ఉపనిషత్తుల వల్ల ప్రభావితుడైనది ష్రోడింగర్ ఒక్కడే కాదు. అలనాటి భౌతిక శాస్త్రవేత్తలు ఎందరో ఈ కోవకి చెందినవారు ఉన్నారు. నీల్స్ బోర్, హైజెన్బర్గ్, ఆపెన్హైమర్ మొదలైనవారు ఉన్నారు. ఆమాటకొస్తే హైజెన్బర్గ్ ప్రవచించిన అనిర్ధారిత సూత్రం చెప్పేది కూడా ఇదే.
శీర్షికలు సంచికలు
బుద్ధుడైనా
మన టైమ్ లైన్ను దాటి
ఆలోచనల్లోకి రాకూడదు
వెలుగుకి భయపడి
మళ్ళీ తెరుచుకునే వీల్లేకుండా
కనుపాపలకు మేకులు కొడతాం.
చంద్రుడూ రాత్రి
సూర్యుడూ పగలు
చెట్టూ భూమి
పూవూ తేనెటీగ
చేపా నీరు
అన్నింటికీ
ఎంత ప్రేమ ఉంటేనేం
ఈ ట్రిబొనాచ్చి సంఖ్యలను మొట్టమొదట అగ్రనోమోఫ్ అను శాస్త్రజ్ఞుడు 1914లో ప్రస్తావించెను. కాని అంతకుముందే ఏనుగుల జనసంఖ్యను వివరించుటకై ఛాల్స్ డార్విన్ తన కొడుకైన జార్జ్ హోవర్డ్ డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతమును గ్రహించెను. ఇది ఒక మేధోప్రహేళిక.
కలో మెలుకువో తెలియని క్షణాలలో
పలుమార్లు కనికరిస్తుంది
ఆశించిన క్షణాల్లో ఆవిరై పరీక్షిస్తుంది
మొండికేస్తుంది – గారాలు పోతుంది
అలుగుతుంది – అంతలో ఆశీర్వదిస్తుంది
ఎప్పుడొచ్చి చేరిందో – ఎలా వొచ్చి కలిసిందో
డాబా మీద పడుకుని
నక్షత్రాల్ని లెక్కవేసేవాడు
మానవ మాత్రులకి రెక్కలు తొడిగి
శుభ్రతలేని చేతి వేళ్ళతో
భూమి గుండెల్లోంచి పక్షుల్ని ఎగరేసేవాడు
ఘడియలన్నీ
వెలిసిపోతున్న నీడలను
కొలుచుకుంటూ
అదృశ్యమైపోతున్న
సంవత్సరాలను చూసి
నిట్టూరుస్తూ
ముడుచుకున్న రేకులతోనే
మొగ్గలు నవ్వుతున్నాయి,
విచ్చుకున్న రెక్కలతోనే
పువ్వులు పలకరిస్తున్నాయి.
చినుకు స్పర్శ చాలు
మట్టి మనసు మెత్తబడటానికి.
వేడుకొంటిని వేలసారులు విసిగించితి మాధవా
ఆడుకొమ్మని ఒక్కసారికి అనకపోతిని కేశవా
కావుకావని కేకలేసితి కరుణలేదని కూకలేసితి
బ్రోవుబ్రోవని బేరమాడితి కడుపు నిండిన గొంతుతో
అడ్డం రూపుదాల్చిన వక్క ఒక సుగంధ ద్రవ్యం (5) సమాధానం: దాల్చినచెక్క చెప్పేవాడంటే అలుసా? (3) సమాధానం: లోకువ కిటికీలో ఒక కోతి (4) […]
క్రితం సంచికలోని గడినుడి-82కి మొదటి ఇరవై రోజుల్లో ఇరవై అయిదు మంది సరైన సమాధానాలు పంపారు. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-82 సమాధానాలు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
రాముణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఉపక్రమించి ఓ భక్తుడు ‘రామా! నీలమేఘశ్యామా’ అని మొదలెట్టాట్ట. ‘సర్లేవయ్యా! ఓ చాయ తగ్గినంత మాత్రాన దాని ప్రస్తావనే తేవాలా?’ అని చిన్నబుచ్చుకున్నాడట రామయ్య. ‘చెట్టు చాటు నుండి వాలిని చంపిన వీరాధివీరా, శబరి ఎంగిలి మింగిన ఇనకులతిలకా!’ అని భక్తుడు స్తోత్రపాఠం అందుకోగానే ‘అన్ని కాండల రామాయణంలో మేము చేసిన మహత్, చమత్, బృహత్ కార్యములు అనేకములు ఉండగా నీకు ఇవే తట్టాయా?’ అని నోరు చేసుకుని వరాలేవీ ఇవ్వకుండానే మాయమయ్యాట్ట ఆ పురుషోత్తముడు — ఇది రాసింది రమణ అంటే ముళ్ళపూడి రమణ అనుకునే తెలుగువారు ఈ రోజుకీ తెలుగునాట ఉన్నారు. మల్లెపూవులా జీవించి మొల్లపూవులా వెళ్ళిపోయిన ముళ్ళపూడి పేరు మీద తనను గుర్తు చేసుకుంటే శ్రీరమణా నొచ్చుకోకపోవచ్చు. అయినా చాలామంది మిథునం రాసిన రమణ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. శ్రీరమణ అంటే బాపు దస్తూరీలోని తెలుగు కథ. బంగారు మురుగు, షోడానాయుడు, ధనలక్ష్మి, మిథునం, నాలుగో ఎకరం ఇలా ఆయన రాసిన అన్ని కథల్లోనూ మానవ సంబంధాల మీద అనితర సాధ్యమైన ఒక వ్యాఖ్య ఉంటుంది. చాలా కథల్లో మనుషులందరూ అనివార్యంగా పోగొట్టుకున్న ఒకానొక కాలం మీద దృష్టి పెట్టారాయన. ఆ రోజుల సున్నితత్వమూ నమ్మకమూ మరిక ఎన్నటికీ తిరిగి రాలేవని గుర్తు చెయ్యడంలోని విషాదం ఆయన కథల్లో అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. మనిషిలోని పెద్దరికమూ పసితనమూ పంతాలు పడే కథా వస్తువులేవో ఆయన కలానికి లోబడిపోయాయి. అందమైన అలతి మాటలు, వ్యంగ్యంతో మిళితమైన సున్నితమైన హాస్యం రమణ రచనల తాలూకు కొండగుర్తులు. వడిసెల తిప్పినట్టు జడ విసిరితే కుప్పెలు ఛెళ్ళున తగిలి కష్టసుఖాలు ఒకేసారి అనుభవంలోకి వచ్చేవిట వరహాల బావి ఊరి కుర్రాళ్ళకి. ధనలక్ష్మి, మేల్ ఇగో పోరు పడలేని ఎందరెందరో ఆడవాళ్ళకి ఒక ఆశాదీపం. ఎర్ర రాళ్ళ నెక్లెసుతో కంటినిండా కాటుకతో ‘ఇదిగో రామాంజనేయులూ, నాకు పెన్సిలు కావాలి’ అని ఘల్లుఘల్లున గజ్జెల చప్పుడుతో వచ్చి క్లాసు బయట నిలబడి అరిచిన ఎనిమిదేళ్ళ ధనలక్ష్మి, ‘లక్క బంగారం అంటుకుని ఉంటేనే తాళిబొట్టు నిండుగా ఉండేది’ అని ఆరిందాసూత్రాలు పొడుపుకథల్లా చెప్పేంతదవుతుంది. పసితనపు నీలంగోళీ కలని నిక్కరు జేబులో మోసుకొచ్చి, ఇవ్వడానికి మోమాటపడిన సిద్ధుడు – షోడానాయుడు కథలో – కళ్ళ నీళ్ళు పెట్టిస్తాడు. ‘చెంగనాలు వేస్తున్న తువ్వాయి మెడలో పట్టెడ తెగిపోయి మువ్వలు చెదిరిన విధాన, మబ్బు తునకలు తునకలై గడగడా వడగళ్ళు రాలిన చందాన, నేరేడుపళ్ళు దోసిలితో గుమ్మరించిన తీరున షోడాగోళీలు నా గది గచ్చు మీద పడి దొర్లుతున్నాయి’ అని చదువుతుంటే, గుండె గొంతుకలోన కొట్టాడనుందని తెలిసిపోతుంది. ఏళ్ళకేళ్ళ జీవితాలని ఎంతో వైనంగా కుదించి చెప్పగల నేర్పు శ్రీరమణది. అందుకే బోలెడంత మందికి బోలెడు కలలిచ్చి పోయారు. ముగ్గులేసే బామ్మ వీపు మీద బల్లిలా కరుచుకు పడుకుని కునుకు తీయగల బాల్యం, నాలుక్కాసులు ఒక్క ముద్దుకి చెల్లురా అని మనవడిని ఒప్పించి పిల్లని కుదిర్చే బామ్మ -ఎన్నేళ్ళ కాలమూ కరిగించలేని బంగారు మురుగంత అపురూపం. దాంపత్యంలో ఇంత స్నేహం, ఇంత తత్వం ఉంటే అదే మిథునం. పేరడీలు, ఛలోక్తులు, ఎప్పటెప్పటివో అనుభవాలూ జ్ఞాపకాలే ఆయన రచనలు. నవ్వులో శివుడున్నాడురా అని ఆయన చెప్పిన కబుర్లు హాయిగా మళ్ళీ మళ్ళీ చదువుకోదగ్గవి. అందమైన ఆడపిల్లను చూసి ‘ఎవడో మీగడ తోడెట్టాడురోయ్’ అన్న మల్లాది మాట తనకెంతో ఇష్టమని చెప్పుకునే శ్రీరమణ అంతకంతా అందమైన వాక్యాలతో పాఠకులను అలరించారు. పొగడ్త కూడా ఎలా ఒక కళో, నేమ్ డ్రాపింగ్ ఎలా చేస్తే రక్తి కడుతుందో బోలెడు చమక్కులతో చెప్పి పోయిన నిక్కమైన మంచి నీలంపురాశి శ్రీరమణని, ఆయన సాహితీ సంపదలో నుండి ఏ మాటలతో పొగిడినా అనౌచిత్యం ఉండబోదు.
కామం పాశ్చాత్యులు ‘కనిపెట్టారు’ అన్న భావం మనలో చాలామందికి ప్రబలంగా ఉంది. భారతీయసంస్కృతి అందుకు విరుద్ధమని, పాశ్చాత్య సంస్కృతులతో పోలిస్తే మన సంస్కృతి చాలా స్వచ్ఛము పవిత్రము అన్న భావం కూడా చాలామందిలో ఉంది. ఈ చర్చ కావ్యవిమర్శలో రాకుండా ఉండదు. నిజమే, కాని అది ప్రధానం కాదు.
అక్కడి ఒక కూడలిలో ‘చూడు చూడు అంటూ ఒక శిల్పం చూపించాడు మార్కో. అతను ముందే చెప్పిన, హనుమంతుడి పోలికలు పుష్కలంగా ఉన్న ఆకృతి అది. దానికి మార్కో పెట్టిన పేరు ‘మాయన్ హనుమాన్’. ఆమాట అక్కడికి వచ్చిన ఒక భారతీయ టూరిస్టు మార్కోతో అన్నాడట – దాన్ని మార్కో ఖరారు చేసి వాడేస్తున్నాడు.
వాడు నాకు బావ అవుతాడు కదూ. ఏదో ఒకటి వెక్కిరించకుండా వాడి నోరు ఊరుకోదు. నామీద ఓ అక్క అంటూ ఏడవబట్టి నన్ను పెళ్ళి చేసుకోడు. బతికిపోయా. లేపోతే ఏముందీ మా మేనత్తా మా బామ్మా నన్నే వాడికి కట్టబెట్టేస్తారు. పై సంబంధాలు ఎందుకూ? వాడికెవరికో ఇచ్చి తర్వాత ఏదన్నా అయితే బాధ పడ్డం, అని ఉపన్యాసాలు ఇస్తారు.
డిసిప్లిన్కి భంగం రాకుండా, తన పద్ధతిలో తనుండే ఇతన్ని చూస్తే ఆశ్చర్యంగా అనిపించేది. యూనిఫారంలో షూస్ దగ్గర్నించీ కాప్ వరకూ, తన వీలు కోసం చేసుకున్న చిన్నా పెద్దా తేడాలేవీ బయటికి కనిపించకుండా జాగ్రత్త పడేవాడు. బరాక్లో అతని బెడ్ని అటు చదువుకోవడానికీ ఇటు విశ్రాంతికీ వీలుగా, మెత్తటి దోమతెర, రీడింగ్ లాంప్ వంటి ఏర్పాట్లతో సౌకర్యవంతంగా మలచుకున్నాడు. అవసరమైతే తప్ప మాట్లాడడు. డ్రింక్, సిగరెట్లు ముట్టుకోడు.
వీరరాఘవయ్యకి ఇదంతా తెలుసు. ఆవిడ పుట్టింటినుంచి తెచ్చిన నాలుగు రూపాయలతో బొంబాయి జీవితానికి అంకురార్పణ జరిగిందని, ఆ బెట్టు, ఆ ధీమా, ఆ దెప్పు పెళ్ళాం నుంచి జీవితాంతం భరించాలని తెలుసు. నాలుగు రూపాయలు నలభై చేశానుగా, నాప్రమేయమూ కొంత ఉంది అనటానికి లేదు. నా నాలుగే ఈ నలభై అని ఆవిడంటే తార్కికంగా ఆమె తప్పని ఆవిడ భాషలో ఆవిడని ఒప్పించలేడనీ తెలుసు.
ఈమధ్య వచ్చే కథల్లో లోతు మరీ ఎక్కువగా ఉంటోంది నాయుడి కవిత్వంలో లాగ. అర్థం చేసుకోడానికి శ్రమ పడాలి అని గుర్తొచ్చింది. చదువుతూ ఉన్న పుస్తకంలో కథ అసంపూర్ణంగా ఉంది. ఇప్పటి బతుకులో లోతు లేదా? అర్థం చేసుకోలేక పోతున్నానా? కథకురాలు కొత్తగా చెప్పే ప్రయత్నంలో చాలా విషయాలు స్పృశించిందా? ఫేస్బుక్లో అందరూ పుస్తకాన్ని మెచ్చుకున్న వాళ్ళే. బహుశా వేరే రకంగా చెప్పడానికి సంకోచమేమో!?
అడ్డం ఈ బొట్టు దేవుడు … పిలవాలే గానీ పేరు మార్చినా పలుకు సమాధానం: కపాలీ ఔరా! క్షిపణికున్న వేగము సమాధానం: క్షిప్రము డెబ్బైకొమ్ములు […]