మీరు అడగవచ్చు ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానని. నా సమాధానం: ప్రకృతి ఎలాగో, బైబులూ అలాగే. ప్రతి పాఠకుడికీ అది ఒక్కొక్క కథ చెబుతుంది. అయితే, చదివే మనిషి మనిషికీ బైబుల్ మారిపోతుందా? అవును. బైబుల్ ద్వారా దేవుడు ఇద్దరు వ్యక్తులకు ఒకే సందేశాన్ని ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఎందుకని? ఎందుకంటే, ఏ వ్యక్తి చదువుతాడో ఆ వ్యక్తే స్ఫూర్తి.
Category Archive: సంచికలు
డేగలే కనపడని
నియంతలకాలం
అంతా అసంయుక్త హల్లుల మయం
చట్రాల్లో బతికే మనుషులకి
చట్టాలు తెలుస్తాయేమో గాని
చిత్తాలు తెలియవు
వాటికెపుడు పోస్తావో
ఆ మార్మిక జీవాన్ని
ఎవరి గుండెలోనో
కంటితడిలోనో
పొర్లాడి వచ్చిన పుప్పొడిని
ఆ గదినిండా కుమ్మరిస్తాయి
వెంటనే దాన్నొక తేనెపట్టులా మార్చి
నువ్వు తాళం పెట్టేస్తావు
చీకటి రాత్రి చిక్కబడక ముందే
గ్రహపాటుగా నా గుండెనెండబెట్టుకుంటా.
చుక్కపొడుపు పొడిచేలోపే
ఏమరుపాటుగా నా ఆశలార్చుకుంటా.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
ఓలేటి వెంకటేశ్వర్లు పాడిన ‘కడచేనటే సఖియా’ చాలా మందికి తెలిసి ఉండవచ్చు. ఓలేటి పేరు వినగానే వెంటనే స్ఫురించే పాట. 12-13 సంవత్సరాల క్రితం ఈ పాటని ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పించిన ఒక టి.వి. కార్యక్రమంలో మల్లాది బ్రదర్స్లో ఒకరైన రవికుమార్ పాడి బోలెడు ఆసక్తిని రేకెత్తించి కొత్త తరానికి కూడా పరిచయం చేసిన పాట.
అడ్డం ఈశానదిక్కున ఉన్నదుర్గాదేవి (5) సమాధానం: అపరాజిత సుదర్శన్ పట్నాయక్కు కావల్సిన ముడిసరుకు (3) సమాధానం: ఇసుక అనుగ్రహించు కృప ప్రతీక్షణము (4) సమాధానం: […]
క్రితం సంచికలోని గడినుడి-47కి మొదటి ఇరవై రోజుల్లో పద్దెనిమిదిమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-47 సమాధానాలు.
భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణభాగంలో, ప్రత్యేకించి తెలుగుభాషాప్రాంతాలలో ఆంగ్లేయుల పాలన వేళ్ళూనుకుంటున్న సమయంలో వారికి మన చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు, సామాజిక విధివిధానాలను అర్థం అయేలా చెప్పి పరిపాలనాపద్ధతులకు సహకరించిన పండితులు, విద్యావేత్తలు అయిన స్థానికుల గురించి మనకు ఎక్కువగా తెలియదు. ఉదాహరణకు, సి. పి. బ్రౌన్ గురించి మనకు తెలిసినంతగా, అతనికి ఇతోధికంగా సహాయం చేసిన తెలుగు పండితుల గురించి, వారి కృషి గురించి తెలీదు. కల్నల్ మెకంజీ పేరు మనం విన్నాం కాని అతనికి ఆ పేరు రావడానికి కారణమయిన కావలి సోదరుల గురించి వినలేదు. కలకత్తాలో విలియమ్ జోన్స్ సంస్కృత భాషను ప్రధానం చేసి ఇతర స్థానిక భాషలను పట్టించుకోని కారణంగా స్థానిక భాషలు మాట్లాడే వాళ్ళంతా బ్రిటిష్ వారి దృష్టిలో అధములు, తమ పురాచరిత్ర ఔన్నత్యానికి తగనివారుగానూ అయారు. అందుకు కొంత భిన్నంగా దక్షిణ భారతంలో ఆంగ్లేయులకూ స్థానికులకూ మధ్య సంబంధం మరికొంత సాదరసమభావనలతోను, విజ్ఞానం ఇచ్చిపుచ్చుకునేలానూ ఉంటూ వచ్చింది. అందువల్ల స్థానిక పండితులు, మేధావులు జాత్యహంకారపు నీడలోను, అధికారి-సేవకుడు వంటి అసమానమైన స్థితిలోనూ కూడా విజ్ఞానం రెండువైపులకూ పారే స్థితిని వీలైనంతగా నెలకొల్పుకున్నారు. వీరు స్థానిక సంస్కృతీసంప్రదాయాలను, సాహిత్యాన్ని బ్రిటీష్ వారికి నేర్పే క్రమంలో ఆ పురాచరిత్రను ఒక ఆధునికరూపంలో నమోదు చేయడమూ మొదలుపెట్టారు. ఇలా స్థానిక పండితులు, ఆధునికరూపాల్లో నమోదు చేసిన చరిత్ర వల్ల ఇప్పటిదాకా పుక్కిటి పురాణాలుగా కొట్టిపారేసిన మన చరిత్రను, సాంప్రదాయ సాహిత్యాలను అధునాతన పరిశోధనాపద్ధతులలో విశ్లేషించి అర్థం చేసుకోవడానికి కావలసిన వీలు ఇప్పుడు మనకుంది. వీరి కృషిని గమనించి, తద్వారా మరుగున పడ్డ మన నిజచరిత్రను మనం వెలికి తెచ్చే అవకాశాలు ఎంతగానో ఉన్నా ఇప్పటికీ తెలుగునాట చారిత్రకపరిశోధకులెవరూ వాటిని వినియోగించుకున్న దాఖలాలు లేవు. చారిత్రక సాహిత్యాన్ని పునః ప్రచురించడం, ఆ సాహిత్యానికి సందర్భోచితమైన వ్యాఖ్యానాన్ని అందించడం, వాటికి లోతైన దృష్టీ అధ్యయనం ఉన్న విమర్శకులతో ముందుమాట రాయించడం ద్వారా చరిత్రను ఒక కొత్త కోణం నుండి భావి తరాలకు పరిచయం చెయ్యడం ఏకాలానికాకాలం పునరావృతం కావలసిన ఒక అవసరం. ఆ అవసరాన్ని గుర్తెరిగి ఆ దిశగా అడుగులు పడుతున్నాయో లేదో గమనించుకోవాల్సిన బాధ్యత సాహిత్యసమాజంలో ఉన్నామని చెప్పుకునే ప్రతి ఒక్కరిదీ.
రామస్వామి తన కాలానికి మించిన ప్రతిభావంతుడు, ప్రయోజకుడు, వర్తక రహస్యాలు తెలిసినవాడు. బహుశా భారతదేశంలోనే మొదటి ప్రచురణకర్త. అతను చేసిన పనిని, ముఖ్యంగా దక్కను కవుల చరిత్రతో అతను సాధించిన పెద్ద మార్పుని మనం ఇప్పటికీ సరిగా గుర్తించలేదు. ఆ మార్పు ఫలితాన్ని ఇప్పటికీ మనం తెలియకుండానే కొనసాగిస్తున్నాం.
ఫ్రెంచి భాషలో తొలి చారిత్రక నవలగా, మనస్తత్వ ప్రధాన నవలగా ఈ నవల పేరు పొందింది. ఇందులో కథానాయిక తప్ప తక్కిన అందరూ చారిత్రక వ్యక్తులే. ఏ భాషలోని చారిత్రక నవలల్లోనైనా చారిత్రక వ్యక్తులు అతి తక్కువగా, కల్పిత పాత్రలు ఎక్కువగా ఉండడం సహజం. కానీ ఈ తొలి ఫ్రెంచి చారిత్రక నవలలో అన్నీ చారిత్రక పాత్రలే. కథానాయిక మాత్రమే కల్పితం.
తిండి, నిద్రా
రెండు శరీరాలనూ వెలేసుకుంటాయి
కోరికలు, సమీక్షలూ
ఇష్టాలు, ఇష్టమైన వాళ్ళు
అక్షరాలుగా మారిపోతారు.
కవిత్వం కూడదు మన ప్రేమలాగ.
“అవునొరేయ్. బొత్తాల్లో ఉన్న సుకవే సుకం రా. జుప్పు అటిటు ఆడకుండా ఆగిపోయిందనుకో. బాచేయటానికి కాజా గాడింకో ఇరవయ్యో పాతికో దొబ్బుతాడు. రాంబారికో యాభై ఎకరం గొబ్బిరితోటుంది కాబట్టి, ఆళ్ళ మాంగారు ఇంకో యాభై పల్లంకొట్టి పిల్లనిచ్చేరు. నీకూ నాకూ ఏం వుంది? తాడుంటే బొంగరవుండదు. బొంగరవుంటే తాడుండదు.” జిప్ ప్యాంట్ కుట్టించడం విరమించుకున్నాడు సత్తిగాడు.
చల్లని తెల్లని కట్టడమది. పాలరాయి విరివిగా వాడిన సంగతి ప్రాంగణంలోకి వెళ్ళగానే బోధపడింది. అసంఖ్యాకంగా ఉన్న గుమ్మటాలు, నాలుగు పక్కలా కనిపించే మీనార్లు, ఎంతో ఎత్తుగా ఉన్న ప్రవేశ ద్వారం, శీతాకాలపు ఆరుబయట సన్నపాటి పొగమంచు వీచికలా అక్కడంతా పరచుకొని ఉన్న కళాత్మకత-వినమ్రభావన కలిగింది.
నిసి క్రమేపీ వేరే రకమైన సరళ జీవన విధానం అలవరచుకుంది. ఇప్పుడు, ఇన్ని ఏళ్ళ తదనంతరం, తన సౌందర్యం గురించి కొత్త స్ఫురణ ఆమెలో కలిగింది. పొడవుగా వదిలేసిన తెల్లని మెరుపుల జుట్టు, మృదువుగా మారిన ముఖరేఖలు. కళ్ళలో జాలి, వేదన, ఆలోచనల స్థానంలో, కొత్త తరహా చురుకు చూపులు, ప్రఫుల్లమైన నవ్వు. దుస్తులు నగల ఎన్నికలో కొత్త నాజూకులు. ఏది ఇందులో తన స్వాభావికం?
ఇంగ్లీషు కుంపినీవారి దుష్పరిపాలనమునందు జరుగుచుండిన అన్యాయముల వలన మన్యములోని కొండరాజులు జమీందారులు తరచుగా తిరుగుబాటుచేయుచు తమ పరిసరారణ్యములోని ఆటవికజాతుల నాయకుల దగ్గర తలదాచుకొనుచుండిరి. ఆ మన్యప్రాంతములందు కల్లోలములు కలిగినప్పుడు ఆటవికజాతులును తిరుగుబాటు చేయుచుండెను.
యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి? అనుకొని ఏదీ జరగదు. ఊహించనివి ఊహించకుండా జరుగుతాయి. అయినా ఇది అనుకోకుండా జరిగిందా? అనుకొనే జరిగింది కదా! కావాలని చేసిన యాక్సిడెంట్కి ఎంత మూల్యం చెల్లించాలి? మూల్యం చెల్లించడం కోసమే యాక్సిడెంట్ చేస్తారా! విరిగిన చేయి, వెన్ను పక్కగా దిగబడిన రాయి, నీ ప్రమేయం లేకుండా నిన్ను తడిమే చేతుల స్పర్శ కూడా.
వాలిన కన్నులు
తెరదించిన నాటకంలో
మిగిలిన కథలో మెదులుతూ
నడిచే కాలమూ జీవితమే.
గొంతు నడిచిన చప్పుడు
ఎప్పుడూ కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది
దారి పొడవునా వినిపిస్తూనే ఉంటుంది.
స్టే-ఎట్-హోమ్ డాడ్గా ఉండే ఉద్దేశ్యం లేదని సందీప్ స్పష్టం చేశాడు అందరికీ. పాలసీ ప్రకారం వచ్చే ఆర్నెళ్ళ లీవ్ కాకుండా ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నొచ్చుకున్నాడు. అనిత ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు, ఆమెకి ఆమె ఉద్యోగం అంత ముఖ్యం! ఇద్దరూ మొండిపట్టు పట్టి బాబుని పూర్తిగా ఏ ఆయాకో వదిలేయడం ఇష్టం లేక, మనసు చంపుకుని ఉద్యోగం మానుకున్నాడు.
కేసియోపియా అని గ్రీసు దేశస్తులు పిలిచిన నక్షత్ర మండలాన్ని వివిధ సంస్కృతులలో ప్రజలు వివిధమైన పేర్లతో పిలిచేరు. ఈ గుంపులో ఉన్న నక్షత్రాల గురించి అరబ్బులకి తెలుసు, చైనీయులకి తెలుసు, వేదకాలపు భారతీయులకి తెలుసు. వారివారి పురాణ గాథలలో ఇటువంటి కథలు వారికీ ఉన్నాయి.