రవీంద్ర సాహిత్యంలో అడుగడుగడునా పిల్లల లోకంలోని అభూతకల్పనలు, అద్భుత సాహసాలు కనబడతాయి. ప్రాచీన గాథలెన్నో సరికొత్త రూపురేఖలతో పలకరిస్తాయి. రాకుమారులు, రాకుమార్తెలు, ఇచ్ఛాపూరణ్ ఠాకురాణీలు, నిద్రాదేవతలు, అప్సరసలు, యక్షులకు కొదవలేదు. కుట్రలు కుతంత్రాలు మంత్రాంగాలు, గూడు పుఠాణీలు, వాటిని భగ్నం చేసే చాతుర్యం కలిగిన కథానాయకుల ప్రస్తావన సంగతి సరేసరి.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

అడ్డం కాళ్ళకు ధరించే అలంకార విశేషం సమాధానం: అందియ వింత వెదురుగడ పరిణాహం సమాధానం: వింగడం దుకాణం వంక వెళితే సంకేతస్థలం సమాధానం: కందువ […]

క్రితం సంచికలోని గడినుడి-91కి మొదటి ఇరవై రోజుల్లో ముప్పై మంది సరైన సమాధానాలు పంపారు. విజేతలకందరికీ మా అభినందనలు.

ఈ సంచికలో కొత్త గడినుడి లేదు. గడినుడిని మరింత ఆసక్తికరంగా చేయడానికి కొన్ని మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము. అసౌకర్యానికి క్షమాపణలు.

గడి నుడి-91 సమాధానాలు.

తెలుగులో ప్రస్తుతం స్థూలంగా రెండు రకాల కవులున్నారు. ఒకరు తమను తాము సామాజిక చైతన్యంతో అభ్యుదయవాదులుగా ఊహించుకుంటూ రచనలు చేసేవారు. రెండవవారు, తమ తమ ఆంతరంగిక, ప్రాకృతిక జగత్తులోనుండి కవిత్వం వ్రాసుకునేవారు. చిత్రంగా, ఈ రెండు కోవలకు చెందినవాళ్ళు ఒకరి కవితలను ఒకరు ప్రశంసించడం కనపడదు. వారికి వీరు కవులుగా వీరికి వారిది కవిత్వంగా అనిపించదేమో. కవులు అని ఎవరిని అనాలి? కవిత్వం వ్రాసిన వాళ్ళని అనాలి. అప్పుడు వాళ్ళ రచనలో మనం ఏం చూడాలి? వస్తువులో, అభివ్యక్తిలో కొత్తదనం, భావం, అనుభూతి సాంద్రత – ఒక్కమాటలో, కవిత్వాన్ని చూడాలి. తమ అనుభవాలను, ఆవేశాలను కవిత్వంగా మార్చదలచినవాళ్ళు ఆ పని నేర్పుగా చెయ్యగలిగితే అది వేరే సంగతి. కానీ ఏదో ఒక భావజాలానికో భావుకతకో చెందాలనే ఆరాటంలో, తమ అభ్యుదయాన్ని లేదా అనుభూతిని ప్రకటించుకోవాలన్న తొందరలో వ్రాసేవి కృతకమైన రాతలు, కవితలు కావవి. అంటే, కవిత ఎత్తుగడతో సంబంధం లేకుండా ప్రయత్నపూర్వకంగా చొప్పించే భావుకత, వెలిబుచ్చే ఆవేశం కవితని బలోపేతం చెయ్యవు. మరొకలా చెప్పాలంటే, నిజాయితీ లేమి కవితలను నిర్జీవం చేస్తుంది. ఒక కవిత/రచన పాఠకులను చదివించలేకపోతే, ఆలోచించనీయకపోతే, వారు దానితో కాసేపైనా మమేకం కాలేకపోతే, ఎవరికోసమైతే వ్రాశారో వారితో సహా ఎవ్వరికీ అందకుండా అది ఒక వ్యర్థప్రయత్నంగా మిగిలిపోతుంది. అసహనం, ఆవేశం, అనురాగం, సున్నితత్వం–ఇవేమీ తప్పులు కాదు, కవులకు రచయితలకూ ఉండకూడనివీ కావు. కాని, ఒక రచనకు ఇవి ముడిసరుకులు మాత్రమే. వీటిని కథగా కవితగా మలచాలంటే పరిశ్రమ కావాలి. రచయిత చూపు పక్కకు చెదరకుండా, రచన ఆసాంతం ఆ బిగి సడలకుండా ఉండాలి. తనకు తెలిసినదల్లా, తాను అనుభవించినదల్లా చెప్పాలనే అత్యుత్సాహం, ఒకే అంశం మీద నిలబడి మాట్లాడలేని అసహనం వదలాలి. అట్లా మాట్లాడేందుకు తగిన సరుకు పోగుచేసుకునేందుకు కృషి చేయాలి. ఎందుకంటే సమస్య ఎంత జటిలమైనదయినా, అనుభూతి ఎంత లోతయినదయినా అది పాఠకుల దగ్గరకు చేరకపోతే ఆ రచనకు విలువ లేదు. కవితలో కేవలం స్పందనే కాదు, అది ప్రకటించడంలో కొంత వివేచన కూడా ఉండాలి. ఆ వివేచన ఊతంగానే పాఠకుడు రచనను, రచన పాఠకుడిని పట్టుకుని ఉండగలిగేది. ప్రస్తుత తెలుగు సమాజంలో కవిత్వానికి విలువ తగ్గిపోయింది, కవులంటే హేళన పెరిగిపోయిందీ కవిత్వాభిమానులు లేకనో, కవిత్వాభిరుచి పోయో కాదు. కవులమని చెప్పుకుంటూ అకవిత్వాన్ని మోస్తున్నవారు, కవులమని చెప్పుకుంటూ అకవిత్వాన్ని ప్రచురిస్తున్నవారు ఇందుకు కారకులు. తాము వ్రాసిందంతా కవిత్వమనుకునే వారి వెర్రి ధోరణి దీనికి కారణం. కవిత్వం వ్రాయాలీ అంటే ముందు కవిత్వం చదవడం నేర్చుకోవాలి. ఒక కవితను కూలంకషంగా చదివి విశ్లేషించగలగాలి. దానిలోని లోతుపాతులు బేరీజు వేయగలగాలి. కవి తన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా, భావస్ఫోరకంగా ప్రకటించగలిగాడో లేదో, తన ఆశయంలో కృతకృత్యుడు కాగలిగాడో లేదో గమనించగలగాలి. ఇలాంటి శ్రమతో మాత్రమే ఏది ఏ స్థాయి కవిత్వమో బోధపడుతుంది. కనుక కవులారా, మీరు వ్రాసిన ఏ కవితనయినా అందులో వస్తువు కొత్తదనం ఏమాత్రం, పోలికలలో కొత్తవి ఎన్ని, అభివ్యక్తిలో నవ్యత ఎంత, అన్న మూడు ప్రశ్నలతో సరి చూసుకోండి. కవిత్వానికి కొలమానాలు ఉండవు లాంటి మాటలు ఉట్టి అపోహలు. అవి బలిమి ఉన్న కవిత్వాలకు. మీరు భేషుగ్గా మీ మీ కవిత్వాలను కొలిచి చూసుకోండి. మీ కవిత్వం ఏదో ఒక స్థాయికి తూగే దాకా మిమ్మల్ని మీరు కవులు అని చెప్పుకోవడానికి సంశయించండి. కవిత్వాన్ని కొలవగల తూనికరాళ్ళు లేకపోలేదు, గుర్తుంచుకోండి.

ఆండీస్ పర్వత శ్రేణి విస్తరించి ఉన్న దక్షిణ అమెరికా దేశాలలో మొక్కజొన్ననుంచి తయారు చేసే చిచా అన్న మదిర తెప్పించుకొని రుచి చూశాను. ఆ పానీయం ఆ ప్రదేశాల్లో మాత్రమే తయారవుతుందట. దాని మూలాలు ఇన్కా నాగరికత పూర్వపుదినాల నాటివట. ఇన్కా ప్రజానీకం కూడా పండుగలు పబ్బాలలో ఈ మదిరను కాచి విరివిగా సేవించేవారట.

సాయంత్రం కాగానే రాత్రంతా బాగా చదవాలని ఒకరికొకరం ప్రమాణాలు చేసుకుని మిద్దె మీద చేరేవాళ్ళం. పుస్తకాలు ఇక తెరుద్దాము అనుకుంటుండగానే కొత్తగా పెళ్ళయిన జంటలు, పెళ్ళి పాతబడిన జంటలు కూడా వారి వారి మేడల మీదికి దిండూ పరుపులతో సహా ఎక్కేవారు. వారికి మేము కనపడేవాళ్ళం కాదు. వాళ్ళు మాకు కనపడేవారు.

2019లో ఒక అభిప్రాయవేదికని నిర్వహించిన అమెరికన్ పాత్రికేయుడు బ్రెట్ స్టీవెన్, విలా కేథర్‌ని డానల్డ్ ట్రంప్‌కు ఆంటీడోట్‌గా పేర్కొన్నాడు. అమెరికాను గొప్ప దేశంగా చేసే లక్షణాలేమిటో విలా నవలలు చెబుతాయని విమర్శకులు ప్రశంసించారు. ముఖ్యంగా ట్రంప్ విధానాలు విలా కేథర్‌ని చదవాలను గుర్తుచేశాయని అన్నా తప్పులేదు.

కీర్తనల్ని వాగ్గేయకారులు పాడుతూనే రచిస్తున్నారు. త్యాగరాజు, క్షేత్రయ్య, రామదాసూ తమ కీర్తనల్ని పాడేశారు గాని, సాహిత్యం ముందు కట్టుకుని స్వరములు వేరే కట్టుకోలేదు. అంటే, కీర్తనలోని రాగం అసలుతో చేరే బయటపడుతోందని నా అభిప్రాయం. కీర్తనలోని రాగం పుట్టుకతోనే ఉంది. అల్లాగే పద్యాలతో చేరి రాగాలు రావడము లేదు. వివరంగా మనవి చేస్తున్నా. ఒక్కొక్క కవి ఒక్కొక్క రాగంలో పద్యాల్ని పాడుకున్నట్లు చెప్పేను.

ఇవ్వాల్టి కోసమే నిన్నటి కాటుక కారిన కంటితో
వేల మైళ్ళ కాలి మాల కట్టుకుని, రాళ్ళు వదిలే ఊపిరిగా…
రెక్కల కొమ్మల భుజాలని ఇచ్చాను.
గుమ్మడి పూల ఒళ్ళు అలవాటులో పడి చుక్కల ఆకాశం తెప్పల రాగం పాతగా పాడింది.
చెక్కిన ఏనుగు దంతపు మొనతో అధికార వసంతపు ఆట.

ఈ ముసలోడెందుకు ఇంతలా శివా! శివా! అని కేకేస్తూ ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాడో అని కూడా అనిపించసాగింది. సమయం దొరికినప్పుడల్లా చిలకస్వాముల పక్కన చేరి ఆయన్ని ఆటపట్టించడంలో ఆనందం పొందాడు. రోజులు గడిచిన కొద్దీ చిలకస్వాములతో ఒక మాటయినా మాట్లాడించాలని పంతం పట్టాడు అర్చకస్వామి. అయితే అది అంత సులువయిన పనిగా అనిపించలేదు. చాలావరకు చిలకస్వామి ఏ రకంగానూ ప్రతిఘటించేవాడు కాడు.

మా తాతవాళ్ళు పసిఫిక్ సముద్రంలో ఉన్న ఛానల్ ఐలాండ్స్‌లో ఉండేవాళ్ళట. అక్కడకి సీ లయన్స్ వచ్చేవట, అవి మేటింగ్ సీజన్లో సముద్రపు ఇసుకలోకి చేరేవి. ఒకసారి ఒక సీ లయన్ పుట్టాక దాని తల్లి చనిపోయిందట, తండ్రి సముద్రంలోకి వెళ్ళి తిరిగి రాలేదట. ఆ సీ లయన్‌కి రాస్ అని పేరుపెట్టి మా తాత పెంచుకున్నాడు. మా అమ్మ, రాస్‌తో దగ్గరగా పెరిగిందట. రాస్‌కి మా అమ్మ అంటే అలవికాని ప్రేమ.

ఈసారి ఆయన నాకేసి మరింత కోపంగా చూశాడు. ఊ… అంటూ ఓసారి దీర్ఘం తీసి, ‘ఇంకెక్కడి నందు వాళ్ళమ్మ? నేనెప్పుడో దాన్ని పీక పిసికి చంపేశానుగా’ అన్నాడు. ఆ మాటతో నా గుండెలవిసిపోయాయి. కాళ్ళ క్రింద భూమి కదలిపోయింది. ఆ పరాయి ఊరిలో… ఆ చీకట్లో…

నాకు
పిక్కలు కనబడేలా వంగి
ముగ్గులు వేసే ఎదురింటమ్మాయి
కమ్యూనిజంతో మొదలు పెట్టి
కామసూత్ర వరకు మాట్లాడే
టీ కొట్టు నేస్తాలు

పుణికి పువ్వులు పుచ్చుకున్నట్టు
కిందపడ్డ పొగడపువ్వులు
ఏరుకున్నట్టు

జ్ఞాపకాల్లోకి వెళ్ళడానికి
దారితీసే మాటలు
పెదాలమీదకి తుళ్ళుకుంటూ వచ్చే
బాల్యం లాంటి మాటలు

‘నాన్నగారూ, మిమ్మల్ని కదలొద్దని చెప్పాను. ఒక చోట కూర్చోండి నేను చెప్పేవరకు’ ఇందాకటి గొంతే. పెద్దవాళ్ళు ఉన్నట్టున్నారు. సాయం చేద్దామని ఉన్నా వాళ్ళకి చేసే ఓపికుండదు. కాళ్ళకి చేతులకి అడ్డంగా అనిపిస్తారు. ప్చ్! సాయంకాలం మా ఇంటికి పిలిచి కూర్చోపెట్టుకోవాలనుకున్నాను. ఇంతలో పెద్దగా ‘నాన్నగారూ!’ అన్న కేక వినిపించింది. పెద్దాయన్ని మరీ అంత ఘట్టిగా కోప్పడుతోంది. ఎంత తండ్రి అయినా పాపం కదూ! కూతురు కేకలకి బిక్కచచ్చిపోయుంటాడు.

మూడు మైళ్ళు పరుగెట్టాక కట్టెలకు వెళ్ళిన ఇద్దరూ ఎదురుగా వస్తూ కనిపించేరు. వాళ్ళు నిజంగానే చుట్టలు తాగుతూ కాలక్షేపం చేశారు. కట్టెలు ఇంకో గంటలో వస్తాయని వీరితో బొంకారు. ఈ ఇద్దర్నీ చూశాక పరుగెట్టే ఇద్దరూ ఆగి చెప్పారు శవం కదలడం, మూలుగు వినడం అవీ. ఇది విన్న వాళ్ళు వీళ్ళని వెక్కిరించారు పిరికిపందలని. మొత్తానికి నలుగురూ కలిసి మరోసారి శ్మశానానికి తిరిగొచ్చారు. గుడిసెలోకి వెళ్ళాక తెల్సింది – కాదంబిని శవం అక్కడ లేదు.