అప్పట్లో అమెరికాకు, బెంగుళూర్నుంచీ నేరు ప్లైటు కాదు కదా, రెండు మూడు సార్లు కాక, వెళ్తున్న స్థలాన్ని బట్టి కనీసం ఏడెనిమిదిసార్లు విమానాలు మారవలసి వచ్చేది.

నలుగురూ చేరి శ్రీరంగశయనంగారిని రెక్క పుచ్చుకు బలవంతాన లేవదీశారు, మిట్టమధ్యాన్నానికయినా దహనం అయిందనిపిస్తే, ఆ తరవాత ఇంకా చేయవలసిన విధులు చాలా ఉన్నాయని. ముత్తయిదువులు శవానికి స్నానం చేయించి, కొత్తచీరె కట్టి, పసుపూ, కుంకమలతో, పువ్వులతో అలంకరించి పాడెమీద ఉంచేరు. కర్మకాండ పూర్తయేసరికి నాలుగయింది.

దుర్భరమైన కష్టాల్ని, వేదనను స్వయంగా అనుభవించేవాళ్ళు సైతం సృజనశీలురైతే ఆ దు:ఖం అంతర్లీనంగా ప్రవహిస్తూ వాళ్ళ సృజనకు వన్నె తెస్తున్నాది. ఎలాగో?!

నాకు కొన్నాళ్ళు ఎక్కడికన్నా ఎవరికీ కనిపించనంత దూరంగా వెళ్ళాలని ఉంది. కానీ, అంత దూరాన్ని ఎక్కడ వెదుక్కోను? శాశ్వతంగా ప్రపంచం నుండి సెలవు తీసుకోడానికి ధైర్యం చాలట్లేదు.

నేను పొరబడ్డానేమో అనుకున్నాను. ఇంటికొచ్చి అదేదో ఆఫీసు పార్టీలో మా పిల్లలతో కలిసి మృణాలిని తీయించుకున్న ఫోటో వెతికి తీసాను. సందేహం లేదు, అతనే!

నమస్కరించినా మోమైనా ఎత్తి చూడలేదే అని ఒళ్ళు మండుతుంది దేవదేవికి. ఈ స్వామి దొంగస్వామి అని తేల్చేస్తుంది. అక్క కాదని చెప్పినా వినదు. స్వామి నిజంగానే విరాగి.

“ఈనాడు ‘రిథమ్’ విని ఎక్కువమంది ఆనందిస్తున్నామని అనుకుంటున్నారు కానీ ‘మాధుర్యం’ ప్రధానంగా వున్న పాటలే చిరకాలం నిలుస్తాయి”

భరత మాత దగ్గరి నించి తెలుగు తల్లి వరకూ, ఈ మాతలు అందరూ ఒకానొక రాజకీయ సందర్భంలో ఎట్లా పుట్టారో, ఈ రకమైన మాతృ దర్శనాలు ఎట్లా ఉపయోగ పడ్డాయో మనమందరమూ మర్చిపోయాము.

అప్పట్లో వైద్యనాథయ్యరుకి పోటీ లేదని ఒకసారి మైసూరు మహారాజు అంటే, సుబ్రమణ్యయ్యరు ఒక ప్రత్యేకరాగంలో పాట కట్టి ఆశువుగా కచేరీలో పాడాడు.

ఒకసారి, బహదిన్‌ షా సూఫీ సూత్రాలు, సూఫీ పద్ధతులపై ఉపన్యాసం ఇచ్చాడు. ఒక తెలివైన పెద్దమనిషి బహదిన్‌ పై విమర్శ విసిరాడు: “ఈ బహదిన్‌ షా ఎప్పుడైనా, కనీసం ఒక్కసారైనా కాస్త కొత్త విషయాలు చెప్పితే బాగుండును. ఎప్పుడూ చెప్పిందే, చెప్పిందే చెప్పుతాడు.”