కళ్లెదురుగానే వున్నా,
కొన్నిసార్లు ఊహించుకుంటాను నిన్ను.
నా ముందున్నప్పటికంటే మిక్కిలి సంతోషంగా వున్నట్టు.
శీర్షికలు సంచికలు
ప్రతి పాత్ర రూపుఁ జూపునుఁ
బ్రతి మాటయుఁ బ్రతి తలపునుఁ బ్రతి కదలికయున్
బ్రతి నవ్వునుఁ బ్రతి యూరుపు
నతనికి సాక్షాత్కరించి యక్షర మయ్యెన్
నీరెండవేళ తేయాకు తోటలో రికామీగా తిరిగినట్టు,
సౌందర్యవతి ముఖాన్ని చంద్రోదయానికి అర్పించినట్టు,
చేప గగనాన్ని పలకరించి నదిలో మునిగినట్టు,
భూమి సారం పూలరేకుల్లా విప్పారి
గాయపడ్డ మాటలన్నింటినీ దాచుకుని
రెండు దోసిళ్ళలో నింపుకుని
మహానిశ్శబ్దాన్ని నిర్మించుకున్నాను
శాంతి మంత్రమేదో దొరికేంతలో
మళ్ళీ నువ్వు…
చూశాను..
దూరంగా ధవళాగ్ని కాంతి బింబాన్ని మోస్తూన్న మహాసముద్రాన్ని
తోటబాటలో నా పక్కన నడిచే నత్తని
అది మెల్లగా నడిచొచ్చిన దారి స్పటికంలా మెరవడాన్ని.
బీజమే వృక్షమై పెరిగి పెరిగీ మరల
ఆ వృక్షమై చిన్ని బీజమైనట్టుగా
లింగమందుదయించి లింగమందైక్యమై
పురాతనులుగ వెలుగు జంగముల సంగమును చూడరయ్యా!
ఇంగ్లీషు విద్య చదివిన మన యువకులు తమకు తెలుగురాదనీ, తెలుగు చదవమనీ చెప్పుకోవటం గర్వం. ఇందులో గర్వించటానికేమీలేదు.
‘మరి మీ కుటుంబంలో ఎవరైనా భిక్షువులయ్యారా?’ అన్నది మా తదుపరి ప్రశ్న. నవ్వేశాడు పిసాంగ్. ‘నేను పదేళ్ళ వయసులో భిక్షువునయ్యాను. ఇరవై ఏడేళ్ళదాకా కొనసాగాను. రెండేళ్ళ క్రితమే మళ్ళా మామూలు ప్రపంచంలో పడ్డాను,’ అని సమాధానం చెప్పాడు.
ఇవేం ఆలోచించలేదు. చేతిలోవన్నీ పడేసి నేను కూడా పడిపోయాను. ఒక ఐదు నిమిషాలు ఎదురుగా కనిపిస్తున్న కేదార పర్వత సమూహాన్ని, ఎండలో మెరుస్తున్న ఆ అద్భుతాన్ని… అక్కడక్కడ మంచుతో మాసిపోయి కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని కన్నార్పకుండా చూస్తూ, చారబడితే ఎంత ఉపశమనం!
పురుగులూ పిట్టలూ ఆకులూ బస్సులూ మనుషులూ అన్నిటినీ- అలవాటైపోయిన కళ్ళు రసహీనంగా చూపించే ఈ రోజువారీ ప్రపంచాన్ని- మళ్ళీ కొత్తగా పరికించి చూడటం. ఆ సౌందర్య స్పృహతో, అది అందించిన సంతోషంతో తబ్బిబ్బవడం. ఈ “బంగారు తండ్రి” అట్లాంటి పొంగుని మళ్ళీ మన లోగిళ్ళలోకి తెచ్చే ముచ్చటైన పొత్తం.
చలాన్ని దూషణ భూషణ తిరస్కరణలు చేసేవాళ్లంతా కూడా మైదానం నవల చదివారు, ఇక ముందు కూడా చదువుతారు. పూర్వం పడకగదుల్లో దిండు కింద దాచుకుని ఎవరికీ తెలియకుండా కూడా చదివేవారట. ఇప్పటికీ నేమో. మైదానం నవల ఆకర్షణ అంతటిది.
ఏది రాశాడో అదే చలం. ఏది నమ్మాడో అదే అతను రాశాడు. ఏది రాశాడో అదే అతను చెప్పాడు. అంటే ఏ దశలో గానీ, ఏది రాశాడో దానినుంచి ముఖ్యంగా వైమనస్యం గానీ, వైముఖ్యం గానీ, చలానికి సంబంధించినంత వరకు ఏదీ మనకు కనపడదు. వర్తమాన కాలంలో తద్విరుద్ధమైన రచయితలు చాలామంది ఉంటారు. ఆ తీరుగా చలం ‘ఆత్మలోకంలో దివాలా’ తీయలేదు.
‘ఆరుగురు గుడ్డివాళ్ళు – ఏనుగు’ అన్న కథలో లాగ చలాన్ని రకరకాలుగా అర్థాలో, అపార్థాలో మనవాళ్ళు చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. నేను రెండు మూడు సార్లు చలంగారు వుండగా తిరువణ్ణామలై వెళ్ళాను. ఆంధ్ర దేశం నుండి ప్రేయసీ ప్రియులు పెళ్ళి చేసుకుందామనుకునేవారు తిరువణ్ణామలై వచ్చి చలంగారి ఎదురుగా దండలు మార్చుకునేవారు. నాకు ఆశ్చర్యం వేసింది. చలంగారేమో నవ్వుతున్నారు. ఎందుకంటే చలంగారికి వివాహ వ్యవస్థ మీద మొట్టమొదటి నుండి ఏవగింపు.
చుట్టూ ఉన్న అశాంతినీ, విధ్వంసాన్నీ, బాధనూ చూపిస్తూనే వాటినుండి ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకోవాలని కలలు కంటాడు. వాక్య నిర్మాణం, నేపథ్య చిత్రన చాలా అందంగా కవిత్వంలా ఉంది. దాదాపు అన్ని కథల్లో చిన్న కథలు, ఫ్లాష్ బ్యాక్ కథలున్నాయి. అసలు కథకంటే అవి ఓ మెట్టు పైనే ఉన్నాయి. కొన్ని కథలు చదివినప్పుడు పక్కనే కూచుని ఎవరో కథ చెప్తున్నట్టే అనిపిస్తుంది. ఆ కథ చెప్పే ఒడుపు, దానికి అమరిన శైలి, జారిపోనీయకుండా పొదివిపట్టుకున్న ఆశావహమైన కలల వెలుగు, ఈ పుస్తకపు బలాలు.
సుమారు అన్ని కథల్లో జానపద గాథల సరళి, చిన్నపిల్లల ఊహల వైఖరి దర్శనమిస్తాయి. పిల్లలనూ పెద్దలనూ సమానంగా అలరించే కథలు ఇవి. అనువాదం అంత పరిపూర్ణంగా లేకపోయినా కథల బలం కారణంగా అంతగా అది ఇబ్బందిని కలిగించదు. బాలసాహిత్యాన్ని రాస్తున్న తెలుగు రచయితలు ఈ పుస్తకాన్ని చదవితే వారికి లాభం కలుగుతుందని ఈ సమీక్షకుని అభిప్రాయం. దీన్ని రాసిన పరేశ్ పట్నాయక్ అభినందనీయుడు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
ఈమాట సంపాదక వర్గానికి మాధవ్ మాచవరం పేరు గత కొన్నేళ్ళుగా సమానార్థకంగా స్థిరపడింది. 1998లో స్థాపించబడిన ఈమాట పత్రికకు తొలినాళ్ళ నుండి ఎందరో ప్రత్యక్షంగానూ, […]
మా దగ్గరకొచ్చేకొలదీ అతని శరీరం త్వరత్వరగా పెరగసాగింది. అలా పెరిగే క్రమంలో నేను అతని అనేక రూపాలని చూశాను: టెలెస్కోప్ని ఆకాశం వైపు తిప్పడం, పైనుండి క్రిందకి పడే రాయి వేగాన్ని లోలకంతో లెక్కకట్టడం, పాదరసం ఉన్న గొట్టంతో పీడన కొలవడం. అతని రూపం బ్రహ్మాండమైంది: తల ఆకాశాన్ని అంటింది; కాళ్ళు పాతాళం లోతులని చూశాయి; చేతులు రెండు దిశలనీ తాకాయి. అతని చేతిలోని దీపం ఆకాశం అంతటా, అగాధాలలో, నేల నలు మూలలా, వెలుగు ప్రసరించింది. ఎవరీ మహాకాయుడని అడిగాను. ప్లేటో ప్రత్యక్షమయి, ‘ప్రయోగం’ అని సమాధానమిచ్చి..
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హెలెన్ కెల్లర్ 19 నెలల పసిగుడ్డుగా ఉన్న బాల్యంలోనే జబ్బుపడి వినికిడి శక్తిని, చూపుని పోగొట్టుకుంది. తనకి ప్రాప్తించిన గుడ్డితనం కంటే వినికిడిని పోగొట్టుకోవడం వల్ల కలిగిన బలహీనత, ఒంటరితనం, బాధ, ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పుకుని ఆమె బాధ పడింది.
ఈ సంవత్సరం జ్ఞానపీఠ్ అవార్డ్ ఛత్తీస్ఘడ్కు చెందిన వినోద్కుమార్ శుక్లాకు లభించింది. ఈ సందర్భంగా ఆయన రాసిన ‘దీవార్ పర్ ఏక్ ఖిడికీ రహతీ థీ’ అనే హిందీ నవల గురించి భారతీయ నవలా దర్శనం అన్న పుస్తకంలో వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు రాసిన వ్యాసాన్ని ఈమాట పాఠకులకోసం పునర్ముద్రిస్తున్నాం.