బ్యాగులోంచి అన్నండబ్బాను బయటికి తీయగానే, నాకు మామూలుగా నా భార్య ముఖం గుర్తొస్తుంది. దానిలో ఉన్న పదార్థాలను బట్టి కొంచెం చిరాకో, ప్రేమో కలుగుతుంటుంది. కానీ ఇవ్వాళ నేను ఏ కళన ఉన్నానో – డబ్బా మూత తీయగానే, కొంచెం ముద్దగా అయినట్టుగా ఉన్న అన్నం కళ్ళబడగానే, నాకు ఉన్నట్టుండి మా ఊళ్ళో చిన్నతనంలో చూసిన ఒక గొల్లాయన గుర్తొచ్చాడు. ఆయన ఒక పగటిపూట తన అన్నంమూటను విప్పుకుని తినడం గుర్తొచ్చింది.

ఈ మాఘమాసంలో పెళ్ళి చేసేస్తాం, ఈ ఏడు మాఘంలో చేసేస్తాం అంటూ ఇంట్లో కూచోపెడతారు, ఆడపిల్లకి చదువు చెప్పించడం ఆపేసి. చదివేవులే స్కూలు ఫైనలు వరకూ లేదా టెంత్ వరకూ అంటారు. అలాగే ఆ అమ్మాయి కూడా పెళ్ళి కోసం ఈ మాఘం కోసం ఆ మాఘం కోసం చూస్తూ కూచుంటుంది. మాఘమాసాలు ఆగమేఘాల మీద వచ్చివెళ్తూ ఉంటాయి!

పెళ్ళికూతురు ఊర్లోకి ప్రవేశించింది వాను. రెండు వీధులు తిరిగాక, ఒక డాబా ఇల్లు ముందు అయ్యవారు బండాపమన్నాడు. ఇంటిముందు సందడిగా వుంది. గడపలకి మామిడాకుల చెండ్లు కట్టి ఉన్నాయి. వయసాడపిల్లలు గడపల వెనకాల నుంచుని తొంగి చూస్తున్నారు. హాలులో అగరొత్తుల సువాసనలు నాసికలని అలరిస్తున్నాయి. అయ్యవారు దిగి గబగబ ఇంట్లోకి అడుగుపెట్టి పెళ్ళికూతురు తల్లితండ్రుల్ని పిలిచి, పెళ్ళికొడుకుని లోనికాహ్వానించమన్నాడు.

ఒక సమస్య బుద్ధికంటే హృదయాన్ని మేల్కొల్పినప్పుడు, దాన్ని సాధన చేసినవాడి మెదడు కన్నా కూడా, అతని హృదయం పరివ్యక్తమైనపుడూ ఆ సమస్య గొప్ప సమస్య అవుతుంది. ఆ పూరణ ఉదాత్తమైనదవుతుంది. అప్పుడు ఒక సమస్యను ఇవ్వడమూ, ఒక కావ్యం వ్రాయమని ఒక కవిని అడగడమూ — ఈ రెండూ ఒకటే అవుతాయి. కావ్యానికి నిడివితో పనిలేదు. మనసును పూయించేది ఎంత చిన్నదైనా, పెద్దదైనా కావ్యమే.

ఎదకి చెద ఎందుకు పడుతుందీ?
కట్ గ్లాసుల కళ్ళూ నోళ్ళూ తెరుచుకొనే
కనరెక్కని రుచులింకా ఆవురావురంటూనే
పొడిబారని పూరెమ్మలు బాటల్లో పూస్తూనే
మిణుగురు గుర్తులు రాత్రులని వెలిగిస్తూనే
మెత్తని వాసనలు మనసుకి సోకుతూనే ఇంకుతూనే…

ఆమె ఇరవై, ఇరవై రెండేళ్ళ ఈడులో
తతిమ్మా ప్రపంచాన్ని పలుగుతాడు చేసి
తనొక వైపు, నా ఈడు కుర్రలోకాన్ని మరోవైపు
ఉర్రూతలూగిస్తున్నప్పుడు
మూర్ఛపోతున్న నా జతగాళ్ళ గుంపును తట్టిలేపటం
తప్పని వంతయ్యేది.

శకలాలు శకలాలుగా
కదిలిపోయే దృశ్యాల మధ్య
పరిగెత్తలేక కూలబడ్డాక
సప్తవర్ణాల ఇంద్రధనుస్సులో
తెలుపురంగు మాత్రమే మిగులుతుందని
తెల్లవారినా తెరిపిడి పడని కళ్ళు

వానొచ్చిన ప్రతిసారి
భూమికి సంబరంగా ఉంటుంది

వానవీణను మీటుతూ కరిమబ్బు
చినుకుగజ్జెలతో ఆడుతుంది

తడిచీరతో మెరుపుతీగలా మట్టి
పరిమళాల పాట ఎత్తుకుంటుంది

అడ్డం 6 అడ్డం కథను నాటకంగా రాసినవాడు (4) సమాధానం: కాళిదాసు మరచిపోయింది గుర్తుకు రావడం (3) సమాధానం: అభిజ్ఞ వందమంది కొడుకుల కంటే […]

క్రితం సంచికలోని గడినుడి-80కి మొదటి ఇరవై రోజుల్లో పద్దెనిమిమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-80 సమాధానాలు.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

డెబ్భై ఎనభై దశకాలలో పెరిగిన తెలుగువారందరికీ మెకాలే విద్యావిధానం నశించాలి అన్న ఉద్యమ నినాదం, గోడ మీది రాతల్లో ఒకటిగా గుర్తుండే ఉంటుంది. ఆ విధానం నశించిందో లేదో కాని, ఆ తర్వాత ప్రభుత్వాలు విద్యావిధానాలను అంతకంతకూ నిర్వీర్యం చేస్తూ వచ్చాయి. అలా ఏర్పరచుకున్న ఈనాటి విద్యావిధానం లోని మంచి ఏమిటో చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరిప్పుడు. గత మూడు దశాబ్దాలుగా హ్యుమానిటీస్ లేదా లిబరల్ ఆర్ట్స్ అని పిలవబడే భాషలు, కళలు, సాహిత్యం, సంస్కృతి వంటివి పాఠ్యాంశాలుగా క్రమేణా కనుమరుగవవుతూ వచ్చాయి. వీటిని ప్రోత్సహించడం అటుంచి ఇవి ఎందుకు ముఖ్యమో, ఎందుకు చదవాలో చెప్పేవారు కూడా ఇప్పుడు ఎవరూ లేరు. ఏదో ఒక రకంగా కనీసార్హతగా డిగ్రీ ఉంటే చాలు అన్న అప్పటి ఆలోచన నుండి రానురానూ విద్య అన్నది కేవలం ఏదో ఒక రకంగా ఉద్యోగం సంపాదించడానికే అన్న ఇప్పటి ధోరణి దాకా తెలుగురాష్ట్రాలలో విద్య ఒక దుస్థితిలోకి నెట్టబడటానికి ప్రజలూ ప్రభుత్వాలూ ఎవరి పాత్ర వాళ్ళు శక్తిమేరకు నిర్వహించారు. చివరికి విశ్వవిద్యాలయాలలో కూడా కళలు, సాహిత్యం వంటి విభాగాలలో బోధన, పరిశోధనల నాణ్యత ప్రశ్నార్థకంగానే ఉంది. విద్య, విద్యార్థుల లక్ష్యం, విస్తీర్ణం ఎంతో సంకుచితమైపోయి ఉన్నాయి. పాఠశాల విద్యార్థులు తెలుగుని మార్కుల భాషగానే తప్ప జీవభాషగా, తమ ఆలోచనలను వ్యక్తపరుచుకునే భాషగా, తమ ఆలోచనలను, అనుభవాలను బలపరుచుకునే, సరిచూసుకునే భాషగా చూస్తున్నారా అన్నది కొన్ని దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోని సమస్య. జీవితం మొత్తాన్నీ ఆర్జనతో ముడివేసుకుని తిరిగే తరానికి స్వేచ్చగా ఆలోచించడానికి కూడా పరాయి భాష అవసరం తప్పదు. తెలుగే ఉపాధిగా ఉన్న కొద్ది రంగాలు తప్ప, మిగతా సమాజమంతా మెల్లమెల్లగా తెలుగుకి దూరం జరిగిపోయిందనడం నిర్వివాదాంశం. ఉపాధి చూపించలేనివన్నీ అనవసరమైనవే అన్న వికృత భావనలను మనం వ్యవస్థలో చొప్పించి చాలా కాలమైంది కాబట్టి, యువతలో తెలుగు పట్ల ఆసక్తి లేదేమిటని ఇప్పుడు వాపోవడంలో అర్థం లేదు. ఎందుకు చదవాలి అన్న దానికి జవాబు చూపించకుండా తెలుగు చదవాలని పిల్లలే ముందుకు రావాలనుకోవడంలో ఉద్వేగమే తప్ప తార్కికత లేదు. అందువల్ల, ఇది నిజంగా ఒక సమస్య అని అర్థమైతే, నమ్మితే, సాహిత్యకారులు ప్రజలతో మమేకమై ప్రభుత్వ విద్యాశాఖలపై ఒత్తిడి తేవాలి. హ్యుమానిటీస్ ప్రాముఖ్యతను వారికి తెలియజేయాలి. వాటిని ప్రాథమిక పాఠశాలల స్థాయినుండి కాకున్నా కనీసం ఉన్నత పాఠశాలల పాఠ్యాంశాలలో భాగం చేయడానికి ప్రయత్నించాలి. ఇటీవల, ప్రస్తుత విద్యావ్యవస్థ తొమ్మిదో తరగతిలో దాదాపు పద్నాలుగు మంది కవుల కవితలని, అలాగే పద్నాలుగు మంది రచయితల కథలని తెలుగు పాఠ్యాంశాలుగా చేర్చారని, ఉపాధ్యాయులు వాటిని పిల్లలతో చదివించి అర్థవంతంగా వివరించవలసి ఉంటుందని తెలియవచ్చింది. ఎవరి ప్రయత్న ఫలితమైనా ఇది నిస్సంకోచంగా స్వాగతించవలసిన గొప్ప అడుగు. కనీసం ఉపవాచకాలైనా సమకాలీన కథలతో కవితలతో రావడమంటే, పిల్లలని మళ్ళీ సాహిత్య ప్రపంచంలోకి ఆహ్వానించినట్టు. భాషని బతికించుకునే పద్ధతి ఇదే. మెల్లమెల్లగా దారులు విశాలమయ్యే వీలు ఇదే. ఉద్యమాలు, పుస్తక మహోత్సవాలు, పోటీలు, చర్చలు, వీటన్నిటి కన్నా బలంగా తేలిగ్గా పిల్లలను చేరగలిగింది పాఠ్య పుస్తకాలే. ఈ తొలి అడుగు ఈ తరాన్ని చాలా దూరం తీసుకెళ్తుంది. ఎందుకంటే సాహిత్యం ఒక అలవాటుగానో అభిరుచిగానో కాదు, సంస్కారంగా అందుకోగల వయసులో వాళ్ళని చేరగలుగుతున్నాం కనుక. పెద్దయి వారు పుస్తకాభిమానులు అయినా కాకున్నా సాహిత్యంతో పరిచయమయినా ఏర్పడుతుంది, కొంతయినా చదవడం విశ్లేషించడం అలవాటు అవుతుంది కనుక. ఆపైన మిగిలింది ఇటువంటి ‘పనికిమాలిన’ చదువులు చెప్తారా అని దండెత్తే తల్లిదండ్రులనుండి పిల్లలను, పాఠశాలలను, ఈ రకమైన ప్రయత్నాలనూ కాపాడుకోవడం. ఎందుకంటే ఇలా సాంకేతికత, కళాత్మకత రెండూ కలగలసిన సమగ్రవిద్యావిధానం భావితరాలకు కేవలం ఒక పనిముట్టు వాడడం నేర్పించి ఆగిపోదు. విచక్షణ నేర్పి జీవితాన్ని ఎన్నో రకాలుగా తీర్చుదిద్దుకోటానికి వారికి దారి చూపిస్తుంది. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరత్వానికి తర్ఫీదునిస్తుంది. సాహిత్యం ఒక్కటే కాదు, మన సమాజం మెరుగుపడాలన్నా ఈ సమగ్రవిద్యావిధానం ఒక్కటే మార్గం.

ఇంతకూ ఎలియట్ ఈ దృశ్యంలో వర్ణించిన స్త్రీ ఎవరు? ఆయన మొదటి భార్య వివియన్ అని కొందరి ఊహ. ఆయన వర్ణించింది ఒక స్త్రీని కాదు, స్త్రీని. స్త్రీకి ఎన్ని ముఖాలుంటాయో అన్నీ కరిగించి పోసిన పోత. మసి అయిపోయేది స్త్రీయే, మసి చేసేది స్త్రీయే. ఈ దృశ్యంలో వస్తువు స్త్రీ మాత్రమే కాదు. కృత్రిమత్వంలో బుద్ధి నశించిన మనిషి.

కొండల వెనకాల నుంచి మా ముందున్న సరోవరాన్ని వర్ణభరితం చేస్తూ సూర్యుడు మెలమెల్లగా రంగప్రవేశం చెయ్యడం కానవచ్చింది. ‘అసలు నువ్వా శునకాలకు థాంక్స్ చెప్పుకోవాలి. వాటి పుణ్యమా అని ఇంత చక్కని ప్రదేశం చేరి సూర్యోదయం చూడగలుగుతున్నావ్’ అని చెణికింది జెమ్మా. ఆమె ఈ ప్రదేశానికి తరచూ వస్తూ ఉంటుందట.

బామ్మ దగ్గర కథలు విని రాయడం నేర్చుకోవాలి. నన్నడిగితే ప్రపంచం లోని పెద్ద పెద్ద పేరున్న కథకులందరూ బామ్మ దగ్గర కథ చెప్పడంలో బలాదూరే! ఒక్కసారి గాని వాళ్ళు వింటే ఎంత నేర్చుకోవాలో తెలిసివస్తుంది! బామ్మ దగ్గర కథలు విని కథలు రాయడం మొదలుపెడితే ఇంక వాటికి తిరుగు ఉండదు!

పదిహేను అడుగుల వెడల్పున్న ఆ తార్రోడ్డు మీద, అడ్డంగా పరుచుకుని ఉందో నల్లటి త్రాచు. కొద్దిసేపటి క్రితమే ఏదో భారీ వాహనం దాన్ని తొక్కేసినట్లు, తోక భాగం కొద్దిగా తప్ప మిగిలిన శరీరమంతా అప్పడంలా రోడ్డుకి అతుక్కుపోయింది. తోకలో కొద్దిగా చలనం కనిపిస్తోంది ఇంకా. “మెచ్యూర్డ్ కోబ్రా” అన్నాడు మేజర్ దేవల్ దాన్ని ఒకింత జాలిగానూ, ఎక్కువ నిర్లిప్తంగానూ పరికిస్తూ. “ఏదో పెద్దదాన్నే మింగినట్లుంది. అందుకే ట్రక్కు వస్తున్నా తొందరగా రోడ్డు దాటలేకపోయింది.”

ఒక్కోసారి వియోగమనే భావపు ఘాటు ముందర ప్రేమ వెలవెలబోతుందేమో అనిపిస్తుంది. విప్రలంభపు మహిమ ఎవరికీ ఎన్నతరం కాదు. కవిత్వంలో మనకు తెలిసిన ఎన్నో పొరలు దాని దయాభిక్షే. ఒక బలీయమైన అనుభూతిలో శుద్ధతతో కూడినవైన ఎత్తులలో విహారం చేస్తున్నపుడు ఒకవేళ మనస్సు మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఒక్కో పదమూ ఎంతో చిన్నదైనప్పటికీ బరువైన భావాలను మోసేదిగా ఉంటుంది.