బాలుడొక్కడు బలిమి విసరగ
సాగరమ్మున క్రుంగి మునుగక
నలల తేలెడు బంతి కరణిని
బెడగె నెఱ్ఱని బింబమచటన్.

కళ్లెదురుగానే వున్నా,
కొన్నిసార్లు ఊహించుకుంటాను నిన్ను.
నా ముందున్నప్పటికంటే మిక్కిలి సంతోషంగా వున్నట్టు.

నీరెండవేళ తేయాకు తోటలో రికామీగా తిరిగినట్టు,
సౌందర్యవతి ముఖాన్ని చంద్రోదయానికి అర్పించినట్టు,
చేప గగనాన్ని పలకరించి నదిలో మునిగినట్టు,
భూమి సారం పూలరేకుల్లా విప్పారి

గాయపడ్డ మాటలన్నింటినీ దాచుకుని
రెండు దోసిళ్ళలో నింపుకుని
మహానిశ్శబ్దాన్ని నిర్మించుకున్నాను

శాంతి మంత్రమేదో దొరికేంతలో
మళ్ళీ నువ్వు…

చూశాను..
దూరంగా ధవళాగ్ని కాంతి బింబాన్ని మోస్తూన్న మహాసముద్రాన్ని
తోటబాటలో నా పక్కన నడిచే నత్తని
అది మెల్లగా నడిచొచ్చిన దారి స్పటికంలా మెరవడాన్ని.

బీజమే వృక్షమై పెరిగి పెరిగీ మరల
ఆ వృక్షమై చిన్ని బీజమైనట్టుగా
లింగమందుదయించి లింగమందైక్యమై
పురాతనులుగ వెలుగు జంగముల సంగమును చూడరయ్యా!

వేదశాస్త్ర ఆగమ పురాణములెల్ల
తవుడు నూకల దంపుడే సుమీ!
దంచుటెందుకు? చెరుగుటెందుకు?
చెదిరే మనసును నిలుపగలిగిన
అంతా బట్టబయలు చెన్నమల్లికార్జునా!

ఆ లేఖలన్నీ చేరినప్పుడే కదా,
మన చుట్టూ అడవులు విస్తరించేది
అందరికీ నాలుగు వేళ్లూ నోట్లోకి పోయేది!

సంధ్య కొమ్మల మీద
సన్నాయి పాటలు
ఊపందుకున్నాయి
మంచు తెరల చాటుగా
మబ్బుల కళ్లు
తొంగి చూస్తున్నాయి

మరొక శరీరం ఉంటుంది
దీనికి అలుపు లేదు, ఆశాభంగం లేదు
వయసు లేదు, వృద్ధాప్యం లేదు
ప్రాణమై ప్రవేశించే ఒక పద్య పాదం కోసం
అనంత కాలం నిరీక్షిస్తుంది

గిరియందు గాక గడ్డిదిబ్బల మీద ఆడునా నెమలి?
కొలనులో గాక చిన్నికాల్వల నీరాడునా కలహంస?
మావిచిగుళ్ళు మెసవక మోమెత్తి పాడునా కోకిల?
పరిమళములు లేని పూలపై వ్రాలునా తుమ్మెద?
నా దేవుడు చెన్నమల్లికార్జునుని గాక నా మనసు
ఇతరుల నెట్లు చేరగలదో? చెప్పరమ్మా?