ఇందులో ఎందరో మంచి మంచి స్నేహితులు, బంధువులు ఆత్మీయులుగా మారిన పరిచయస్తులు ఉన్నారు. చిన్న చిన్న సహాయాలు కూడా మర్చిపోని గొప్ప వ్యక్తులున్నారు. ప్రతిచోటా ఆదరించి అన్నం పెట్టిన తల్లులున్నారు, బీదరికంలో ఉంటూ కూడా. రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉంటే ఇంటికి తీసికెళ్ళి సేదదీర్చిన ‘లఖ్నవీ అమ్మ’లున్నారు.
రచయిత వివరాలు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
వాడ్రేవు వీరలక్ష్మీదేవి రచనలు
నవలా రచయితగా సుబ్రహ్మణ్య శాస్త్రిగారి గురించి చెప్పుకోవలసిన అంశాలలో ప్రధానమైనది భాష. భాష విషయంలో ఆయనలో క్రమక్రమంగా వచ్చిన మార్పుకు ఈ నవలలు దర్పణాలు. మొదటి రెండు నవలల్లోనూ పండిత లోకం శిరసున ధరించే వరమ ప్రామాణికమైన గ్రాంథిక భాష. వర్ణనాత్మకమయిన శైలీ విన్యాసంతో అలరారిన భాష. నవల మొదలుపెడితే ఆపకుండా చదివించగల ధారాప్రవాహం లాంటి సారళ్యతను ఆ గ్రాంథిక రచనలో కూడా సాధించగలగడం శాస్త్రిగారి విశేష ప్రజ్ఞ.
ప్రతి సంవత్సరం కాకినాడ లోని ఇస్మాయిల్ మిత్రమండలి ఇచ్చే ఇస్మాయిల్ కవితా పురస్కారానికి గాను 2010 సంవత్సరంలో వచ్చిన ‘రెండో పాత్ర’ కవితా సంకలనం ఎంపికయ్యింది. కవి విన్నకోట రవి శంకర్.