తన దృష్టికి వచ్చిన ప్రతి రచననూ, రచయితనూ ఇది మంచిది, అది మంచిది కాదు, ఈ సృజనకి నావి ఇన్ని మార్కులు! అని నిర్ణయించి తీరాలన్న నమ్మకం. చర్చకు వచ్చిన అన్ని విషయాల మీదా, తనకూ చుట్టూ ఉన్నవాళ్ళకు కూడా ఇదమిద్ధం అని స్పష్టమైన అభిప్రాయాలు ఉండే తీరాలన్న ఊహ.
శీర్షికలు సంచికలు
అమ్మా, నాకేం పేరు పెడతావు …
సుధ అంటావా, మధు అంటావా
నిధినా లేక నిశినా
రత్ననా, రశ్మినా
హిమాలయాల్లో ప్రవరుడు, భగీరథుడు తపస్సు చేసిన చోటు, శివుని కంటిమంటకు మన్మధుడు బూడిద అయిన చోటు, సప్తర్షుల భార్యలను మోహించి అగ్నిదేవుడు విరహం అనుభవించిన చోటు, కుమారస్వామి పుట్టిన చోటు – ఇలా చాలా ప్రదేశాలు చూస్తాడు.
పొగలూరే పొయ్యి కింద
తాపీగా కాలుతాయి కట్టెలు
విసన కర్ర చెప్పినట్టల్లా
తలలాడిస్తాయి మంటలు
కిసలంబుల వసనంబులు
కుసుమాభరణంబులు,పికకులభాషణముల్
లసితంబగు కనకాంగము
పొసగ న్నారామలక్ష్మి పొంపెసలారెన్.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా (TANA) తమ 18వ ద్వైవార్షిక సమావేశోత్సవాన్ని జులై 1-3న శాంటా క్లారా, కాలిఫోర్నియాలో జరుపుకుంటున్నది. వారికి మా శుభాకాంక్షలు. ఈ సమావేశాలకు తెలుగు దేశం నుంచి ఎందరో రాజకీయ కళా సాంస్కృతిక రంగాల ప్రముఖులు అతిథులుగా వస్తున్నారు. తానా సాహిత్య సమావేశంలో మేడసాని మోహన్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కాత్యాయనీ విద్మహే, మృణాలిని, వాసిరెడ్డి నవీన్ తదితరులు పాల్గొంటున్నారు. బాపూ బొమ్మల కొలువు ఈ సమావేశంలో ఒక ప్రత్యేక ఆకర్షణ.
ఈ సందర్భంగా కె.వి. గిరిధరరావు సంపాదకత్వంలో ప్రచురింపబడిన జ్ఞాపిక తెలుగు పలుకు లోని సాహిత్యాన్ని ఈమాట గ్రంథాలయంలో పొందు పరిచాము. ఇలా సావనీరులో ప్రచురించబడిన రచనలను మరెందరో పాఠకులు చదవగలిగే ఈ ప్రతిపాదనకు సాదరంగా అంగీకరించి సహకారం అందించిన తానా వారికి మా కృతజ్ఞతలు.
తెలుగు పలుకు – తానా 2011 ప్రత్యేక సంచిక
ఈ సంచికలో మీకోసం – ఆర్. దమయంతి వానజల్లుల జ్ఞాపకాలు; వేలూరి చెప్పిన కథ నచ్చిన కారణం; భైరవి రాగంపై రోహిణీప్రసాద్ సంగీత వ్యాసం; ఇంద్రాణి, ఉదయకళ, కృష్ణదేశికాచార్యుల కవితలు; మరి కొన్ని అపురూపమైన గొంతుకల ఆడియోలు; కనకప్రసాద్ శబ్ద సాహిత్యం; పాత సినిమా పత్రిక కినిమా నుంచి సేన్ గుప్తా వ్యాసం; తదితర రచనలు.
నేను, నాకు నచ్చినవే నచ్చుకునే కవులు కొందరం తరచు కలుసుకొంటూ, మేం రాసినవి ఒకళ్ళవొకళ్ళం మెచ్చుకుంటూ, మాకు నచ్చనివాళ్ళని, వాళ్ళ సృజనల్నీ వేళాకోళం చెయ్యటం – సాయంత్రాలు ఇలా గడిపేవాళ్ళం. ఈ గుంపులోనే మళ్ళీ అక్కడ ఎదుట లేనివాళ్ళని చాటుగా వేళాకోళం చేసుకోవటమూ ఉండేది.
ఆధునిక సమాజాల్లోన ప్రాధమిక అవసరాలు దాదాపుగా అందరికీ తీరుతున్నాయి. కాని, సాంఘిక అసమానతలు ఇదివరకటిలాగే ఉన్నాయి. వివక్షకు, పీడనకు గురయ్యే వర్గాల్లోన సృజనశీలురైన వాళ్ళందరికీ ఈ స్పృహ, వేదన ఉండితీరుతాయి. ఆ కష్టం ఏమిటో అనుభవించనివాళ్ళకి తెలిసే అవకాశం తక్కువ.
పదాల వ్యుత్పత్తిని శాస్త్రీయంగా ధాతువుల ద్వారా నిరూపించే నిరుక్త శాస్త్రం తరువాతి రోజుల్లో భాష్యకారుల కృత్తిమ వ్యుత్పత్తులతో వారు తమ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ఒక వినోద సాధనంగా మారిపోయింది. సాధారణ వివరణ ఇస్తే, నిరుక్తంలో వారి నిపుణత మనకెలా తెలుస్తుంది చెప్పండి?
ద్రావిడ భాషలలో ఒకటి నుండి పది వరకు, వందకు ప్రత్యేక పదాలు కనిపిస్తాయి. వెయ్యికి ఒక్క తెలుగులో మాత్రమే ద్రావిడ పదం కనిపిస్తుంది. అయితే, సాహిత్య రహిత భాషలలో ద్రావిడ సంఖ్యాపదాలు ఏడు దాటి ఉండవు.
ఒక మందు వ్యాపార యోగ్యం కావడానికి కనీసం పది నుండి పదిహేను ఏళ్ళు పడుతుంది. ఒక్క వ్యాధికి వేల వేల రసాయన మిశ్రణాలను పరీక్షిస్తే ఒక్కటి చివరకు ప్రభుత్వ ఆమోదాన్ని పొందవచ్చు. ఈ వ్యవహారానికంతటికీ కొన్ని కోట్ల డాలర్లు ఖర్చవుతుందని ఔషధ పరిశ్రమ అంచనా.
నీటిలోన మునుగుతూ
ఊదా రంగు నీడలు
కలువ పువ్వుల కాడలు
చేప పిల్లల జాడలు
మస్తానీ బాజీరావుల ప్రణయగాథ రతీమన్మథుల కథవలె భారతీయులకు చిరస్మరణీయమైనది. ఈతడు బుందేలుఖండము నేలుచుండిన హిందూప్రభువైన ఛత్రసాలునికి పారసీక వనితవల్ల గల్గిన మస్తానీయను ముస్లిముకాంతను వివాహమాడెను.
సూర్యకిరణాలకి సైతం
లోతు తెలీనివ్వకుండా
తెరలు తెరలుగా నవ్వుతూ
గోదావరి
పచ్చని ఆకు జీవితానికి –
పట్టుమని ఒక్కగానొక్క
వసంతం వరంగా దొరుకుతుంది.
ఓ పేజీలో భూకంపం
ఓ పేజీలో సునామీ
మరో పేజీలో
బిపాసా!
చేపిన పొదుగే లేగకు చక్కెర తీపైనట్లు
ఓపిన యమ్మకు నెమ్మది తేట నీరు దిగినట్లు
అలల కొలని జలలు అట్టె తళ తళ లాపినయట్లు
నేను రాసిన ఆర్టికల్ గురించి తెలిసి వెంకట్రామయ్య నాతో మాట్లాడ్డం మానేసాడు. వాడి కుటుంబాన్ని బజారు కీడ్చానని, వాళ్ళ అమ్మాయి గురించి తెలిస్తే ఎవడూ పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రాడనీ నన్ను చెడామడా తిట్టేడు. ఇహ నా మొహం చూపించద్దనీ స్నేహాన్ని తెంపేసాడు.
కాస్త ధైర్యం కలిగింది, అమ్మయ్య అంటూ నిట్టూర్చాడు. అప్పుడు తన చాక్లెట్ డ్రింక్ కప్పుని అందుకుని హాల్లోకి నడిచాడు. టి.వి ఆన్ చేయగానే, సినిమాలో మొదటి సీన్ – గాంధీ గారి హత్య సన్నివేశం వస్తోంది.
కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన మూడోరోజు భీష్ముని యుద్ధపరాక్రమం భయంకరంగా ఉంది. అర్జునుడు ఎదుర్కొన్నాడు కానీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. సారధి అయిన కృష్ణుడిని కూడా ముప్పుతిప్పలు పెడుతున్నాడు.