దులిపేం
చొక్కాల మీది
గండు చీమల్ని
కంగారు గాలిని
తోసేం
పొద్దు పచ్చిక
మేసేం.
Category Archive: సంచికలు
బోడిగుండంత సుఖం లేదని తెలిసినా
జులపాల జుత్తు పెంచుకున్న వాణ్ణి.
ఊరుకున్నంత ఉత్తమం లేదని తెలిసినా
కంద దురదా కత్తిపీట దురదా
కలిపి కళ్ళకద్దుకుని
నాలుకకు రాసుకున్న వాణ్ణి…
ఒకసారి వెళ్ళి ఆ దాక్కున్న నదిలో
మునకేసివద్దామా?
ఇక్కడ ఎవరికి ఎవరు ఏమైయ్యారని
మురికి అవయవాల మధ్య మలినమైన
బ్రతుకు వివరాలన్నీ ఏ భాగీరథిలో
కలిశాయని అడుగుదాం.
ఇక్కడ ఒకడుగు
అక్కడ రెండడుగులు
నేలమీద నేను
నేలా నింగీ తను
పరుగుల పందెంరెక్కల్లా చేతులు చాచి
తనకోసం పరుగెడుతూ నేను.
గణితంలో ప్రావీణ్యం లేని వారు కూడ, గణితపు లోతులని తరచి చూసే సామర్ధ్యం లేని వారు కూడ, ఈ ప్రధాన సంఖ్యల అందచందాలని చవి చూడకపోతే జీవితంలో ఒక వెలితి మిగిలిపోయినట్లే. అదృష్టవశాత్తు ఈ ప్రధాన సంఖ్యలలోని అందచందాలని చవి చూసి ఆనందించడానికి గణితం లోతుల్లోకి అతిగా వెళ్ళనక్కరలేదు.
ఇది భారతీయ సాహిత్యచరిత్రాధ్యేతలు ఎన్నడూ కనీ వినీ యెరుగని ఒక అపూర్వమైన, నిరుపమానమైన మహాకావ్యం. నిజం చెప్పాలంటే, ఇటువంటి కావ్యం భారతీయభాషలలో మరొకటి లేదు. అంతే కాదు. ఆంధ్రభాషలో పాండిత్యం కోసం కావ్యనాటకసాహిత్యాలలోని వ్యాకరణ ఛందోలంకార శాస్త్రాధ్యయనం మొదలుపెట్టిన విద్యార్థులకు, పాఠకులకు శబ్దార్థరచనారహస్యాన్ని ఎత్తిచూపే వస్తువిమర్శ కలిగిన కావ్యశిక్షాగ్రంథం!
ప్రబంధరాజంలో వేంకటకవి కావించిన సంస్కృత శ్లోకానువాదాలను గురించి ఇంకా లోతుగా పరిశోధింపవలసి ఉన్నది. వేంకటకవి ఆ పద్యాన్ని ఏదో సంస్కృతశ్లోకానికి అనువాదంగా కాక, తన ముందున్న ఏదో తెలుగు పద్యాన్నే పర్యాయపదాలతో మార్చి చెప్పివుంటాడనే నమ్మకం వల్ల అలా గుర్తుపట్టిన కొన్నింటిలో ముఖ్యమైనవాటిని ఈ 2వ ప్రకరణంలో వివరిస్తాను.
స్వరార్చనం కల
రాగ సుధా రసార్ణవం
చెన్నారెడు చెవి తేనియలై కీర్తనలూ
అనశ్వరం
ఎందరో హేమాహేమీలు: మల్లిక్, ఓలేటి, ఎన్.సిహెచ్.వి. జగన్నాథాచార్యులు, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది సూరిబాబు, … పాల్గొన్న ఈ చక్కటి సంగీతనాటిక విజయవాడ స్టేషన్లో, 1970ల చివర్లోనో, 1980ల ప్రారంభంలోనో, ప్రసారితమైంది.
కోనసీమని తలచుకుంటే ఇప్పటికీ కొబ్బరి తోటలు, కాలువలు, పచ్చని పొలాలు – ఇవే గుర్తొస్తాయి. ఈ సీమ నుంచి బయటపడి ఇంగ్లీషు చదువులు చదువుకుని పైకొచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నా కానీ, వేదపారాయణులు, నిత్యాగ్నిహోత్రులు అయిన అతి కొద్దిమంది బ్రాహ్మణులు ఈ ప్రాంతంలో ఇంకా వున్నారు. భమిడిపాటి వారు, బులుసు వారు, దువ్వూరి వారు, పుల్లెల వారు, ఇలా. వేదపఠన పాఠనాన్ని , యజ్ఞయాగాదులని శాస్త్రోక్తంగా నిర్వహించుకుంటూ ఈ కుటుంబాల వాళ్ళు మూడువేల ఏడువందల సంవత్సరాల వైదిక సంప్రదాయాన్ని నిలబెట్టారు. ఇది మానవ జాతి చరిత్రలోనే అపూర్వమైన విషయం. వీరిని క్షుణ్ణంగా పరిశీలించి సూక్ష్మమైన వివరాలతో సహా, విస్కాన్సిన్ విశ్వవిద్యాలయపు ఆచార్యుడు డేవిడ్ నైప్ (David M. Knipe) Vedic voices – Intimate narratives of a living Andhra tradition (2015) అనే ఒక పుస్తకం రాశారు. కేరళ నంబూద్రి బ్రాహ్మణుల అతిరాత్ర అగ్నిచయన క్రతువుని ఫ్రిట్స్ స్టాల్ (Frits Staal)వివరంగా రెండు పుస్తకాలు, ఒక చలనచిత్రంగా భద్రపరిచాడు. ఇప్పటికీ వైదిక సంప్రదాయాన్ని గురించి పాఠాలు చెప్పే తరగతుల్లో వీటిని వాడుతూ వుంటారు. కానీ, వైదిక బ్రాహ్మణులు చేసే యజ్ఞాలకి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి గుర్తింపు ఇప్పటి దాకా లేదు. నైప్ పరిశోధన ద్వారా ఆ సంప్రదాయాల నిర్వికార ప్రాచీనత గురించి వివరంగా తెలుస్తుంది. వైదిక సంప్రదాయాన్ని గురించి ఇతర ఆధారాలతో రాసిన పుస్తకాలు చాలా వున్నాయి కానీ ఇప్పటికీ వున్న వైదిక కుటుంబాల దైనందిక జీవితాన్ని పరిశీలించి వివరంగా రాసిన పుస్తకం ఇదొక్కటే.
డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తి (1944 – 2015): నరసింహ మూర్తిగారు చక్కటి సాహిత్య విమర్శకుడు, గొప్ప వక్త కూడా. ఇతర భారతీయ భాషల ఆధునిక నాటకాలతో పోల్చి, మూర్తిగారు రాసిన కన్యాశుల్కం – తులనాత్మక పరిశీలన అన్న బృహద్గ్రంథం వారికెంతో పేరు తెచ్చింది. ఔచిత్యప్రస్థానం, కథాశిల్పి చాసో, కవిత్వదర్శనం మొదలైన పుస్తకాలు ప్రచురించారు. రబీంద్రనాథ్ టాగోర్ నేషనల్ ఫెలోషిప్ అందుకున్న ఏకైక తెలుగువాడు, ఇటీవలే పరమపదించిన ఈ సాహితీవేత్తకు ఈమాట శ్రద్ధాంజలులు.
తెలుగు నేర్చుకోవడం మూలంగా తెలుగులో వున్న పుస్తకాలు చదవడం మూలంగా ప్రపంచ విజ్ఞానాన్ని పెంచగలమని మన దేశపు విజ్ఞానులు ప్రపంచానికి ప్రదర్శించగలరా? నువ్వు ఏ భాష వాడివైనా తెలుగులో రాసిన పుస్తకాలు చదవకపోతే నీ విజ్ఞానానికి ఈ రకంగా లోపం వస్తుంది, అని మనం చెప్పగలిగిన రోజున, ఆ మాట ప్రపంచం లోని విజ్ఞానులు విన్న రోజున, వాళ్ళు తెలుగు పుస్తకాలు చదివి అందువల్ల గ్రహించిన విజ్ఞానాన్ని ప్రపంచ విజ్ఞానంలో భాగం చేసిన రోజున — తెలుగు ప్రపంచ భాష అవుతుంది.
విడవబడ్డదే తడవుగా మిలియన్ల సంఖ్యలో వాళ్ళు తమ గమ్యస్థానం వైపు పరుగెత్తడం మొదలు పెడతారు. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి వాళ్ళ వేగాన్ని నిరోధించదు. అదృశ్య శక్తేదో వాళ్ళని ఆ గమ్యం వైపు నడుపుతూంటుంది. గమ్యం దొరక్క శక్తి ఉడిగిన తరువాత రాలిపోవడం వాళ్ళల్లో కొంతమందికి జరిగేదే. గమ్యం దొరికిన వాళ్ళకి కూడా అదొక దుర్భేద్యమైన కోట. దాన్ని ముట్టడించిన వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రం ఆ కోట రక్షణ కవచాలని ఛేదించి లోపలికి ప్రవేశించ గలుగుతారు. అయితే, ప్రవేశించిన తరువాత తమ అస్థిత్వాన్ని కోల్పోతారు.
ఆ రోజు సుజాత ఇద్దరు పిల్లల్ని సూరిగాడికి కాపలాగా పెట్టింది. వాళ్ళు చాలా ఉత్సాహంతో పెద్ద టీచర్ మాటలు పాటించారు. ఒంటేలుకు కూడా ఒంటరిగా వదలకుండా వాడి వెంటే వున్నారు. రెండోరోజుకల్లా సూరిగాడికి చాలా కడుపునొప్పి వచ్చింది. ఇంట్లోనే ఉండిపోయాడు. మూడో రోజు ఉదయం కూడా అలానే ఉందన్నాడు. వాణ్ణి బతిమాలి పడుకోబెట్టి, వాళ్ళ అమ్మ గబాగబా పని ముగించుకునొచ్చేసరికల్లా పత్తా లేడు. నాలుగో రోజు మళ్ళీ రాఘవులు తెచ్చి వదిలాడు. “అమ్మ! జర బద్రం. పోరగాడు మల్ల ఉరికిబోతడు,” అంటూ.
మధ్యాహ్నం భోజనం అయ్యేక అంగట్లో ఖాళీ ఉన్నప్పుడు వచ్చారు తండ్రీ త్రివక్రా – సుదాముణ్ణి చూడ్డానికి. వచ్చిన వాళ్ళని కూర్చోపెట్టి అడిగేడు. “ఎందుకు మీరీ పిల్లని అలా హింసిస్తున్నారు రోజూ? ఈ శరీరం, ఈ అవకరాలు అన్నీ భగవంతుడిచ్చినవి. మనం ఏదో జన్మలో చేసుకున్న కర్మ వల్ల ఇలాంటి మానవ జీవితం వచ్చింది. ఇప్పుడు సంతోషంగా ఆ మిగిలిపోయిన కర్మ మౌనంగా అనుభవించేస్తే మేలు. ఎవరూ కూడా అవకరాలు కావాలని కొని తెచ్చుకోరు కద?”
హాల్లో అత్తయ్యా మావయ్యా నల్ల బల్ల ఉయ్యాల మీద కూర్చున్నారు. ఒకరెదురుగా ఒకరు. ఆవిడ సన్నజాజుల మాల కడుతోంది. మావయ్య పూల మొగ్గల్ని జోడించి అందిస్తున్నాడు. చాలా దీక్షగా. ఎంత శ్రద్ధ మావయ్యకి. రోజూ మేడెక్కి పూలు కోసుకొస్తాడు. ఎండా కాలాల్లో మల్లెపూలు, కనకాంబరాలు పది మరువం రెమ్మలూ. ఇదీ ఆ సముద్రంలా ఎప్పుడొచ్చినా మనసు నిండా నిండిపోయే చిత్రమే.
అరూబా, ఆ కరీబియన్ ద్వీపం ఎంత అందమైంది. వారి హోటెల్ రూమ్ లోనుండి అనంతంగా కనిపిస్తున్న నియాన్ ఆకుపచ్చ, ప్రష్యన్ నీలం కలబోతల సముద్రం నిసికి మానసిక ప్రశాంతతనూ, విశాలతనూ, లోతునూ కలిగిస్తే, శ్యాంలో అవి ఉద్రిక్తతనూ, పొంగే పురుషత్వాన్ని సంతరించాయి. కామకేళిలో ఆమె శరీరపు స్పర్శలు, తనను హత్తుకునే తీరు, ఆమెను ముద్దాడినప్పుడు తిరుగు కౌగిలింతలు, అతనికి ఎంతో ఇష్టం. వారికి ఇతరుల గురించిన ఆలోచనలూ, వ్యగ్రతలూ నశించాయి.
రాయుడు ఉత్త వాగుడుకాయ. బుర్రలో పుట్టే ఆలోచనల ప్రవాహం కంటె ఎక్కువ జోరుగా మాట్లాడడంలో అతనికి అతనే సాటి. అప్పుడప్పుడొక మోతాదు అశ్లీలాలు దొర్లిస్తూ మాట్లాడే తత్త్వమేమో, ‘కంట్రీ క్లబ్బు’లో అతను ఎక్కడ ఉంటే అక్కడ పదిమంది తేనె చుట్టూ చేరే ఈగల్లా చేరి కేరింతాలు కొడుతూ ఉంటారు. నాయుడికి రాయుడంటే చిరాకు. ముభావంగా ముడుచుకు కూర్చునే నాయుడు చుట్టూ వందిమాగధులు ఎవ్వరూ చేరరు. అందుకని రాయుడంటే అసూయ పడుతున్నాడో ఏమో! మనకి తెలియదు.
సరమాగో ప్రారంభంలో రాస్తాడు: “భూతకాలం రాళ్ళు రప్పలతో కప్పబడ్డ విశాలమైన భూమి. చాలామంది జోరుగా కారుల్లో ఏమీ పట్టించుకోకండా పోతారు, ఆ రాళ్ళమీద! కొద్దిమంది మాత్రం ఓపిగ్గా ఒక్కొక్క రాయీ ఎత్తి ఆ రాయి క్రింద ఏమున్నదో అని జాగ్రత్తగా చూస్తారు. ఒక్కోసారి తేళ్ళు, మరొక్క సారి జెర్రులు, గొంగళీ పురుగులూ, గమ్మనకండా కూచున్న గూటిపురుగులూ కనిపిస్తాయి. అసాధ్యం కాదు గాని, ఒకే ఒక్కసారైనా సరే, ఒక ఏనుగు కనిపించవచ్చు…”
పురాణాల గురించి వాళ్ళు చేసే వ్యాఖ్యానాలూ ప్రవచనాలూ ప్రసంగాలూ, ‘కలలో వార్తలు విప్పిచెప్పడం’ వంటిదట. ఇది మరొక ఆశ్చర్యమైన పోలిక. అందులోని స్వారస్యం పాఠకులే గ్రహింతురు గాక! అలా పురాణార్థాలను వివరించే సన్యాసులకు సైతం నిజంగా మోక్షం అంటే ఏమిటో తెలియదబ్బాయ్ అన్నాడు. మోక్షాన్ని కౌగిలించుకోవడం అనేది చింతకాయ కజ్జాయం వంటిదట.