స్వదేశీ ఉద్యమంలో కేవలం భౌతికమైన ఆయుధాలే కాదు, సంగీత సాహిత్యాలూ, కలం అనే అత్యంత శక్తివంతమైన అదృశ్య ఆయుధాలు కూడా ఎంతగానో పోరాడాయి. నాటినుంచి నేటివరకూ, ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తిని రగిలిస్తూ, అచంచలమైన స్ఫూర్తిని నింపుతున్న ఆ అమర గీతాల ప్రయాణం ఒక్కసారి గుర్తు చేసుకుందాం!

సాహిత్య విమర్శకుడు, పుంభావ సరస్వతి కీ.శే. జొన్నవిత్తుల రామకృష్ణశర్మగారు, వారి శ్రీమతి కీ.శే. లక్ష్మీనరసమ్మగారల సంస్మరణార్థం, వారి కుమారులు జొన్నవిత్తులవారి సాహిత్య స్ఫూర్తి పురస్కారాన్ని ఇవ్వాలని సంకల్పించారు. ఈ పురస్కారాన్ని తెలుగు, సంస్కృత, ప్రాకృత భాషా సాహిత్యాల్లో అద్వితీయమైన ప్రతిభ కనపరుస్తున్న యువ సాహితీవేత్త, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీ పరిమి శ్రీరామనాథ్‌గారికి అందిస్తున్నారు.

గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాలు: 2025 సంవత్సరంలో వెలువరించిన కథా, కవితా సంపుటాలకు ఆహ్వానం పలుకగా 20 కథా సంపుటాలు, 33 కవితా సంపుటాలు వచ్చాయి.

నెచ్చెలి 7వ వార్షికోత్సవం (జూలై 10, 2026) సందర్భంగా నిర్వహిస్తున్న కథా, కవితా పురస్కార పోటీలకు రచనలకు ఆహ్వానం!

వేలూరి వేంకటేశ్వరరావుగారు రాసిన ‘కావ్యదహనోత్సవం’ ఆడియో రూపంలో కథాసంగ్రహం.

పరిచయకర్త/స్వరం – కొప్పర్తి రాంబాబు

వేలూరి వేంకటేశ్వరరావుగారికి ఇష్టమైన కాటుక కంటినీరు పద్యంపై వారి వ్యాసానికి ఆడియో రూపం.

చదివిన వారు: రాజేష్ భరద్వాజ

గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహితీ పురస్కారాల కోసం కథ, కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నది.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

తెల్లాపూర్‌లోని ఫూలే అంబేద్కర్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్‌లో ఫిబ్రవరి 7- 8 తేదీలలో 50 మంది కొత్త తరం కవుల ‘మిలన్: వర్క్‌షాప్’ జరుగుతుంది.