ఐఐటీ-జీలు, ఎమ్‌సెట్‌లు అని బండకేసి బాదించుకోవడం తప్ప ఇంకోటి తెలియనివాళ్ళు, ఆ మాత్రం కాంపిటీటివ్ స్పిరిట్ లేకుండా, చూపించకుండా ఉండలేరు. కానీ అతడి మీదున్నది ప్రేమో-దోమో-ఇంకేదో అనేది ఇంకా తేలకముందే, ‘నీ సుఖమే నే కోరుకున్నా… నిను వీడి అందుకే వెడుతున్నా’ లాంటి సినిమాస్థాయి త్యాగాల ట్యూన్లు మనసులో ఎందుకు మొదలవుతాయో ఆమెకి అర్థమై చావదు.

హైదరాబాద్ జాడ్యములకు పుట్టినిల్లు. అక్కడ అవినీతి తప్ప మరేమియు వర్ధిల్లదు. ఆదేశము నందలి దురదృష్ట ప్రజలను తుపాకి సన్నీల (బాయొనెట్ల) వాడిమొనలను చూపి భయపెట్టియు, పదునైన ఖడ్గములను ఝుళిపించియు సొమ్ము వసూలు చేయుదురు. అక్కడి యన్యాయములకు అంతము లేదు.

జీతం అనేది ఒకటి జీవితంలో మొదటిసారి అందుకోవడమూ, అందరమూ ఆ మొదటి తారీఖు రాగానే అకౌంట్స్‌ సెక్షన్‌ ముందు వరుసగా నిలబడటమూ, వాళ్ళు ఒక్కొక్కరినీ రెవెన్యూ స్టాంపులు అంటించిన రిజిస్టర్‌లో సంతకం పెట్టించుకుని, టేబుల్‌ మీద పరిచిన నోట్ల కట్టల్లోంచి మనకో కొన్ని కాగితాలు చిల్లర పైసలతో సహా లెక్కించి చేతికి ఇవ్వడమూ; కొన్నాళ్ళు పోయాక చెల్లింపుల్ని కొంత నాగరికపరిచి, ముందే అందరి డబ్బుల్నీ ఎవరి కవర్లో వాళ్ళకు వేసి పిన్‌ చేసి ఉంచడమూ;

ఒక్క ధర్మతత్వశాస్త్రం బోధించే పాఠశాలలలోనే ఒక ఆచార్యుడికి తన మతవిశ్వాసాలకి విరుద్ధంగా ఒక వాస్తవం కనిపిస్తే, దాన్ని అతను గోప్యంగానైనా ఉంచాలి, లేదా దాని ఉనికిని నిరాకరించాలి. లేకపోతే అతను తన పదవిని కోల్పోవలసి వస్తుంది. సత్యప్రకటన నేరం, పిరికితనం. కానీ, ఆత్మవంచన మాత్రం ఒక సుగుణం.

పెరిగిన గడ్డం, పెదాలకి అడ్డొచ్చే మీసం
పెద్దగా ఇబ్బంది పెట్టవు.
అంటుకున్న ఎంగిలి అద్దంలో చూసుకున్నాకయితే
ఒకప్పుడు చేత్తో తుడిచిన మనుషుల్ని ఎలా వెతుక్కోవాలి మరి?

అందమైన జ్ఞాపకాల పేజీలన్నీ
చెదలు పట్టి
పొడిపొడిగా రాలిపోతుంటే
మరపు మలుపులలో
అనుభూతుల స్మృతులన్నీ వెలసి
దిగులు పెంకులను విసిరేస్తోంటే
మనసు కొలను అల్లకల్లోలమవుతుంది

ఇంతకీ ఎదటి వాహన చోదక బాధ్యతలు నెరవేర్చుతున్నదెవడు లేక ఎవతి? చోదకుణ్ణి స్త్రీలింగంలో ఏమంటారో? ఓ! అంకుల్‌గారు… మెల్లగా, ప్రపంచంలోని టైమంతా తనకే ఉన్నట్లు రోడ్డుమీద స్పెండ్ చేస్తున్నారు. అబ్బ పోనిద్దూ. ట్రాఫికే అంత మెల్లిగా పాకుతుంటే ఆయన మాత్రమేం చేస్తాడు? ఒరే చైల్డూ, నువ్వు కాసేపు గోల చెయ్యకు. నన్ను డ్రైవ్ చెయ్యనీ! అయామోకే, యూ ఆర్ ఆల్సో ఓకె!

కల్తీ కొంగలు వాలి
ఏ ఏడుకాయేడు పంటను మేసేసినప్పుడూ
నగరం చుట్టూ ప్రాకిన నల్ల కొండచిలువ
సగం పొలాన్ని మింగేసినప్పుడూ
ఆలి కాటిఖర్చుల కోసం
జోడెద్దుల్ని అమ్ముకోవాల్సొచ్చినప్పుడూ

ఇపుడు జీవించాలన్న తలపు
తొలిచేస్తోంది
ఓపినన్ని కలలున్న ఎడారిని నేను
ఒయాసిస్సులను మొలిపించుకోగలను
ఏమో, పాడుకుంటూ పరవళ్ళు తొక్కే
ఒక సెలయేరూ దారిలో ఎదురవ్వచ్చు.

ఇస్మాయిల్‍గారు టాగూర్‌ను సదాబాలకులు అన్నారని మనకు తెలుసు. అయితే మంచి కవులందరూ సదాబాలకులే. వాళ్ళలో పసితనపు సమ్మోహనత్వమేదో నిలిచే ఉంటుంది. ఆ పసితనపు స్వచ్ఛత సూదంటురాయిలా ఆకర్షించినట్టు, వీళ్ళ కవిత్వం కూడా పాఠకులను లాగుతూ ఉంటుంది. ఈ సంపుటిలో కూడా ఇదే ప్రధాన ఆకర్షణ.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

అడ్డం కృష్ణజన్మస్థానం ఆరంభంలో తెగి చక్కెర అయింది (3) సమాధానం: రసాల సంగీతం, సాహిత్యం, నృత్యం లాంటి ప్రక్రియల్నిముందుండి నడిపించే పరాశక్తి (3) సమాధానం: […]

గడినుడి పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రితం సంచికలోని గడినుడి-50కి మొదటి ఇరవై రోజుల్లో పద్దెనిమిది మంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-50 సమాధానాలు.

సాహిత్యం ఒక ఆయుధం కాదు సమాజాన్ని ఖండించడానికి; సాహిత్యం మన వాదభావరాజకీయావసరాలు తీర్చే, తీర్చగలిగే ఒక పనిముట్టు కాదు-ప్రత్యేకించి వాటిని వాడటం చేతకాని చేతులలో. అలా కావాలి అంటే ముందు సాహిత్యం పట్ల, సమాజం పట్ల, ఆ రెంటి సంబంధం పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. అది లేనప్పుడు, ఎన్ని వాదాలను సమర్థిస్తూ ఎన్ని నమూనా కథలు రాసినా వాటి ఫలితం శూన్యం. సమాజం ఒక అభాసరూపి; బహుముఖీన. నిర్వచనాలకు లొంగనిది. పాఠకులతో రచయిత జరిపే సాహిత్య సంభాషణ వ్యక్తిగతమైనది. సామూహికమైనది కాదు. అందువల్ల రచయిత చేయగలిగింది, చేయవలసింది తమ రచనల ద్వారా తమ ఆలోచనలను పాఠకులకు స్పష్టంగా చేర్చగలగడం, పాఠకులు తమ భావాలకు, ఆలోచనలకు స్పష్టతనిచ్చుకోవడంలో సహాయపడడం మాత్రమే. ఇలా తమ సాహిత్యం ద్వారా పాఠకులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న రచయితలు తెలుగులో ప్రస్తుతం నూటికో కోటికో ఒక్కరు మాత్రమే కనిపిస్తున్నారు. కోట్లమంది తెలుగువారిలో సాహిత్యం చదివేవారు వేలమందిలోను, విమర్శనాత్మకంగా చదవగలిగినవారు వందల్లో మాత్రమే ఉన్నారనడం సత్యదూరం కాని విషయం. పాఠకుల సాహిత్యాభిరుచి ఈ స్థితికి రావడానికి కారణం రచయితలే. సాహిత్యం ఇలానే ఉండాలి, ఈ వాదాలనే సమర్థించాలి, ఈ రకమైన ముగింపులే ఇవ్వాలి అని నిర్బంధించి, సమాజంలోని ఎన్నో రంగుల జీవితాలను కేవలం నలుపు-తెలుపులలో చూపే ప్రయత్నాలను మాత్రమే రచయితలు, పత్రికలు కూడా సమర్థించడం వల్లనే. అందువల్ల, పట్టుమని పదిమంది కూడా చదవని తమ సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు తెస్తున్నామనుకోవడం, వారి సాహిత్యానికి అంత శక్తి ఉందనుకోవడం కేవలం రచయితల పగటికల మాత్రమే. వైయక్తికస్థాయిలోనైనా మార్పు తేగలిగినంత ప్రభావంతో తెలుగులో ఎవరూ రాయటంలేదు. కారణం? పాఠకులకంటే కూడా ముఖ్యంగా రచయితలకు సాహిత్యస్వభావం గురించి లేశమాత్రమైనా అవగాహన లేకపోవడం. తమచుట్టూ తమలాంటి ఒక పదిమందిని కూడగట్టుకొని తాము చూసిందే ప్రపంచమని, దాన్ని తాము మారుస్తున్నామని, ప్రశ్నిస్తున్నామని, తమ గొంతు వినిపిస్తున్నామని అపోహపడడం, అలా కాని సాహిత్యాన్ని నిందించడం, ఆపై సాహిత్యవ్యాసంగాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకొనడం. ఇదీ నేటి పరిస్థితి రచయితలది, కొండొకచో పత్రికలదీ. సాహిత్యం ద్వారా తమ వాదపక్షపాతాన్ని ప్రకటించడం, దాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నించడంలో ఏ తప్పూ లేదు. కాని, సాహిత్యం కేవలం మనకు నచ్చినట్టే ఉండాలని, మన ఇష్టాయిష్టాలను, మన అభిప్రాయాలను, అపోహలనూ మాత్రమే ప్రతిబింబించాలని అనుకోవడం, అలా కాని సాహిత్యం ప్రమాదమని, హేయమని దాడి చేయడం కేవలం మూర్ఖత్వం. మనం నచ్చని, మనకు నచ్చని ప్రజలు ప్రపంచంలో ఉన్నట్టే, మనకు నచ్చని కథాంశాలు, పాత్రలు, వాటి ప్రవర్తనలు ఉన్న కథలుంటాయి. కథను కథలాగానే చదవాలి. అర్థం చేసుకోవాలి. కథగానే విమర్శించాలి. ఈ సాహిత్య సంస్కారం ప్రస్తుతం పాఠకులకంటే రచయితలకు ఒక ముఖ్యావసరం కావడం బాధించే విషయం. రచయితలు ముందు తమ దృక్పథాన్ని విశాలం చేసుకోవాలి. నిష్పాక్షికంగా తమచుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా పరిశీలించాలి. అవధులు లేని దాని విస్తీర్ణతను బహురూపత్వాన్ని గుర్తించాలి. సాహిత్యసంస్కారంతో పాటు, భిన్నాభిప్రాయాల పట్ల నిరసనను కూడా గౌరవంగా తెలపగలిగే సాంఘిక సంస్కారమూ అలవర్చుకోవాలి. ఈ తక్షణావసరాన్ని గుర్తించకుంటే తెలుగు సాహిత్యం, రచయితలు కొత్తలోతులకు దిగజారగలరేమో కాని కొత్త ఎత్తులు ఎక్కలేరు.

సంక్లిష్టమైన ఇతివృత్తాన్ని లేఖల ద్వారా కథనం చేయడంలో రచయిత్రి అపారమైన ప్రతిభ చూపింది. ఉత్తరాలనగానే కథకు మాత్రమే ఉపకరిస్తాయనిపిస్తుంది కాని, ఇందులో ఉత్తరాల ద్వారా అప్పటి సమాజం, ఆర్థిక వ్యత్యాసాలు, స్త్రీలను, పేదలను ధనవంతులు దోచుకునే విధానాలు, వాటికి వ్యవస్థ ఆమోదాలు అన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి.

రామాయణం రంకు, భారతం బొంకు అని ఒక నానుడి. భారతం విషయం నిర్వివాదం, అది ధర్మరాజు బొంకు కనుక. కాని రామాయణం విషయంలో ఆ నానుడి యీనాడు ఏమాత్రము నిర్వివాదం కాదు. ఆనాడు కానీ యీనాడు కానీ అన్ని అనర్థాలకు మూలం కామం. అది లేంది సృష్టిలేదు. కనుక, దాన్ని అదుపులో ఉంచుకోవడమే పురుషార్థసాధన. ఏ కావ్యవిషయమైనా ఆ విషయమే, ప్రాచ్యంగాని పాశ్చాత్యంగాని.

ఎడారిలో పూలు చూడటమన్నది వింతగొలపడం ఎప్పుడో మానేసిందిగానీ ఆ సాయంత్రం స్టేడియం మెట్రో స్టేషన్నుంచి ఇంటికి నడుస్తోన్నపుడు కురిసి గొడుగు తెరిచేలా చేసిన పది నిమిషాల వాన మాత్రం నాకు అపురూపమైన అనుభవాన్ని మిగిల్చింది. పూలను వికసింపజేయడం మానవ సాధ్యమే కావచ్చుగానీ ఆరుబయట వాన కురిపించటానికి దేవతలే కరుణించాలి.

పెళ్ళానికైనా ఇవన్నీ చేశానా? ఆమెకైనా ఎందుకు చేయాలి? ఎప్పుడైనా పెళ్ళాంగా ఉందా? పూర్తి స్వాతంత్య్రం ఇచ్చా కదా! దేనిలో ఇచ్చా? అంతకంటే చేసేదేంటి, ఏం కావాలో అవి చేశా. ఆమెనేమన్నా అబ్యూజ్ చేశానా? ‘తిట్టడం కొట్టడం ఒక్కటే అబ్యూజా, ఇంట్లో ఇంకో మనిషి ఉందన్న ధ్యాస లేకుండా, తనతో బతికే మనిషిని పట్టించుకోని నిర్లక్ష్యం కంటే పెద్ద అబ్యూజ్ ఏముంటుంది?’ అనేది ఆమె.