మెదడులలో ఉండే జీవకణాలని న్యూరానులు అంటారు. ఇవి శరీరంలోని ఇతర జీవకణాలవంటివి కావు. ఈ న్యూరానులని కొన్నింటిని ఒక జాడీలో వేసి అలా వాటి మానాన్న వాటిని వదిలేస్తే కొంతసేపట్లో అవి ‘ఆలోచించడం’ మొదలెడతాయి! ఈ వాక్యం కాసింత అతిశయోక్తి అనిపించినా, ఇది హాప్‌ఫీల్డ్ పరిశోధన సారాంశం.

కావ్యాన్ని ముక్కలు చేసి
చిదిమేయకు
చలిమంటలో పడేయకు
ఏ వాక్యంలో
ఏ విస్ఫోటనం ఉందో!

తెల్లారిందని
దీపం ఆర్పేయకు

కర్ణుళ్ళం కాదు, కిరీటాల్లేవు
కవచకుండలాలూ కరువేనాయె.
ప్రాణమున్న గోధుమ పిండి బొమ్మలం
వత్తేసి కాల్చినా, వాయనాలై ఎటెటో వలసపోతాం.

నరకడానికి ప్రతి ఒక్కడూ సిద్ధమే, కానీ
ప్రాణం పోయడానికే పరమశివుడొక్కడూ దొరకడు

కంప్యూటర్ కాదు
పొద్దు వాలిన జీవితం
రిఫ్రెష్ బటన్ నొక్కగానే
కరప్ట్ ఫైళ్ళను యాంటీవైరస్‌తో
ఉదయంలా శుభ్రపరచడానికి.

ఇది సెలవు తీసుకుంటున్న
నిస్సాయ సంధ్య.

భూమి ఉందో, లేదో తెలీదు
నీరు ఉందో, లేదో తెలీదు
ఆకాశమూ, చుక్కలూ తెలీదు
జీవితం ఉందో, లేదో తెలీదు

అలాంటిదొకటి గడిచిందని తెలీదు
ఉత్త ఖాళీ, ఖాళీ కూడా తెలీదు

గత జీవితం ఎప్పుడూ
జ్ఞాపకాల సమాహారం కదా
జ్ఞాపకానికీ, మరుపుకీ లోబడి
ఆశ్చర్యంగా ఎన్నాళ్లో గుప్తంగా ఉన్నవి
అకస్మాత్తుగా బయటకొస్తాయి
ఎవరికైనా అసంపూర్ణ
పునర్నిర్మాణమే కదా గతం

అక్కడ ఉత్తర దిక్కును చుట్టుకుని
పీక నులిమేస్తోంది వర్షం
రహదారులతో పాటు ప్రాణాలను మింగి
భీభత్సనృత్యం చేస్తోంది వర్షం
పగ పట్టిన పాములా
బుసలు కొడుతోంది వర్షం

కానీ నేస్తం, చేస్తూనే ఉండు
నువు చేస్తున్నాననుకునే ఆకూస్తా
నీకో తృప్తి, నీ పైవాడికీ అదే తృప్తి;
తీరని దప్పిక, తెలిసీ తప్పదిక
నీవారనుకునే వారు, ఎవరో అనుకునే
వారూ అందరూ ఒకరే

పేరు గుర్తులేదు కాని, నా చిన్నతనంలో, చచ్చిపోతున్న ఒక భాషలో చివరి మనిషైన ఒక కొండప్రాంతానికి చెందిన ముసలామె వినేవారెవరూ లేక, ఒక పక్షితో తన భాషలో మాట్లాడిందని ఎక్కడో చదివేను. ఆ వార్త నన్ను కదిలించిన వైనం నేనెప్పటికీ మరిచిపోలేను. తరువాతనుండీ అనేకభాషలలో చివరివారి గురించి ప్రచురించబడే వార్తలు అడపాదడపా చదువుతూనే ఉన్నాను. ఒక భాషయొక్క ప్రతీ చివరి వ్యక్తి – అది స్త్రీ అయినా పురుషుడైనా వారు చేసేది ఇంతే.

లీలాశుకుడు 17వ శతాబ్దపు కవి. యౌవనోద్రేకంలో వేశ్య చింతామణిని తగులుకొని దారి తప్పాడు. ఒక భయంకరమైన తుఫాను రాత్రి నానా అగచాట్లూ పడి ఆమె ఇంటికి పోతే ఆమె కాస్తా ఈ మాంసపుముద్దకోసం మనసుపడి యింత తుఫానునూ లెక్కచేయకుండా వచ్చావే, ఈ మనసుని ఆ భగవంతునిపై నిలుపరాదా అన్నది. అంతే ఆయన తక్షణం విరాగియై భగవన్నామస్మరణలో పడ్డాడు. ఎంతో మధురమైన భక్తికవిత్వం చెప్పాడు.

ఒక ముఖంలో రెండు నాలుకలు
ఒకే నాలుకతో రెండు జీవితాలు.
సిగ్గు చెరుపుకుని
బుద్ది విప్పేసి నగ్నంగా వీధిలో
మురుగు కాలువల్లా పారుతూ
చింది పడుతుంటారు.

తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే ఆమె జిజ్ఞాసకు అక్కడి పరిచయాలు ఎంతో తోడ్పడ్డాయి. చదివిన పుస్తకాల వల్ల ప్రపంచాన్ని మార్చటం సాధ్యమే అనే అభిప్రాయం ఏర్పడింది. వామపక్ష రాజకీయాలు అర్థవంతమైనవి అనిపించింది. ప్రపంచమంతా విప్లవాలు జరుగుతున్న సమయమది. ఆ ప్రభావం క్యాంపస్‌లో చాలా ఉంది.

కుగ్రామంలో పుట్టి పెరిగి, పట్నానికి వెళ్ళి, దాన్ని వదలిపెట్టి అడవి దాపుకి వెళ్ళిన కవి మనిషినీ ప్రకృతినీ పునర్దర్శించి వాటి మధ్యనున్నది, ఆదిమానికీ ఆధునికానికీ మధ్యనున్నదీ అయిన ఒకే అనుబంధాన్ని కనుగొని జీవితానికి అర్థమేమిటనే అందర్నీ తొలిచే ప్రశ్నను ఆదరించి చేసిన కవనయజ్ఞఫలాన్ని పఠితలకిస్తూ వినయంగా తల వంచాడు.

‘వందేళ్ల కథకు వందనాలు’ అర్పిస్తూ సమర్పించిన 118 కథనాల్లో కేవలం 12 మంది రచయిత్రులు మాత్రమే దర్శనమిచ్చారు. రచయిత్రి శీలా సుభద్రాదేవిగారిని ఆ విషయం బాధించింది. వ్యక్తిగత ఆసక్తితో కథాసాహిత్య నిర్మాణంలో రచయిత్రుల భాగస్వామ్యం గురించి ఆమె ఆరా తీస్తూ పోతే, ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి.

శ్రీదేవి కథలలోని పాత్రలన్నీ సజీవ చైతన్యంతో ఉంటాయి. దృఢమైన వ్యక్తిత్వం కలిగివుండి, జీవితంపైన స్పష్టమైన అవగాహన కలిగివుంటాయి. వేసే ప్రతీ అడుగూ తడబడకుండా ఆచితూచి వేస్తాయి. పొరపాటున అడుగు పక్కకు తప్పినా దానికి మరొకరిపై నింద వేయవు. తమ తప్పిదాన్ని తామే తెలుసుకుని మేలుకుంటాయి.

కథకునిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా భిన్న ప్రక్రియలలో శతాధిక గ్రంథాలను వెలువరించిన ఆవంత్స సోమసుందర్ అభ్యుదయ కవిగా తెలుగు సాహిత్యరంగంపై చెరగని ముద్ర వేశారు. ఈ వ్యాసం ద్వారా సోమసుందర్ రచించిన గేయసంపుటులు, మినీ కవితలను కొద్దిగా పరిచయం చేస్తాను.

ఈ కథకు ఇంత గుర్తింపు ఎలా వచ్చింది అన్న ప్రశ్న కలగవచ్చు. ఒకసారి చదవంగానే పూర్తిగా అర్థమయ్యే కథ కాదు. చదివిన ప్రతిసారి కొత్త కోణాలను, లోతులనూ చూపించే కథ. పాత్రల అంతరంగాలు, మనస్తత్వాలు అర్థం చేసుకోవడంలో మెదడుకు పని కల్పించే కథ. అందుకే గొల్లపూడి మారుతీరావు ఈ కథను నిగూఢత, మార్మికత ఉన్న మిస్టిక్‌ స్టోరీ అన్నారు. కుముదం మృత్యువుతో ముగిసిన ఈ కథ మనస్సులో నిశబ్దతను, విషాదాన్ని నింపుతుంది.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

సమాజంలో అభ్యుదయం, ప్రగతి అంటే ఏమిటి? ఒక తరం తన వారసత్వ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పదిలపరచుకొని, దానినుండి నేర్చుకొని, సమకాలీన పరిస్థితులతో అన్వయించుకొని ఆపైన ఆ సంపదకు తమ వంతు జ్ఞానాన్ని జోడించి ముందుతరం వారికి ఇవ్వడం. తన సాహిత్యకళావారసత్వ సంపదను నిరర్థకమని, అప్రస్తుతమని విసర్జించే సమాజం కేవలం ఒక నిలువనీటి మురికిగుంట. ఈ పోలిక ప్రస్తుత తెలుగు సాహిత్య సమాజానికి నప్పినంతగా ఇంకే సమాజానికీ నప్పదు. కళాకారులకు, సృజనశీలులకు కులం, మతం, వాదం వంటి బురదను అంటగట్టే సంప్రదాయాన్ని తెలుగువారు ఇప్పటికీ బలంగా నిలుపుకుంటున్నారు. ఇప్పుడు సాహిత్యకారులు కూడా నిర్లజ్జగా ఆ సమూహాల్లో చేరి ముందు నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు పాఠకులు, సాహితీవేత్తలు ఇంకా గతకాలపు రచయితలనే పట్టుకు వేలాడుతున్నారు, వారి రచనలనే ప్రస్తావిస్తున్నారు తప్ప తమవంటి సమకాలీన రచయితలను గుర్తించటం లేదు, చదవటం లేదు అన్న ఆక్రోశం ఒకటి ఇటీవల కొంత తరచుగా వినిపిస్తున్నది. ఈ రచయితల ఆక్రోశం వెనుక ఉన్నది కేవలం అజ్ఞానం, అసమర్థత. వీరిని బావిలో కప్పలుగా పోల్చటం అసమంజసం. కప్పలకు అవి ఉండే బావి గురించి కొంతయినా అవగాహన ఉంటుంది. నిర్బంధంగా ఎవరూ ఏ రచయితనూ ఎవరి చేతా చదివించలేరు. ముందు తరాల రచయితల పేర్లే ఇంకా వినబడుతుండడానికి కారణం తెలుగు పాఠకులలో ఉత్తమసాహిత్యాభిరుచి ఎంతో కొంత ఇంకా మిగిలే ఉండడం; ఆ రచనల్లోని వస్తుపరమైన సార్వజనీనత, రచనాపరంగా వారు చేసిన ప్రయోగాలు, తెచ్చిన విప్లవాలు, ఆయా రచనల ద్వారా వారు నేర్పిన పాఠాల సార్వకాలీనత… ఇలా, ఈ కాలం రచయితలు తమ రచనల నుండి తీసి చూపించలేని ఎన్నో గొప్ప లక్షణాలు ఆ రచయితల రచనల్లో ఉన్నాయి. సమకాలీన రచయితలలో పాఠకులను ఆద్యంతం తన కథనబలంతో చదివించి, కథావస్తువు పట్ల ఆలోచన రేకెత్తించగల రచయితలు బహుకొద్ది మంది. ఒక అజెండాతో మాత్రమే రచనలు చేసే రచయితలు నాసిరకం పాఠకులను, వారు కొట్టే తాలు చప్పట్లను కోరుకుంటారు. మంచి రచయితలు తమ వ్యాసంగాన్ని నిర్విరామంగా మెరుగు పరుచుకుంటూ, మంచి పాఠకులను మెప్పించే ప్రయత్నం చేస్తారు. వారిలో ఆలోచననూ రేకెత్తించగలుగుతారు. తమను గుర్తించటం లేదని ఆక్రోశించే రచయితలది ఏ కోవో చెప్పనక్కర్లేదు. తెలుగు సమాజంలో కుహనా వాదరచయితలకు, వాళ్ళకు జేజేలు పాడే భజంత్రీలకు ఏనాడూ లోటు లేదు, ఉండదు. సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసినంత మాత్రాన అవి సాహిత్య రత్నాలయిపోవు. బ్రాహ్మణులనో, హిందువులనో కేరికేచర్ విలన్లుగా చూపుతూ సైక్లోస్టయిలు కథలు వరుసగా అచ్చోసినంత మాత్రాన అవి అస్తిత్వవాద సాహిత్యపు ఆణిముత్యాలయిపోవు. ఈ ధోరణులు తెలుగు సాహిత్యానికి పట్టిన పుళ్ళు! గాజుముక్కలను చూసి రత్నాలనుకునేంత అవివేకులు కారు తెలుగు పాఠకులు. ఏది మంచి సాహిత్యమో ఏది కాదో, ఏది నిలుపుకోవాలో ఏది పారవేయాలో వారికి బాగా తెలుసు. ఇక, ఇలా ముందు తరాల రచయితల పేర్లే ఇంకా వినపడుతుండడానికి కారణం మైనారిటీ రచయితలను తొక్కివేయడం కోసం అగ్రవర్ణాలు పన్నిన వ్యూహం అని ధ్వనింపచేయబూనడం తెలుగు రచయిత అందుకున్న కొత్త లోతు. తమ రచనాపటిమతో కాక రాజకీయంతో సమాజపు గుర్తింపు కోసం చేస్తున్న యాచన ఇది! తెలుగు సాహిత్యకారులు ఇంతకంటే దిగజారలేరు అనుకున్న వారికి ఇదొక కనువిప్పు. ఇటువంటి వారిని నిగ్గతీసి నిజస్వరూపం చూపి వారిని వెలివేయలేని సాహిత్యసమాజాన్ని సభ్యతతో పరామర్శించవలసిన అవసరం కనపడదు.

మనసు తరచూ మరో ప్రశ్న వేస్తుంది. ఈ ప్రశ్నకు నా మనసిచ్చే జవాబు – ఖర్చులూ ఫలితాల సంగతి నాకు అనవసరం. ఏదో సాధించాలని నేను ప్రయాణం చెయ్యడం లేదు. ప్రయాణమే నా జీవితం కాబట్టి ప్రయాణాలు చేస్తున్నాను. జీవించడానికి నాకు తెలిసిన ఒకే ఒక మార్గం ప్రయాణం…