ఈ కన్నీటిదీవి ఇప్పుడు
నా వాస్తవికత
ఈ దుఃఖసముద్రం
నా సహచరి
ఆ ఎడారులు
ఆ పక్షుల్లేని అరణ్యాలు
ఈ తలుపుల్లేని ఇల్లూ
ఇప్పుడిదే నా ప్రపంచం

తన పాటకు తానే పులకిస్తూ
ఎత్తుపల్లాలను ఏకం చేసే రాగంతో
ఈ గాలి.
స్వచ్ఛంగా
ఆనందంగా
హాయిగా ఎగిరే
ఈ పూల పిట్ట.

గాలికి ఊగుతున్న
పూవు నీడలోకి తప్పిపోవడానికి చూస్తూ

రహస్యం తెలిసింది నీకు అన్నాడు
నీలాకాశపు తెర వెనుకకు తప్పుకొంటూ
ఎండ కాసేటపుడు అన్నీ తెరుచుకుంటాయి
చీకటితో సహా అన్నాను

ఎంతో ఆర్తితో ప్రేమతో భక్తితో అలవోకగా ఆశువుగా హనుమంతుడి లీలాగానం చేసినట్టుండే ఈ స్వరం, ఈ గేయం తెలుగునాట సంగీతప్రియులకు చిరపరిచితమే. సినీ నేపథ్యగానమే గాక లలితసంగీతం లోనూ కృషి చేసి, సుందరకాండను పండిత పామర జనరంజకమైన గీతంగా అలతి పదాల్లో రాసి తానే బాణీ కట్టి ఆలపించిన ఆ గాయకుడు ఎమ్. ఎస్. రామారావుగా ప్రసిద్ది పొందిన మోపర్తి సీతారామారావు.

ఉపకారాలని అపకారాలని చేసే మహాసముద్రం నా స్నేహితుడు అనుకుంటాడా ముసలివాడు. జీవితం ఆ మహాసముద్రం లాంటిదేనని చెప్పకనే చెప్పే చిట్టిముత్యం లాంటి నవల ఇది. నీ పోరాటం నీదేనని, నీ అనుభవమే ఏనాటికైనా నీ తలుపు తట్టగల అదృష్టమనీ పాఠం చెప్పే నవల

1995లో తన ‘క్రాస్‌రోడ్స్’ కథాసంపుటి కోసం వడ్డెర చండీదాస్ రాసిన ముందుమాటను తాను పోగొట్టుకున్నానని, ఆ చేతిరాతప్రతి తిరిగి ఈమధ్యే దొరికిందనీ చెబుతూ సదాశివరావు ఇటీవల ఆ ప్రతిని, ఆయనే తీసిన చండీదాస్ ఫోటోని, మాతో మరికొందరు మిత్రులతో పంచుకున్నారు.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

సి. కృష్ణవేణి, ఎన్. టి. రామారావు తాము సొంతంగా తీసిన సినిమాలలో ఎమ్. ఎస్. రామారావుకి పాడే అవకాశం ఇచ్చారు. ఏదయినా ఘంటసాల గాయకునిగా బలపడిన తరవాత ఎమ్. ఎస్. రామారావుకి అవకాశాలు తగ్గిపోయాయి అన్నది వాస్తవం.

అడ్డం మన భారతదేశం పార్వతీదేవికి సంబంధించినది. (5) సమాధానం: హైమవతము పంచతత్వాలు నశించడం. మరణం. (3) సమాధానం: పంచత్వం మిడుతల దండు (5) సమాధానం: […]

క్రితం సంచికలోని గడినుడి-51కి మొదటి ఇరవై రోజుల్లో పంతొమ్మిది మంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-51 సమాధానాలు.

కనీవినీ ఎరుగని రీతిలో కొరోనా వైరస్ గతసంవత్సరం ప్రపంచమంతటినీ కుదిపివేసింది. ఎన్నో వ్యాపారాలను, వృత్తులను అతలాకుతలం చేసింది. ఏ పూటకాపూట సంపాదించుకునే ఎన్నో జీవితాలను రాత్రికి రాత్రి అయోమయంలోకి నెట్టింది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రభుత్వాలకు పేదప్రజలు ఆటబొమ్మలేనని పాశవికంగా స్పష్టం చేసింది. దేశాల మధ్య, మనుష్యుల మధ్య కొత్త దూరాలు ఏర్పరచింది, కొత్త భయాలు సృష్టించింది. వెలివేత లాంటి జీవితంలో అశాంతికి, వేదనకూ గురి చేసింది. నిజానికి ఇట్లాంటి క్షణాల్లోనే మనిషి తనకు తానొక ప్రశ్నార్థకమై జవాబులు వెదుక్కునే ప్రయత్నం చేస్తాడు. తనకు నిజంగా కావలసినవి, అక్కర్లేనివీ బేరీజు వేసుకుంటాడు. బహుశా అందుకే సమాజంలోనూ ఏకాంతంలోనూ తమతమ విలువలు, బాధ్యతలు స్పష్టం చేసుకొని కొందరు మరింత మంచితనంతో ముందుకుసాగారు; మరికొందరు ఇదే సందర్భాన్ని తమ స్వార్థాన్ని, ఇతరుల పట్ల ద్వేషాన్ని సమర్థించుకొనేందుకు అనువుగా వాడుకున్నారు. ఆదినుండీ ఏ పరిస్థితిలోనయినా ఈ రెండు దారులూ ఉంటూనే ఉన్నాయి, ఏది ఎంచుకుంటామనేది మన విజ్ఞతను బట్టి ఉంటుంది. కళాకారులూ దీనికి అతీతం కాదు. నిజమైన కళాకారుడు ప్రతిబంధకాలతో నిస్పృహ చెందడు. పరిమితులు పెరిగేకొద్దీ తన కళను అపరిమితంగా సృష్టించుకునే దారులను అన్వేషిస్తాడు. కళను సామాజిక, సామూహిక ప్రభావాలకు ఆవలగా చూస్తాడు. తనదైన ఏకాంతంలో నుండి, తనవే అయిన అనుభవాలలో నుండి ఓ కొత్త చూపుతో కళాసృజనకు ఉద్యమిస్తాడు, ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. దృశ్య సంగీత మాధ్యమాలలో ఎందరో కళాకారులు ఈ కోవిడ్ కట్టుబాట్లనే తమ సృజనకు వేదికగా మార్చుకొని ప్రతిభను నిరూపించుకోవడం దానికదే ఓ స్ఫూర్తిసందేశం. కళాకారుడైనా, సామాన్య మానవుడైనా దిక్కుతోచని స్థితిలో కొత్త దిక్కు వెతుక్కుంటాడనేది మరొక్కసారి నిరూపించబడిన తరుణమిది. తెలుగు సాహిత్యానికి కోవిడ్ వంటి దుర్దశ కొన్ని దశాబ్దాలుగా ఏర్పడి ఉన్నా, తెలుగు సాహిత్యకారులు ఎంచుకోవలసిన దారి ఎంచుకోకున్నా, ఇప్పుడు ఈ ఆశావహ దృక్పథమే మనకు మరింత అవసరం. ఈ కోవిడ్ ఏకాంతం తెలుగు కవిరచయితలలో ఏ కొత్త దారులు తెరిచిందో, తెలుగు సాహిత్యంలో ఏ ప్రభావం చూపిందో, అసలు చూపిందో లేదో కూడా మనకింకా తెలియదు. తెలుగునేలపై ప్రముఖులమనుకునే వారి ధోరణి షరా మామూలుగానే ఉన్నా, వాటికి భిన్నంగా కొందరు రచయితలు కొత్తదారి పడుతున్నారని, ఒంటరి దీపాలుగా ద్వీపాలుగా, వైవిధ్యమైన కథాకథనప్రయోగాలతో తెలుగు సాహిత్యాన్ని సజీవంగా ఉంచేందుకు తమదైన కృషి చేస్తున్నారని మా ఎరుక. కారుమొయిలులా కొత్త వెలుగులను కమ్మేస్తున్న పాత ధోరణులను పక్కకు నెట్టి, సాహిత్యచర్చలు ఈ కొత్త కలాల గురించి కొనసాగాలి. జీవితం కొత్త అనుభవాలతో ఎలా మనల్ని బలోపేతం చేస్తోందో, తెలుగు సాహిత్యాన్నీ అదే రీతిన పరిపుష్టం చేసుకోవాలి. అదే మనం ఎంచుకోవలసిన దారి.

మనకు తూర్పు కనుమలు, పడమటి కనుమలు బాగా తెలుసు. కానీ, సముద్రంలో ఉన్న కనుమల గురించి తెలుసా? ఈ సముద్రకనుమలు బారుగా ఒకదానికొకటి అంటుకొని సముద్రగర్భంలో భూమి చుట్టూ వడ్డాణపు గొలుసుల్లా పాకివున్నాయి. అన్నీ కలుపుకొని వీటి పొడవు 40వేల మైళ్ళు.

జాషువా మొదట్నించీ పద్యాన్ని పట్టుకోవాలి, పద్యాన్ని బాగా రాయాలి అన్న ప్రయత్నంలోనే ఉన్నాడు. తను కవిత్వం రాసే కాలానికి పద్యం పాత పద్ధతుల్లో లేదని, పద్యాన్ని భావకవులు వచ్చి మాటల కూర్పు మీద, ఊహల పొందిక మీద దృష్టి పెట్టి పద్య స్వభావాన్ని మార్చేశారని జాషువా గుర్తించలేదు. ఆయనకు కావలసిందల్లా పాత పద్ధతుల్లో భావాన్ని ఛందస్సులో ఇమిడ్చి చెప్పడమే.

ఆ సముద్రతీరపు అల్‌బహ్రీ రోడ్డు మస్కట్‌ నగరానికి సరి అయిన కంఠాభరణమని మెల్లగా అర్థమయింది. ఎడమవేపున సాగర జలాలు, వాటిలో సీగల్స్- కుడివేపున ఏవేవో భవనాలు, ఆఫీసులు. పనిరోజు కావడంవల్లనేమో, పర్యాటకులు యాత్రికులు దాదాపు లేరు. అయినా అంత ఎండలో కొత్త బిచ్చగాళ్ళు తప్ప ఎవరొస్తారూ?

స్త్రీపర్వంలో పగ పరాకాష్ఠ చేరిన సన్నివేశం ప్రసిద్ధం. ఆ పగను ఊహించిన కృష్ణుడు (పగను ఊహించడానికి పరమాత్ముడే కానక్కరలేదు) ధృతరాష్ట్రుడికి ముందు ఉక్కుభీముణ్ణి ఉంచిన కథ తెలియని వాడుండడు భారతదేశంలో. పగ పగతో ఆరదు, ఎన్నటికీ తీరదు. ఉక్కు తీర్మానాలు కూడా తుక్కు కావలసిందే. ఇదే భారతం తీర్మానం. భారతం చెప్పిన పరిష్కారం ఏమిటి?

స్త్రీలు సృజనాత్మక పనులు చేయడం తప్పని భావించే సగటు మనస్తత్వాన్ని బర్నీ కొంతకాలం అధిగమించలేకపోయింది. అందుకే ఆమె తన తొలి రచనలన్నిటినీ కుప్పపోసి తగలబెట్టింది. ‘నా పుస్తకాలనైతే తగలబెట్టగలిగాను కానీ నా ఆలోచనలను తగలబెట్టలేకపోయాను’ అంది ఆమె ఆ తర్వాత.

నేను దారి తప్పి అలసిపోయి ఉన్నా. ఆ చలికి నేను వేసుకున్న బట్టలు సరిపోవట్లేదు. అతని దుస్తులు పల్చగానే అనిపించాయి. నా దగ్గరకు వచ్చాడు. అతనొక పిచ్చివాడిలా అనిపించాడు. ఏమీ మాట్లాడలేదు. నన్ను పట్టించుకోలేదు. ముందుకు వెళ్ళిపోయాడు. అతని పాదాలు కొద్దిగా పెద్దగా ఉన్నాయి, అంత దృఢమైన మనిషిలా అనిపించలేదు. చాలా వేగంగా నడుస్తున్నాడు. అతని కళ్ళలో పచ్చిక్రూరత్వం.

పరమశివుని కనులు విచ్చుకున్నాయి. ఆర్తిగా చూస్తున్న పార్వతి నయనాలతో చూపులు పెనవేసుకున్నాయి. ఆ పద్మనయని ముగ్ధమోహన రూపాన్ని మంత్రముగ్ధుడై చూస్తుండిపోయాడు. లజ్జతో తత్తరపాటుతో ఆమె కనురెప్పలు బరువెక్కినాయి. మోహం కాలాన్ని ఒడిసిపట్టే ప్రయత్నం చేసి విఫలమైంది.