసరించింది. ఎవరీ మహాకాయుడని అడిగాను. ప్లేటో ప్రత్యక్షమయి, ‘ప్రయోగం’ అని సమాధానమిచ్చి..
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హెలెన్ కెల్లర్ 19 నెలల పసిగుడ్డుగా ఉన్న బాల్యంలోనే జబ్బుపడి వినికిడి శక్తిని, చూపుని పోగొట్టుకుంది. తనకి ప్రాప్తించిన గుడ్డితనం కంటే వినికిడిని పోగొట్టుకోవడం వల్ల కలిగిన బలహీనత, ఒంటరితనం, బాధ, ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పుకుని ఆమె బాధ పడింది.
ఈ సంవత్సరం జ్ఞానపీఠ్ అవార్డ్ ఛత్తీస్ఘడ్కు చెందిన వినోద్కుమార్ శుక్లాకు లభించింది. ఈ సందర్భంగా ఆయన రాసిన ‘దీవార్ పర్ ఏక్ ఖిడికీ రహతీ థీ’ అనే హిందీ నవల గురించి భారతీయ నవలా దర్శనం అన్న పుస్తకంలో వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు రాసిన వ్యాసాన్ని ఈమాట పాఠకులకోసం పునర్ముద్రిస్తున్నాం.
పిచ్చివాడు వాళ్ళమధ్యకు దూకి, వాళ్ళను తీక్షణంగా చూశాడు. “ఎక్కడికెళ్ళాడు దేవుడు?”, అని అరిచాడు; నే చెబుతా. మనం చంపేశాం, నీవూ, నేనూ. మనమంతా ఆయన హంతకులం. కాని, ఎలా చంపాం? సముద్రాన్ని ఎలా తాగగలిగాం? ఆయన ఆనవాళ్ళు లేకుండా దిగంతాలను ఏ తడిగుడ్డతో తుడిచేశాం? సంకెళ్ళు తెగగొట్టి యీ భూగోళాన్ని సూర్యుడినుండి విడిపించినపుడు, మనం ఏం చేస్తున్నామో తెలిసే చేశామా? తెగిన భూగోళం ఎటు వెళుతున్నది? మనం ఎటువైపు వెళుతున్నాం? ఆదిత్యులనుండి దూరదూరంగా?
స్వచ్ఛమైన గాలీ, నీరు ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో చాలావరకూ ఆరోగ్యంగా వుంటారేమో. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి వాళ్ళు ఆనందంగా కూడా వుంటారనుకుంటాను. అందుకేనేమో భూటాన్ను ఆనందమయదేశం అంటారు.
ఈ ఆధునిక సిద్ధాంతాలను చూసినప్పుడు, కుమారిల భట్టు కంటే శంకరాచార్యులు, బౌద్ధులు సత్యానికి ఎక్కువగా దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది. బౌద్ధులు, శంకరాచార్యులు కూడా స్థల-కాలాలు మనోనిర్మితాలని, మనం చూసే దృశ్యాలు దేహ పరిమితుల నుంచి పుట్టాయని చెప్పారు. ఆధునిక విజ్ఞానవేత్తలు కూడా దాదాపు ఇటువంటి సిద్ధాంతాన్నే ప్రతిపాదించడం ఆబ్బురపరిచే విషయం.
నిజానికి ఆ సూపర్ కంప్యూటర్ కంటే ఈనాడు మన అరచేతిలో ఉన్న ఫోనులోని కంప్యూటర్ కొన్ని వేల రెట్లు శక్తివంతమైనది. లక్షల ట్రాన్సిస్టర్లు ఉన్న ఆనాటి కంప్యూటరు కంటే ఈనాటి సెల్ ఫోనులో ఎన్నో వేల రెట్లు ఎక్కువ ట్రాన్సిస్టర్లు ఉంటాయి. ఆనాటి కంప్యూటరు ఒక అంతస్తులో సగభాగం ఆక్రమిస్తే, ఈనాటి సెల్ ఫోనులు అరచేతిలో పట్టేస్తాయి.
ప్రస్తుతం వస్తున్నవి డయాస్పోరా కాదని నా ఉద్దేశం. లొకేషన్ మారితే అవి డయాస్పోరా అవుతాయనుకోవడం తప్పు. అమెరికా నుండి వచ్చే సాహిత్యం డయాస్పోరా సాహిత్యం కావాలంటే మనం నూతన సమాజంలో ప్రవాసులుగా ఒక హైబ్రిడ్ సంస్కృతిని రూపొందించుకొని, ఆ సమాజంలో మనకే ప్రత్యేకమైన సమస్యలు, సంక్లిష్టతలు, అనుభవాలతో ఒక కొత్త జాన్రా సృష్టించుకోగలగాలి. అప్పుడు ఆ సాహిత్యాన్ని డయాస్పోరా సాహిత్యం అనవచ్చు.
అయినా ఇప్పుడు నేను చేశానని చెప్పినా నా మాట ఎవడు నమ్ముతాడు? నా ఆధారాలు ఎవడు నిజమనుకుంటాడు? అనవసరంగా నా భార్యాపిల్లలకు జీవితాలలో సుఖము శాంతి లేకుండా చేయడం తప్ప ఒరిగేదేముంది? పొరపాటు పని కాదా? ఏది ఒప్పు ఏది తప్పు? జనం ఏమంటారు? మెచ్చుకుంటారా? నా మంచితనాన్ని గుర్తిస్తారా? నా నిర్ణయాన్ని గౌరవిస్తారా?