నలుగురూ చేరి శ్రీరంగశయనంగారిని రెక్క పుచ్చుకు బలవంతాన లేవదీశారు, మిట్టమధ్యాన్నానికయినా దహనం అయిందనిపిస్తే, ఆ తరవాత ఇంకా చేయవలసిన విధులు చాలా ఉన్నాయని. ముత్తయిదువులు శవానికి స్నానం చేయించి, కొత్తచీరె కట్టి, పసుపూ, కుంకమలతో, పువ్వులతో అలంకరించి పాడెమీద ఉంచేరు. కర్మకాండ పూర్తయేసరికి నాలుగయింది.
నిడదవోలు మాలతి
జీవిత విశేషాలు
నిడదవోలు మాలతి ప్రముఖ రచయిత్రి, కథకురాలు, సాహిత్య విమర్శకురాలు, తెలుగు ఉపాధ్యాయులు. పంథొమ్మిదివందల యాభైల్లో కథలు వ్రాయడం మొదలు పెట్టి ఇప్పడు తన స్వంత వెబ్ పత్రికలు తెలుగు, ఇంగ్లిష్ తూలికలు నిర్వహిస్తూ, దాదాపు వంద తెలుగు కథల్ని ఇంగ్లిష్ లోకి అనువదించి, ఇంగ్లిష్ లో మూడు అనువాద కథా సంకలనాలు. The Spectrum of My People ( జైకో బుక్స్) “From My Front Porch” (సాహిత్య అకాడెమీ ప్రచురణ) All I Wanted Was to Read and Other Stories (e-Book) వెలువరించారు.
నిడదవోలు మాలతి రచనలు
అవును. అప్పుడు నాకు బహుశా మహార్ణవ్ వయసే అనుకుంటాను. నాకు చీకటి అంటే భయం. నాభయం పోగొట్టడానికి అంటూ మా నాన్నగారు నన్ను చీకటి గదిలో పెట్టి తలుపేసేరు.
అమెరికాలో దిగడి ముప్పై ఏళ్ళు దాటుతోంది.. గత ఇరవై యేళ్ళలోనూ ఏడు కంప్యూటర్లు మారేయి. అయిదున్నర ఇంచీల ఫ్లాపీలనుంచి అరచేతిలో ఉసిరిక్కాయల్లా ఇమిడిపోయే సీడీలదాకా సాంకేతిక ఇంద్రజాలంలో పడి కొట్టుకుపోతున్నాను
మురికివాడలో నా ఇరుకుగదిలో
వెతుక్కుంటున్నాను
ఆల్చిప్పంత జాగాకోసం.
పావుగంట అయింది. రంగంమీదకి కొత్త పాత్ర ప్రవేశించింది. “మామీ” పాప అరిచింది హఠాత్తుగా. చుట్టూ కూర్చున్నవాళ్ళు హుష్ష్ అంటూ తమ అసహనాన్ని వెలిబుచ్చారు. నీలవేణి వాళ్ళకి క్షమాపణలు చెప్పుకుని, ఆపాపని మళ్ళీ నెమ్మదిగా అడిగింది ఆవిడ మీఅమ్మాఅని. అవును మామీయే. తల్లెవరో నిర్ధారణ అయిపోయింది. నీలవేణి ప్రాణం తెరిపిన బడింది. ఆట ముగిసేసరికి ఆపసిదానిబాధ్యత కూడా తీరిపోతుందని.
అసలు ఆయనే కాదు ఆయింట్లో ఎవరికీ నార్మల్ వాయిస్ వున్నట్టు లేదు. అందరివీ కాకలీ స్వనాలే! 90 డెసిబెల్స్కి పైమాటే!