దిలీప్ గారు: ఇది చాలాకాలం క్రితం (2003లో) ప్రచురితమైన వ్యాసం. అప్పట్నుంచి ఇప్పటివరకు “ఈమాట” సాంకేతిక పద్ధతుల్లో కలిగిన మార్పుల వల్ల మీకన్న ముందు వారు రాసిన అభిప్రాయాలన్నీ ఇప్పుడు కనుమరుగయ్యాయి.
— ————
ఇప్పుడు రమ గారి సందేహాలకి సమాధానాలివ్వటానికి ప్రయత్నిస్తాను. ఆవిడ ముఖ్యంగా రెండు విషయాలు లేవనెత్తారు. (అ) ఈ వ్యాసం “ఆధునిక” రామాయణాల మీదే కేంద్రీకరిస్తుంది, (ఆ) విశ్లేషణంతా “ఆధునిక” దృష్టితోనే జరిగింది.
వ్యాసం అంతా చదివితే తొలి ఆరోపణ నిజం కాదని ఇట్టే తెలిసిపోతుంది. వాల్మీకి రామాయణం చర్చించే సమస్య గురించి పోలాక్ చెప్పిన అభిప్రాయాన్ని ఈ వ్యాసరచయిత అంగీకరించారు. అంటే అది రాజ్యం ఒకతరాన్నుంచి మరో తరానికి సంక్రమించే పద్ధతుల గురించి ప్రధానంగా చెప్పిందని ఒప్పుకున్నారన్న మాట (వాల్మీకి రామాయణం చెప్పేది అదేనా లేదా మరోటా అనేది వేరే చర్చ, అది ఈ వ్యాసం scope లో లేదు). ఈ ప్రతిపాదన ప్రకారం రాముడు దేవుడు కాడు, ఆదర్శపురుషుడు మాత్రమే. అలాగే, వాల్మీకి రామాయణంలో రాజ్య సంక్రమణకి వున్న మిగిలిన నమూనాలు (ఉదా: సుగ్రీవుడు, విభీషణుడు) సరైనవి కావని, రాముడి మార్గమే అందరికీ అనుసరణీయమని చాటి చెప్తుంది వాల్మీకి రామాయణ కథ. ఇక తెలుగు రామాయణాల విషయానికి వస్తే, తెలుగులో తొలి రామాయణం వచ్చేనాటికే రాముడు దేవుడయ్యాడని ఈ వ్యాసం చేసే ప్రతిపాదన. కనక తెలుగులో ఇరవయ్యవ శతాబ్దానికి ముందు వరకు వచ్చిన రామాయణాలన్నీ రాముణ్ణి దేవుడిగా చూస్తూ ఆ దృష్టి నుంచి రామాయణ కథని ఆయా కవుల ప్రతిభలకి తగ్గట్టుగా, ఆయా కాలాల స్థితిగతులకి అనుగుణంగా చెప్పటానికి ప్రయత్నించాయన్నది corollary. ఐతే ఇరవయ్యవ శతాబ్దంలో కొత్త ఆలోచనలు వచ్చినయ్, రామాయణాన్ని కొత్త కోణాల్లోంచి చూడటం మొదలయ్యింది (స్త్రీల రామాయణాల్లాటి మౌఖిక సంప్రదాయపు కథనాలు అంతకు ముందు నుంచీ వున్నయ్ కాని అవి mainstream లోకి రాలేకపోయినయ్). ఈ కొత్తదారికి దారితీసిన మూల కారణాలేవో వివరించే ప్రయత్నం చేసిందీ వ్యాసం. ముఖ్యంగా అచ్చు యంత్రం, వలస పాలన, వాటి ద్వారా కలిగిన సామాజిక విప్లవం – వీటిని గుర్తించి, వీటి మూలాన ఈ కొత్తదారిలో వచ్చిన రచనల పరిణామాన్ని విశ్లేషించటం జరిగింది. కనక వ్యాసమంతా కేవలం “ఆధునిక” తెలుగు రామాయణాల గురించే అనటం అవాస్తవం.
ఇక రెండో విషయం. మొదటగా, ఈ point నాకు సరిగా అర్థం కావటం లేదు. “ఆధునిక” దృష్టితో విశ్లేషించటానికి అభ్యంతరం చెప్తున్నారు. అంటే ఆధునిక పూర్వ దృష్టితో విశ్లేషిస్తే బాగుండేదని దాని భావం అనుకుంటున్నా. ఐతే ఇప్పటి కాలంలో నివసించే ఒక వ్యక్తికి అలాటి దృష్టి ఎలా సాధ్యమో నాకు తెలియటం లేదు. బహుశ ఆవిడ reference ఇచ్చిన జయప్రభ గారి వ్యాసంలో అలాటి దృష్టితో చేసిన విశ్లేషణ వుందేమో చూడాలి. నాకు బోలెడంత కుతూహలంగా వుంది అలాటి విశ్లేషణ చూడాలని. ఎవరైనా దాన్ని చదివిన వాళ్లు ఆధునిక పూర్వ దృష్టి ఎలా వుంటుందో దయచేసి అందరితోనూ పంచుకోండి.
పై చర్చల జోలికి పోకుండా, ఒక ఈగలాగుతున్నా : “సఖి వాళ్ళు చారుమతి స్టేట్మెంట్ రికార్డ్ చేసారు. ఆమె ఫోటోలు తీసుకున్నారు. అప్పుడు చెప్పింది చారుమతి తను డొమెస్టిక్ వయొలెన్స్ విభాగం నుండి వచ్చినట్టు. ” … అది చెప్పాల్సింది మధుబని కదా???
పంతొమ్మిదివందల డెబ్భయిల్లో కాబోలు – బహుశా మల్లాది శివరాం రచన అనుకుంటాను – ఆకాశవాణి నించి ఒక పాట ప్రసారం అయ్యేది. ఆ పాట వినీవినగానే నన్ను ఆకట్టుకుంది. నా యుక్త వయసులో నాకు బాగా ప్రేరణనిచ్చిన పాటగా నేను దీన్ని గుర్తుంచుకున్నాను. ఇప్పటికీ ఈ పాట నాకిష్టమైన పాటల్లో ఒకటి. ఎప్పుడూ సన్నగా కూనిరాగం తీసుకునే పాటగా నా గొంతులో ఉంటుంది. ఆ పాట ఇలాంటి మాటల్లోంచి నడుస్తుంది. జీవితాన్ని మల్లాది శివరాం ఇలా పాడారు. అందులోంచి ఆయన మరణాన్ని ఇలా చూపించారు. పాట ఇదీ!
ఈ లోకంలో ఈ నా దేశంలో ఈ నా ఇప్పటి దేహంతో
ఎన్నాళ్ళైనా బతకడమిష్టం ఎపుడు రాలినా ఇష్టం!
పొరపాటునా మోక్షం వస్తే పుట్టుక లేకుండా పోతే
ఇలా తలానికి దూరంగా ఎలాగన్నదే నాకు భయం /ఈ లోకంలో/
సంసారం సాగరమైతే జలక్రీడగా జీవనమిష్టం
తిరిగిపుట్టుటకె మరణంబైతే మరణం అంటే మరి మరి ఇష్టం /ఈ లోకంలో /
నిత్యం తలుచుకోబుద్ధయ్యే ఈ పాట తరవాత ఇక్కడ ఉన్న రవిశంకర్ కవిత చదివేకా ఒక్కో కవి బతుకుని ఎలా చూస్తాడో ఎలా చూపిస్తాడో కదా అని మాత్రం అనిపించింది. అంతే !! 🙂
“First they came for the communists,
and I didn’t speak out because I wasn’t a communist.
Then they came for the trade unionists,
and I didn’t speak out because I wasn’t a trade unionist.
Then they came for the Jews,
and I didn’t speak out because I wasn’t a Jew.
Then they came for me
and there was no one left to speak out for me.”
-చిన్నప్పుడు స్కూల్లో ఈ కవిత ఉండేది పాఠ్యాంశంగా. అది గుర్తొచ్చింది ఈ కథ చదువుతూ ఉంటే.
మేరు నగ మేధావి గురించి Rohiniprasad అభిప్రాయం:
08/11/2012 2:03 am
హైదరాబాద్లో ఉంటున్నవారికి ఇంకా తెలియని ఈ విషాదవార్తను అందించిన సురేశ్ గారికి థాంక్స్.
మేరు నగ మేధావి గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
08/10/2012 11:41 pm
Prof. BhK is no more.
“మన సారథి, మన సచివుడు,
మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్
మన విభుడు, గురువు, దేవర
మనలనుఁదిగనాడి చనియె …”
గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భద్రిరాజు కృష్ణమూర్తి గారు ఆగస్టు 10వ తేది రాత్రి కన్నుమూసారు.
నిజంగా … గురించి Shaik Khaja Moenuddin అభిప్రాయం:
08/10/2012 9:30 pm
ఈ కథ చాల బాగుంది.
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
08/09/2012 2:43 pm
దిలీప్ గారు: ఇది చాలాకాలం క్రితం (2003లో) ప్రచురితమైన వ్యాసం. అప్పట్నుంచి ఇప్పటివరకు “ఈమాట” సాంకేతిక పద్ధతుల్లో కలిగిన మార్పుల వల్ల మీకన్న ముందు వారు రాసిన అభిప్రాయాలన్నీ ఇప్పుడు కనుమరుగయ్యాయి.
— ————
ఇప్పుడు రమ గారి సందేహాలకి సమాధానాలివ్వటానికి ప్రయత్నిస్తాను. ఆవిడ ముఖ్యంగా రెండు విషయాలు లేవనెత్తారు. (అ) ఈ వ్యాసం “ఆధునిక” రామాయణాల మీదే కేంద్రీకరిస్తుంది, (ఆ) విశ్లేషణంతా “ఆధునిక” దృష్టితోనే జరిగింది.
వ్యాసం అంతా చదివితే తొలి ఆరోపణ నిజం కాదని ఇట్టే తెలిసిపోతుంది. వాల్మీకి రామాయణం చర్చించే సమస్య గురించి పోలాక్ చెప్పిన అభిప్రాయాన్ని ఈ వ్యాసరచయిత అంగీకరించారు. అంటే అది రాజ్యం ఒకతరాన్నుంచి మరో తరానికి సంక్రమించే పద్ధతుల గురించి ప్రధానంగా చెప్పిందని ఒప్పుకున్నారన్న మాట (వాల్మీకి రామాయణం చెప్పేది అదేనా లేదా మరోటా అనేది వేరే చర్చ, అది ఈ వ్యాసం scope లో లేదు). ఈ ప్రతిపాదన ప్రకారం రాముడు దేవుడు కాడు, ఆదర్శపురుషుడు మాత్రమే. అలాగే, వాల్మీకి రామాయణంలో రాజ్య సంక్రమణకి వున్న మిగిలిన నమూనాలు (ఉదా: సుగ్రీవుడు, విభీషణుడు) సరైనవి కావని, రాముడి మార్గమే అందరికీ అనుసరణీయమని చాటి చెప్తుంది వాల్మీకి రామాయణ కథ. ఇక తెలుగు రామాయణాల విషయానికి వస్తే, తెలుగులో తొలి రామాయణం వచ్చేనాటికే రాముడు దేవుడయ్యాడని ఈ వ్యాసం చేసే ప్రతిపాదన. కనక తెలుగులో ఇరవయ్యవ శతాబ్దానికి ముందు వరకు వచ్చిన రామాయణాలన్నీ రాముణ్ణి దేవుడిగా చూస్తూ ఆ దృష్టి నుంచి రామాయణ కథని ఆయా కవుల ప్రతిభలకి తగ్గట్టుగా, ఆయా కాలాల స్థితిగతులకి అనుగుణంగా చెప్పటానికి ప్రయత్నించాయన్నది corollary. ఐతే ఇరవయ్యవ శతాబ్దంలో కొత్త ఆలోచనలు వచ్చినయ్, రామాయణాన్ని కొత్త కోణాల్లోంచి చూడటం మొదలయ్యింది (స్త్రీల రామాయణాల్లాటి మౌఖిక సంప్రదాయపు కథనాలు అంతకు ముందు నుంచీ వున్నయ్ కాని అవి mainstream లోకి రాలేకపోయినయ్). ఈ కొత్తదారికి దారితీసిన మూల కారణాలేవో వివరించే ప్రయత్నం చేసిందీ వ్యాసం. ముఖ్యంగా అచ్చు యంత్రం, వలస పాలన, వాటి ద్వారా కలిగిన సామాజిక విప్లవం – వీటిని గుర్తించి, వీటి మూలాన ఈ కొత్తదారిలో వచ్చిన రచనల పరిణామాన్ని విశ్లేషించటం జరిగింది. కనక వ్యాసమంతా కేవలం “ఆధునిక” తెలుగు రామాయణాల గురించే అనటం అవాస్తవం.
ఇక రెండో విషయం. మొదటగా, ఈ point నాకు సరిగా అర్థం కావటం లేదు. “ఆధునిక” దృష్టితో విశ్లేషించటానికి అభ్యంతరం చెప్తున్నారు. అంటే ఆధునిక పూర్వ దృష్టితో విశ్లేషిస్తే బాగుండేదని దాని భావం అనుకుంటున్నా. ఐతే ఇప్పటి కాలంలో నివసించే ఒక వ్యక్తికి అలాటి దృష్టి ఎలా సాధ్యమో నాకు తెలియటం లేదు. బహుశ ఆవిడ reference ఇచ్చిన జయప్రభ గారి వ్యాసంలో అలాటి దృష్టితో చేసిన విశ్లేషణ వుందేమో చూడాలి. నాకు బోలెడంత కుతూహలంగా వుంది అలాటి విశ్లేషణ చూడాలని. ఎవరైనా దాన్ని చదివిన వాళ్లు ఆధునిక పూర్వ దృష్టి ఎలా వుంటుందో దయచేసి అందరితోనూ పంచుకోండి.
చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి satyanarayana chary అభిప్రాయం:
08/09/2012 10:53 am
పద్యాల అర్దాలు కూడా తెలియచేసి ఉంటే ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం.
రచయితలకు సూచనలు గురించి Ravi Shankar అభిప్రాయం:
08/08/2012 6:56 am
“ఈమాట” ని నడుపుతున్న-నడిపిస్తున్న వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నాకు కావలసిన చాలా సమాచారం ఎప్పటినుంచో ఇక్కడ లభ్యమవుతున్నది.
ఈ సమాచారదర్శిని ఇలాగే వర్థిల్లాలని కోరుకుంటున్నాను.
గౌరీ రవిశంకరశర్మా అహంభో అభివాదయే!
తెంపుకోవే బంధనాలు గురించి Sowmya అభిప్రాయం:
08/07/2012 7:36 am
పై చర్చల జోలికి పోకుండా, ఒక ఈగలాగుతున్నా : “సఖి వాళ్ళు చారుమతి స్టేట్మెంట్ రికార్డ్ చేసారు. ఆమె ఫోటోలు తీసుకున్నారు. అప్పుడు చెప్పింది చారుమతి తను డొమెస్టిక్ వయొలెన్స్ విభాగం నుండి వచ్చినట్టు. ” … అది చెప్పాల్సింది మధుబని కదా???
ఆఖరి మనిషి గురించి rama bharadwaj అభిప్రాయం:
08/07/2012 6:21 am
పంతొమ్మిదివందల డెబ్భయిల్లో కాబోలు – బహుశా మల్లాది శివరాం రచన అనుకుంటాను – ఆకాశవాణి నించి ఒక పాట ప్రసారం అయ్యేది. ఆ పాట వినీవినగానే నన్ను ఆకట్టుకుంది. నా యుక్త వయసులో నాకు బాగా ప్రేరణనిచ్చిన పాటగా నేను దీన్ని గుర్తుంచుకున్నాను. ఇప్పటికీ ఈ పాట నాకిష్టమైన పాటల్లో ఒకటి. ఎప్పుడూ సన్నగా కూనిరాగం తీసుకునే పాటగా నా గొంతులో ఉంటుంది. ఆ పాట ఇలాంటి మాటల్లోంచి నడుస్తుంది. జీవితాన్ని మల్లాది శివరాం ఇలా పాడారు. అందులోంచి ఆయన మరణాన్ని ఇలా చూపించారు. పాట ఇదీ!
ఈ లోకంలో ఈ నా దేశంలో ఈ నా ఇప్పటి దేహంతో
ఎన్నాళ్ళైనా బతకడమిష్టం ఎపుడు రాలినా ఇష్టం!
పొరపాటునా మోక్షం వస్తే పుట్టుక లేకుండా పోతే
ఇలా తలానికి దూరంగా ఎలాగన్నదే నాకు భయం /ఈ లోకంలో/
సంసారం సాగరమైతే జలక్రీడగా జీవనమిష్టం
తిరిగిపుట్టుటకె మరణంబైతే మరణం అంటే మరి మరి ఇష్టం /ఈ లోకంలో /
నిత్యం తలుచుకోబుద్ధయ్యే ఈ పాట తరవాత ఇక్కడ ఉన్న రవిశంకర్ కవిత చదివేకా ఒక్కో కవి బతుకుని ఎలా చూస్తాడో ఎలా చూపిస్తాడో కదా అని మాత్రం అనిపించింది. అంతే !! 🙂
రమ.
అంతరం గురించి సోమశంకర్ అభిప్రాయం:
08/07/2012 6:07 am
ఈ కథని ప్రచురించిన ఈ మాట వారికి, చదివి స్పందించిన పాఠకులకు ధన్యవాదాలు.
సోమశంకర్
నన్ను కాదు గురించి Sowmya అభిప్రాయం:
08/06/2012 8:30 am
“First they came for the communists,
and I didn’t speak out because I wasn’t a communist.
Then they came for the trade unionists,
and I didn’t speak out because I wasn’t a trade unionist.
Then they came for the Jews,
and I didn’t speak out because I wasn’t a Jew.
Then they came for me
and there was no one left to speak out for me.”
-చిన్నప్పుడు స్కూల్లో ఈ కవిత ఉండేది పాఠ్యాంశంగా. అది గుర్తొచ్చింది ఈ కథ చదువుతూ ఉంటే.