ఇది
మిణుగురు గుండెలోని
ఉదయపు వేడీ
రాత్రుల చీకటీ
ఊగే చెట్లూ, పారే వ్యర్ధాలూ
ఊపిరాడనివ్వని కమరుతో పాటు
తనకంటూ దాచుకున్న గుప్పెడు గాలి.

మానవ సమాజం ఎప్పటికీ ఏకసమూహం కాదు, కాలేదు. మానవ ఆవిర్భావం నుండి అదెప్పుడూ కుదురులు కుదురులుగా సమూహ ప్రత్యేకతలతో అస్థిత్వాలతో బతకడానికే ప్రయత్నించింది. నాగరికసమాజాలు ఏర్పడే క్రమంలో ఎవరి సామర్థ్యాల మేరకు వారు ఎక్కువ తక్కువలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. చేస్తూనే ఉంటారు. ఆధిక్యత, ఆధిపత్య భావన అనేవి మానవ రక్తంలో కలిసిపోయిన జంతుభావనలు.

సుమారు నూటతొంబై ఏళ్ళ తరువాత అంతకు మించి ఎన్నో రెట్ల శక్తితో వస్తోంది శాండీ! తీవ్రంగా వచ్చి తాకే హరికేన్ వేగానికి, హడ్సన్ నది అల్లకల్లోలమై – నగర వీధులు, రాకపోకలని సుగమం చేసే టనల్స్, సబ్‌వేలు జలమయమై పోయి, కరెంటు పోయి రెండు నగరాలూ ఊహకి అందనంత భారీనష్టం ఎదుర్కోవలసి రావచ్చని వాతావరణ నిపుణుల అంచనాలు చెపుతున్నాయి. కానీ ఈ విషయాలు దూరాన వున్న త్యాగికి చెప్పి అనవసరపు ఆందోళన కలిగించడం ఎందుకు?

వాటితోబాటే మోసాలు, కుట్రలు, కక్షలు, కార్పణ్యాలు కూడా. నోట్లో తాంబూలం వేసుకుని పెదిమలు పక్కకు తిప్పి, చాడీ చెప్పారంటే ఆ శివుడైనా పార్వతిని పక్కకు పెట్టేయగలడంటే చూసుకో! వాళ్ళెవరూ కవులూ కారు, వాళ్ళ మాటల్లో ధర్మం అనే అఱం లేదు కాబట్టి సరిపోయింది. అధర్మపాలనో, ప్రజలకు సంక్షోభం కలిగించే పనులకో తలపడిన రాజులమీద కవులు తిరగబడి ‘అఱం పాడటం’ అనే ధర్మాన్ని తమ పద్యాల్లో వస్తువుగా పెట్టి పాడితే, ఆ రాజు వంశమే నిర్మూలం అయిపోయేది!

బజాట్లో ఊతకర్ర నేల పొడుస్తూ
అడుగులు లెక్కపెడుతూ
చెట్టు కొమ్మలంతున్న
బుర్ర మీసాల సందున
చిరునవ్వు పిట్టల్ని ఎగరేస్తూ
ముతక తాత వెళ్తూ ఉంటాడు

జావాలో సంస్కృత పదములతో కూడుకొన్న ప్రాచీన జావాభాషలో కావ్యములను వ్రాసినారు అక్కడి కవులు. వీటిని కాకవిన్ అంటారు. కాకవిన్ రామాయణము మొట్టమొదట వెలువడినది. అది సంస్కృత ఛందములలో వ్రాయబడినది. అంతే కాదు, అక్కడి కవులు, లాక్షణికులు క్రొత్త ఛందములను కూడ కల్పించినారు.

ఉన్నట్టుండి
పరిమళాలపారిజాతాలై కురిసిపోవాలి

గతపుజాతరలో తప్పిపోయి
పరధ్యానంగా కూర్చున్నపుడు
దాచుకున్న బ్రతుకు పానకపు రుచి
గుర్తు రావాలి

ఈ నాలుగు కథలు వస్తుపరంగా ప్రయోగాత్మకమైన కథలు. స్వీకరించే వస్తువు కొత్తదైనప్పుడు, మూస వస్తువుల్ని కాదని కొత్త వస్తువులతో కథలు రాసినప్పుడు ప్రయోగమే అవుతుంది మరి! అన్ని కథలు సమకాలీన కథలు. ఇవాల్టి కథలు. ఆధునిక సమాజంలో సంభవిస్తున్న మార్పులే ఆమె కథలకి వస్తువులు. ఇక కథలు వస్తుపరంగానే కాకుండా, రూపపరంగా వైవిధ్యాన్ని, విలక్షణతనీ కూడా కలిగివున్నాయి.

నిజానికి మహా సౌందర్యాఘాతమూ నరకమే. అదేదో గట్టిగా అనుభవించిన దాఖలా ఈ కవిగారు తన గురించి ఈ పుస్తకంలో చెప్పినచోట కనిపించింది. నా సొంత అనుభూతిలో నడిచి నడిచి సీదా తిరిగి మళ్ళీ ఈ సంకలనంలోని కవితల్లోకి ఇరుక్కున్నట్టయింది. అంటే భారీ సెంటిమెంట్లు, మరికొళుందు వాసన గోల కాదు నాది. ఈ కవితలు పన్నిన వలే అంత!

క్రితం సంచికలోని గడినుడి-64కి మొదటి ఇరవై రోజుల్లో పదముగ్గురి నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-64 సమాధానాలు.

అడ్డం కీలుబొమ్మ (3) సమాధానం: జంతరం ఎముకలని కలిపిఉంచు సన్నని నరము (3) సమాధానం: స్నాయువు పార్వతీదేవి పుట్టుమచ్చ (3) సమాధానం: కాలక తెలంగాణా […]

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

ఒక భాషకు చెందిన సాహిత్యం, ప్రత్యేకించి ఒక కాలానికి చెందిన సాహిత్యం కొన్ని సారూప్యాలను కలిగి ఉండటం గమనిస్తాం. అది కొన్ని విభజనలకు లోబడే రీతిలో కొన్ని ధోరణులను ప్రస్ఫుటంగా వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఈ ధోరణులను దాటి రాసే అరుదైన సాహిత్యకారులు ఉంటే ఉండవచ్చు గాక. కాని, సమకాలీన సామాజిక ధోరణులు, సమకాలీన ప్రసిద్ధ సాహిత్యకారుల దృక్పథాలు, చాపకిందనీరులా ఒక భాష సాహిత్యాన్ని ప్రభావితం చేస్తాయనడం అతిశయోక్తి కాదు. నిలవనీరులా సాహిత్యమిలా పాతబడే సందర్భాల్లో అనువాదసాహిత్యపు అవసరం స్పష్టమవుతుంది. ఒకే కాలానికి చెందిన, ఒకే నేలకు చెందిన మనుషులు, మరొక భాషలో, మరొక ప్రాంతంలో చేస్తున్న ప్రయోగాలను, వేస్తున్న ముందడుగులను చూపెడుతుంది. పరభాషల రచయితలు తమ తమ జీవనవాస్తవికతను సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా నిలబెట్టుకుంటున్నారో గమనించే వీలిస్తుంది. వేరే వేరే సంస్కృతులు, వాతావరణాలలోని మనుషుల మధ్యనున్న భిన్నత్వాన్నీ ఏకత్వాన్నీ కూడా మిగతావారికి పరిచయం చేస్తుంది. అందువల్ల ఒక భాషలోని సహజ సాహిత్యం ఎంత ముఖ్యమో అనువాదసాహిత్యం కూడా అంతే ముఖ్యం. ఇలా ప్రపంచభాషలనుంచి ప్రోదిపడ్డ అనువాదాల వల్ల ఆంగ్లసాహిత్యం ఎంత పరిపుష్టమయిందో వేరుగా చెప్పక్కర్లేదు. అయితే, ఇది కేవలం రాశికే సంబంధించిన విషయం కాదు కనుక, అనువాదకులు కూడా తమ పని పట్ల ఆ గౌరవాన్ని, జాగ్రత్తని కలిగి ఉండాలి. కేవలం రెండు భాషలూ అర్థమవుతాయన్న మాట దగ్గర ఆగిపోకుండా, రెండు భాషలలోని నుడికారాన్ని ఆకళింపు చేసుకోవాలి. రెండు భాషలలోని వ్యావహారిక పదాలను, జాతీయాలను, వాడుకలో పదాలకున్న భిన్నార్థాలను తెలుసుకోవాలి. ఆపైన మూలభాషలోని సహజత్వాన్ని అనువాదభాషలోకి అంతే సహజంగా తేవాలి. మూలంలోని వాక్యాన్ని అనువాదభాషలోకి అలాగే తేవడం కృతకమైన పని. ఎందుకంటే మూలం ఏదైనా, అనువదించబడ్డాక అది ఆ భాషాసాహిత్యం అవుతుంది. అందువల్ల ఆ అనువాదం తెలుగులోకి అయితే అది తెలుగు భాష, వ్యాకరణం, నుడికారాలతో అలరారవలసిందే. కొన్ని రచనలు కేవలం తెలుగులో చెప్పబడతాయి. మరికొన్ని కథావస్తువులు తెలుగు నేల, సంస్కృతిలో ప్రతిక్షేపించబడతాయి. మూలానికి విధేయత అంటే, ఏ పదానికాపదం తెలుగులో చెప్పడం కాదు, మూలరచన ఉద్దేశ్యాన్ని మార్చకపోవడం, అదేసమయంలో మూలరచన ధ్వనినీ అనువాదభాషలోకి తేగలగడం. ఆ దృష్టితో చూసినప్పుడు, సృజనాత్మకత పరంగా, అనువాదసాహిత్యం సహజసాహిత్యానికేమాత్రమూ తక్కువ కాదు. ఇంటర్నెట్ వల్ల ఇప్పుడు ఇతర భాషల ఉచ్చారణ, వాడుక, భిన్నార్థాలవంటివి అందరికీ అందుబాటుకొచ్చాయి. ఆ రకంగా, అనువాదకుల విషయవస్తు సేకరణ సాంకేతికత వల్ల కొంత సులభమైన మాట నిజమే అయినా, మూలభాషలోని సాహిత్యరీతికి సరిపోయిన వ్యక్తీకరణను అనువాదభాషలోకి తేవడమన్న కష్టం నిత్యనూతనమైనదే. పైపెచ్చు, సృష్టిలో సృజనకారులకు ఉన్న వెసులుబాటు ప్రతిసృష్టిలో ఉండదు. అందువల్ల, సృష్టి ప్రతిసృష్టి రెండూ శ్రమపూరితాలే అయినా అనువాదకుల పని మరింత కష్టమైనది, వారి బాధ్యత మరింత గురుతరమైనది. ఇది కేవలం అనువాదకులే కాదు, పాఠకులు, ప్రచురణకర్తలూ గమనించాలి. మూలరచయితతో పాటు అనువాదకుల పేర్లనూ పుస్తకాలపై ప్రముఖంగా ప్రచురిస్తూ, ఈ ప్రక్రియకూ సముచిత గౌరవాన్నివ్వడం, సాహిత్య సమాజపు కనీస కర్తవ్యం.

ఈమాట డిసెంబర్ 2021 ముందుమాట పుస్తకావిష్కరణల పోలిక అన్న ఒక కొత్త అంశాన్ని లేవనెత్తింది. ఈనాటి తెలుగు పుస్తకావిష్కరణల పద్ధతి ఒక ప్రహసనమే కావచ్చు. దానికి మార్పు కూడా అవసరమే కావచ్చు కానీ ‘పాశ్చాత్య పద్ధతి నవలంబించండి’ అన్న సూచన మాత్రం ఈనాటి తెలుగు రచయితల, ప్రచురణకర్తల, పుస్తకశాలల పరిస్థితిని ఏమాత్రం పరిగణన లోనికి తీసుకోలేదని అనిపించడానికి కారణాలు చాలా వున్నాయి.

‘మరేమో ఒచ్చి’ ఏం గోడు చెప్పుకోడానికి ఒచ్చిందో వినాలని ఉన్నా ఆవిడ వెళ్ళిపోయాక బామ్మా అమ్మా మళ్ళీ మళ్ళీ ఎలాగా వాళ్ళలోవాళ్ళు ఏకరువు పెట్టుకుంటూనే ఉంటారు! భోగట్టా తెలీకపోదు! ఎటొచ్చీ ఆవిడ నోట విండం ఇహ కుదరదు! నేనక్కడ ఉంటే నవ్వుతానని, నవ్వు ఆపుకోనని అమ్మకు భయం! ఆవిడ ఎదురుగా నన్ను చీవాట్లు పెట్టడమూ కుదరదు! అదీ సంగతి!

మీ ఆంగ్ల అనువాదాలు మీ బ్లాగులో, ఎఫ్.బీ.లో, చూస్తూనే ఉంటాను. అవి అస్సలు అనువాదాలనిపించవు. ఇంగ్లీషులోనే రాసేరేమో అనిపిస్తాయి. మీ అనువాదాలు చదివినప్పుడల్లా నా రచన ఒక్కటైనా మీరు అనువాదం చేస్తే బాగుండునని తీవ్రమైన కోరిక కలుగుతుంది. ఈ జన్మకి ఆ కోరిక తీరేనా!? అన్నట్టు, నా పుస్తకం త్వరలో విడుదల కాబోతోంది. తప్పకుండా చదువుతారు కదూ?

ఆ రోజు నుండి నేను హిందూ పత్రికలో అప్పుడప్పుడు కనిపించే ఆవుగారి కార్టూన్ కోసం వెతికేవాడిని. ప్రచురితమైన ఆయన ప్రతీ బొమ్మని గంటల తరబడి నేను చాలా శ్రద్దతో అధ్యయన పూర్వకంగా పరిశీలించేవాడిని. ఆయన కార్టూన్లలోని రాజకీయ వ్యాఖ్యానాలలోని చురుకు, వెటకారం నాకు అర్థం అయ్యేంత వయసు కాదు కానీ చిత్రించే బొమ్మపై ఆవుగారికి ఉన్న నియంత్రణ నన్ను ముగ్ధుణ్ణి చేసేది.

నాకు ఆశ్చర్యమనిపించింది. ఈ ప్రాంగణం ఎంతో విశాలంగా ఉన్నమాట నిజమే గానీ దీని దిగువున అరవైవేలమంది బానిస ఖైదీలు ఉండటం సాధ్యమనిపించడం లేదు అన్నాను. ఒక గట్టి నిట్టూర్పు విడిచి- వాళ్ళంతా గొలుసులతో గోడలకి కట్టివేయబడ్డారు. నిలబడటానికి కూడా చోటు లేనంతగా కిక్కిరిసి ఉండేదీ జైలు. వాళ్ళల్లో చాలామందికి నిలబడే నిద్రపోవలసివచ్చేది అని వివరించాడు హఫీద్.

బుజ్జాయిగారు అలా కాదు అమిత సింప్లీ ఆయన బొమ్మల బ్యూటీ. బుజ్జాయిగారి బొమ్మలతో పోల్చుకోదగిన అలతి రేఖల ఆర్టిస్ట్ అంత సులువుగా మరెవరూ కానరారు. అందువల్లనే ఒకానొక సమయంలో దేశంలోకెల్లా ప్రఖ్యాతి గాంచిన ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పత్రికలో బుజ్జాయిగారి బొమ్మలు మాత్రమే ప్రచురితం అయ్యాయి. మరే తెలుగు చిత్రకారులు ఎంత ప్రయత్నించినా అందులో చోటు చేసుకోలేకపోయారు.

ఆచార్య మహాకాశ్యపులవారికి వీడ్కోలు చెప్పడానికి విశాఖారామ పరిసరాల్లోని అనేక విహారాలనుంచి విచ్చేసిన బిక్కులతో సముద్రగర్భంలోకి చొచ్చుకొని ఉన్న ఆ చిన్నపర్వతమంతా నిండిపోయింది. తెరచాపలతో సముద్రంపై ఊయల ఊగుతున్న నావ వైపుకి పయనిస్తూ ఉన్న చిన్న పడవ నిదానంగా వారికి దూరమయింది. అప్పటివరకు వారికి తోడునీడగా అండగా రక్షణగా నిలబడ్డ మహాక్షుద్రకుడు అక్కడే ఆగిపోయాడు.