సమాధి దగ్గర్లో గుప్పెడు మట్టిని తీసి
జేబులో వేసుకున్నాను
నడుస్తుంటే చెమటతో తడిచిన మట్టిలో
ఏదో కదలాడినట్టై చూస్తే
లోపల కళ్ళు పేలని విత్తనం
కవి అబద్ధం కానందుకు ఆనందమేసింది

నేను నిశ్చయత కోరుకున్నది గణితంలో మాత్రమే కాదు. రెనె డెకార్ట్ లాగా నాక్కూడా బయటి ప్రపంచమంతా ఒక కల కావచ్చునని అనిపించేది. ఒకవేళ అది నిజంగా కలే అయినా, ఆ కలను కనడం నిజం కాబట్టి, ఆ కలను నేను అనుభూతి చెందుతున్నది నిస్సందేహమైన వాస్తవం కాబట్టి నా ఉనికి అనుమానించలేనిదని నాకు అనిపించింది.

ఏప్రిల్ 2024 ఈమాట లోని మూడు రచనలపై నా స్పందన ఇది. నా ఈ విమర్శ అవసరమా అని ఎవరయినా ప్రశ్నిస్తే దానికి తిరుగు ప్రశ్న, ఆ వ్యాసాలు ప్రచురించడం ఎందుకు అవసరం? అని. సంపాదకీయంలో ప్రస్తావించబడ్డాయి గనుక – అని జవాబు. ఆ సంపాదకీయానికి అవసరం? ఒక గాయకుడికి ప్రకటించిన పురస్కారం లేపిన దుమారం. కారణం, త్యాగయ్య మీద ఆ గాయకుడి వ్యాఖ్యలని కొందరు అనుచితాలనడం.

తెలుగు క్రియాంత భాష కాబట్టి, సాధారణంగా తెలుగు భాషా లక్షణాలను వివరించేందుకు రాసిన సంప్రదాయ వ్యాకరణంలోనైనా, ఆధునిక వ్యాకరణంలోనైనా క్రియకు ప్రాధాన్యం ఉండటం సహజం. అందువల్ల ఈ విషయాన్ని వెల్చేరుగారు మొదటగా కానీ, ప్రత్యేకంగా కానీ ‘కనిపెట్టా’రన్నట్టు చెప్పడం సబబు కాదు.

మెహక్ ఈ సంపుటి ముందుమాటలో చెప్పినట్టు రెండు ముఖ్య విషయాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఒకటి – ఇతివృత్తాలు, సంవిధానం, ముగింపు భిన్నంగానే కనిపిస్తాయి. రెండు – ఇరు మతాల మధ్య సయోధ్య పెంపొందించి, వైరుధ్యాలను వెదికి వేరుచేసి, చెరిపేసే కృషి వున్న సృజనశీలత. ఈ రెండు విశేషాలు స్పష్టంగా వ్యక్తమవుతాయి ఈ కథల్లో.

అడ్డం ఒక్కర్తే కరకరలాడుతోంది .. నైజం తిక్కలా ఉంది (జంతిక) సమాధానం: జంతిక తాపీగా చదివితే అంతా త్రిభంగి విక్రిడితమే.. యతి కూడా చెల్లింది […]

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

తెలుగుదారి పుస్తకం వీటన్నిటికంటే భిన్నమైన పరిస్థితుల్లో వచ్చింది. పరిమిత ప్రయోజనం కోసం ఉద్దేశించిన ఈ వ్యాకరణాన్ని సమగ్రమైన తెలుగు వ్యాకరణం అనడానికి వీల్లేదు. వ్యాకరణ పరిభాష అంతా ఇంగ్లీషులో ఉన్నందువల్ల తెలుగు అధ్యాపకులకు కాని, విద్యార్థులకు కాని ఇది అంతగా ఉపయోగపడదు.

కర్ణాటక సంగీతగాయకుడు టి. ఎం. కృష్ణకు మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ సంగీతకళానిధి అవార్డ్ ప్రకటించటంతో దుమారం చెలరేగింది. సంగీతసాహిత్యాది కళలలో సాధారణంగా విమర్శలు గ్రహీతల అర్హతను ప్రశ్నించేవిగా ఉంటాయి. ఐతే, కృష్ణ విషయంలో వివాదం అతని ప్రతిభను ప్రశ్నించేది కాక అతనిని వ్యక్తిగా నిందించేది. సంప్రదాయం ఆశించే యథాతథస్థితిని అతను ప్రశ్నించడం, దాని పునాదులు కదిల్చే ప్రయత్నాలు చెయ్యడం సంప్రదాయవాదులకు నచ్చలేదు. ఇది ఒక అభద్రతాభావం నుండి పుట్టిన అసహనమే తప్ప, శతాబ్దాలుగా పరిఢవిల్లిన శాస్త్రీయ సంగీతానికి ఇప్పుడు కొత్తగా రాగల ముప్పేమీ లేదు. ఛందోబంధనాలు తెంపిన కవుల వల్ల తెలుగు కవిత్వం మరింత పరిపుష్ఠమయిందే కాని, కావ్యసంపదకు అవమానమేమీ జరగలేదు. కర్ణాటక సంగీతాన్ని భక్తి అనే ఏకభావప్రాధాన్యతా శృంఖలాల నుండి తప్పించడానికి కృష్ణ చేస్తున్న ప్రయత్నాల వల్ల ఆ సంగీతం మరింత ప్రౌఢము, విస్తారమూ అవుతుంది తప్ప అది ఏ రకంగానూ బలహీనపడదు. కాని, ఆవేశం, అసహనం మాత్రమే హెచ్చరిల్లి తార్కిక విశ్లేషణ, వివేచన కొరవడిన సమాజానికి, తామే నియంత్రించి లోబడి ఉండే సంప్రదాయాన్ని ఏ రకంగా ప్రశ్నించినా ధిక్కరించినా ఓర్వలేనివారికి, మార్పు సహించలేనివారికీ ఇలాంటి సందర్భాల్లో చేయ చేతనైనది వ్యక్తి దూషణ, వ్యక్తిత్వ హననం మాత్రమే. ఇది పక్కన పెట్టినా, మిగతా ప్రతిస్పందనలూ ఆశ్చర్యం గొలిపేవే. కాకతాళీయమే అనుకుందాం, కాని సరిగ్గా ఈ వివాదం నడుస్తున్నప్పుడే – త్యాగరాజు సంగీతం కోసం సాహిత్యాన్ని విస్మరించాడన్న కృష్ణ అభిప్రాయం ఒకటి సందర్భశుద్ధి లేకుండా వెలికి తెచ్చి, మసి పూసి మారేడు చేసి అతనిపై తెలుగు భాషాభిమానులందరూ శాయశక్తులా తమ అక్కసును వెలిగక్కారు. కానీ నిజానికి కృష్ణ చెప్పింది కొత్తదీ కాదు, ఆయన మాటలు త్యాగరాజు పట్ల అవమానమూ కాదు. దశాబ్దాల క్రితమే శ్రీపాద, రాళ్ళపల్లి తదితరులు ఈ సంగతిని తార్కికంగా సోదాహరణంగా చర్చించారు. ఇక, భక్తుడు కానివాడు భక్తిసంగీతంలో తాదాత్మ్యం చెందలేడు కాబట్టి కృష్ణ ఈ కీర్తనలు పాడకూడదన్నది మరొక వాదన. ఇది, ఎవరి కథలు వారే చెప్పుకోగలరు, ఇతరులు చెప్పలేరు, చెప్పకూడదు అని సాహిత్యంలో అస్తిత్వవాదులు చాలాకాలంగా చేస్తున్న ఒక అర్థం లేని వాదనకు భిన్నమేమీ కాదు. కులమతప్రాంతీయ జీవనసరళులను బట్టి వారికే ప్రత్యేకమైన కొన్ని అనుభవాలు, పద్ధతులు ఉంటాయి నిజమే కాని, ఆవేశం, ఆనందం, ఆక్రోశం, అవమానం, అభిమానం, అనురాగం, అణచివేత, ధిక్కరణ వంటి సార్వజనీనమైన అనుభవాల సారాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నవాళ్ళు, కళలో ఆ లోతులు పట్టుకోగలిగిన కళాకారులు ఎవరైనా, ఎవరి కథయినా వ్రాయగలరు, ఎవరి పాటయినా పాడగలరు, ఎవరి బొమ్మయినా గీయగలరు. భక్తిభావం ఇందుకు భిన్నమైనదేదీ కాదు. కృతులలో ఎంత భక్తి ఉన్నా, కర్ణాటక సంగీతం కూడా ఇతర కళలలాగానే ఒక కళ. భక్తిసంగీతమైనా, గాయకుడి భక్తి కేవలం సంగీతం మీద. సాహిత్యశిల్పచిత్రలేఖనాది కళలన్నిటికీ ఇదే వర్తిస్తుంది. ఇది కళాసృజనలో చాలా సూక్ష్మమైన గమనింపు. వివేచనతో తప్ప అవగతం కానిది. ఇలా, సంప్రదాయవాదులు ఈ రకమైన దాడికి దిగితే, అభ్యుదయవాదులు మొత్తంగా వారి మార్కు మౌనాన్ని వారు ఆశ్రయించుకున్నారు. కృష్ణ చేస్తున్న ప్రయత్నం ఎంత విప్లవాత్మకమైనా అతని పోరాటం అగ్రవర్ణ సంప్రదాయం లోలోపలి కుమ్ములాటే కదా అన్న నిరసన వాళ్ళది. ఆ ఆలోచనాధోరణి ప్రమాదకరమైనది. రాజ్యాన్ని ముప్పొద్దులా విమర్శించే వాళ్ళకు కూడా ఇది కేవలం సంగీత వివాదం అనిపించడం; ఇది సాక్షాత్తూ భగవంతుడికే జరిగిన అవమానమన్నట్లు నానా యాగీ చేస్తున్న సంప్రదాయవాదులకు ఇందులోని సామాజిక కోణం పట్టకపోవడం – ఈ రెంటినీ కలిపి చూస్తే, మన సమాజం సమస్యలను ఎంత ఏకపక్షంగా చూస్తుందో అర్థమవుతుంది. ఇప్పటి ఈ వివాదం ఒక గాయకుడిది మాత్రమే కాదు. నిన్నైనా మొన్నైనా ఒక రచయితది, ఒక చిత్రకారుడిది మాత్రమే కాదు. ఇవి కేవలం ఉదాహరణలు. ఈ సమస్య ఒక సమాజంగా మనందరిదీ. భిన్నత్వాన్ని కనీసం మాటమాత్రంగా కూడా సహించలేని మన కురచతనం, సామాజిక వివేచన కోల్పోయిన మన సంకుచితత్వం, తమ బాగే అభ్యుదయం అనుకొనే స్వార్థం. అదనంగా కళ, కళాసృజనల పట్ల అవగాహనాలేమి, అగౌరవం. మరీ ముఖ్యంగా కళలు మత, రాజ్య, సంప్రదాయాల పరిమితులకు, నియమాలకు లోబడి ఉండవని, నిరంతర వినూత్నత, విభిన్నత వాటి ధర్మం, కర్తవ్యం అని కనీసం ఊహకు కూడా రాకపోవడం. సమస్యకు మూలం ఇక్కడే ఉంది. మన చర్చ మొదలవాల్సింది కూడా ఇక్కడే.

ఇది మతధర్మము, కుల ధర్మము, జాతి ధర్మము కాని కాదు. మఱి మానవధర్మం. వివిధ భేదాలతో అడ్డగోడలతో ఉద్రేకాలు పెరిగి అనాహుతాలపాలై పోతూవుండే మన దేశంలో త్యాగయ్యగారి యీ గానకళను పరస్పరస్నేహ సౌహార్దాలకు సాధనంగా ఉపయోగించి మనం ధన్యులం కావలసి ఉన్నాము.

మన తెలుగువారికి త్యాగరాజు తెలుగుదనముతోనేగాని ఆయన కీర్తనా సంగీతంతో నిమిత్తం లేదు. త్యాగరాజు తన కీర్తనలను సంగీతంలో మూర్తీభవించినాడుగాని తెలుగులో మూర్తీభవించలేదు. దక్షిణాదివారు పాపం తెలుగు ఏమీ రాకపోయినా, కీర్తనల సంగీతం కోసం వాటిని వల్లించుకున్నారు. వారితో సంగీతవిద్యలో పోటీ చెయ్యలేక, త్యాగరాజు కీర్తనాసాహిత్యాన్ని అరవలు పాడుచేస్తున్నారూ, మేముద్ధరిస్తున్నామని మనము బోరవిరచి ఉపన్యాసాలిస్తున్నాము. కీర్తనలో సంగీతమే ప్రధానము గనుక సాహిత్యానికి జరిగే ఈ ‘అపచారాన్ని’ గురించి నేటి కాలపు ఆంధ్రాభిమానులు తప్ప త్యాగరాజుగాని, ఆయన శిష్యులుగాని బాధపడియుండినట్టు లేదు.

ఆ మేడమీది రెస్టరెంటు పాతపట్నపు సంపూర్ణ దృశ్యాన్ని కళ్ళకు కట్టింది. పట్నంలోని ఎన్నో భవనాలూ లాండ్‌మార్కులూ ఆ దీపాల వెలుగుల్లో చక్కగా కనిపించాయి. సెంట్రల్ ప్లాజా, మెట్రోపాలిటన్ కథెడ్రల్, కొండమీద నెలకొన్న వర్జిన్ మేరీ విగ్రహం, ఊళ్ళోని బసీలికా స్పైరు – అన్నీ ఎంతో చక్కగా కనిపించాయి.

హిందూ వివాహవ్యవస్థలోని బోలుతనం, ఆధిపత్య భావజాలం, కోడంట్రికం, ఇంటి కోడలి సహనం, పతివ్రతాలక్షణం – నవలలో ప్రధానాంశాలు. అయితే కమలను అంతమాత్రంగానే చిత్రించివుంటే ఈ నవలలో చెప్పుకోదగ్గ విషయం ఉండేది కాదు. కమలలో ఈ ‘పవిత్ర భారతనారి’ లక్షణాలెన్ని ఉన్నా, ఆమెలో ప్రత్యేకతలున్నాయి.

మానవ జీవితం వన్ వే ట్రాఫిక్. ఒకవైపుకే మన ప్రయాణం. మనం అందరం చివరగా వెళ్ళేది ఒక చోటుకే. దార్లో ఎంతోమంది స్నేహితులూ మిత్రులూ కలుస్తారు, వస్తారు, మధ్యమార్గంలో మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అసలు ‘జీవితం అంటే ఏమిటి?’ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే వదిలిపోయే స్నేహాలు, సహచరులు, మారిపోయే ప్రాధాన్యతలు, అనుబంధాలు… ఇదే జీవితమేమో అనిపిస్తుంది. ఇలాంటి జీవితంలో ఒంటరిగా మనం.

గ్రహణాలు అతి ప్రాచీనమైనవి, మనిషి భూమిమీద అంతరించిపోయిన తర్వాత కూడా కొనసాగేవీ. ఖగోళశాస్త్రంలో గణనీయమైన చరిత్ర ఉన్న మనం ఆ క్షేత్రంలో జరుగుతున్న పరిశోధనలను జాగ్రత్తగా గమనిస్తూ, మానవజాతి పురోగతిలో మనవంతు పాత్ర పోషించడానికి తగిన కృషిచెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ముజు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు తొమ్మిదేళ్ళు ఉంటాయేమో! ఆమె రాగానే మూడేళ్ళ నా చెల్లెలు సేనిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. ఇక అప్పటి నుంచి సేని ముజుని వదిలి క్షణం ఉండేది కాదు. ఆమె వెంటే తిరుగుతూ ఉండేది. ముజుని పెళ్ళి చేసుకున్న కొన్ని రోజులకే పచ్చి తాగుబోతైన మా నాన్న చిన్న మురికికాలవలో పడి ఆపైన మంచానికి అతుక్కుపోయాడు. తాగుడుకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేక ఆయన తన కోపమంతా ముజుపైన చూపించేవాడు.

కవితలు కురవడం ఆగిపోయిన తీగ మీద సుతిమెత్తని కిరణం వాలితే ఇలాంటి సవ్వడే అవుతుందేమో! భుజం మీదినుంచి కోయిల ఎగిరిపోయినా ఇదే చుక్క జారుతుందేమో! లోపలి చూపులనుంచి వొలికే నిశ్వాసల వొరవడీ వొరిపిడీ ఇంతేనేమో. దిండ్లుగా మారిన బండల స్పృహ ఛెళ్ళుమనడం ఇలాగే తెలుస్తుందేమో! ఇవన్నీ మీరు వినాలనే అనుకుంటాను కాని, కత్తులే మొద్దుబారాయో, గుండే గడ్డకట్టిందో కాని…

“మీరు అమ్మాయి వివరాలు ఫోటోలు చూసినట్టు వాళ్ళు కూడా మీ అబ్బాయి ఫోటో ఉద్యోగం చదువు ఇవన్నీ చూడాలి కదా. ఇవాళే మీ వివరాలన్నీ వాళ్ళకు పంపించేస్తాం. వాళ్ళు చూసి ఓకే చెప్పగానే మీకు తెలియజేస్తాం.” ఎలాంటి తడబాటు లేకుండా అలవోకగా వచ్చిపడుతున్న మాటలు. రోజూ చెప్పే అవే అబద్దాలకు మన ముఖాలలో ఎలాంటి మార్పు ఉండదు. కంగారు ఉండదు. చెరగని చిరునవ్వుతో ఎంతో ఇష్టంగా చేస్తున్నట్టు సహజంగా ఉండటం వీలవుతుంది.