అమద్యాబాద్, 1 జనవరి: నూతన సంవత్సర సందర్భంగా నగరంలో తెలుగు తాగుబోతుల సమావేశం అట్టహాసంగా జరిగింది. ఎప్పణ్ణుంచో తాగుతున్నవాళ్ళు, ఇప్పుడిప్పుడే తాగడం మొదలు పెట్టినవాళ్ళు, […]
శీర్షికలు సంచికలు
ఒకానొక కాలంలో విశ్వాసం ఒక జీవితకాల సాధన. మించి సాధించదగింది లేదు. ఈనాడు ‘నేను విశ్వాసిని’ అని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నాం. మనకు విశ్వాసం వద్దు. అది మూఢులకు. మనం మేధావులం. విశ్వాసం నీళ్ళను మద్యంగా మారుస్తుంది. మనకీనాడు మద్యం మంచినీళ్ళు.
“నేను నీకు చేసిన ద్రోహం ఏదీ లేదు. మన బిజినెస్లో డబ్బులేమీ నొక్కేయలేదు. అయినా అంతమాత్రానికే కాల్చిపడేయరు కదా ఎవరూ! నీ గురించి చెడు ప్రచారమేదీ చేయలేదు నేను. నీకు రావలసిన దేన్నీ తన్నుకుపోలేదు. మా మధ్య ఏదన్నా నడుస్తుందని అనుమానించడానికి సుజనతో అంత క్లోజ్గా ఎప్పుడూ లేను.” ఆగి అన్నాడు, “ఎవడన్నా నా మీదో, సుజన మీదో కోపం పెట్టుకుని ఫొటోలు మార్ఫింగ్ చేసి నీకు పంపుతారంటావా?”
ఈ పర్వతాల రంగులు కూడా వివిధ సమయాల్లో వివిధ రకాలుగా మనకు కనబడతాయి. సూర్యోదయ సమయంలో నారింజరంగు కలసిన పసిడి వర్ణం, మధ్యాహ్న సమయంలో మచ్చ లేని ధవళ వర్ణం, సూర్యాస్తమయ సమయంలో ధగధగల బంగారు వర్ణం… క్రమక్రమంగా అరుణారుణ గిరిశిఖరం!
ఆవిధంగా నేను బాగా గమనించింది ఏంటంటే, N ఏమాత్రమూ ఏదీ పట్టించుకునే పరిస్థితిలో లేడు, తన కుర్చీ చేతులను గట్టిగా పట్టుకుని అటూ ఇటూ మెలికలు తిరుగుతున్నాడు, కనీసం ఒక్కసారి కూడా నావైపు తలెత్తి చూళ్ళేదు, అయోమయంగా అగమ్యగోచరంగా ఉన్నాయి అతని చూపులు, శూన్యంలో దేనికోసమో వెతుకుతున్నట్టు, నేను మాట్లాడేదాంట్లో ఒక్క అక్షరం కాదు కదా అసలు నా ఉనికి కూడా ఆయన ఎఱుక లోకి కూడా వెళ్ళుండదు.
తోటాన్ అందులోకి కనెక్ట్ చేసుకుని రిసీవర్ చెవికీ భుజానికి మధ్య నొక్కి పట్టుకుంటారు. అదే ఒకే తీరున చెవిలో ర్ర్ర్ర్ర్ర్ మంటూ మోగడం మొదలవుతుంది. తోటాన్ అది వింటూ ఉంటారు. ఆయన తల వేలాడదీసిన లోలకంలా అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. కాసేపటికి ఒక పక్కకు ఒరిగిపోతుంది. కళ్ళు మూసుకుపోయి, నోరు తెరుచుకుని, భుజాలు సడలి పక్కనున్న ఆలివ్ గ్రీన్ బీరువా మీదకు ఒరిగిపోయి కూర్చునుంటారు.
పట్టుపురుగు కోరి యిల్లు కట్టుకొనగ
తనదు పట్టు తననె చుట్టి చచ్చినట్లు
మదిని రేగు కోర్కెలు మనిషిని బంధించునయ్య!
నా మనసు దురాశల నాశమొందగజేసి
నీ దరిని జూపు చెన్నమల్లికార్జునయ్య!
మనకు లాగే గగనానికీ
ఓ గాంధీ ఉన్నాడట తెలుసా!
గాంధీ పోయినరోజు తప్ప
364 రోజులు కనిపిస్తాడట!
వింటే ప్రతిచుక్కా
ఇలాంటి కథేదో చెప్తుంది!
సముద్రమొద్దు
నదీ సంగమమసలే వద్దు
ఉత్తరాయణం వేళ
చలి తగిలిన ఎండలో
ఆకులు రాలే మంచు పొడిలో
బ్రతుకుచెట్టు నన్ను విదిలిస్తుందా!
చీకటిని ఆహ్వానించారు
కరెంట్ను తరిమికొట్టి
నక్షత్రాలు వెలిగించారు
ఎక్కడో, ఈ భూగ్రహంపైనే
గాలి చెలరేగిందిట.
ఎవరో సత్యాన్ని కనుగొన్నారట.
పైన పోతున్న పక్షుల గుంపు
పచ్చదనాన్ని పాటగా
గూట్లోకి తీసుకెళ్తున్నాయి
పాటలు వింటున్న పీతలు
బొరియల్లో
మాగన్నుగా కునుకు తీశాయి
పలుగులు పట్టిన
మేధావుల తవ్వకాల్లోనూ
కాలుష్యం పొర్లి ప్రవహిస్తుంటుంది
ఎవరి పల్లకీ ఎవరు
ఎందుకు మోస్తున్నారో
బోయీలకు సైతం బోధ పడదు
వార్ధక్యపు నడక
వాక్యంలా జీవితం
మంచినీళ్ళ పెద్ద ఊట చెలిమి
ఇప్పుడు ఎండిపోయింది
బతుకు గానుగ ఎద్దై
చుట్టుచుట్టూ తిరుగుతుంది
ఆ మొక్కలూ మొదళ్ళ చుట్టూ మన్నూ
పచ్చని తోటగా కొత్తరూపులెత్తాక
కొమ్మకొమ్మకూ పిట్టలు చేరికయ్యాయి
వాటిలో యాంగ్రీబర్డ్స్ కొన్నుంటాయని
అవి యుద్ధానికి కాలు దువ్వుతాయని
మాకు తెలీలేదు
మీకూ తెలిసినట్టు లేదు.
కాలం క్షణికమా? శాశ్వతమా? స్థిర రాశా? చర రాశా? మనం పరిశీలిస్తున్న వస్తువులలో వచ్చిన మార్పుని కొలిచే సాధనమా? లేక మార్పుకి మరో పేరే కాలమా? అది మనలో భాగమా? పరిశీలించే హృదయానికే దాని అస్తిత్వం అవగతమౌతుందా? లేక ఇతర అస్తిత్వాలతో సంబంధం లేకుండా తన కొక ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నదా? రెండువేల సంవత్సరాలకు పైగా ఈ ప్రశ్నలు శాస్త్రజ్ఞులని, తత్త్వవేత్తలనీ సమానంగా సవాలు చేశాయి.
వయసు, అనారోగ్యాల కారణంగా అంబేద్కర్ తన భార్యకి మూడు లక్షణాలు ఉండాలి అనుకున్నాడు. తనకు కాబోయే భార్య విద్యావంతురాలు, వైద్యురాలు, వంటనేర్చిన వ్యక్తి కావాలని ఆయన కోరుకున్నాడు. సవితా అంబేద్కర్ ఆ పాత్రలు అన్నీ ఒక ఆధునిక ఆదర్శ గృహిణిగా పోషించినట్లుగా ఆమె కథనం ఉంది.
శంతనుడికి ఒక అన్నగారు ఉన్నారన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. ఈ అన్నగారైన దేవాపి – బొల్లి (రోగం) వల్ల రాజ్యార్హతని పోగొట్టుకుని అడవులలో తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోబట్టే చిన్నవాడైన శంతనుడికి రాజ్యం దక్కింది. తరువాత తరంలో దేవవ్రతుడికి దక్కవలసిన రాజ్యం మరొక విధంగా చెయ్యి జారిపోయింది. పోనీ శంతనుడికి సత్యవతి వల్ల కలిగిన ప్రథమ సంతానమైన చిత్రాంగదుడికి రాజ్యం దక్కిందా? అదీ లేదు.
అద్భుతమైన కథలు రాసిన భగవంతం, తన కథలలో సంప్రదాయ కథన నిర్మాణాలను ప్రక్కన పెట్టి ఒక కొత్త శైలిలో కథలు రాశాడు. తన కథలు తరచుగా కాల్పనికతకి, వాస్తవికతకు మధ్యన వుండే సరిహద్దులు చెరిపేస్తాయి. అసలు కాల్పనిక సాహిత్య నిర్వచనాలను సవాలు చేస్తాయి.
మొదటి ప్రయోజనం కథను ఆసక్తికరంగా చదివించేట్టు చేయడం. రెండవది, అసలు కథంతా అందుకోసమే రాసినది; ప్రధాన పాత్రలకు, తమకు ఉన్నాయనే తెలియని ప్రశ్నలు, వాటి స్వరూపాలు వాళ్ళకి తెలిసిరావటం. మూడవది వాటికి సమాధానం ఆ మాధ్యమాల ద్వారానే దొరకటం.
ఎక్కడో సుదూరపు మధ్య అమెరికా, దక్షిణ అమెరికా ప్రజల గురించి రాసిన పుస్తకం కాదిది – సమస్త మానవాళి ఆశనిరాశలను, సుఖదుఃఖాలను, కష్టనష్టాలను, ఉత్థానపతనాలను, విజయపరాజయాలను, కరుణాక్రౌర్యాలను, స్వార్థాలూ ఉదారతలను విప్పి చెప్పే రచన ఇది.