పిచ్చివాడు వాళ్ళమధ్యకు దూకి, వాళ్ళను తీక్షణంగా చూశాడు. “ఎక్కడికెళ్ళాడు దేవుడు?”, అని అరిచాడు; నే చెబుతా. మనం చంపేశాం, నీవూ, నేనూ. మనమంతా ఆయన హంతకులం. కాని, ఎలా చంపాం? సముద్రాన్ని ఎలా తాగగలిగాం? ఆయన ఆనవాళ్ళు లేకుండా దిగంతాలను ఏ తడిగుడ్డతో తుడిచేశాం? సంకెళ్ళు తెగగొట్టి యీ భూగోళాన్ని సూర్యుడినుండి విడిపించినపుడు, మనం ఏం చేస్తున్నామో తెలిసే చేశామా? తెగిన భూగోళం ఎటు వెళుతున్నది? మనం ఎటువైపు వెళుతున్నాం? ఆదిత్యులనుండి దూరదూరంగా?
శీర్షికలు సంచికలు
మహాయాన బౌద్ధానికి చెందినదీ టిబెటియన్ బుద్ధిజం. జాతకకథల్లో చెప్పినట్టు బుద్ధుడు అనేక అవతారాలు ఎత్తిన మహనీయుడు అని వీరు నమ్ముతారు. అందులో కొన్ని జంతురూపపు అవతారాలు కూడానట. వాటి వాటి గుణధర్మాలు సామాన్యులు గ్రహించి అనుసరించాలన్నది ఆ అవతారాల ఉద్దేశ్యమట.
స్వచ్ఛమైన గాలీ, నీరు ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో చాలావరకూ ఆరోగ్యంగా వుంటారేమో. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి వాళ్ళు ఆనందంగా కూడా వుంటారనుకుంటాను. అందుకేనేమో భూటాన్ను ఆనందమయదేశం అంటారు.
రాత్రికి రాత్రే సముద్రం రణరంగంగా మారిపోయింది. గాలి భీకరంగా వీచింది. నీరు నిలువెల్లా ఉప్పొంగిపోయింది. ఆకాశం చిమ్మచీకటిగా మారింది. వేటయన్ ఊహించిన విధంగా సముద్రం తన నిజరూపాన్ని చూపిస్తున్నదని గ్రహించాడు. అలలు పడగెత్తి, ఒడ్డుకు ఉరికి పడుతూ, ప్రతీదానికంటే మరొకటి మరింత గర్జనతో ముందుకొచ్చాయి. వేటకు వెళ్లిన బోట్లలో ఒక్కటీ తిరిగి రాలేదు
ఈ ఆధునిక సిద్ధాంతాలను చూసినప్పుడు, కుమారిల భట్టు కంటే శంకరాచార్యులు, బౌద్ధులు సత్యానికి ఎక్కువగా దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది. బౌద్ధులు, శంకరాచార్యులు కూడా స్థల-కాలాలు మనోనిర్మితాలని, మనం చూసే దృశ్యాలు దేహ పరిమితుల నుంచి పుట్టాయని చెప్పారు. ఆధునిక విజ్ఞానవేత్తలు కూడా దాదాపు ఇటువంటి సిద్ధాంతాన్నే ప్రతిపాదించడం ఆబ్బురపరిచే విషయం.
మధ్య జీవితాన్ని వదిలేస్తే
పుట్టుకకి, మరణానికి
విషచషకం
మతమొక్కటే
లాల్గుడి జయరామన్ చిన్నగా నవ్వి “నేను వాయించటానికి నువ్వు ఏమి అట్టేపెట్టావు నాకు? నువ్వు కాఫీ రాగం సంపూర్ణంగా పాడేసావు. అంచేత నాకేమీ మిగల్లేదు. అప్పుడు నేను ఇంక వాయిస్తే బాగుండదు. అందుకనే పాడేయమన్నాను” అన్నారు.
“ఇవాళ మేడే!”
“అంటే?”
“అమెరికాలో, చికాగో నగరంలో కార్మికులు తమ ప్రాణాలనొడ్డి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నారు.”
“ఎవర్నువ్వు?”
“దేవుడిని. నీతో చిన్న పనుంది.”
“ఓహో… నేను అమితాబ్ బచ్చన్ని! నాకు నీతో పనేం లేదు. పోయి ఇంకెక్కడైనా పని చూసుకో.”
ఎటు పొంచియున్నాడొ యెక్కుపెట్టిన యమ్ము
కటునిషాదుం, డెంత కఠినమా హృదయమ్ము
త్రుటిలోన నేసె నాతురముగా గురి చూసి
చటుకునన్ మగపక్షిఁ జంపె గుండెను దూసి
వేదశాస్త్ర ఆగమ పురాణములెల్ల
తవుడు నూకల దంపుడే సుమీ!
దంచుటెందుకు? చెరుగుటెందుకు?
చెదిరే మనసును నిలుపగలిగిన
అంతా బట్టబయలు చెన్నమల్లికార్జునా!
నీ ప్రియుని రహస్య భాషణ
నువు మాత్రమే వినవలసి ఉంది
తయారుగా ఉన్నావా, లేదా
తనతో ఏకాంత సమాగమానికి
కాలం మాయాపసరు-
గాయాన్ని మచ్చగా, మచ్చని జ్ఞాపకంగా
జ్ఞాపకాన్ని శిలాజంగా పదిలం చేస్తుంది
ఆ లేఖలన్నీ చేరినప్పుడే కదా,
మన చుట్టూ అడవులు విస్తరించేది
అందరికీ నాలుగు వేళ్లూ నోట్లోకి పోయేది!
మనది పరిశుభ్రత అంటే చాలా పట్టింపు గల వంశం అన్నమాట. అన్నిటినీ శుద్ధి చేసే ఆ అగ్నిదేవుడే కానీ, మనింటోకి రావాలంటే చన్నీళ్ళు స్నానం చేస్తేగానీ రావడానికి వీల్లేదని అర్థం.
సంధ్య కొమ్మల మీద
సన్నాయి పాటలు
ఊపందుకున్నాయి
మంచు తెరల చాటుగా
మబ్బుల కళ్లు
తొంగి చూస్తున్నాయి
మరొక శరీరం ఉంటుంది
దీనికి అలుపు లేదు, ఆశాభంగం లేదు
వయసు లేదు, వృద్ధాప్యం లేదు
ప్రాణమై ప్రవేశించే ఒక పద్య పాదం కోసం
అనంత కాలం నిరీక్షిస్తుంది
వలసతో ఏం కోల్పోతున్నామో అందరికీ తెలుసు.. కానీ వేరే దేశానికైనా, పట్టణానికైనా మన వలసలు తప్పట్లేదు. ఎక్కడ ఆపాలో తెలుసుకోగలిగే శక్తి మనిషి మెదడు నుండే పుట్టాలి. ఈ కథలు అట్లాంటి మెదడుకు మేత.
రఘు శబ్దాల రంగూ రుచీ వాసనా పూర్తిగా తెలిసిన కవి. కనుక ఏ మండేన్ (mundane) విషయమైనా ఈ కవి తన టెక్నిక్ సంచిలో ముంచి తియ్యగానే, ఆ విషయం మురిపెంగా మనను ముద్దాడుతుంది. ఇంతకు మించి ఏ కవీ సాధించలేడు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ.