ఒక్కోసారి పొద్దున్నే
రెప్పలచూరు పట్టుకుని
ఒక ఊహ
చినుకులా వేళ్ళాడుతుంటుంది
కిందకు జారేలోగా
ఏదో పనిశరం తగిలి
పగిలిపోతుంది
శీర్షికలు సంచికలు
ఢిల్లీ నగరం గురించి విశేషంగా రాసి, తిరుగులేని వ్యంగ్య రచయితగా పేరు తెచ్చుకున్నా ఫిక్ర్ తౌన్స్వీకి సాహిత్య అవార్డులు ఏవీ రాలేదు. ఇప్పటికీ తక్కిన హిందుస్తానీ రచయితలంత విరివిగా ఆయన పేరు వినిపించదు. కానీ ఒక్కసారి అలవాటైతే మాత్రం మర్చిపోలేని చమత్కార వచనం ఆయనది. తప్పక చదవాల్సిన రచయిత. ప్రతినిత్యం వాడుకలో ఉన్న పదాలకి తనదైన శైలిలో అర్థాలు, నిర్వచనాలు ఇచ్చారు లుఘాత్-ఎ-ఫిక్రీ అనే రచనలో.
వేడి, వేడి వడి వడి అంతర్జాలంలో విర్రవీగే
సాంకేతిక విజ్ఞాన అంధకారంలో ప్రపంచం
ఒక్కుమ్మడిగా ఆంక్షలకీ, కట్టడికీ చేరాలంటే
అలోచనలకి అనేక వారాల సమయం పట్టదూ?
టోలెమీ అనే ఒకటో శతాబ్దపు శాస్త్రవేత్త తను రాసుకున్న నోట్సులో మైసోలస్ అంటే కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో పిటిడ్ర అనే వాణిజ్యం నగరం గురించి ప్రస్తావించాడు. బహుశా ఆ పిటిడ్రనే ప్రిథుండ కావచ్చు. బౌద్ద స్తూపాలు నేలలో సగం పూడ్చిన గుడ్డు ఆకారంలో ఉంటాయి. ప్రిథుండ అంటే పెద్ద గుడ్డు. అలాంటి ఓ పెద్ద స్తూపం ఉన్న నగరంగా ప్రిథుండను ఊహించాలి.
ఈ భూమిపై ఎందరో పిల్లలు ఆకలితో చనిపోతుంటే అంగారక గ్రహ యాత్ర కోసం బిలియన్ల డాలర్ల ఖర్చును నేను ఎలా సూచించగలుగుతున్నానని మీ లేఖలో అడిగారు. అయ్యో! ఆకలితో చనిపోతున్న పిల్లలున్నారని నాకు తెలీదు, ఇప్పటినుంచి మానవాళి ఈ సమస్యను పరిష్కరించే వరకు నేను అన్ని అంతరిక్ష పరిశోధనల నుంచి విరమించుకుంటాను వంటి సమాధానాలు మీరు ఆశించరని నాకు తెలుసు.
ఇందలి ఇతివృత్తము శృంగార,కరుణారస భరితమై ఇంపుగా నున్నది. దీనిని భారతసంస్కృతికి అన్వయించుకొనుటకు కొన్ని ముఖ్యమైన మార్పు లవసరమైనవి. 12వ శతాబ్దిలో జెరూసలెంవంటి క్రైస్తవపుణ్యస్థలములను పరిరక్షించుకొనుటకై అచ్చట నున్న ముస్లిముపాలకులతో మధ్యప్రాచ్యదేశములలో యూరోపియనుల కనేక మతయుద్ధములు జరిగినవి.
క్రితం సంచికలోని గడినుడి-67కి మొదటి ఇరవై రోజుల్లో పదహారుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-67 సమాధానాలు
అడ్డం గరాటును తిరగేయడంలో నిమగ్నమయిన ధూర్తుడు సమాధానం: రాగ ఒక దూరపు కొలత సమాధానం: కోసు వెనుకనుంచి హఠాత్తుగా దాడి చేయడానికి ఇలా దాగి […]
జ్యోతి మాసపత్రికలో 1970,80లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
డబ్బు సంపాదించకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ రాదంటుంది మాలతీచందూర్ నవల్లోని నాయిక ఒకతె. ఇంటి శుభ్రత గురించీ ఆడపిల్లల చదువు ఆవశ్యకత గురించీ రంగనాయకమ్మ తనదైన సూటిగొంతుకతో చదువుకున్న కమల నవల్లోనూ మిగతావాటిలోనూ మాట్లాడుతుంది. రాబడితో నిమిత్తం లేకుండా ఆహారానికీ అలవాట్లకీ సంబంధించిన మంచి విషయాలను, ఉన్నంతలో ఇంటినీ జీవితాన్నీ ఉత్సాహభరితంగానూ ఆరోగ్యవంతంగానూ నిలుపుకునే మార్గాలను చర్చించారు ఒకతరం స్త్రీవాద రచయిత్రులందరూ. ఒక ఆరోగ్యవంతమైన సమాజానికి ఆరోగ్యవంతమైన మనుషులూ మనసులూ ఆలోచనలూ కుటుంబాలూ కావాలని వాళ్ళు గుర్తుపట్టారు. జీవితానికింకాస్త అదనపు సౌందర్యాన్ని అద్దుతూ బుర్రలని ఖాళీగా ఉండనీయని పనులను బాహాటంగా సమర్ధించారు. స్త్రీల జీవితాల పట్ల అసలైన అక్కర కనపరిచి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ఉద్యోగాలకు వెళ్ళేలా ఉత్సాహపరిచి కుటుంబంలో వాళ్ళ పాత్రను గుర్తెరిగి నడుచుకునే వివేచన పంచారు. ఎక్స్ప్లాయిటేషన్ జరిగే సందర్భాలను దాటే మార్గాలను చర్చించారు, తద్వారా ఎందరికో దన్నుగా నిలబడ్డారు. ఆడువారికి ఆత్మగౌరవాన్ని స్వావలంబననూ మించిన అలంకారాలు లేవని పునరుద్ఘాటించారు. ఆ ప్రయత్నంలో సమాజంతో మాటలూ పడ్డారు. ఎవరేమన్నా ఓ తరానికి ఆ సాహిత్యం చేసిన మేలు కొలవలేనిది. నిజానికి ఆ తరాన్ని ముందుకు నడిపించిన సాహిత్యమది. ఇప్పటి సమాజం మారింది. ఆ కనీస చదువు ఉద్యోగాలు చాలామంది సంపాదించుకునే స్థితికి వచ్చారు. ప్రపంచం వేగవంతమయింది. ఎందరో ఆడపిల్లలు పైచదువులు చదువుకుంటున్నారు. మగపిల్లలతో సమానంగా ఇష్టపడ్డ ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. ఆత్మగౌరవాన్ని, నిర్బరతనూ చాటుకుంటున్నారు. కాని, ఈ కొత్తప్రపంచం కూడా పూలబాట కాదు. జీవితపు పగ్గాలు ఎవరి చేతుల్లో వాళ్ళకి ఉన్నట్టే ఉన్నా వివక్ష అన్నిరకాలుగా ఇంకా వేళ్ళూనుకునే ఉంది. స్త్రీకి భద్రత ఇంకా కరువయ్యే ఉంది. ఒకప్పటికన్నా ఇప్పుడు స్త్రీలు ఎదుర్కుంటున్న సమస్యలు మరింత లోతైనవి వ్యక్తిగతమైనవిగా మారాయి. శారీరక శ్రమలను సామాజిక ఆంక్షలను మించి వాళ్ళ మానసిక ఆవరణలను కుదిపేస్తూ ఎన్నో కొత్త సమస్యలు వచ్చి చేరుతున్నాయి. కొన్ని పాత సమస్యలే కొత్తముఖాలతో ఎదురవుతున్నాయి. కొంత ప్రగతి సాధించినా ఇంకా వివక్షను, పురుషాధిక్యతనూ ఎదుర్కొంటూనే ఉన్నారు. నిస్సహాయత వల్లో, నిర్బంధం వల్లో తమ శారీరక మానసిక అవసరాలను నిర్లక్ష్యం చేసుకుంటూనే ఉన్నారు. కోరి ఎంచుకుని ప్రయాణిస్తున్న మార్గాల్లో ఎదురవుతున్న ఒత్తిడిని ప్రస్తావించడమూ చర్చించడమూ తిరిగి తమను వెనక్కి లాగుతాయన్న భయం వల్లో, ఆ చర్చలను తమ ఓటమికి చిహ్నంగా ముద్ర వేస్తారన్న ఆలోచనలో నుండి కలిగిన నిస్పృహ వల్లో ఎప్పటిలాగే మౌనాన్ని ఆశ్రయిస్తున్నవారే అత్యధికులు. తమ సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా తమజీవితాలలో ఆనందాన్ని నింపుకోగలగాలి అన్నది చాలామంది స్త్రీలకు ఈనాటికీ తెలియదు. అది తమ జన్మహక్కని కనీసం ఊహకూ రాని వారు చుట్టూ కోకొల్లలుగా కనపడుతూనే ఉన్నారు. గ్రామీణ, పట్టణ, నాగరిక సమాజాల స్త్రీల సమస్యలు పైకి వేరువేరుగా కనిపిస్తున్నా వాటి మూలాలు ఒకటే. ఆ సమస్యల అసలు రంగు ఒకటే. సాహిత్యపు ఆలంబన సమాజానికి ఇలాంటి సంధికాలాల్లోనే మరింత అవసరం. అయితే, ఒకప్పటిలా ఇప్పటి స్త్రీవాద రచయిత్రులెవరూ ఈ సమస్యలను తమ సాహిత్యం ద్వారా చర్చిస్తున్న దాఖలాలు ఎక్కువగా లేవు. ఆవేశంతో ఏదో నాటకీయమైన ముగింపో పరిష్కారమో చూపించే కాల్పనికసాహిత్యం పెదవి విరిచి పక్కకు పారేసేది మాత్రమే అవుతుంది. అలా కాక, నిజజీవితానికి దగ్గరగా ఉండి, ఒక ఆలోచనను, ఆచరణయోగ్యమైన పరిష్కారాన్ని సూచించేది, లేదూ కనీసం సమస్యను కూలంకషంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేది, అది కూడా కాదంటే హీనపక్షం మీమీ జీవితాల్లో ఇటువంటి సమస్యొకటి ఉందీ అని హెచ్చరించే సాహిత్యం అర్థవంతమవుతుంది. అట్లా ఈకాలపు స్త్రీ అవసరాలను, ఇబ్బందులనూ లోతుగా గమనించి అర్థం చేసుకొని వివేచనాత్మకమైన సాహిత్యాన్ని సృజిస్తోన్న స్త్రీవాద రచయితలు ఇప్పుడు మనకున్నారా? ఈనాడు తెలుగునాట అలాంటి స్త్రీవాద సాహిత్యం అసలు ఉన్నదా?
ఆ రోజుల్లో పండగలకు కొత్త బట్టల ముచ్చట. అసలు కొత్త బట్టలంటేనే తాను నుండి గుడ్డ చింపించి, చక్కగా కొలతలు తీపించి, కుట్టించి, నలభైసార్లు దర్జీ షాపు చుట్టూ తిరిగి, చొక్కాయ్ సాధించి దానిని బొగ్గుల పెట్టెతో ఉల్టా పల్టా ఇస్త్రీ లాగించి మన చొక్కాని తొలిసారిగా వాడెవడో కాక మనమే తొడుక్కోడం. ఇప్పుడు మనం కొత్తంగి అని తొడుక్కునేది ఎక్కడని కొత్తది?
తెలుగు కవిత్వానికి అలవాటు కాని పద్ధతిలో ఈ ఒరియా కవిత్వాన్ని అనుసృజన పేరుతో పనికట్టుకుని అచ్చు వేయించడంలో వెంకటేశ్వరరావుకి ప్రత్యేకమైన దృష్టి వుందని నా అనుమానం. నేలబారుగా ఏదో ఒక వస్తువునో ఒక వాదాన్నో ఒక నమ్మకాన్నో చెప్పడం కోసం రాసే తెలుగు పద్యాల పద్ధతి ఒరియా కవిత్వం ద్వారా మార్చాలని, తెలుగు అభిరుచి ఇంకా క్లిష్టమవ్వావలని వెంకటేశ్వరరావు ఆలోచన.
వంటింటి అటకమీంచి ఆవకాయ గూనలు పెద్దవీ చిన్నవీ అన్నిటినీ దింపించాలా, కడిగించాలా, ఎండబెట్టాలా! ఒక వహీవా? అన్ని వహీల ఆవకాయా పెట్టాలా! పచ్చావకాయ, బెల్లమావకాయ, ఎండావకాయ, అడకాయ, మాగాయి, తొక్కుపచ్చడి, కాయావకాయ, మెంతావకాయ. మళ్ళీ అందులోనూ కొన్నిటిలో వెల్లుల్లి వేసీ, కొన్నిటిలో వెయ్యకుండానూ!
నిర్మానుష్యమైన రోడ్డు హక్కుగా లాక్కుంది ఒంటరి గుండెని. చెవుల్లో చలి, గుండెలో మంచు, మొద్దుబారిపోయిన మొహం. గ్లోవ్స్ ఉన్న చేతిలో వెచ్చగా ఒదిగిన సిగరెట్ స్టబ్ చివరి వెలుతురులు చిమ్ముతుంది. అడుగుల కింది ఎండుటాకులు అన్నీ మంచు నీళ్ళల్లో ఒదిగిపోతున్నాయి. కొండలు, నిశ్చలంగా నిల్చున్న చెరువు. సాయంత్రమైందని ఈ రోజుకి ఇక చాలు అని సోలిపోతున్న సూర్యుడు. వీటన్నిటికీ సాక్షిగా నేను. నన్ను కూడా వీటిగాటిన కట్టేస్తూ తాము సాక్షులుగా పక్షుల గుంపులు.
తిరిగి హోటలుకు వెళ్ళేటపుడు ఆ దేశపు పార్లమెంటు భవనము, సాయుధ రక్షకుల పర్యవేక్షణలో ఉన్న రాజప్రాసాదమూ కనిపించాయి. రబాత్ నగరాన్ని నడకరాయుళ్ళ స్వప్నసీమ అనవచ్చు. నగరంలో తిరుగుతోంటే ఆత్మీయంగా అనిపిస్తుందే తప్ప సంభ్రమాశ్చర్యాలు, మనమీద నగరం వాలిపోయి ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న భావన కలగనే కలగవు.
విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచి పెట్టాడని, రాహువు కపటంగా దేవతల ఆకృతిలో వచ్చి అమృతాన్ని పొందే ప్రయత్నం చేశాడని, ఆ విషయం పసిగట్టి విష్ణువుకు ఆ విషయాన్ని చేరవేశారని తెలుసుకున్న రాహువుకు సూర్యచంద్రుల మీద తీరని పగ కలిగిందనీ వివరించాను. అలా రాహువు పగసాధింపు చర్య నేటికీ కొనసాగుతుందని చెప్పాను. ప్రతీ రోజూ ఈ రాహువు సూర్యచంద్రులను వాళ్ళ సంచలనంలో కొంతసేపు పీడిస్తూ ఉంటాడు. దాన్నే రాహుకాలం అంటారు.
కొన్ని పద్యాలు
సద్యోగర్భ జనితాలు
ఘటానాఘటన
పయోమృత ధారలతో
అశ్రువర్ష ధీసతులు
వర్తమాన వార్తా స్రవంతికి
తోబుట్టువులు
రాత్రిళ్ళు భోజనానంతరం ఇలా మా ఇంట్లో చెప్పుకునే కబుర్లు భలే ఉంటాయిలే. ఆరోజు మేము కలుసుకున్న కొత్త వ్యక్తులు, పాఠశాలలోని ఉపాధ్యాయుల లేదా కార్యాలయాల్లోని ఉన్నతాధికారుల దౌర్జన్యాలను, అతి వేషాల గురించి తమాషా పడుతూ వారి హెచ్చులని వెక్కిరించుకుంటూ ముచ్చటించుకుంటాము.
మొన్న నేను ప్లాజాకి వెచ్చాలు కొనుక్కురావడానికి వెళ్ళినప్పుడు మా అపార్ట్మెంట్ బిల్డింగ్ కాన్సియార్జ్ వచ్చింది. నాన్నతో అవీ ఇవీ మాట్లాడి వెళ్ళింది. మాకు దగ్గిరలోనే ఉన్న కుట్జివ్ గ్రామాన్ని రష్యన్ దళాలు ఆక్రమించుకున్నాయి అని చెప్పిందట. ఇళ్ళళ్ళో ఉన్న స్త్రీలని బలాత్కరించారని చెప్పింది. అని వూరుకున్నా బాగుండేది. ఒంటరి తల్లిని రేప్ చేయబోతున్న రష్యన్ సైనికుడికి ఆవిడకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు అడ్డం పడితే వాడిని కాల్చి చంపి ఆ తల్లిని చెరిచాడట.