ఆమె వీధి అరుగుపై కూర్చుని
దారిన పోయే అందరినీ పలకరిస్తుంది
ఎలా ఉన్నారనో
ఏం చేస్తున్నారనో అడుగుతుంది
తోచిన మాటలేవో
వడపోత లేకుండా మాట్లాడుతుంది

మహమ్మదీయ మతమునందేగాక అన్ని మతములందును సత్యమున్నదని నమ్మిన అక్బరుచక్రవర్తి యంతటి వేదాంతికి కూడా పైన చెప్పినవానియందు కొంత విశ్వాసముండెను. ఆయన కుమారుడైన జహంగీరునకీ విషయమున వెర్రినమ్మకముండెను.

హిందూ పురాణాలలో, ఇతిహాసాలలో దేవుళ్ళతో సమానంగా దేవతలున్నారు. చరిత్రలో వీరపురుషులతో పాటు వీరనారీమణులున్నారు. ప్రార్థనాది విషయాలు మినహాయిస్తే మన పాఠ్యపుస్తకాలలో ఏ స్థాయిలోనూ వారి వీరోచిత గాథలు గాని, ప్రేరణాత్మకమైన వారి జీవిత విశేషాలు గాని లేవు, ఉండవు.

జల
ఎప్పుడైనా కనిపిస్తుందా?
చేదితేనే
గలగలమని పొంగుతుంది.

పరిమళం
దూరానికి తెలుస్తుందా?
దరి చేరితేనే
గుప్పుమని కప్పేస్తుంది.

వలస ప్రధాన అంశంగా రాయబడిన ఈ నవలలో మానవ సంబంధాల చిత్రీకరణకూడా ఎంతో వాస్తవికంగా, సునిశితంగా, హృద్యంగా సాగింది. చిత్తూరుజిల్లావాసి, భద్రావతాయనగా పిలవబడుతూ, ఇప్పటికీ జీవించి ఉన్న మంగరి నాగయ్య జీవితాన్నాధారంగా చేసుకుని బలభద్రి పాత్రను మలచారు రచయిత.

ఈ సంచిక గడినుడి ప్రముఖ నేపథ్యగాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి స్మృతికి నివాళి.

క్రితం సంచికలోని గడినుడి-48కి మొదటి ఇరవై రోజుల్లో పద్దెనిమిదిమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-48 సమాధానాలు.

సూచన: ఈసారి సమాధానాల్లో 8 నిలువు కోసం వులివెంజర అని గడినుడి కూర్చాము. కానీ, ఆంధ్ర భారతి నిఘంటువులో అది అక్షర దోషమని, అసలు […]

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

రాబోయే సంక్రాంతి 2021 పండుగ సందర్భంగా శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ నిర్వహిస్తుంది. విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని సవినయంగా కోరుతున్నాం.

మట్టిముద్దగాదు మహిత సత్కవి శక్తి మట్టుచున్న నణగిమణిగి యుండ/ రత్నఖచితమైన రబ్బరుబంతియై వెంటవెంట నంటి మింటికెక్కు అని ఎంత నమ్మినా, సామాజిక అసమానతలకు గురైన ఆవేదనలో, …ఎంత రత్నకాంతి యెంత శాంతి! ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో/ పుట్టరాని చోట బుట్టుకతన అని అతను వాపోయిన మాట కూడా నిజం. ఎవడారగించు నమృతభోజనంబున గలిసెనో ఈలేమ గంజిబువ్వ/ ఎవరు వాసముసేయు శృంగార సౌధాన మునిగెనో యిన్నారి పూరిగుడిసె? అని ప్రశ్నించిన మాటా నిజం. కాని, వీటికి అతీతంగా, గవ్వకుసాటిరాని పలుగాకులమూక లసూయచేత నన్నెవ్విధిదూరినన్ నను వరించిన శారదలేచిపోవునే? అంటూ ఎనలేని ప్రతిభతో ఇంతింతగా ఎదిగి, ఆలస్యంగానైనా అందుకు తగిన గుర్తింపూ సత్కారాలూ పొంది కులమతతారతమ్యాలన్నీ తన కవితాధారతో త్రోసిరాజని మహాకవుల సరసన నిలబడ్డాడు గుఱ్ఱం జాషువా. జాషువా నూటయిరవైఐదవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అందరూ ఆయన గురించి మాట్లాడుకుంటున్న ప్రస్తుత సందర్భంలో, ఆయనను కొంతకాలంగా దళితకవిగా మాత్రమే పేర్కొనడం, ఆయన సాహిత్యాన్ని ఆ దృక్పథంనుంచే పరిశీలించడం సాహిత్యాభిమానులు నిశితంగా చర్చించాల్సిన విషయం. విశ్వనరుడనని చెప్పుకున్న ఓ కవిని ఇలా ఒక కులానికీ వర్గానికీ ప్రాంతానికీ పరిమితం చేయడం వల్ల, ఆ రకమైన ముద్రలు ఆపాదించడం వల్ల అతని కవిత్వంలోని విశ్వజనీనత కుదించబడుతుంది. ఆ సాహిత్యపు సర్వకాలీనత చెరిగిపోతుంది. కళాకారుడి సృజనకు ఇదే అసలైన గుర్తింపు పత్రమై నిలిచిపోతుంది. తన ప్రమేయం లేకుండానే తగిలించబడ్డ అస్తిత్వాన్ని మోస్తున్న దుస్థితి కేవలం జాషువా ఒక్కడిదే కాదు. ఎందరో కవులు, రచయితలు, కళాకారులు కులమతలింగప్రాంతీయాది అస్తిత్వవాదముద్రలను తమ ప్రమేయం లేకుండానే మోస్తున్నారు. తమ సృజనకు వెలుపలగా ఈ చట్రాలలో బలవంతంగా ఇరికించబడుతూనే ఉన్నారు. ఇవి తప్ప సృజనను పరిశీలించేందుకు మరేమీ తూనికరాళ్ళుగా తెచ్చుకోలేని సంకుచితవాదులతో నిందించబడుతూనే ఉన్నారు, వివక్షకూ గురి అవుతున్నారు. అభిమానంతో కొందరిని తమవారిగా ప్రకటించుకోవడానికి, మరికొందరిని శత్రువులుగా భావించి తుడిపివేయడానికి, అవే ముద్రలను వాడుతున్నామన్న గ్రహింపు లేకపోవడం గొప్ప సాహిత్యవిపత్తు. ఏ ముద్రతో ఒక కళాకారుడిని పైకెత్తుతున్నారో, అదే ముద్రతో మరొక కళాకారుడిని పతనం చేస్తున్నారని సాటి కళాకారులతో సహా ఎవరూ గుర్తించట్లేదు. ఉద్దేశ్యం మంచిదైనా చెడుదైనా చివరికి నష్టపోయేది కళ మాత్రమే. ఏ కళయైనా ఆయా కళాకారుల లోతైన అధ్యయనం, లోకాతీతమైన తపన, నిర్విరామ కృషి ఫలితం. వాళ్ళ ఉనికి కులమతవర్గవాద పరిధులకు అతీతమైనది. వారి సృజనాత్మకత అస్తిత్వాలకు, సొంత వ్యక్తిత్వాలకు అందనంత ఎత్తులోది. వారి సృజనను ఆ స్థాయిలోనే ఆ పరిధిలోనే విశ్లేషించాలి, అభినందించాలి, విమర్శించాలి కూడా. అలా కాక, కళాకారులకు సాహిత్యేతర అస్తిత్వాన్ని అంటగట్టి వారిని, వారి కళను ఆ సంకుచితదృష్టితో వెల కడితే ఏ కొద్దిమందికో తాత్కాలిక ప్రయోజనం కలగడం వినా సాహిత్యానికి యావత్‌సమాజానికి శాశ్వతమైన నష్టమే మిగులుతుంది.

ఈ నవలలో కథ చిన్నదే. కానీ ఇది రేకెత్తించిన ఆలోచనలు కొత్తవి. అందులో ముఖ్యమైన విషయం నల్లజాతీయుల బానిసత్వం. బ్రిటన్‌లో అప్పటికి ఆఫ్రికన్ కాలనీల్లో బానిసత్వం ముమ్మరంగా ఉన్నప్పటికీ దానిపై తిరుగుబాట్లు, దాని నిషేధానికి పోరాటాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. అక్కడక్కడా కొందరు వ్యతిరేకించడం మినహా, సంఘటిత పోరాటాలేవీ అప్పుడు లేవు.

ఏమవుతుంది నాకు? గిల్టీగా ఎందుకుంది, నా లోపల భయమెందుకు? మణి ఇదివరకటిలా లేదు. ప్రశ్నలు వేసినా నన్నేమి అనలేదు, నా వైపు చూసే అభావపు చూపు తట్టుకోలేకుండా ఉన్నా. ఉక్రోషంగా చెప్పాలనిపించింది భరణి నన్ను వెతుక్కుంటా వచ్చాడు నిన్ను చూసుకోమని అని. కాని చెప్పలేకపోయా. మనుషులు మన అవసరాలను చూసి, వాళ్ళ పనులు చేయించుకుంటారు. ప్రేమ స్నేహం ముసుగులో భరణి చేసిందేంటి?

“బావుంది. ఏడు ఎమిరేట్లు. ఎనభైవేలనుంచి ముప్ఫయిమూడు లక్షలదాకా జనాభా వ్యత్యాసాలు. రెండొందల ఏభై చదరపు కిలోమీటర్ల నుంచి అరవైవేల కిలోమీటర్ల దాకా భౌగోళిక వ్యత్యాసాలు. అసలు ఈ ఉమ్మడి కుటుంబం ఎలా బతుకుతోందీ? డబ్బుల విషయంలోనో సరిహద్దుల విషయంలోనో, హక్కులూ ఆధిపత్యాల విషయంలోనో గొడవలు పడరా వీళ్ళు?!”

నిద్ర తెలుస్తున్నా, సమయం చూడనంత
గాఢమైన ముడులు కునుకుకీ కట్టక
ఒంటిమీద ఉరేస్తాయి నన్ను,
నాలుగూ పదకొండు ఇక నిద్రపో అని నువ్వనే వరకూ.

కాలు ఆనించిన చోటు విమానాలు ఆగే చోటు. స్థలాలని కలుపుతూ, కాలాలని మారుస్తూ, నాగరికతలని కరెన్సీ నోట్లలా తర్జుమా చేయగలిగే పవిత్ర స్థలి. నువ్వు అక్కడే నిలబడివున్నా నీతో పాటు ఇదే కాలంలో ఇదే క్షణంలో జీవించిన, జీవిస్తున్న ఈ కోట్లకోట్లమంది సంబంధం లేని జనాల ఆటుపోట్లు, ఒకరినొకరు తోసుకుంటూ తప్పుకుంటూ వస్తూ పోతూ… ఇవ్వేమీ నిన్ను తాకే స్థితిలో నువ్వు లేవు.

రోహిణి చనిపోయి ఇరవై రోజులు దాటింది. పత్రికలో చదివి సమాచారం తెలుసుకున్నాను. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పట్లాగే ఇంటి తలుపు బిగించి ఉంది. నేను తలుపు తట్టగానే పక్కనున్న కిటికీ సగం తీసి చూసి ‘మీరా?’ అని అడిగి తలుపు తీసింది జయ. నేను లోపలికి వెళ్ళగానే తలుపు, కిటికీ మూసింది. ‘ఒక నెల రోజలుగా ఊర్లో లేను. నిన్ననే తెలిసింది విషయం’ అని అబద్ధమాడాను.

అక్కడ
రంగులేని రంగు
రూపంలేని రూపం
రుచిలేని రుచి
స్పర్శలేని స్పర్శ
శబ్దంలేని శబ్దం
వాసనలేని వాసన
నీకోసం ఎదురుచూస్తాయి

ఈ పధకం ప్రకారం బంధులుడు, అతని ముప్ఫై ఇద్దరు పిల్లలూ రహస్యంగా వెళ్ళి ఫలానా రాజ్యం సరిహద్దుల్లో జరగబోయే తిరుగుబాటు అణచాలి. అలా వాళ్ళు వెళ్ళినపుడు అక్కడ దాక్కున్న ప్రసేనజిత్తు సైన్యం ఈ బంధులుణ్ణీ, అతని పిల్లలనీ హతమారుస్తుస్తుంది వాళ్ళు నిద్రలో ఉండగా. అలా అతి బలవంతుడైన బంధులుణ్ణి పిల్లల్తో సహా వదిలించుకుంటే దరిద్రం వదులుతుంది ప్రసేనజిత్తుకి.

ధరణా కూర్చుని సాత్విక నిరోధము చేయుట భారతదేశములో అనాదిసిద్ధమైన సత్యాగ్రహ పద్ధతి. ఒకడింకొకనికన్యాయము చేసినయెడల అన్యాయమును పొందినవాడాయన్యాయము చేసినవాని వాకిట తిండి తినక, ఎండయనక వానయనక నిశ్చలముగా కూర్చుండి యుండును. దీనికే ధరణాకూర్పొనుటయందురు. ఇట్లు కూర్చుండి ప్రాణములను బాసినవాని యుసురాయింటివానికి గొట్టునని ప్రజలనమ్మకము.

రాజుగారివి గాడిద చెవులు అని మంగలికి తెలిసిపోయింది. మూడో కంటివాడికి ఈ రహస్యం తెలిసిందంటే తల తీయించేస్తానని మైడస్ మంగలిని బెదిరించేడు. రాచరహస్యం! రచ్చకెక్కితే కొంపలంటుకుపోవూ? కడుపులో దాచుకోలేక మంగలి కడుపు ఉబ్బిపోతోంది. ఎవ్వరికో ఒకరికి చెప్పాలి. తనకి తెలిసిన రహస్యాన్ని ఒక పుట్టలో ఊదేశాడు!