తీర్థంలో రంగరించి పోసిన మత్తుని
ఇంకో మతం మీద సందేహాన్ని పిడిగుద్దుని
తిరగబడ్డ చక్రాలకి వేళ్ళాడిన మాంసం ముద్దని
ఉపగ్రహం చూపించిన భూచక్రాన్ని
విరిగిపడ్డ అలని – పెనుగాలికి ఎగిరిపోయిన రేకుని

మీరు చెప్పమంటే, నేను మార్లాతో మాట్లాడి ఆమె తొందరపడి కేస్ ఫైలు చెయ్యకుండా ఉండేట్లు చూస్తాను. నేను చెప్పినట్లు ఆమె చెయ్యక్కర్లేదు. అసలు నేను అలా చెప్పకూడదు కూడా. నా ఉద్దేశంలో ఆమె పనిలో పొరపాటు లేదని. ఈ కాగితాలు చూడండి. ఆమెకు తన డెస్కు దగ్గరే ఉండి, హాస్పిటల్ కంప్యూటర్ మీద ఎడిషనల్ పని చేసుకోటానికి ఆమెకు పర్మిషన్ ఇవ్వబడింది. ఇవిగో అంతకు ముందున్న చీఫ్, ఒక వైస్ ప్రెసిడెంటు సంతకాలు పెట్టిన కాగితాలు.

కథాకాలాన్ని అనుసరించి ఈ కథల్లో యుద్ధ వాతావరణమూ, యుద్ధం మీద చర్చా ఉన్నాయి. రచయితకు ఉన్న అపార విజ్ఞానం ఈ కథల్లో చోటు చేసుకున్న సంఘటనల మీద, అంతర్జాతీయ పరిణామాల మీద ఆయన వ్యాఖ్యానం తేటతెల్లం చేస్తుంది. రచయిత రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటులో పాల్గొని ఉండటం ఆయన నేవీ కథలకు నేపథ్యం అని స్పష్టమవుతుంది.

ఆ అమ్మాయి ద్వారాల పక్కన ఉన్న ఆ డిజైన్లను తన బొమ్మల పుస్తకంలో నకలు దింపుకోవాలని ప్రయత్నిస్తుంది. చూసి వాటిని గీయడం సరిగా కుదరకపోతే రబ్బరు పెట్టి తుడిచి మళ్ళీ పదే పదే గీయ ప్రయత్నించడం, ఇబ్బంది పడ్డం చూస్తున్నాను. పెన్సిల్ ముక్క ఒక కోణం నుండి మరో కోణానికి తిరుగుతూ ఆగుతూ సుతారంగా మెలికలు పోతూ సాగుతుంది గీత.

అవధాని తండ్రి యెడల భయభక్తులతో, తల్లి చాటున పెరిగిన బిడ్డ. మారుతున్న కాలానికి ఎదురీదే ధైర్యం లేక శాస్త్రానికి పిలకని ఉండనిచ్చి, కాలానికి అనుగుణంగా క్రాఫింగ్ చేయించుకున్నాడు. పాఠశాలలో లఘు సిద్ధాంత కౌముది, రఘువంశం అధ్యయనం చేసేడు. సహాధ్యాయులు చాలామంది బ్రాహ్మణేతరులు కావడంతో పౌరోహిత్యానికి కాని, అర్చకత్వానికి కానీ బ్రాహ్మణులకి ఉంటూ వచ్చిన గిరాకీ ఇటుపైన ఉండదేమో అనే భయం పట్టుకుంది అవధానికి.

ఇది జాజుల జావళి. కాదు. అత్తరులు అద్దిన వెన్నెల ప్రవాహం. కోనేట్లో స్నానమాడి గుడిమెట్లు ఎక్కి వచ్చిన పిల్లగాలి అమృతస్పర్శ. ఏకాంతంలో మనతో మనం చేసుకునే రహస్య సంభాషణ. కాగితం వరకు రాకుండానే మనసులో ఇంకిపోయిన అనేకానేక అద్భుత భావసంచయం. ‘కవిత్వం ఒక ఆల్కెమీ’ అంటాడు తిలక్. ఆ రహస్యం నిషిగంధకు పట్టుబడింది.

క్రితం సంచికలోని గడినుడి-66కి మొదటి ఇరవై రోజుల్లో పద్నాలుగు మంది నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-66 సమాధానాలు.

అడ్డం 18 నిలువుకి ఇష్టమైన పండు (4) సమాధానం: శుకప్రియ వర్షానికి ఒకమారు వచ్చే మొదటి పండుగ (3) సమాధానం: ఉగాది ఒక నక్షత్రం […]

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నింటిలోనూ వార్తాపత్రికలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అవి ప్రభుత్వాన్ని నిలదీసి విమర్శించే అక్షరదళాలు. అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించే ప్రజాగళాలు. అందుకే దృశ్యమాధ్యమాలు ఎంత ప్రాచుర్యంలోకి వచ్చినా వార్తాపత్రికల ప్రాధాన్యం ఒకింత తగ్గిందేమో తప్ప పూర్తిగా సమసిపోలేదు. నిజానికి విజువల్ మీడియా కూడా తమ కథనాలకోసం పత్రికా విలేకరుల వార్తలపైన, వారి పరిశోధనాత్మక పాత్రికేయత మీదే ఆధారపడుతుంది. అందువల్ల వార్తాపత్రికలు తమ ఉనికినీ ప్రాభవాన్ని పోగొట్టుకోవడమన్న మాట లేదు. సమస్యల్లా, మిగతా మీడియాతో పోటీపడే క్రమంలో పత్రికలు తమ ప్రమాణాలను దిగజార్చుకుంటూ వారి మూసల్లోకి ఒదిగే ప్రయత్నం చెయ్యడంతోనే. వార్తాకథనం రాయడం కష్టం. దానికి తర్ఫీదు కావాలి, నేర్పు కావాలి. వార్తావాక్యం సూటిగా, సరళంగా ఉండాలి. అందులో సత్యం స్పష్టంగా నిష్పక్షపాతంగా కనిపించాలి. శీర్షిక క్లుప్తంగా వార్తాకథనాన్ని పరిచయం చెయ్యాలి. పాఠకుడిని తమ అలంకారాలతో ప్రభావితం చెయ్యడం వార్తల పని కాదు. వార్తావాక్యం న్యాయాధికారి కాదు. న్యాయనిర్ణేత కాదు. సత్యావిష్కరణకు పనిముట్టుగా మాత్రమే మిగలాల్సిన వార్త సంఘటన పట్ల తీర్పు చెప్పకూడదు. ఇట్లాంటి లక్షణాలున్న వార్తలు ప్రచురించే పత్రిక కోసం నేడు తెలుగునాట వెదుకులాట అవసరమవుతోంది. వాడుకభాషలో కూడా మాట్లాడే భాష వేరు, రాసే భాష వేరు. ప్రపంచంలోని అన్ని భాషలలోనూ వాడుక భాషకు సంబంధించిన యాసలు ఎన్నివున్నా రాసే భాష కొంత భిన్నంగా ఉంటుంది. ఏ ప్రాంతీయభాష/యాస వాడినా వాక్యం వార్తావాక్యంగా ఉండాలి. ప్రామాణికత ఆ వాక్యలక్షణం ద్వారానే వస్తుంది. ఆ ప్రమాణాలను అందుకునేందుకు నిరంతర కృషి కొనసాగేది కనుకే, నిన్నామొన్నటి దాకా తెలుగునాట వాక్యరచనకు కథలనూ కవితలనూ నవలలనూ కాక వార్తపత్రికల భాషను, అక్కడి వాక్య లక్షణాలను ప్రామాణికంగా తీసుకునేవారు. కాని, వార్తావాక్యం అంటే ఏమిటో కూడా సమకాలీన విలేకరులకు అర్థం అవుతున్న దాఖలా లేదు. వర్ణనలు, అతిశయోక్తులు, ఆరోపణలు, అభిప్రాయాలు, చవుకబారు శీర్షికలు- వార్తాపత్రికల్లో ఇప్పుడున్నవన్నీ ఇవే. వార్తాపత్రికల భాషకు, పల్ప్ వెబ్‌సైట్ల భాషకూ తేడా కనపడటం లేదు. కథలు వార్తలుగా, వార్తలు కథలుగా, ఎవరు కథకులో ఎవరు విలేకరులో తేడా కనిపించని సమయంలో, సమాజంలో ఉన్నాం. సినిమాల ద్వారా ప్రాచుర్యానికి నోచుకునే కొన్ని పదబంధాలు జనాల నోళ్ళల్లో నానుతాయి. వీధిభాషలో ప్రజలు రకరకాల ఊతపదాలు, వ్యక్తీకరణలు వాడతారు. అంతమాత్రాన వాటికి ప్రామాణికత రాదు. అలాంటి భాషను తమ వార్తల్లోను, శీర్షికల్లోను వాడే వార్తాపత్రికల స్థాయి ఎలాంటిది? ఈ పాత్రికేయులకు ఇలాంటి భాషను ఏ విశ్వవిద్యాలయాల జర్నలిజం కోర్సులు నేర్పుతున్నాయి? ఆయా పత్రికల సంపాదకులు ఇలాంటి వాక్యాన్ని ఎలా అంగీకరిస్తున్నారు? సృజనాత్మకత పేరిట యథేచ్ఛగా వెలువడుతున్న వార్తలూ శీర్షికల్లోని చవకబారుతనాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? చివరకు ఘోరప్రమాదాలను, అత్యంత దయనీయం, దారుణం అయిన సంఘటనలను కూడా ప్రాసలు, పంచ్‌లైన్ల లౌల్యంలో బాధ్యతారహితంగా అమానవీయంగా ఎలా రాయగలుగుతున్నారు? వార్తాపత్రికలే రాజకీయపార్టీలకు తొత్తులై వారి బాకాలుగా, వారికి భజంత్రీలుగా మారి తమ స్వతంత్ర ఉనికిని పోగొట్టుకున్న ఈ కాలంలో, ప్రతిరోజూ నిజాలు కళ్ళెదుటే దారుణంగా హత్య కాబడుతుంటే, భాష గురించా తమ దిగులు అని మీరు నిలదీయవచ్చు. అవును, అదీ నిజమే. కాని, వార్త ఉండవలసినట్టు ఉంటే కనీసం అది హత్య అని అనిపించకుండా ఉంటుంది. వార్తావాక్యానికి ఉండాల్సిన సర్జికల్ ప్రిసిషన్ అదే కదా.

ఈ కథ – సృష్టికి, సృష్టికర్తకూ ఉన్న సంబంధం గురించి; మానవీయతకు, అమానవీయతకూ ఉన్న సంబంధం గురించి; వికారానికి, అందానికీ ఉన్న సంబంధం గురించి; మేధకు, ఉద్వేగానికీ ఉన్న సంబంధం గురించి; శాస్త్రజ్ఞానానికి, యథార్థానికీ ఉన్న సంబంధం గురించి; ప్రకృతికి, మనిషికీ ఉన్న సంబంధం గురించి సరికొత్త వ్యాఖ్యానం.

సాలిపురుగు శ్రద్ధగా తన పట్టుని అల్లుతుందన్నమాట. ఎంత సన్నదారమో. దాని ఒంటినుంచి వొస్తుందా దారం మరి! అర్థచంద్రాకారాల దారాలని మజ్జి దారానికి వేళ్ళాడబెడుతూ చకచకా అటోసారి ఇటోసారీ అతికేస్తూ అల్లేస్తుంది! దాని పనివాడితనాన్ని అమ్మ పనివాడితనాన్ని మెచ్చుకున్నట్టు మెచ్చుకోవలిసిందే!

జిబ్రాల్టర్ జలసంధి దక్షిణ తటాన, మధ్యధరా సముద్రం అట్లాంటిక్ మహాసముద్రాన్ని పలకరించే చోట కాపలా సిపాయిలా నిలచి ఉండే నగరం టాంజియర్. ఆ జలసంధి ఎంతో సన్నపాటిది. ఒకచోట భూభాగాల మధ్య దూరం పదమూడు కిలోమీటర్లే. విరామమంటూ లేకుండా కార్యకలాపాలు సాగే సముద్ర మార్గాలలో జిబ్రాల్టర్ జలసంధి ప్రముఖమైనది.

చిరాకు తగ్గని గణపతమ్మ ముఖాన్ని చూస్తూ కొన్ని క్షణాలు నిలబడ్డవాడు ఏమనుకున్నాడో, హఠాత్తుగా పరిగెత్తుకెళ్ళి గణపతమ్మ లావుపాటి శరీరాన్ని గట్టిగా హత్తుకున్నాడు. బియ్యం నానబెట్టిన గిన్నెని కోపంగా వంటగట్టు మీద పెట్టి, పెంటను తొక్కిన దానిలా ఛీ! అని పక్కకు జరిగి నిలబడింది గణపతమ్మ.

నాకన్నా అయిదున్నర సంవత్సరాలు పెద్ద అయిన నా పెద్దన్నకు అప్పటికే, అంటే 1962 ప్రాంతాలకు, తెలుగులో పద్యవిద్య పట్టుబడింది. ఆంధ్రదేశంలో నారాయణాచార్యుల వంటి మహాత్ములకు బాగా దగ్గరగా ఉన్నవారిని కాస్త మినహాయిస్తే, ఈమాత్రం ఆమాత్రం తెలుగు పద్యవిద్యలో ప్రవేశం ఉన్నవాళ్ళకి సన్నిధిలోనో, ఏకలవ్యంగానో విశ్వనాథే గురువు. ఇంత అయినా కాలేజీకి రాగానే శ్రీశ్రీ చక్రారాధన అలవడింది.

మాకు ఆకలిగా ఉంది, తను ఏమేమి తెచ్చి ఉంటాడా అని అత్రుతగా చూస్తున్నాం, పెట్టినదాన్ని పెట్టినట్లు గుటుక్కుమనిపించాలని తొందర కూడా పడుతున్నాం. వాసు ఆ భోజనపు పొట్లాన్ని జాగ్రత్తగా విప్పాడు. అందులో ఉన్నది చూసి నేనూ నా మిత్రుడు నిర్ఘాంతపోయాం, నివ్వెరపోయాం, ఖంగుతిన్నాం, నిశ్చేష్టులమయ్యాం!

పదునైన దృశ్యాలు
పాముల్లా పడగవిప్పి
బుసకొడుతున్న గగుర్పాటు
వికృత శబ్దాలకు
గుండెనదిలో పెరుగుతున్న
భయపు నీటిమట్టం

కాళ్ళు భూమిలో పాతేసినట్టు కదలడానికి మొరాయించాయి. చిమన్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అతడు చెప్పింది కరెక్టే. ఇక్కడ నుంచి లేచి వెళ్ళాలి నేను. ఆమె ఏ క్షణంలో ఏం చేస్తుందో? బాగ్ లోంచి కత్తి తీసి పొడిస్తే మాత్రం ఎవరు చూడొచ్చారు? అసలు ఆమె ఒక చేత్తో తోస్తే చాలు నేను కుప్పకూలిపోతాను. అంత బలంగా ఉన్నాయి ఆమె చేతులు. కొంపదీసి కరుడుగట్టిన నేరస్తుడెవరైనా ఆ బుర్ఖాలో లేడు కదా? వెన్నులో చలి పుట్టింది.

దామెర్ల రామారావు జీవితకాలంలోనే ఇంతటి ప్రశంసలను అందుకున్నారు. కానీ ఈరోజు భారతదేశంలో రామారావును ఎరిగినవారు ఎవరూ లేరనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అరకొర జ్ఞాపకాలే మిగిలాయి. ఆంధ్రదేశ వీరగణంలో అస్పష్టమూర్తిగానే రామారావు నిలిచారు. జాతీయ ఆధునిక చిత్రకళ గ్యాలరీలో దామెర్ల చిత్రాలు మచ్చుకు ఒక్కటైనా కనిపించవు.

మధ్యాహ్నం, అతడికి తను వండిన ఇండియన్ డిష్, రొట్టె మడుపులో, స్వయంగా నోటి కందిస్తే, గోధుమ కనుపాపల, ఆశ్చర్యపు అరక్షణపు నిస్టాగ్మస్. ఆ పై ప్రతి బైట్‍కూ, సంభోగ పరాకాష్ఠాసమయపు కూజితాలు వెలువడ్డాయ్ అతని గొంతులోంచి. ‘ఎవ్రి‌ధింగ్ సీమ్డ్ ఎక్జాట్‍లీ రైట్, ఒళ్ళంతా కోన్యాక్‍లా వెచ్చగా జ్వలించింది.’ అన్నాడు. భోజనానంతర పునర్భవ కామ వాంఛలు, భోగినీ దండకాలకే ఉచితాలు.