మన సౌర మండలంలో జరిగే ప్రతి మార్పుకు కారణభూతుడు సూర్యుడే. గ్రహాల గమనమైనా, వాటి ఉపగ్రహాల గమనమైనా, గ్రహాల చుట్టూ ఉండే వాతావరణం, అందులోని మార్పులూ, గ్రహణాలూ – వీటన్నిటికీ మూల కారణం సూర్యుడు. భూమి పైన జనించే సకల సృష్టికి కారణం సూర్యుడు. ఈ సృష్టిలో చేతనాచేతనమైన జీవాలకి ప్రత్యక్ష సాక్షి – సృష్టికర్త సూర్యభగవానుడు.

త్రిపుర ఏనాడూ పట్టుదలగా ఏదైనా ఒక విషయాన్ని గురించి ఇలాక్కాదు అలాగ! ఆని నొక్కి చెప్పడం చూళ్ళేదు నేను. అవేళ మాత్రం మాకిద్దరికీ ఒక టకాఫోర్ వచ్చింది. మాటల్లోన బాలగోపాల్ గారి ప్రసక్తి వచ్చింది. నేను ఆయన “సాహిత్యం జీవితంలో ఖాళీల్ని పూరించాలి” అని అన్నారని అభ్యంతరం చెపుతున్నాను.

ఇంటర్నెట్ ద్వారా రాత, రాతతో ముడిపడ్డ సమాచార వ్యవస్థ ఎంతగా మార్పు చెందాయో, ఆ మార్పులు మన సమాజంలో ఎలాంటి ప్రభావం కలిగిస్తున్నాయో ఇప్పుడు అందరికీ అనుభవంలోకి వస్తున్నది. ఇది కనీవినీ ఎరుగని ఒక పెనుమార్పుగా మనం అనుకుంటున్నాం. అయితే, అంతకంటే మౌలికమైన మార్పు రాత వల్ల మానవ సమాజాల్లో వచ్చింది.

అందుచేత ఆధునిక కవి, లౌకిక వ్యక్తిలో ఒక పొర. ఒక అంతరార్థ భాగం. ఒక్కొక్కప్పుడు, స్ప్లిట్ పర్సనాలిటీ అని మానసిక శాస్త్రజ్ఞులు చెప్పేటట్టు చూస్తే లౌకిక వ్యక్తిలో ఒక ఖండం, ఒక ముక్క. ఇంతకీ కవి అంటే ఎవరూ మనకు కవిత్వం ద్వారా తెలిసే కథ మాత్రమే. అందుచేత కవులందరూ కథలే.

త్రిపదల వెనుక ఇంత గొప్ప చరిత్ర దాగి ఉన్నదన్న సంగతి చాల మందికి తెలియక పోయినను, అందఱికి హైకూలను గుఱించి తెలిసి ఉంటుంది. హైకూ ఒక త్రిపద – మొదటి మూడవ పంక్తులలో ఐదు అక్షరములు, రెండవ పంక్తిలో ఏడు అక్షరాలు ఉంటాయి యిందులో. పదములకన్న ఆ పదములు సృష్టించిన చిత్రములు హైకూ ప్రత్యేకాకర్షణ.

అక్షరాలా ఎవరు పుస్తకాన్ని రాశారు అన్నది తెలుసుకోవాలనే ప్రయత్నం తెలుగు సాహిత్యం కాని సంస్కృత సాహిత్యం కాని ఇతర భారతీయ సాహిత్యాలు కాని చెయ్యలేదు. కవి అంటే పుస్తకానికి తన పేరుతో కవితా గౌరవాన్ని కల్పించేవాడు అని అర్థం. ఆ పుస్తకానికి పాఠకులు చెప్పుకున్న అర్థానికి అనువైన జీవిత చరిత్ర కలవాడు అని అర్థం. అంతేకాని అక్షరాలా ఆ పుస్తకాన్ని రాసిన వాడు అని అర్థం కాదు.

పిబిఎస్ నటులకు సరిపోయే గాయకుల గాత్రం అనేదాన్ని గురించి అది ప్రేక్షకుల, శ్రోతల భ్రమ మాత్రమే అంటాడు. రాజకుమార్‌కు తన గొంతు సరిపోవడం, అలాగే తాను సామాన్యంగా ఘంటసాల మత్రమే పాడే ఎన్.టి. రామారావు, నాగేశ్వర రావులకు పాడితే నప్పదు అనే భ్రమ కూడా అలాంటిదే.

సాలూరి రా.రా భలే తమాషా మనిషి. విచిత్రమైన వ్యక్తి. ఎవరితోనైనా ఇట్టే పరిచయం చేసేసుకుని సరదాగా మాటాడేయగలిగే శక్తి వుంది. ఆ ధోరణిలో నవ్వుతూ నవ్వుతూనే నసాళానికి అంటిపోయే జోకులు బ్రేకు లేకుండానే స్వీట్ కేకుల్లా తెగవేయగలిగే నేర్పువుంది. నిరాడంబరజీవి.

వేదకాలం నుంచి మనకు సెకండులో ఒక కోటివంతు కాలం నుండి 40 లక్షల కోట్ల సంవత్సరాల దాకా లెక్క పెట్టగలిగే కాలమానం ఉండేదని చెప్పే వెబ్‌సైట్లు ఇంటర్నెట్టులో కోకొల్లలు. అలాగే, వేదాలలో (సూర్య)కాంతి వేగాన్ని కూడా విలువకట్టి చెప్పారని, అది నేటి శాస్త్రవేత్తలు ఆధునిక పద్ధతులను ఉపయోగించి కనిపెట్టిన విలువకు ఉరమరగా సరిపోతుందనీ గర్వంగా చెప్పుకోవడం కూడా కొన్ని సైట్లలో కనిపిస్తుంది.

శ్రీనివాస్ సంగీత మేళకర్త రాగాల స్వరలక్షణాన్ని గుర్తుంచుకోవటానికి ఒక ‘డైమండ్ కీ’ సూత్రాన్ని రూపొందించారు. ఇది విద్యార్థులకు రాగస్వరూపాన్ని సులభంగా నేర్పాలని చేసిన ప్రయత్నం. వెంటనే ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, డి.కె. పట్టమ్మాళ్, విశ్వనాథన్, వంటి మహావిద్వాంసులు శ్రీనివాస్‌ని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు.

ఒక కాలానికి నిరవకాశంగా మారిన సంస్కృత సాహిత్యం సావకాశం కల తెలుగును బాధించిందా అన్న విషయం పరిశీలించదగ్గదే. దీని మాట ఎలా ఉన్నా తెలుగువారు తమ సాహిత్యావకాశాన్ని ఏర్పరచుకొనేటప్పుడు కేవలం సంస్కృతం మీదనే ఆధారపడలేదని, ఇరుగు పొరుగు బాషలను కూడా గమనించారని తెలుసుకొని సాహిత్యవికాసాన్ని పరిశీలించాలన్నది ముఖ్యం.

ఎన్నో ఆంగ్లపదాలు ఆయా ప్రాంతీయ భాషల పదాలలో యధాతథంగా చోటుచేసుకుని ఆయా భాషలకి చెందిన పదాలలాగే ఈనాటికి చెలామణి అవుతూ వుండడం రసజ్ఞులు గమనిస్తూనే వున్నారు. ఓ డియర్, వై ఫియర్, కం నియర్‌ లాంటి రైమ్స్ అన్ని భారతీయ భాషా చిత్రాల గీతికలోనూ వాడబడడం పరిపాటి అయిపోయింది.

సాంఘికంగా మార్పు చెందుతున్న స్త్రీ రూపం మనలో ఒక రకమైన అవ్యవస్థని సృష్టించింది. ఒక సమస్యతో జీవిస్తున్నంత కాలం, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడం మానవ సహజం. కాని, నిజం చెప్పాలంటే, మనలో ఎవ్వరికీ — భర్తలుగా, భార్యలుగా, ప్రేమికులుగా, చిత్రకారులుగా, విమర్శకులుగా — ఈ విషయాలపై సంపూర్ణ జ్ఞానం లేదు అని ఒప్పుకోవటం కష్టం.

బ్రౌన్ తెలుగు ప్రజలతో కలిసిమెలిసి తిరిగి రాతప్రతులని వాళ్ళు ఇళ్ళల్లో భద్రపరిచే తీరు, చదివే తీరు, అందులో తేడాలు, అన్నీ గ్రహించి వుంటే తెలుగు గ్రంథ ప్రపంచాన్ని గురించి ఆయనకు కొంత అవగాహన వచ్చేది. కానీ ఆ ఆలోచన ఆయనకి రాలేదు. తెలుగు గ్రంథసంస్కృతి యూరోపు దేశాల గ్రంథసంస్కృతికన్నా భిన్నమైనదేమో అన్న సందేహం కించిత్తయినా కలగలేదు కూడా.

చుక్కలను తాకకుండ వాటి చుట్టు ముగ్గుపొడితో, తడి పిండితో చిత్రవిచిత్రములైన ఆకారములను సృష్టించుటకు వీలవుతుంది. వీటిని మెలిక ముగ్గులు లేక మువ్వల ముగ్గులు అంటారు. వీటిని జాగ్రత్తగా వేసినప్పుడు ఇందులో ముడులు కనబడుతాయి. ఇవి త్రాటితో లేక త్రాళ్ళతో నేసిన తివాచీలలా కూడ ఉంటాయి. ఇవియే నిజమైన మెలిక ముగ్గులు.

I first met Narayana Rao at a conference in Israel. His infectious laughter and love of literature were absolutely contagious. I came away from our conversations renewed and eager to plunge into some new idea, some new project, from our casual chats.

ఇంతటి విజ్ఞానాన్ని పదిమందికీ తెలియపరచటం ఎంతో కష్టమైన పని. వీఎన్నార్‌ను కేవలం తెలుగు భాషలో ఒక మూల పడున్న సాహిత్యాన్ని తర్జుమా చేసేవాడుగా తీసిపారేయడం, ప్రత్యేకించి పాశ్చాత్య విద్యాసంస్థలలో, ఎంతో సులభంగా జరిగే పని.

భారత సాహిత్యంలో చారిత్రక రచన ఏ ఒక్క సాహిత్యవర్గానికో పరిమితమై ఉండలేదు. అటువంటి విభజనలకి అతీతంగా పద్య మహాకావ్యం నుంచి తెలుగు వచన చారిత్రము దాకా సాహిత్యంలో ఎన్నో రూపాలలో అది విస్తరించింది. ఈ సాహిత్య రూపాలేవీ కూడా స్వతస్సిద్ధంగా చారిత్రక రచనలు కావు; ఆ రకంగా అవి ఎప్పుడూ ఆ సమాజంలో చూడబడలేదు.