పదములు
పాడెదన్,
పిలిచి వలపుల
పీటను వేతు,
పుల్కలన్ బెదరుచు
పూతు గంధమును,
పృథుకము
పెట్టెద నావుపాలితో ముదమున,
పేద
పైదలియు
పొగడ సరాలను
పోహణింతు, నీ సుదినము
పౌర్ణమిన్ బ్రదుకు శుభమవ,
పండ త–
పః ఫలమ్ము రా!
Category Archive: సంచికలు
లయ తెలుసు నీకు. అనుగుణంగా అడుగు తీసి అడుగు. ఊగుతూ నడుం. ఊపుతూ చేతులు. ముందుకీ వెనక్కీ. కవ్విస్తూ దగ్గరగా ఒరిగి అందకుండా దూరంగా జరిగి. కదలికకు బదులుగా కదలిక. ఉబికే కండరం మీద నిగనిగలాడుతూ వెచ్చటి తడి.
ఆ రాత్రి,
ముక్కలయే కాలం ముందు
మౌనం నిశ్శేషంగా నిలబడ్డ రాత్రి,
వెన్నెలను శ్వాసిస్తున్న చీకట్లోనే
లోకం సుస్పష్టంగా కనపడ్డ రాత్రి
కళ్ళు
విప్పార్చుకుని
బరువుగా తూగే
సీతాఫలాలతో
కులాసాగా
ఊసులాడుతో
చెట్ల నీడలు
మాండిల్స్టామ్ గురించి సోవియట్ రచయితల సంఘం ఎందుకు తన దగ్గిరకి రాయబారానికి రాలేదు? అని స్టాలిన్ అడిగితే, 1927 నుంచీ రచయితల సంఘం ఇటువంటి విషయాలలో జోక్యం కల్పించుకోవటల్లేదని పాస్టర్నాక్ చెప్పాడు. ఈ విషయమై, నేను ప్రత్యేకంగా నీతో మాట్లాడాలని ఉన్నది అని పాస్టర్నాక్ అనంగానే, స్టాలిన్ టెలిఫోను పెట్టేశాడట!
యుద్ధాల గురించి సాహిత్యంలో సాధారణంగా ప్రస్తావనలు వీరత్వాలు, భుజబలాల ప్రస్తావనల కేసి, లేదంటే కలిగే రక్తపాతం గురించి వుంటాయి. యుద్ధ ధర్మాలు, వీరారాధనలు వంటివి తప్ప యుద్ధ నిర్వహణలో హృదయం పెట్టి పని చేయగల నాయకుల ఆలోచనలు తూనిక వేసే అలవాటు మన సాహిత్యకారులకు చాలా అరుదు.
అమెరికా ఆదాయపుపన్ను గురించి ఈమాట పత్రికలో ఇంత వివరంగా చెప్పవలసిన అవసరం నిజంగా ఉన్నదా అన్నది (మీ) అసలు ప్రశ్న. ఎందుకంటే, ఈమాట శ్రద్ధగానో, అశ్రద్ధగానో చదివే పాఠకులు అమెరికాలో కన్నా తెలుగు భాష (ఏ యాస భాష అయితేనేం!) మాట్లాడే రాష్ట్రాలలోనే ఎక్కువమంది ఉన్నారు. వాళ్ళకెందుకీ గోల?
శ్రీనాథుని శాలివాహన సప్తశతి ఇంతవరకు లభింపలేదు. అందులోనివని కొన్ని కొన్ని పద్యాలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీనాథుని భీమేశ్వర పురాణములో ఒకటి, దామరాజు సోమన పేరుమీద ఒకటి పద్యాలు కనబడుతున్నాయి. ప్రసిద్ధ సాహిత్యవిమర్శకులు పేర్కొన్నవి మరికొన్ని ఉన్నాయి. వాటి తథ్యమిథ్యావివేచన కోసం ఈ పరిశీలనమంతా ఉద్దేశింపబడుతున్నది.
తెన్నేటి సూరిగారి చెంఘిజ్ ఖాన్ ఎంత ప్రాచుర్యం పొందిందో మాటల్లో చెప్పలేం. ఈ రచనని (సెప్టెంబరు 1998) రేడియో నాటకంగా శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు అనుసరించి ప్రసారం చేశారు. ఆ పుస్తకంలో వున్న వేగం, చదివేటప్పుడు కలిగే అనుభూతి ఈ నాటకం వినడంలో కూడా ఉన్నాయో లేదో మీరే చెప్పండి.
నటీమణి ఎస్. వరలక్ష్మితో శ్రీ ఈడుపుగంటి లక్ష్మణరావు చేసిన ముఖాముఖీ, ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రం సమర్పణ. ఇద్దరు ప్రసిద్ధులు పాల్గొన్న ఒక అపురూపమైన ముఖాముఖీ!
యావజ్జీవితం శాసన పరిశోధనకు అంకితమై ఆంధ్ర చరిత్ర రచనకు ఆకరాలు అందించిన పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారికి జయనామ సంవత్సర బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాము.
తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు కె. మమత ఎంపికైంది. ఎగసి పడే భావాలను, నిజాయితీగా – సున్నితమైన పదచిత్రాల్లో పట్టుకురావడంలో గల నేర్పు, కవిత్వానికి కట్టుబడి ఉండటం నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి.
!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!
ఆలన్ ట్యూరింగ్(23 జూన్ 1912 – 7 జూన్ 1954): కంప్యూటర్లు మన జీవితాలని ఊహించని విధంగా మార్చేశాయి. మన ఆలోచనలని, అనుభవాలని, మన విద్యవైద్యావైజ్ఞానిక విధానాలకు, పరిశోధనలకు మునుపెన్నడూ లేనంత ఊతం ఇచ్చాయి, మన ప్రస్తుత కాలాన్ని సాంకేతిక యుగం అని పిలుచుకునేంతగా కంప్యూటర్లు మానవాళిని ప్రభావితం చేశాయి. ఐతే, వీటి ఆవిర్భావానికి ట్యూరింగ్ మెషీన్ అని పిలవబడే ఒక ఆలోచన, ఒక యంత్రం కాని యంత్రం ఆధారం అని, అది ఎంత తేలికైన, అద్భుతమైన ఆలోచనో తెలుసుకున్నవారు విస్మయానికి గురి కాకతప్పదు. అందుకు ఆద్యుడైన ఆలన్ ట్యూరింగ్ గురించి కంప్యూటర్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు అనే శీర్షిక క్రింద కొడవళ్ళ హనుమంతరావు కొంత విరామం తరువాత రాసిన వైజ్ఞానిక వ్యాసం; వాణి నా రాణి అని ఠీవిగా చాటుకున్న పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతాన్ని రాసిన ఉదంతాన్ని చక్కటి కథగా మలచిన తిరుమల కృష్ణదేశికాచార్యుని పద్యనాటిక, ఈ సంచికలో.
ఇంకా: మానస, స్వాతికుమారి, నారాయణ, ఇంద్రాణిల కవితలు; శ్యామలాదేవి, సుబ్రహ్మణ్యం, ఆర్ శర్మ, సాయి బ్రహ్మానందం కథలు; మోహన రావు, కామేశ్వరరావు, మానసల వ్యాసం, శీర్షిక, సమీక్షలు; శ్రీనివాస్ సమర్పిస్తున్న రేడియో నాటకం, లలిత గీతాలు…
అబ్బాయిని కోడలు వినకుండా మందలించింది పార్వతమ్మ. ఓ వెఱ్ఱినవ్వు నవ్వి ఊరుకున్నాడు అమ్మూ. కోడలికి చెప్పాలంటే సంకోచపడింది ఆవిడ. గౌరీశంకరం గారు కూడా నోరు మెదపలేదు. అమ్మాయికి చెప్పే స్వతంత్రత లేదని అన్నారు. అమ్మాయి తల్లి తండ్రులు చెపితే బాగుంటుందేమో ప్రస్థుత పరిస్థితులలోయని పార్వతి దగ్గర అభిప్రాయపడ్డారు.
ఈ వూరికి ఆ వూరు ఎంత దూరమో ఆ వూరికి ఈ వూరూ అంతే దూరం అన్నట్టు… మన తెలుగు దేశం నడిబొడ్డులో పుట్టి పెరిగిన ఈ అమ్మాయిలు ఇంత వెస్ట్రనైజ్డ్గా వున్నారేమిటీ అని నేను ఆశ్చర్య పోయానా, మరీ వాళ్ళేమో నా గద్వాల్ చీర, నా జుట్టుముడి చూసి ఈ దేశంలో నలబై ఏళ్ళుగా వుంటున్నానని, నేను డాక్టర్ నని విని నోళ్ళు తెరిచారు!
ముని గుడిసె లోంచి బయటకొచ్చి మిఖాయిల్ని తీసుకెళ్ళి ఓ చెట్టును పడగొట్టించేక దాన్ని మూడు ముక్కలుగా కాల్పించేడు నిప్పుల మీద. అవి బొగ్గుముక్కల్లాగా అయ్యేక చెప్పేడు ముని, “ఇవి సగం లోతుగా ఇక్కడ పాతిపెట్టు. రోజూ నోటితో వీటిని తడుపుతూ ఉండు. నీకిదే పని. ఎప్పుడైతే ఈ మూడూ పూర్తిగా ఆకులు వేసి మళ్ళీ మొలవడం మొదలు పెడతాయో అప్పుడు నీకు పాప ప్రక్షాళన అయినట్టు.”
నాకు డెబ్బీతో పరిచయం విచిత్రంగా జరిగింది. నేను బారిస్టాగా పనిలో చేరిన కొత్తలో కస్టమర్ల ఆర్డర్లు తీసుకోవడం కాస్త కష్టంగా ఉండేది. అలవాటు లేని పని. పైగా వచ్చే ప్రతీ వాడూ ఒక్కో కాంబినేషన్లో కాఫీ ఆర్డర్ చేస్తాడు. సాధారణంగా కాఫీ గ్లాసు మీద ఆర్డరు రాస్తారు. దాన్ని బట్టే కాఫీ చేస్తారు.
నిజానికి ప్రకృతి వర్ణనలకు సంబంధించి చాలా మంది పాఠకులకు ఉండే ఇబ్బంది కవి దృష్టితో లోకాన్ని చూడలేకపోవడం; కవి వర్ణనలను అతిశయోక్తులని నమ్మడం. ఈ వైయక్తికమైన అనుభవాలని సార్వజనీనం చేసి ఒప్పింప జేసుకోవడానికి కవిలో నిజాయితీతో పాటు, పాఠకులను చనువుగా తన వెంట రమ్మని పిలవగల నేర్పు కూడా ఉండాలి.
మొత్తం సృష్టిలో ఒకానొక జీవిగా మన మానవజాతి ఆయుఃప్రమాణమెంత? దాన్ని మనం ఎంతవరకూ సద్వినియోగం చేసుకుంటున్నాం? బుద్ధిజీవులమైన మనం ఆ బుద్ధిని దేనికోసం ఉపయోగిస్తున్నాం? జారిపోయే కాలం విలువని తెలుసుకోనీయకుండా ఏయే ఉన్మాదాలు మన బుద్ధిని ఆక్రమించేస్తున్నాయి? మతోన్మాదం, మదోన్మాదం, ధనోన్మాదం, అధికారోన్మాదం – ఎన్నెన్నో ఉన్మాదాలు!
క్రిందటి రాత్రి వఱకును గావ్యమునకు పినవీరభద్రుఁడు శ్రీకారము చుట్టలేదని రాజునకును, సభికు లకును దెలియును. ఒకరాత్రిలో నాశువుగ నైనను అంతటి మహాకావ్యమును వ్రాయుట దుర్లభ మని సభికు లభియోగము దెచ్చిరఁట. అప్పుడు పినవీరభద్రకవి ‘వాణి నారాణి’ యనియు, తన కది యసా ధ్యము కాదనియు వారికి బదులు చెప్పెనఁట!