1. “మన కవులు అక్షరాస్యులేనా అని గుడిపాటి అడిగిన ప్రశ్నని, కొందరు అది కొన్ని రకాల కవిత్వాన్ని అణగదొక్కటానికి వేసిన ప్రశ్నగా తప్పు అర్థం చేసుకున్నారు.”
2. “రాసేవాళ్ళు సమర్థులైతే మంచి కవిత్వం రాస్తున్నారు . సమర్థులు కాని వాళ్ళు ఏ భాషలో రాసినా మంచి కవిత్వం రాయలేకపోతున్నారు.”
3. “కవిత్వపు మంచిచెడ్డలు భాషలో లేవు, అది వాడేవాళ్ళ సమర్థతలో వుండే తేడాల్లో వున్నాయి. ఈ తేడాలని గురించి ఆయా కవులే మాట్లాడాలనీ, తమరంగంలో కవులకి ఎలాటి శిక్షణ కావాలో కవులే చెప్పాలనీ నారాయణ రావు కోరాడు.”
4. “ఎవరి కవిత్వపు మంచి చెడ్డలు వివరించడానికి, విశ్లేషించడానికి అవసరమైన విమర్శ భావాల్ని, పరిభాషనీ వాళ్ళు తయారుచేసుకోవచ్చు. తయారు చేసుకుంటున్నారు కూడా. ”
5. “తెలుగు కవిత్వానికీ, విమర్శకీ ప్రమాణాలు కవిత్వం రాసేవాళ్ళూ , విమర్శ రాసేవాళ్ళూ తమలో తాము చర్చల ద్వారా నిర్ణయించాలి. ఏప్రమాణాలూ లేకుండా ఏది రాసినా కవిత్వమే, ఎవరు రాసినా విమర్శే అనే పరిస్థితి ఎవరికీ మంచిది కాదు.”
వేలూరి గారు చేసిన పై అయిదు ముఖ్యమైన ప్రతిపాదనల్లో (observations అనుకోండి, “ప్రతిపాదన” అనే పదం నచ్చకపోతే) దేనితో కొడవళ్ళ హనుమంతరావు గారు ఏకీభవించడంలేదో నాకు తెలియలేదు. ఆయన రాసినట్లు: “ఈ చర్చకి గుడిపాటి వ్యాసం మూలం. దానిమీద నాకూ వేలూరికీ భిన్నమైన అభిప్రాయాలుండటాన వాటిని తెలిపాను.” భిన్నమైన అభిప్రాయాలు శీర్షికలో ప్రశ్న గురించా లేక పైన ప్రస్తావించిన విశయాల గురించా?
కొడవళ్ళగారికీ, వేలూరికీ ఉన్న భిన్నమైన అభిప్రాయం నాకర్ధమైన వరకూ వ్యాసానికి గుడిపాటి పెట్టిన శీర్షికలో ప్రశ్న “మౌలికమైనదా కాదా” అన్న దాని గురించి మాత్రమే అని నేనర్ధం చేసుకున్నాను, మిగాతావి ఏమైనా ఉన్నయా? (శీర్షిక గురించి వేలూరి గారు ప్రత్యేకంగా ప్రస్తావించలేదు పైగా, ఆయన మౌలికమైందని మాత్రమే అన్నారు). నేను పైపైన చదవలేదు, ఒకటికి రెండు సార్లు ఈ అభిప్రాయాలన్నీ చదివినా నాకర్ధమవకే ఇంతవరకూ రాస్తున్నాను.
మనం ఈ చర్చని ముందుకి తీసికెళ్లాలి, వెనక్కి కాదు. అంచేత గుడిపాటి లేవనెత్తిన ప్రశ్న సారాంశాన్నీ, నావ్యాసంలో చర్చకి ఉపయోగపడే ప్రధానాంశాల్నీ మాత్రమే ప్రస్తావిద్దాం. మాటకి మాట తెగులు అని తెలుగులోఒక సామెత వుంది. అది గుర్తుపెట్టుకుని క్లుప్తంగా రాద్దాం. చర్చించవలసిన విషయాలు చాలా వున్నాయి.
అక్షరజ్ఞానులేనా? అన్నది అవమానకరమని చెప్పటానికీ, గుడిపాటి వ్యాసంలో నాకు కనిపించిన కొన్ని లోపాల్ని చూపటానికీ, రాశాను. వెల్చేరు వ్యాసానికి సంబంధించి మొదటి విషయాన్ని దాటి పోలేదు. భేదాభిప్రాయాన్ని మర్యాదగా వ్యక్తపరిస్తే చాలు; అంతకుమించి ఏదో “సాధించాలని” కాదు.
బహుశా నేను చేస్తున్న పొరబాటు నెలక్రితం వచ్చిన గుడిపాటి వ్యాసం మీద కేంద్రీకరించడం, నాకు తోచిన విషయాలు మాత్రమే తీసుకోవడం, వేలూరి చెప్పినట్లుగా చర్చని సాగించకపోవడం. కాని ఈ చర్చకి గుడిపాటి వ్యాసం మూలం. దానిమీద నాకూ వేలూరికీ భిన్నమైన అభిప్రాయాలుండటాన వాటిని తెలిపాను.
అవమానకరంగా ఉందన్నానుగాని అ, ఆ ల గురించిన ప్రశ్న అనలేదు. ఈ తెలుగు వాడకాన్ని అర్థం చేసుకోడానికి ఇంగ్లీషుని ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది. “మన కవులు అక్షరాస్యులేనా?” అన్నది “Are our poets literate?” గా అనువదించుకోవచ్చు. (అదీ సభ్యతగా అనిపించదు.) కాని దాంట్లో మూలానికున్న బలం లేదు. “Do our poets know the ABC of poetry?” అన్నది దగ్గరగా ఉంది. “Do our engineers know the ABC of Computer Science?” అని అడిగితే కించపరిచినట్లే. ”Do our engineers have the right tools and the right training?” అంటే మర్యాదగానే ఉంది, కాని అదీ ఇదీ ఒకటి కాదు.
నిందార్థం ఏమీ లేదన్నారు వెల్చేరు. అది వారి వ్యాసంలో నిజమే, కాని గుడిపాటి వ్యాసమంతా నిందలతో నిండి ఉంది! మన కవులు పుస్తకాలు చదవరు, వ్యాకరణం నేర్చుకోరు, వారి కవితల్లో స్పష్టత లేదు, కూర్పు లేదు – ఇవన్నీ నిందలే. ఆయన నిందార్థంలోనే వాడారని తెలుస్తుంది. నిందిస్తే తప్పేమీ లేదు – ఇది వాళ్ళ సాహిత్యాన్ని గురించే గాని వ్యక్తిగత జీవితాల గురించి కాదు. కాని అవి అపనిందలు కాదని పాఠకులకి చూపెట్టాలి. ఆయన ఆపని చెయ్యలేదన్నది నా వాదన సారాంశం.
అలవోకగా రాసిన అభిప్రాయమని ఒప్పుకుంటాను. అది వ్యాసమంత ముఖ్యం కాదు. గుడిపాటి వ్యాసం లోతైన విశ్లేషణతో విస్తృతాధారాలతో కూడి ఉన్నదా? మన కవులు నిరక్షరాస్యులని తేల్చిన వ్యాసంలో ఏమాత్రం పరిశోధనా, తర్కం ఉన్నాయ్?
ప్రధాన విషయాన్నించి దారిమళ్ళించలేదు. liberal education లో శిక్షణ ఉండి కూడా ఇలా ఎలా రాశావంటున్నారు. శిక్షణ “ఉండి కూడా” కాదు; “ఉండటం వల్లనే” రాశాను. వివరించే ముందు liberal education అన్నదానికి ఒక నిర్వచనం:
“Liberal education, which consists in the constant intercourse with the greatest minds, is a training in the highest form of modesty, not to say of humility. It is at the same time a training in boldness: it demands from us the complete break with the noise, the rush, the thoughtlessness, the cheapness of the Vanity Fair of the intellectuals as well as of their enemies. It demands from us the boldness implied in the resolve to regard the accepted views as mere opinions, or to regard the average opinions as extreme opinions which are at least as likely to be wrong as the most strange or the least popular opinions.” — Leo Strauss.
నాకు ప్రధాన విషయం గుడిపాటి వ్యాసం. దాని ప్రతిపాదన ఇది – అక్షరాస్యత అంటే స్పష్టత, భాషాధికారం, అధ్యయనంపై ఆసక్తి; కొద్ది మంది తప్ప మనకవులంతా నిరక్షరాస్యులు. ఇంతవరకు బాగానే ఉంది. కాని ఈ ప్రతిపాదనకి వ్యాసంలో ఆధారాలేవీ చూపెట్టలేదు. ఆయన చెప్పేదంతా “నాకీ కవులంతా తెలుసు, నమ్మండి” అన్నట్లుగా ఉంది గాని scholarly article లో ఉండాల్సిన పస లేదు.
నేను తమ్మినేని వ్యాసాన్ని ఎందుకు ఉదహరించాను? అనువాద కవిత్వం గురించి కొన్ని ప్రతిపాదనలు చేసి వాటిని కొన్ని కవితల విశ్లేషణ ద్వారా సమర్థించాడు. అది నాకు scholarly article అనిపించింది. గుడిపాటి అలాంటిది చెయ్యలేదు, కనీసం ప్రయత్నించలేదు. ఆయన సమస్య చాలా విస్తృతమయిందంటారా? కవిత్వమంతా తీసుకోవాల్సిన పనిలేదు. వ్యాసం చదివేవాడికి గూడా బుర్ర ఉంది. ఆయన ప్రస్తావించిన కొన్ని రకాల కవిత్వ వాదాల్లో ఏదో ఒకదానిని తీసుకొని ఆ కవికో కవులకో అస్పష్టత, అనధికారం, అనాసక్తి ఉండటాన వారి కవితలెంత హీనమయ్యాయో చూపెట్టొచ్చు.
అలా చేస్తే ఆయన వాదానికి బలం చేకూరడమే కాక అంతకన్న ముఖ్యమైన ప్రయోజనమొకటి కలిగేది. అదేంటంటే ఏది మంచి కవిత్వమో ఎందుకో కొంతైనా పాఠకుడికి తెలిసేది. గుడిపాటి వాద విధానంలోని లోపాన్ని వేరే వ్యాసంతో పోల్చి చూపెట్టాను. అది liberal education ఇచ్చిన శిక్షణలో లోపమనుకోను.
“పరమ వినయంగా” దాటేయడం గురించి. వినయాన్ని వెల్లడించ లేదు, చూపాల్సిన సందర్భమూ కాదది. వెల్చేరు గారి వ్యాసం లోతుల్లోకి వెళ్ళని మాట నిజమే. కాని వారు కవుల్నీ విమర్శకుల్నీ చర్చకి పిలిచారు కాని పాఠకుల్ని వదిలేశారు.
“గుడిపాటీ, నేనూ … చర్చకి తీసుకొస్తున్న విషయం వ్యక్తులకి సంబంధించింది కాదు. వ్యవస్థకి సంబంధించినది…”
శిక్షణా సంస్థల గురించి గుడిపాటి ప్రస్తావించ లేదు. అది వెల్చేరు గారి “వివరణ” వ్యాసంలో ఉంది. నేను దానిని గురించి రాయలేదు. గుడిపాటి వ్యాసంలో అర్థంకానంత క్లిష్ట విషయాలేమీ లేవు. అదంతా వ్యక్తుల గొడవే. అస్పష్టత, అనాసక్తి, అవగాహనా రాహిత్యం, పుస్తకాలు చదవక పోవడం – ఇవన్నీ వ్యక్తుల్లో లోపాలు. ఈ లోపాలు కొన్ని వందల కవుల్లో ఉండటాన ఇది వ్యవస్థకి సంబంధించిందని వెల్చేరు అభిప్రాయం కావొచ్చు. దాని గురించి మరో సారి మాట్లాడదాం.
కొడవళ్ల హనుమంత రావుగారు ఈ మాటలో వేలూరి సంపాదకీయం మీద రాసిన అభిప్రాయం/విమర్శ ఎందుకు, ఏంసాధించడానికి రాశారో నాకు అర్థం కాలేదు. కానిఅందులొ కొన్నిమాటలు వార్త లో నేను రాసిన వ్యాసానికి సంబధించినవి కాబట్టిఈ నాలుగు వాక్యాలూ ఇక్కడ రాస్తున్నాను.
మొదటి సంగతి: గుడిపాటి అడిగిన మన కవులు అక్షరాస్యులేనా అన్న ప్రశ్నలో అక్షరాస్యులు అనే మాటకి కాని, నేను ఆ ప్రశ్న తిప్పి మన విమర్శకులు అక్షరాస్యులేనా అని అడిగిన ప్రశ్నలో అక్షరాస్యులు అనే మాటకి కాని నిందార్థం ఏమీ లేదని, వాళ్ళకి అ ఆ లు వొచ్చునా అని ఆ మాటకి అర్థం కాదనీ, ఇంగ్లీషులో cultural literacy, fiscal literacy అనే మాటల్లో literacy లాటిది ఈ అక్షరాస్యత అనే మాట అనీ హనుమంతరావు గారికి తెలియలేదని నేను అనుకోలేకపోతున్నాను. అది ఆయన ఊహకి అందనంత గహనమైన విషయం కాదు. నా వ్యాసం చివరదాకా చదివితే, నేను ఆ వ్యాసంలో అడిగిన ప్రశ్నలు చూస్తే ఈ విషయం తేలిగ్గానే తెలుస్తుంది. ఆయన నా వ్యాసం పూర్తిగా చదవలేదనీ, నేను ఆవ్యాసంలో వేసిన ప్రశ్నలు — తెలుగులో విమర్శకులు తయారవడానికి అందుబాటులో వున్న అవకాశా లేమిటి, వాళ్ళు చదవ వలసిన పుస్తకాలు, పొందవలసిన శిక్షణ ఏమిటి — అనేవి ఆ సంగతుల మీద తెలుగులో ప్రముఖ విమర్శకులు దృష్టిపెట్టేట్టు చెయ్యడానికి వేసిన ప్రశ్నలు అని హనుమంతరావు గారు బోధపరుచుకోలేక పోయారనీ కూడా నేను అనుకోవడం లేదు. పైగాఈ చర్చలలో ప్రధాన విషయాన్ని ఆయన గమనించలేదని అనుకోడానికీ వీలులేదు: “వారిద్దరి వ్యాసాల్లో చర్చించదగ్గ విషయాలు చాలానే ఉన్నా, ఆ ప్రశ్నలు వేరే రూపంలో వేసి ఉండాల్సింది. ” అని ఒక అభిప్రాయం చెప్పారు కాబట్టి. కాని ఆయన పరమ వినయంగా ఈవిషయాన్ని, దీనికి సంబంధించిన వివరాల్నీ వొదిలేసి ఆయనకి ఇష్టమైన మరో విషయంలోకి తన వ్యాఖ్యానాన్ని మళ్లించారు.
ఈ దేశంలో liberal education లో భాగంగా చర్చని ప్రధాన విషయాల మీద కేంద్రీకరించే పద్ధతీ, అప్రధాన విషాయలవేపు మళ్లకుండా వుండే జాగ్రత్తలూ నేర్పుతారు. ఈ శిక్షణని హనుమంతరావు గారు పొందలేదని నేను అనుకోను. అయినా ఆయన అసలు విషయాన్ని వొదిలేసి మరొక దారి లో వ్యాఖ్యానాలు చెయ్యడానికి ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి.
తెలుగు సాహిత్యరంగంలో ఆయన కోరుకునే రకమైన పుస్తకాలు రావడంలేదు. ఆయనకి బోధపడేలా ఉదాహరణలూ దృష్టాంతాలూ ఉన్న పుస్తకాలూ, వ్యాసాలూ ఎవరో ఒకరు తప్ప ఎక్కువమంది రాయడం లేదు. ఇది ఆయన లేవనెత్తుతున్న సమస్య. ఈ సమస్య చాలా ముఖ్యమైనది, వివరంగా చర్చించదగినదీని. ఇది అయితే దీన్ని గురించి వేరే వ్యాసంలో పరిశీలన చెయ్యాలి. అంతేకాని వేలూరి వెంకటేశ్వర రావు రాసిన సంపాదకీయం మీద అలవోకగా చేసే వ్యాఖ్యానంలో భాగం చెయ్యకూడదు.
(హనుమంతరావు గారిని ఇంతగా మథనపెడుతున్న ఈ సమస్య ని ఈమాట లో వివరంగా చర్చించడానికి వొచ్చే నెల సంచిక కోసం నేను ఒక వ్యాసం రాస్తున్నాను. అది ఈమాటలో ప్రచురించబడితే అప్పుడు ఆ విషయం ప్రధానవిషయంగా చర్చలు కొనసాగుతాయని ఆశిస్తాను.)
వార్తలో గుడిపాటీ, నేనూ, ఆ తరవాత ఈమాటలో వేలూరి చర్చకి తీసుకొస్తున్న విషయం వ్యక్తులకి సంబధించినది కాదు. వ్యవస్థ కి సంబంధించినది. తెలుగులో కవులూ, విమర్శకులూ శిక్షణ పొందడానికి ఎలాటి సంస్థలు ఉన్నాయి? ఈ రంగం లో ప్రమాణాలు ఎలా నిర్ణయించ బడతాయి? తెలుగు సాహిత్య రంగం కేవలం ఔత్సాహికులు ప్రధానంగా వుండే రంగంగా ఉండి పోకుండా ఇది professionalize ఎలా అవుతుంది? ఈ ప్రశ్నలు ముందు ఈరంగంలో వున్న పదిమందీ వేసుకుంటే — వీటికి సమాధానాలు వెతికే ప్రయత్నంలో తెలుగు సాహిత్య రంగం వ్యవస్థీకరించ బడడానికి అవసరమైన సంస్థల్ని నిర్మించే ఆలోచనలు చేస్తారని ఒక ఆశ.
ఈ చర్చ తెలుగు దేశం లోనే జరగ వలసిన అవసరం లేదు. వేలూరి అన్నట్టుగా తెలుగు ప్రపంచ భాషగా ఎదుగుతోంది. అంచేత ఇందులో మనకి కూడా జాగా వుంది.
Dear Eemaata,
A very good discussion on Sri Rohini prasad gari Article. As a music lover and an enthusiastic learner, I am very much benefited and learnt some more new things by the article and the discussions on the same.
Thank you very much.
Raja gopal.
ఈ యూనికోడ్ తెలుగు ఎప్పుడో ఒక సారి నన్ను పప్పులోకి దింపుతుంది అని తెలిసీ ఈ గెస్ట్ బుక్ లో రాయకుండా ఉండలేక పోయాను, ఇదీ ఒక వ్యసనం గా మారే ప్రమాదం ఉందనిపిస్తుంది. ఏదో రాస్తూ పోయాను ఎట్లాగైనా ఈ “ప్రజాకవి” అనే అనవసర సిద్ధాంతాన్ని, నిర్వచనాన్ని కొంతైనా discredit చేయాలనే ఉద్దేశ్యంతో.
నా మటుకు నాకు ఇది ఒక నామ వాచకం లా లేక ఒక బిరుదు గా వదిలేస్తే బాగుంటుందనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనకు ప్రజాకవి కాళోజీ ఉన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా రేపు (సెప్టెంబర్ 9 న) తెలంగాణ జిల్లాల్లో చాలా వరకు ఉత్సవాలు కూడా జరుగుతున్నయి. మీరిప్పుడు తిరుపతి వెంకట కవుల్ని ప్రజాకవులు అని చెబితే ఎవరో మాష్టారుకు ఇది నచ్చి అదే మాట తెలుగు పుస్తకాల్లోకి ఉన్నది ఉన్నట్లు దింపితే అప్పుడు నాలాంటి వాడొకడు తన పాళీని జియో పొలిటికల్ ఇంకులో ముంచి ఇవ్వాళ కాక పోతె రేపు ఇట్ల రాయ వీలయితది:
“బోగపోళ్ళ బాగోతపు పద్యాలను మా నెత్తిన /ప్రజల కవిత్వం పేర రుద్ది / సౌహార్ద్రం, సమైక్యం భాషంటివి / నా యాసను చిన్నబుస్తివి / నీ పాఠం నాకొద్దు / ప్రజలు నేను, కవిత్వం నాది, ప్రజాకవివి నువ్వెట్లయితవు”
అందుకే: వెల్చేరు గారు సెప్టెంబరు తెలుగు నాడిలో రాసిన తిరుపతి వెంకట కవుల పరిచయం చాలు, మీ వ్యాసం కూడా మొదటి నాలుగు పేరాలు (టైటిల్ తోసహా) మినహాయించి, “1999 జూన్ జులై ” కాడ్నించి అద్భుతం. అది నా అసలు అభిప్రాయం. ఆ మాట డొంక తిరుగుడుగా చెప్పాలనుకోవటం నా తప్పే.
అన్నట్టు, తొడ పాశం పెట్టిన సారు మీదికి ఎదురు మళ్ళానని నన్ను పక్క సెక్షనులో తోసారు, అప్పుడు ఏదో లే అని సరిపెట్టుకుని ఉంటే ఇప్పుడిట్లా తయారయి ఉండే వాడిని కాదేమో.
మీరు తప్పుగా అనుకోకపోతే ఇప్పటికే ఎక్కువ రాసాను,
ఇక సెలవ్, విప్లవ్
ఆయనకి వ్యాసం నచ్చినందుకు సంతోషం. ఔత్సాహికుల సౌకర్యం కోసమని 16 శ్రుతుల గురించి ప్రస్తావించలేదనీ, నేనూ, ఇతర పాఠకులూ విన్నవించుకోవడం జరిగింది.
మరొక విషయం. 72 మేళకర్తల వరకూ వివరించడానికి 16 శ్రుతులు సరిపోతాయి కాని ఆరభి, దేవగాంధారి వంటి రాగాల మధ్య తేడాలు తెలుసుకోవడానికి ఉపకరించవు. ఔత్సాహికులకు అవసరంలేని ఇలాంటి విషయాలు కొన్ని ఉంటాయి. 22 శ్రుతుల గురించి తెలియాలంటే ఇది చూడండి.
నేను రాసిన అభ్యంతరమల్లా ఒక్కటే ! మొత్త స్వరాలు 16, కానీ కీబోర్డు మీద కేవలం 12 మాత్రమే పలికించ గలమని రాయచ్చు కదా? మొత్తం 12 స్వరాలే అని రాయడం, నా దృష్టిలో సుముచితం కాదు. అవును, 16 స్వరాలు 16 అని రాసి, 12 అని రాయకుండా ఉండాల్సింది అని అనచ్చుకదా? లేదా 16 స్వ రాలు ఉన్నాయి, కానీ 12 మాత్రమే కీబోర్డు లో పలికించ వచ్చు అని రాయడం వల్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు.
అలా కాకుండా మేకేం తెలియదంటూ, నాకు అపారమైన వాయిద్య అనుభవం ఉంది అని రాయడం వల్లే నేను పొరపాటని రాయడం జరిగింది. నేను వ్యాసకర్తని కానీ, ఆయన వ్యాసం బాగోలేదని కానీ రాయలేదు. నాకూ సంగీతానుభవం ఉంది. నేనూ వీణ వాయించ గలను. వాయిద్య ముఖ్యం కాదు, సంగీతమే ముఖ్యం అన్నప్పుడు, మనం ఇచ్చే సమాచారం సరిగ్గా ఉండాలన్నదే నా ఉద్దేశ్యం, అంతేకానీ, ఇంకోళ్ళ విద్వత్తుని ప్ర శ్నించడం కాదు. వస్తువు వదిలేసి, వ్యక్తులవైపు విమర్శ దారి మళ్ళితే ఎలా ఉంటుంది?
వ్యాసం చదివేక ప్రసాదు గారికి అపారమైన సంగీతానుభవం ఉందని ఎవరికైనా అర్థం అవుతుంది.
ఆలస్యంగా సమాధానాలిస్తున్నందుకు మన్నించండి. ముందుగా రథ్య అర్థం గురించి:
రథ్య అంటే రాజమార్గము అనీ, రథసమూహము అనీ రెండర్థాలూ ఉన్నాయి ( చూ: సూర్యరాయాంధ్ర నిఘంటువు, ఆరవ సంపుటము, 648 వ పేజీ, లేదా చూ: శబ్దరత్నాకరము, 922 వ పేజీ)
నాకూ శ్రీశ్రీ అంటే చచ్చే ఇష్టం, వల్లమాలిన అభిమానం. ఏ ప్రజలకి అతను “ప్రజాకవి” గా చలామణి అవుతాడో నావ్యాసంలో (నావ్యాస పరిథిలో అంటే ఇబ్బంది తక్కువ అవచ్చు!) చెప్పిందానికన్నా ఎక్కువగా చెప్పేందుకు ఏమీ లేదు.
గద్దర్, వంగపండుల పాటలని ముందుగా “కవితలు”గా బేరీజు వెయ్యాలి. అందుకు చెయ్యవలసిన కృషి వేరే ఉంది. (ఆ పని నేను మొదలెట్టా!)అసలు, ఆపాటలు కవిత్వమా? కాదా? అని నిర్థారణ చేసుకున్న తరువాత, వారు ప్రజాకవులా కారా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. (నన్ను అపార్థం చేసుకోకండి, అక్కిరాజు గారూ! ఆహా! ఎంచక్కని సినిమా డైలాగు!)
ఒకానొకప్పుడు, “తెలుసా”లో గద్దర్ పై నేను ఒక పెద్ద వ్యాసం రాసిన గుర్తు. ఆ వ్యాసం అంతా అతని ఒకేఒక్క పాటమీద! అప్పట్లో, కొందరు నన్ను చీవాట్లు కూడా పెట్టారు. అదివేరే విషయం, అనుకోండి.
గద్దర్ పైవ్యాసంకూడా త్వరలోనే ( సమీక్షకులు “సై” అంటేనే సుమా!) ఈమాట లో రావచ్చు.
విప్లవ్ గారు చాలా విషయాలు చెప్పారు. సాంఘిక చరిత్ర గురించి ఆయనకి నేను పాఠం చెప్పగల సమర్థుణ్ణి కాదు. అయినా, ఆయన నన్ను పూర్తిగా “అపార్థం” ( అబ్బ! ఇంతకన్నా మంచి మాట తెలుగులో లేదు కాబోలు!) చేసుకున్నట్టు అనుమానం గా వుంది. వ్యక్తిగత అభిప్రాయాలని మన్నించమని మా తెలుగు మేష్టారు ఎప్పుడో చిన్నప్పుడే, శొంఠిపిక్క పెట్టి మరీ నేర్పారు! అందుకు బద్ధుణ్ణి, ఇప్పటికీనూ!
అమెరికాలోనూ, మన దేశానికి దూరంగా ఇతర ప్రాంతాల్లోనూ ఉంటున్న తెలుగువారు తమ సంస్కృతిని మరిచిపోకుండా ఉండేందుకూ, తమ పిల్లలకు దాన్ని గురించి పరిచయం చేసేందుకూ తంటాలు పడటం మామూలే. ఇందులో భాగంగా సంగీతం, నాట్యం మొదలైన కళలనూ, తెలుగు భాషనూ నేర్పేందుకు చిన్నా పెద్దా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించకుండా ఇందులోని సాధక బాధకాల గురించీ, నేర్పేవాళ్ళ, నేర్చుకునేవాళ్ళ అనుభవాల గురించీ వ్యాసాలు ఈమాటలో వేస్తే నలుగురికీ ఉపయోగకరంగా ఉంటుంది. అస్తమానం సినిమా నటులని పిలిపించి వారితో అవస్థలు పడేకన్నా స్థానికంగా జరిపే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయని నా ఉద్దేశం. ఇటువంటి రచనలను ఆహ్వానిస్తూ సంపాదక వర్గం ప్రకటన చేస్తే బావుంటుందేమో. అటువంటి రచయితల గురించి తెలిస్తే వారిని వ్యాసాల కోసం సంప్రదించటం కూడా మంచిదే.
సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి విప్లవ్ అభిప్రాయం:
09/10/2006 7:29 pm
వేలూరి చెప్పిన అయిదు విషయాలు మక్కీకి మక్కీ:
1. “మన కవులు అక్షరాస్యులేనా అని గుడిపాటి అడిగిన ప్రశ్నని, కొందరు అది కొన్ని రకాల కవిత్వాన్ని అణగదొక్కటానికి వేసిన ప్రశ్నగా తప్పు అర్థం చేసుకున్నారు.”
2. “రాసేవాళ్ళు సమర్థులైతే మంచి కవిత్వం రాస్తున్నారు . సమర్థులు కాని వాళ్ళు ఏ భాషలో రాసినా మంచి కవిత్వం రాయలేకపోతున్నారు.”
3. “కవిత్వపు మంచిచెడ్డలు భాషలో లేవు, అది వాడేవాళ్ళ సమర్థతలో వుండే తేడాల్లో వున్నాయి. ఈ తేడాలని గురించి ఆయా కవులే మాట్లాడాలనీ, తమరంగంలో కవులకి ఎలాటి శిక్షణ కావాలో కవులే చెప్పాలనీ నారాయణ రావు కోరాడు.”
4. “ఎవరి కవిత్వపు మంచి చెడ్డలు వివరించడానికి, విశ్లేషించడానికి అవసరమైన విమర్శ భావాల్ని, పరిభాషనీ వాళ్ళు తయారుచేసుకోవచ్చు. తయారు చేసుకుంటున్నారు కూడా. ”
5. “తెలుగు కవిత్వానికీ, విమర్శకీ ప్రమాణాలు కవిత్వం రాసేవాళ్ళూ , విమర్శ రాసేవాళ్ళూ తమలో తాము చర్చల ద్వారా నిర్ణయించాలి. ఏప్రమాణాలూ లేకుండా ఏది రాసినా కవిత్వమే, ఎవరు రాసినా విమర్శే అనే పరిస్థితి ఎవరికీ మంచిది కాదు.”
వేలూరి గారు చేసిన పై అయిదు ముఖ్యమైన ప్రతిపాదనల్లో (observations అనుకోండి, “ప్రతిపాదన” అనే పదం నచ్చకపోతే) దేనితో కొడవళ్ళ హనుమంతరావు గారు ఏకీభవించడంలేదో నాకు తెలియలేదు. ఆయన రాసినట్లు: “ఈ చర్చకి గుడిపాటి వ్యాసం మూలం. దానిమీద నాకూ వేలూరికీ భిన్నమైన అభిప్రాయాలుండటాన వాటిని తెలిపాను.” భిన్నమైన అభిప్రాయాలు శీర్షికలో ప్రశ్న గురించా లేక పైన ప్రస్తావించిన విశయాల గురించా?
కొడవళ్ళగారికీ, వేలూరికీ ఉన్న భిన్నమైన అభిప్రాయం నాకర్ధమైన వరకూ వ్యాసానికి గుడిపాటి పెట్టిన శీర్షికలో ప్రశ్న “మౌలికమైనదా కాదా” అన్న దాని గురించి మాత్రమే అని నేనర్ధం చేసుకున్నాను, మిగాతావి ఏమైనా ఉన్నయా? (శీర్షిక గురించి వేలూరి గారు ప్రత్యేకంగా ప్రస్తావించలేదు పైగా, ఆయన మౌలికమైందని మాత్రమే అన్నారు). నేను పైపైన చదవలేదు, ఒకటికి రెండు సార్లు ఈ అభిప్రాయాలన్నీ చదివినా నాకర్ధమవకే ఇంతవరకూ రాస్తున్నాను.
విప్లవ్
సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి వెల్చేరు నారాయణ రావు అభిప్రాయం:
09/10/2006 3:38 pm
మనం ఈ చర్చని ముందుకి తీసికెళ్లాలి, వెనక్కి కాదు. అంచేత గుడిపాటి లేవనెత్తిన ప్రశ్న సారాంశాన్నీ, నావ్యాసంలో చర్చకి ఉపయోగపడే ప్రధానాంశాల్నీ మాత్రమే ప్రస్తావిద్దాం. మాటకి మాట తెగులు అని తెలుగులోఒక సామెత వుంది. అది గుర్తుపెట్టుకుని క్లుప్తంగా రాద్దాం. చర్చించవలసిన విషయాలు చాలా వున్నాయి.
వెల్చేరు నారాయణ రావు.
సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
09/10/2006 1:35 pm
వెల్చేరుతో విభేదం
అక్షరజ్ఞానులేనా? అన్నది అవమానకరమని చెప్పటానికీ, గుడిపాటి వ్యాసంలో నాకు కనిపించిన కొన్ని లోపాల్ని చూపటానికీ, రాశాను. వెల్చేరు వ్యాసానికి సంబంధించి మొదటి విషయాన్ని దాటి పోలేదు. భేదాభిప్రాయాన్ని మర్యాదగా వ్యక్తపరిస్తే చాలు; అంతకుమించి ఏదో “సాధించాలని” కాదు.
బహుశా నేను చేస్తున్న పొరబాటు నెలక్రితం వచ్చిన గుడిపాటి వ్యాసం మీద కేంద్రీకరించడం, నాకు తోచిన విషయాలు మాత్రమే తీసుకోవడం, వేలూరి చెప్పినట్లుగా చర్చని సాగించకపోవడం. కాని ఈ చర్చకి గుడిపాటి వ్యాసం మూలం. దానిమీద నాకూ వేలూరికీ భిన్నమైన అభిప్రాయాలుండటాన వాటిని తెలిపాను.
అవమానకరంగా ఉందన్నానుగాని అ, ఆ ల గురించిన ప్రశ్న అనలేదు. ఈ తెలుగు వాడకాన్ని అర్థం చేసుకోడానికి ఇంగ్లీషుని ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది. “మన కవులు అక్షరాస్యులేనా?” అన్నది “Are our poets literate?” గా అనువదించుకోవచ్చు. (అదీ సభ్యతగా అనిపించదు.) కాని దాంట్లో మూలానికున్న బలం లేదు. “Do our poets know the ABC of poetry?” అన్నది దగ్గరగా ఉంది. “Do our engineers know the ABC of Computer Science?” అని అడిగితే కించపరిచినట్లే. ”Do our engineers have the right tools and the right training?” అంటే మర్యాదగానే ఉంది, కాని అదీ ఇదీ ఒకటి కాదు.
నిందార్థం ఏమీ లేదన్నారు వెల్చేరు. అది వారి వ్యాసంలో నిజమే, కాని గుడిపాటి వ్యాసమంతా నిందలతో నిండి ఉంది! మన కవులు పుస్తకాలు చదవరు, వ్యాకరణం నేర్చుకోరు, వారి కవితల్లో స్పష్టత లేదు, కూర్పు లేదు – ఇవన్నీ నిందలే. ఆయన నిందార్థంలోనే వాడారని తెలుస్తుంది. నిందిస్తే తప్పేమీ లేదు – ఇది వాళ్ళ సాహిత్యాన్ని గురించే గాని వ్యక్తిగత జీవితాల గురించి కాదు. కాని అవి అపనిందలు కాదని పాఠకులకి చూపెట్టాలి. ఆయన ఆపని చెయ్యలేదన్నది నా వాదన సారాంశం.
అలవోకగా రాసిన అభిప్రాయమని ఒప్పుకుంటాను. అది వ్యాసమంత ముఖ్యం కాదు. గుడిపాటి వ్యాసం లోతైన విశ్లేషణతో విస్తృతాధారాలతో కూడి ఉన్నదా? మన కవులు నిరక్షరాస్యులని తేల్చిన వ్యాసంలో ఏమాత్రం పరిశోధనా, తర్కం ఉన్నాయ్?
ప్రధాన విషయాన్నించి దారిమళ్ళించలేదు. liberal education లో శిక్షణ ఉండి కూడా ఇలా ఎలా రాశావంటున్నారు. శిక్షణ “ఉండి కూడా” కాదు; “ఉండటం వల్లనే” రాశాను. వివరించే ముందు liberal education అన్నదానికి ఒక నిర్వచనం:
“Liberal education, which consists in the constant intercourse with the greatest minds, is a training in the highest form of modesty, not to say of humility. It is at the same time a training in boldness: it demands from us the complete break with the noise, the rush, the thoughtlessness, the cheapness of the Vanity Fair of the intellectuals as well as of their enemies. It demands from us the boldness implied in the resolve to regard the accepted views as mere opinions, or to regard the average opinions as extreme opinions which are at least as likely to be wrong as the most strange or the least popular opinions.” — Leo Strauss.
నాకు ప్రధాన విషయం గుడిపాటి వ్యాసం. దాని ప్రతిపాదన ఇది – అక్షరాస్యత అంటే స్పష్టత, భాషాధికారం, అధ్యయనంపై ఆసక్తి; కొద్ది మంది తప్ప మనకవులంతా నిరక్షరాస్యులు. ఇంతవరకు బాగానే ఉంది. కాని ఈ ప్రతిపాదనకి వ్యాసంలో ఆధారాలేవీ చూపెట్టలేదు. ఆయన చెప్పేదంతా “నాకీ కవులంతా తెలుసు, నమ్మండి” అన్నట్లుగా ఉంది గాని scholarly article లో ఉండాల్సిన పస లేదు.
నేను తమ్మినేని వ్యాసాన్ని ఎందుకు ఉదహరించాను? అనువాద కవిత్వం గురించి కొన్ని ప్రతిపాదనలు చేసి వాటిని కొన్ని కవితల విశ్లేషణ ద్వారా సమర్థించాడు. అది నాకు scholarly article అనిపించింది. గుడిపాటి అలాంటిది చెయ్యలేదు, కనీసం ప్రయత్నించలేదు. ఆయన సమస్య చాలా విస్తృతమయిందంటారా? కవిత్వమంతా తీసుకోవాల్సిన పనిలేదు. వ్యాసం చదివేవాడికి గూడా బుర్ర ఉంది. ఆయన ప్రస్తావించిన కొన్ని రకాల కవిత్వ వాదాల్లో ఏదో ఒకదానిని తీసుకొని ఆ కవికో కవులకో అస్పష్టత, అనధికారం, అనాసక్తి ఉండటాన వారి కవితలెంత హీనమయ్యాయో చూపెట్టొచ్చు.
అలా చేస్తే ఆయన వాదానికి బలం చేకూరడమే కాక అంతకన్న ముఖ్యమైన ప్రయోజనమొకటి కలిగేది. అదేంటంటే ఏది మంచి కవిత్వమో ఎందుకో కొంతైనా పాఠకుడికి తెలిసేది. గుడిపాటి వాద విధానంలోని లోపాన్ని వేరే వ్యాసంతో పోల్చి చూపెట్టాను. అది liberal education ఇచ్చిన శిక్షణలో లోపమనుకోను.
“పరమ వినయంగా” దాటేయడం గురించి. వినయాన్ని వెల్లడించ లేదు, చూపాల్సిన సందర్భమూ కాదది. వెల్చేరు గారి వ్యాసం లోతుల్లోకి వెళ్ళని మాట నిజమే. కాని వారు కవుల్నీ విమర్శకుల్నీ చర్చకి పిలిచారు కాని పాఠకుల్ని వదిలేశారు.
“గుడిపాటీ, నేనూ … చర్చకి తీసుకొస్తున్న విషయం వ్యక్తులకి సంబంధించింది కాదు. వ్యవస్థకి సంబంధించినది…”
శిక్షణా సంస్థల గురించి గుడిపాటి ప్రస్తావించ లేదు. అది వెల్చేరు గారి “వివరణ” వ్యాసంలో ఉంది. నేను దానిని గురించి రాయలేదు. గుడిపాటి వ్యాసంలో అర్థంకానంత క్లిష్ట విషయాలేమీ లేవు. అదంతా వ్యక్తుల గొడవే. అస్పష్టత, అనాసక్తి, అవగాహనా రాహిత్యం, పుస్తకాలు చదవక పోవడం – ఇవన్నీ వ్యక్తుల్లో లోపాలు. ఈ లోపాలు కొన్ని వందల కవుల్లో ఉండటాన ఇది వ్యవస్థకి సంబంధించిందని వెల్చేరు అభిప్రాయం కావొచ్చు. దాని గురించి మరో సారి మాట్లాడదాం.
కొడవళ్ళ హనుమంతరావు
సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి వెల్చేరు నారాయణ రావు అభిప్రాయం:
09/09/2006 10:57 am
కొడవళ్ల హనుమంత రావుగారు ఈ మాటలో వేలూరి సంపాదకీయం మీద రాసిన అభిప్రాయం/విమర్శ ఎందుకు, ఏంసాధించడానికి రాశారో నాకు అర్థం కాలేదు. కానిఅందులొ కొన్నిమాటలు వార్త లో నేను రాసిన వ్యాసానికి సంబధించినవి కాబట్టిఈ నాలుగు వాక్యాలూ ఇక్కడ రాస్తున్నాను.
మొదటి సంగతి: గుడిపాటి అడిగిన మన కవులు అక్షరాస్యులేనా అన్న ప్రశ్నలో అక్షరాస్యులు అనే మాటకి కాని, నేను ఆ ప్రశ్న తిప్పి మన విమర్శకులు అక్షరాస్యులేనా అని అడిగిన ప్రశ్నలో అక్షరాస్యులు అనే మాటకి కాని నిందార్థం ఏమీ లేదని, వాళ్ళకి అ ఆ లు వొచ్చునా అని ఆ మాటకి అర్థం కాదనీ, ఇంగ్లీషులో cultural literacy, fiscal literacy అనే మాటల్లో literacy లాటిది ఈ అక్షరాస్యత అనే మాట అనీ హనుమంతరావు గారికి తెలియలేదని నేను అనుకోలేకపోతున్నాను. అది ఆయన ఊహకి అందనంత గహనమైన విషయం కాదు. నా వ్యాసం చివరదాకా చదివితే, నేను ఆ వ్యాసంలో అడిగిన ప్రశ్నలు చూస్తే ఈ విషయం తేలిగ్గానే తెలుస్తుంది. ఆయన నా వ్యాసం పూర్తిగా చదవలేదనీ, నేను ఆవ్యాసంలో వేసిన ప్రశ్నలు — తెలుగులో విమర్శకులు తయారవడానికి అందుబాటులో వున్న అవకాశా లేమిటి, వాళ్ళు చదవ వలసిన పుస్తకాలు, పొందవలసిన శిక్షణ ఏమిటి — అనేవి ఆ సంగతుల మీద తెలుగులో ప్రముఖ విమర్శకులు దృష్టిపెట్టేట్టు చెయ్యడానికి వేసిన ప్రశ్నలు అని హనుమంతరావు గారు బోధపరుచుకోలేక పోయారనీ కూడా నేను అనుకోవడం లేదు. పైగాఈ చర్చలలో ప్రధాన విషయాన్ని ఆయన గమనించలేదని అనుకోడానికీ వీలులేదు: “వారిద్దరి వ్యాసాల్లో చర్చించదగ్గ విషయాలు చాలానే ఉన్నా, ఆ ప్రశ్నలు వేరే రూపంలో వేసి ఉండాల్సింది. ” అని ఒక అభిప్రాయం చెప్పారు కాబట్టి. కాని ఆయన పరమ వినయంగా ఈవిషయాన్ని, దీనికి సంబంధించిన వివరాల్నీ వొదిలేసి ఆయనకి ఇష్టమైన మరో విషయంలోకి తన వ్యాఖ్యానాన్ని మళ్లించారు.
ఈ దేశంలో liberal education లో భాగంగా చర్చని ప్రధాన విషయాల మీద కేంద్రీకరించే పద్ధతీ, అప్రధాన విషాయలవేపు మళ్లకుండా వుండే జాగ్రత్తలూ నేర్పుతారు. ఈ శిక్షణని హనుమంతరావు గారు పొందలేదని నేను అనుకోను. అయినా ఆయన అసలు విషయాన్ని వొదిలేసి మరొక దారి లో వ్యాఖ్యానాలు చెయ్యడానికి ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి.
తెలుగు సాహిత్యరంగంలో ఆయన కోరుకునే రకమైన పుస్తకాలు రావడంలేదు. ఆయనకి బోధపడేలా ఉదాహరణలూ దృష్టాంతాలూ ఉన్న పుస్తకాలూ, వ్యాసాలూ ఎవరో ఒకరు తప్ప ఎక్కువమంది రాయడం లేదు. ఇది ఆయన లేవనెత్తుతున్న సమస్య. ఈ సమస్య చాలా ముఖ్యమైనది, వివరంగా చర్చించదగినదీని. ఇది అయితే దీన్ని గురించి వేరే వ్యాసంలో పరిశీలన చెయ్యాలి. అంతేకాని వేలూరి వెంకటేశ్వర రావు రాసిన సంపాదకీయం మీద అలవోకగా చేసే వ్యాఖ్యానంలో భాగం చెయ్యకూడదు.
(హనుమంతరావు గారిని ఇంతగా మథనపెడుతున్న ఈ సమస్య ని ఈమాట లో వివరంగా చర్చించడానికి వొచ్చే నెల సంచిక కోసం నేను ఒక వ్యాసం రాస్తున్నాను. అది ఈమాటలో ప్రచురించబడితే అప్పుడు ఆ విషయం ప్రధానవిషయంగా చర్చలు కొనసాగుతాయని ఆశిస్తాను.)
వార్తలో గుడిపాటీ, నేనూ, ఆ తరవాత ఈమాటలో వేలూరి చర్చకి తీసుకొస్తున్న విషయం వ్యక్తులకి సంబధించినది కాదు. వ్యవస్థ కి సంబంధించినది. తెలుగులో కవులూ, విమర్శకులూ శిక్షణ పొందడానికి ఎలాటి సంస్థలు ఉన్నాయి? ఈ రంగం లో ప్రమాణాలు ఎలా నిర్ణయించ బడతాయి? తెలుగు సాహిత్య రంగం కేవలం ఔత్సాహికులు ప్రధానంగా వుండే రంగంగా ఉండి పోకుండా ఇది professionalize ఎలా అవుతుంది? ఈ ప్రశ్నలు ముందు ఈరంగంలో వున్న పదిమందీ వేసుకుంటే — వీటికి సమాధానాలు వెతికే ప్రయత్నంలో తెలుగు సాహిత్య రంగం వ్యవస్థీకరించ బడడానికి అవసరమైన సంస్థల్ని నిర్మించే ఆలోచనలు చేస్తారని ఒక ఆశ.
ఈ చర్చ తెలుగు దేశం లోనే జరగ వలసిన అవసరం లేదు. వేలూరి అన్నట్టుగా తెలుగు ప్రపంచ భాషగా ఎదుగుతోంది. అంచేత ఇందులో మనకి కూడా జాగా వుంది.
VNR
సంగీతంతో కుస్తీ గురించి T.Raja gopal అభిప్రాయం:
09/09/2006 9:13 am
Dear Eemaata,
A very good discussion on Sri Rohini prasad gari Article. As a music lover and an enthusiastic learner, I am very much benefited and learnt some more new things by the article and the discussions on the same.
Thank you very much.
Raja gopal.
గత శతాబ్దంలో ప్రజాకవులు గురించి విప్లవ్ అభిప్రాయం:
09/08/2006 6:32 am
వేలూరి గారూ,
ఈ యూనికోడ్ తెలుగు ఎప్పుడో ఒక సారి నన్ను పప్పులోకి దింపుతుంది అని తెలిసీ ఈ గెస్ట్ బుక్ లో రాయకుండా ఉండలేక పోయాను, ఇదీ ఒక వ్యసనం గా మారే ప్రమాదం ఉందనిపిస్తుంది. ఏదో రాస్తూ పోయాను ఎట్లాగైనా ఈ “ప్రజాకవి” అనే అనవసర సిద్ధాంతాన్ని, నిర్వచనాన్ని కొంతైనా discredit చేయాలనే ఉద్దేశ్యంతో.
నా మటుకు నాకు ఇది ఒక నామ వాచకం లా లేక ఒక బిరుదు గా వదిలేస్తే బాగుంటుందనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనకు ప్రజాకవి కాళోజీ ఉన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా రేపు (సెప్టెంబర్ 9 న) తెలంగాణ జిల్లాల్లో చాలా వరకు ఉత్సవాలు కూడా జరుగుతున్నయి. మీరిప్పుడు తిరుపతి వెంకట కవుల్ని ప్రజాకవులు అని చెబితే ఎవరో మాష్టారుకు ఇది నచ్చి అదే మాట తెలుగు పుస్తకాల్లోకి ఉన్నది ఉన్నట్లు దింపితే అప్పుడు నాలాంటి వాడొకడు తన పాళీని జియో పొలిటికల్ ఇంకులో ముంచి ఇవ్వాళ కాక పోతె రేపు ఇట్ల రాయ వీలయితది:
“బోగపోళ్ళ బాగోతపు పద్యాలను మా నెత్తిన /ప్రజల కవిత్వం పేర రుద్ది / సౌహార్ద్రం, సమైక్యం భాషంటివి / నా యాసను చిన్నబుస్తివి / నీ పాఠం నాకొద్దు / ప్రజలు నేను, కవిత్వం నాది, ప్రజాకవివి నువ్వెట్లయితవు”
అందుకే: వెల్చేరు గారు సెప్టెంబరు తెలుగు నాడిలో రాసిన తిరుపతి వెంకట కవుల పరిచయం చాలు, మీ వ్యాసం కూడా మొదటి నాలుగు పేరాలు (టైటిల్ తోసహా) మినహాయించి, “1999 జూన్ జులై ” కాడ్నించి అద్భుతం. అది నా అసలు అభిప్రాయం. ఆ మాట డొంక తిరుగుడుగా చెప్పాలనుకోవటం నా తప్పే.
అన్నట్టు, తొడ పాశం పెట్టిన సారు మీదికి ఎదురు మళ్ళానని నన్ను పక్క సెక్షనులో తోసారు, అప్పుడు ఏదో లే అని సరిపెట్టుకుని ఉంటే ఇప్పుడిట్లా తయారయి ఉండే వాడిని కాదేమో.
మీరు తప్పుగా అనుకోకపోతే ఇప్పటికే ఎక్కువ రాసాను,
ఇక సెలవ్, విప్లవ్
సంగీతంతో కుస్తీ గురించి Rohiniprasad అభిప్రాయం:
09/08/2006 6:25 am
సాయిగారి సంతృప్తి కోసమని నేను లోగడ రాసిన వ్యాసం లింక్ ఇస్తున్నాను. అందులో శాస్త్రీయ సంగీతపు 16, 22 శ్రుతులను గురించి క్లుప్తంగా చెప్పాను.
https://eemaata.com/em/issues/200007/789.html
ఆయనకి వ్యాసం నచ్చినందుకు సంతోషం. ఔత్సాహికుల సౌకర్యం కోసమని 16 శ్రుతుల గురించి ప్రస్తావించలేదనీ, నేనూ, ఇతర పాఠకులూ విన్నవించుకోవడం జరిగింది.
మరొక విషయం. 72 మేళకర్తల వరకూ వివరించడానికి 16 శ్రుతులు సరిపోతాయి కాని ఆరభి, దేవగాంధారి వంటి రాగాల మధ్య తేడాలు తెలుసుకోవడానికి ఉపకరించవు. ఔత్సాహికులకు అవసరంలేని ఇలాంటి విషయాలు కొన్ని ఉంటాయి. 22 శ్రుతుల గురించి తెలియాలంటే ఇది చూడండి.
http://www.rit.edu/~pnveme/raga/Sruti.html
[ఈ 12 vs. 16 vs. 22 శ్రుతుల పై చర్చ ఇంతటితో ముగించవలసిందిగా పాఠకులకు మనవి. – సంపాదకులు]
సంగీతంతో కుస్తీ గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
09/07/2006 2:34 pm
నేను రాసిన అభ్యంతరమల్లా ఒక్కటే ! మొత్త స్వరాలు 16, కానీ కీబోర్డు మీద కేవలం 12 మాత్రమే పలికించ గలమని రాయచ్చు కదా? మొత్తం 12 స్వరాలే అని రాయడం, నా దృష్టిలో సుముచితం కాదు. అవును, 16 స్వరాలు 16 అని రాసి, 12 అని రాయకుండా ఉండాల్సింది అని అనచ్చుకదా? లేదా 16 స్వ రాలు ఉన్నాయి, కానీ 12 మాత్రమే కీబోర్డు లో పలికించ వచ్చు అని రాయడం వల్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు.
అలా కాకుండా మేకేం తెలియదంటూ, నాకు అపారమైన వాయిద్య అనుభవం ఉంది అని రాయడం వల్లే నేను పొరపాటని రాయడం జరిగింది. నేను వ్యాసకర్తని కానీ, ఆయన వ్యాసం బాగోలేదని కానీ రాయలేదు. నాకూ సంగీతానుభవం ఉంది. నేనూ వీణ వాయించ గలను. వాయిద్య ముఖ్యం కాదు, సంగీతమే ముఖ్యం అన్నప్పుడు, మనం ఇచ్చే సమాచారం సరిగ్గా ఉండాలన్నదే నా ఉద్దేశ్యం, అంతేకానీ, ఇంకోళ్ళ విద్వత్తుని ప్ర శ్నించడం కాదు. వస్తువు వదిలేసి, వ్యక్తులవైపు విమర్శ దారి మళ్ళితే ఎలా ఉంటుంది?
వ్యాసం చదివేక ప్రసాదు గారికి అపారమైన సంగీతానుభవం ఉందని ఎవరికైనా అర్థం అవుతుంది.
– సాయి బ్రహ్మానందం గొర్తి
గత శతాబ్దంలో ప్రజాకవులు గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:
09/07/2006 2:27 pm
ఆలస్యంగా సమాధానాలిస్తున్నందుకు మన్నించండి. ముందుగా రథ్య అర్థం గురించి:
రథ్య అంటే రాజమార్గము అనీ, రథసమూహము అనీ రెండర్థాలూ ఉన్నాయి ( చూ: సూర్యరాయాంధ్ర నిఘంటువు, ఆరవ సంపుటము, 648 వ పేజీ, లేదా చూ: శబ్దరత్నాకరము, 922 వ పేజీ)
నాకూ శ్రీశ్రీ అంటే చచ్చే ఇష్టం, వల్లమాలిన అభిమానం. ఏ ప్రజలకి అతను “ప్రజాకవి” గా చలామణి అవుతాడో నావ్యాసంలో (నావ్యాస పరిథిలో అంటే ఇబ్బంది తక్కువ అవచ్చు!) చెప్పిందానికన్నా ఎక్కువగా చెప్పేందుకు ఏమీ లేదు.
గద్దర్, వంగపండుల పాటలని ముందుగా “కవితలు”గా బేరీజు వెయ్యాలి. అందుకు చెయ్యవలసిన కృషి వేరే ఉంది. (ఆ పని నేను మొదలెట్టా!)అసలు, ఆపాటలు కవిత్వమా? కాదా? అని నిర్థారణ చేసుకున్న తరువాత, వారు ప్రజాకవులా కారా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. (నన్ను అపార్థం చేసుకోకండి, అక్కిరాజు గారూ! ఆహా! ఎంచక్కని సినిమా డైలాగు!)
ఒకానొకప్పుడు, “తెలుసా”లో గద్దర్ పై నేను ఒక పెద్ద వ్యాసం రాసిన గుర్తు. ఆ వ్యాసం అంతా అతని ఒకేఒక్క పాటమీద! అప్పట్లో, కొందరు నన్ను చీవాట్లు కూడా పెట్టారు. అదివేరే విషయం, అనుకోండి.
గద్దర్ పైవ్యాసంకూడా త్వరలోనే ( సమీక్షకులు “సై” అంటేనే సుమా!) ఈమాట లో రావచ్చు.
విప్లవ్ గారు చాలా విషయాలు చెప్పారు. సాంఘిక చరిత్ర గురించి ఆయనకి నేను పాఠం చెప్పగల సమర్థుణ్ణి కాదు. అయినా, ఆయన నన్ను పూర్తిగా “అపార్థం” ( అబ్బ! ఇంతకన్నా మంచి మాట తెలుగులో లేదు కాబోలు!) చేసుకున్నట్టు అనుమానం గా వుంది. వ్యక్తిగత అభిప్రాయాలని మన్నించమని మా తెలుగు మేష్టారు ఎప్పుడో చిన్నప్పుడే, శొంఠిపిక్క పెట్టి మరీ నేర్పారు! అందుకు బద్ధుణ్ణి, ఇప్పటికీనూ!
ఇతి.
అభివాదాలతో, — వేలూరి వేంకటేశ్వర రావు.
ఈమాట కొత్త వేషం గురించి Rohiniprasad అభిప్రాయం:
09/06/2006 1:54 pm
అమెరికాలోనూ, మన దేశానికి దూరంగా ఇతర ప్రాంతాల్లోనూ ఉంటున్న తెలుగువారు తమ సంస్కృతిని మరిచిపోకుండా ఉండేందుకూ, తమ పిల్లలకు దాన్ని గురించి పరిచయం చేసేందుకూ తంటాలు పడటం మామూలే. ఇందులో భాగంగా సంగీతం, నాట్యం మొదలైన కళలనూ, తెలుగు భాషనూ నేర్పేందుకు చిన్నా పెద్దా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించకుండా ఇందులోని సాధక బాధకాల గురించీ, నేర్పేవాళ్ళ, నేర్చుకునేవాళ్ళ అనుభవాల గురించీ వ్యాసాలు ఈమాటలో వేస్తే నలుగురికీ ఉపయోగకరంగా ఉంటుంది. అస్తమానం సినిమా నటులని పిలిపించి వారితో అవస్థలు పడేకన్నా స్థానికంగా జరిపే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయని నా ఉద్దేశం. ఇటువంటి రచనలను ఆహ్వానిస్తూ సంపాదక వర్గం ప్రకటన చేస్తే బావుంటుందేమో. అటువంటి రచయితల గురించి తెలిస్తే వారిని వ్యాసాల కోసం సంప్రదించటం కూడా మంచిదే.