లైలా గారన్న మాటలకి చిరు సమాధానం: ఇది రాసి తొమ్మిదేళ్లు దాటింది. ఇప్పుడు నాదగ్గర మూలం లేదు కూడ. లైలా గారు ఆంధ్రాంగ్లాల్లో మంచి ప్రావీణ్యం ఉన్నవారిలా కనిపిస్తున్నారు కనక వారే చివరి పేరాని అనువదిస్తే బాగుంటుందని నా నమ్మకం. మేము పద్నాలుగేళ్ల నాడు ఈ పత్రికని ప్రారంభించాలనుకున్నప్పుడు కోరుకున్న ఒక పరిణామం దూరదూరంగా వున్నవారు Internet ద్వారా సహకరించి రచనలు చేస్తారని. వారు ఈ వ్యాసంలో మెరుగుపడగలవన్న ఏ భాగాల్నైనా తిరిగి రాయటానికి నాకెలాటి అభ్యంతరమూ లేదు. కావలసింది రచన మూలానికి తగ్గ స్థాయిని చేరుకోవటం. దానికి వారి వంతుగా ఎలాటి మార్పులూ చేర్పులూ చేసినా అది హర్షించదగింది. వారికిదే నా ఆహ్వానం.
నారాయణ రావు గారు తను “ఆధునిక” దృష్టితో ఈ వ్యాసాన్ని రాస్తున్నానని ఎక్కడా అనలేదు, నా అనువాదంలో నేనూ అనలేదు. రమ గారు వేసిన ముద్ర అది – పదేపదే కోట్స్ లో పెట్టి మరీ. ఇక ఇప్పుడు నా దృష్టిలో ఆ “ఆధునికత” ఏమిటో నేను స్పష్టపరచాలట, ! ఆవిడ తయారుచేసిన దాన్ని నేనెలా స్పష్టపరచగలనో నాకు బోధపడదు !!
సరే, అలాటి దృష్టి ఒకటి వుందనుకుందాం, ఎలాగో నారాయణ రావు గారు దాన్ని పట్టుకుని ఆ దృష్టితోనే ఈ వ్యాసాన్ని రాశారనీ అనుకుందాం. ఆయన ఆ దృష్టితో కాదు, మరో “ఫలానా” దృష్టితోనే తన విశ్లేషణ చెయ్యాలని దబాయించటానికి మనమెవరం? సాహిత్య విమర్శలో ఎన్నో మార్గాలున్నాయని మన ఆలంకారికులన్నారు, పాశ్చాత్యులూ అన్నారు. అనుభవజ్ఞుడైన విమర్శకుడు ఏ విషయానికి ఎలాటి మార్గం సరైందో ఎన్నుకుని ఆ మార్గంలో తన పరిశోధన కొనసాగిస్తాడు. కాదనే హక్కు పాఠకుడికెక్కడిది? ముందుగా పాఠకులందరి అనుమతి తీసుకునిగాని పరిశోధకుడు పనిచెయ్యటానికి లేదా?
ఐతే, ఆయన ఇలాటి దృష్టితో ఈ సమస్యని చూడటం “సులువు” కనక అలా చేశాడని ఒక ఆరోపణ. ఆయనకి అదెంత కష్టమో సులువో రమ గారికో మరొకరికో ఎలా తెలుస్తుంది? “విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం” ఆయన ఎన్నెన్ని దారుల్లో తిరిగి తిరిగి చివరికి ఆ దారి చేరారో, దానికి ఎంత కష్టపడ్డారో ఎలా లెక్కకట్టటం? ఇతరుల కష్టాన్ని తేలిగ్గా కొట్టిపారెయ్యటం కన్నా సులువైన పని మరొకటుందా?
రామారావు గారు పోలాక్ గారి ప్రస్తావన తెచ్చారు గనుక మాత్రమే నేను ఇది కూడా ప్రస్తావన చేస్తున్నాను. పోలాక్ గారి వ్యాసం “crisis in the classics” లో పోలాక్ తనని తాను “non-modernist” గా సంభావించుకుంటూ, ప్రపంచం మొత్తం మీద classics తాలుకు భవిష్యత్తు ని గురించి తన భావాలనీ తన ఆందోళననీ కూడా చెప్పారు. విశ్వవిద్యాలయాలలో classics ని బోధించగలిగిన వాళ్ళు క్రమేపీ తగ్గిపోతున్న వైనం గురించి ఆయన బాధ పడ్డారు. non-brahminism, islamophobia లాంటి ethno chauvinist movements ప్రభావాలని ఆయన ప్రస్తావన చేసారు.
నారాయణ రావు వ్యాసంలో పోలాక్ చూసే ప్రమాదాలు ఏమన్నా ఉన్నాయా అని రామారావు గారు అనుకోలేదు. మనకి “ఆధునికత” అంటే అర్ధం కాని ఒక మోజు, అలా మాట్లాడక పోతే ఏమన్నా వెనకబడిపోతామేమో అన్న భయం, అంధ విశ్వాసం లాంటి ఆరాధనా భావం [హీరో వర్షిప్] వెరసి విమర్శకి తలుపులు మూసేస్తున్న ధోరణి బాగా పెరిగి చివరికి ప్రతిదాన్నీ ఆధునికతా ముసుగు కప్పి మాట్లాడటాన్ని ఒక తప్పనిసరి విధానంగా చేసుకుంటున్నాం!
అసలిప్పటిదాకా మనం ఎవ్వరం కూడా “ఆధునికత” అన్నదానిని మన సమాజాలకి సంబంధించి ఇధమిథ్థంగా నిర్వచించి చూసుకున్న దాఖలా ఎక్కడా కనిపించదు. అది ఫలానాగా స్పష్టపడనిదే మన సాహిత్య విమర్శ గతి కూడా నిజం గా స్పష్టపడదు.
రమ.
నోట్ : పై అభిప్రాయం లో కలిపి రాయాలని అనుకున్నా అప్పటికే type చేసిందీ అచ్చు తప్పులు దిద్దుకున్నదీ కలిపి శ్రమ అవడంతో ఆపివేసాను. గనుక దీన్ని నా పై అభిప్రాయానికి కలగలుపుకుని చదువుకోమని మనవి.
‘వాల్మీకమూ అవాల్మీకమూ అయిన రచనలని పోల్చి చూసి వచ్చిన మార్పులని సవివరంగా తెలిపే పరిశీలన మనకి రాలేదు‘: rama bharadwaj అభిప్రాయం.
ఈ విషయాన్నె నేను మరొక రకంగా చెప్పాను కొచెం తీవ్ర ధోరణిలో ఊర్మిళా దేవి నిద్ర, సీత గడియల మీద వ్యాసాలు చదివి అభిప్రాయాలు చెప్పినప్పుడు.
వాల్మీకి రాసిన దానిని మాత్రమే (సాంకేతికంగా) ‘రామాయణం’ అనాలి. గణిత శాస్త్రాలలో వాడే ‘దూర సూచి’ ‘Metric / Distance Function’ లాంటి ఒక సమంజసమైన కొలమాన పరికరాన్ని సాహిత్య విమర్శ కూడా తయారుచేసుకోవాలి. మూలం నుంచి అనువాదం గానీ, కొత్తగా ఆ పాత్రల పేర్లూ, వాతావరణమూ ఉంచుతూ రాసిన కల్పనలు గానీ, వాటి ఆధారమైన రచన నుంచి యెంత దూరంగా ఉన్నాయి అన్నది చర్చకు చాలా అవసరం. ఊర్మిళా దేవి నిద్ర, సీత గడియ లాంటి వాటిని రామాయణ పాటలని / కథలని/ గాధలని అనటానికి వీలు లేదు అని రాశాను [ఇక్కడ వాటిలొ ఉన్న రస విషయాలతో సంబంధం లేదు]. రచయిత తను రాసినదానికి ‘రామాయణ కల్పతరువు’ అని పేరు పెట్టుకొవచ్చు, వానికి ఆ స్వేచ్చ ఉంది. విమర్శకులు ‘దూరాన్ని’ ఎంచకుండా ఆ రచన కు ‘రామాయణ’ సంబంధం పెట్ట గూడదు. ఇది కొంచెం కష్టమైనదే గానీ అట్లా కాని పక్షంలో విమర్శకు శాస్త్రీయత ఉండదు. నేనొక ప్రశ్న అడిగాను – రామాంజనేయ నాటకం [గయోపాఖ్యానం] రామాయణ [మహాభారత] కథ అవుతుందా అని. మూలాన్నించి దూరాన్ని యెంచి ఈ విషయాన్ని గురించి చెప్పకుండా చెప్పే ‘రామాయణ రి టొల్డ్’,’ రామాయణ క్వస్చెండ్’ లాంటి వాటికి అర్ఠం లేదు. వాల్మీకి రామాయణాన్ని గానీ దానికి ‘తగినంత చేరువ’ లో ఉన్నవాటిని గానీ చేసిన శాస్త్రీయమైన యే రకమైన పరిశీలన అయినా అభిలషణీయమే. అటువంటి దానిని మాత్రమే ‘రామాయణ’ అన్న మాటతొ అభివర్ణించడం సబబు. ఇతరములకు వాల్మీకి అనే కవి రాసిన కావ్యంతొ ఏ రకమైన సంబంధమూ అంట కట్ట గూడదు. అలాచేస్తే దాన్ని ఒకరకమైన మోసం గానే అనుకోవాలి.
ఏ రకమైన కొలబద్ద అయినా మంచి అవగాహనకు కొద్దిగానో గొప్పగనో ఉపకరిస్తుంది. అయితే , ప్రతీ విషయమూ, ప్రతీ వస్తువూ, ప్రతీ సిధ్ధాంతమూ చివరికి ప్రతీ వ్యక్తి కూడా మనకు తెలిసిన కొలబద్దలకూ తూకంరాళ్ళకూ లొంగి తీరవలసినదే నన్న ఆలోచన సరైనది కాదని నా అభిప్రాయం.
విషయానికి వస్తే, లూకాచ్ అనే ఒకాయన తనకు దొరికిన వాటిలో నచ్చిన కొన్ని నవలలను మార్క్సిష్టు దృక్పధంతో పరిశీలించి చారిత్రకనవలల లక్షణాలను క్రోడీకరించటం జరిగిందని తెలుస్తోంది యీ వ్యాసం వలన నాకు. ప్రపంచంలో ఆయన దృష్టికి రాని అనేక చారిత్రకనవల లుండవచ్చును గదా? అనేక దేశాలలో అనేక సంస్కృతులలో అనేక భాషలలో అనేకానేక చారిత్రకనవలలు ఉంటే అన్నిటినీ పరిశీలించటం లూకాచ్ గారికి వీలుపడేపనీ కాదు. ఆయన ఒక గుప్పెడు నవలలను పరిశీలించి ఒక సిధ్ధాంతం చేస్తే అది శిరోధార్యం కానవుసరం లేదు. మంచం పొట్టిదయిందని కాళ్ళు నరుకుకోరు కదా? ఈ సిధ్ధాంతం చట్రంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని సాహిత్యాలలోనూ వచ్చిన చారిత్రక నవలలను ఇమడ్చాలన్న ఆదుర్దాతో అలా ఇమడని వాటిని అక్షరాలా ఖండించటమేనా చేయవలసినది? ఇది శాస్త్ర్రీయదృక్పధం అనిపించుకుంటుందా?
పాశ్చాత్యులైతే మనకన్న తెలిసిన వారు తెలివైన వారు అనే బూజుపట్టిన భావదారిద్యం నుండి మనకు యెప్పుడూ విడుదల? ఎంతసేపూ తెల్లవాడి సిధ్ధాంతాల మూసల్లోకి భారతీయ సాహిత్యాన్ని పోసి గుండెలు బాదుకోవటం జుగుప్స కలిగిస్తోంది. భారతీయవిమర్శనాసిద్ధాంతాల ప్రతిపదికగా పాశ్చాత్య సాహిత్యాన్ని యెందుకు బేరీజువేయరు అనే యెదురు ప్రశ్న వేసి తీరాలనిపిస్తోంది. (నిజానికి రెండూ సరైన ధోరణులు కావని తెలిసినా కూడా!)
ఈ వ్యాసకర్తగారి ఒక వాక్యం “చివరికి విశ్వనాథ సత్యనారాయణగారి పురాణవైర గ్రంధమాల పేరున వచ్చిన నవలలు కూడా ఒక విధముగా చరిత్రాత్మక నవలలే!” అన్న మాటలో ఎంత హేళన ఉన్నది. పాపం విశ్వనాధ భారతోయుడై పోవటం కారణాన, ఇంకా దుడుగ్గా చెప్పాలంటే సాటి తెలుగువాడై పోయిన కారణాన ఎంత పలుచనై పోయాడు. పాపం ఆయనకు ‘లూకాచ్’ అనే ఆయన బిగించిన సిధ్ధాంతం ప్రకారం వ్రాయక పోవటం మరింత అవమానానికి గురి చేసిందా? నోరివారు విశ్వనాధ కొంత విశృంఖలంగా వ్రాసారన్నది నవలల చారిత్రకను ప్రశ్నించటం కాకపోవచ్చని నా అభిప్రాయం.
“నోరి వారి లెక్కలో అడివి బాపిరాజు రాసిన హిమబిందు, గోనగన్నారెడ్డి చారిత్రక నవలలే” అన్న వేరొక వాక్యం వ్యాసకర్త గారు చెప్పారు. బాపిరాజుగారిని లూకాస్ శిక్షకు గురిచేస్తున్నా రన్నమాట. వేరే రకంగా ఎలా అర్థం చేసుకోవాలీ వాక్యాన్ని?
ఇటువంటి ధోరణులు అసంతృప్తిని కలిగిస్తున్నాయి. భగవద్గీతనుండి బాపిరాజుదాకా, మీదాకా నాదాకా అందరి మీద పెత్తనం చేసే అధికారం ఈ మార్క్సిజానికీ దానిపేరు చెప్పుకొని పుట్టే సవాలక్ష సిధ్ధాంతోపసిధ్దాంతాలకీ ఎవరిచ్చారు?
ఈ మార్క్సిజం అనే ఇనప చట్రంలో ఇమడవలసిన అగత్యం ప్రపంచాని కేమీ లేదు. ఎవరు హర్షించినా మానినా సాహిత్యకారులు ఏ సిధ్ధాంతాల చట్రాలకూ అనుగుణంగా వ్రాసితీరాలన్న వెట్టి చాకిరీ యేమీ లేదు చెల్లదు.
అచార్య కృష్ణమూర్తి గారిని హైదరాబాదులో, వారింట్లో ఒకసారి, కేలిఫోర్నియాలో మా స్నేహితుడి ఇంట్లో ఒకసారి కలుసుకునే అదృష్టం నాకు కలిగింది. నిండుగా ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుందనే దానికి కృష్ణమూర్తిగారు ఒక ఉదాహరణ.
“ఏకైక రామాయణ కథనానికి దారితీసే అవాంఛనీయ ప్రయత్నాల్ని ఇవి కొంతవరకు అడ్డుకొంటున్నాయి.” -K.V.S. Ramarao
అనువాదము చాలా బాగుంది. Terrific. ఆఖరు పేరా, original English essay లో ఉన్నంత అర్థవంతము కాదు. The writer who translated the essay didn’t capture the essence of original writer’s conclusion.
Narayana Rao uses the word ‘discourse’ three times in the last paragraph of his English essay. The word’s meaning is kept consistant. The English essay’s last sentence (It is a difficult sentence in itself, and it has its problems; :-), seriously, how many independent and dependent clauses can a compound-complex English sentence support, before it loses track of it’s verbs and its thoughts :-)) conveys a different meaning.
అనువాదపు ఆఖరు పేరా తిరగ రాయవచ్చును. ఇంత గొప్పగా అనువదించిన వారికి అదెంత పాటి కష్టం?
“Questioning Ramayanas” పుస్తకములోని ఇతర వ్యాసాలు ఇంకేమైనా తెలుగులోకి అనువదింపబడినవా?
రామారావు గారూ! నా అభిప్రాయాన్ని కూడా నేను మరి కొంచెం వివరించి రాసి ఉండవలసింది. నేను ఎక్కువ సేపు టైపు చెయ్యలేకపోవడం ఒక కారణం కాగా అభిప్రాయాలనే వ్యాసాలుగా విస్తరించి రాసే ఆసక్తి లేకపోవడం మరొక కారణం కావడంతో క్లుప్తంగానే నా అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది.
మీరే అన్నారు ” ఆధునిక” దృష్టి కానిది ఎలా ఉంటుందో నాకు అర్ధం కావడం లేదు అని. ఇది చెప్పడం లేదా మనం ఎంతగా ఈ “ఆధునిక ” స్పృహలో కూరుకుని పోయామో తెలుసుకోవడానికి? మీ ఉద్దేశ్యంలో “ఆధునికత”ని ముందు స్పష్టపరచండి. అసలు మనం ఏ పాటి “ఆధునికులమో” తెలుస్తుంది. అది అటుంచితే ఎందుకని మనకి విమర్శ తప్పనిసరిగా ఇంగ్లీషువారి మార్గాన్ని అనుసరించి వారిని ఉల్లేఖిస్తూ వారి మార్గంలో వారికి ఒప్పుదలగా సాగడం ఒక ఆనవాయితీగా మారిపోయింది? ఇది తప్ప వేరే మార్గం ఎందుకని లేదని మీరు అనుకుంటున్నారూ? మనకి ముందున్న ప్రమాణాలాన్నీ వట్టిపోయినవేననీ మన సమకాలంలోని అమెరికన్ విశ్వవిద్యాలయాలలోని విమర్శ మాత్రమే బలమైనదనీ ఎలా భావిస్తున్నారూ? దీన్నే “అంటగట్టడం” అని అంటాం. నాకు పోలాక్ ఏం చెప్పేరో ఎంతగా తెలియాలో అంతకన్నా ముఖ్యంగా భవభూతి ఏమని అనుకున్నాడో కూడా అంతే ముఖ్యంగా తెలియాలి. నాకు “కాలస్పృహ” లేదు. ఆ ప్రమాణంతో నేను ఆధునికతనే తప్పనిసరి కొలమానంగా ఎంచను. అందునా సాహిత్యంలో అసలే లేదు.
పై వ్యాసంలో ఎంతగా నారాయణ రావు తెలుగున వచ్చిన పాత రామాయణాల ప్రస్తావన తెచ్చినా ఆయన విశ్లేషణ చేసింది మొత్తంగా వలస పాలన ప్రభావంతో మారిన ఆధునికుల చూపుని గురించే! ఇది ఒక ఫ్యాషన్. ఇదేమీ సత్యమూ శాశ్వతమూ కానఖ్ఖరలేదు. నేను భాగవతం లోని కృష్ణుని ప్రస్తావన తెచ్చినది ఎందుకంటే ప్రతిలో లేని దానిని మనం వ్యాఖ్యానం చెయ్యడం కాదు. కవి చెప్పిన దాని మీద మాత్రమే మాట్లాడటం విమర్శకి ముఖ్యం గనక. ఆ వ్యాసంలో చేసిన పని అదే! అంతే గానీ రామాయణాన్ని ఆధునికంగా మార్చిన రచనల మీద ఆధునికతా దృష్టితో ఇతిహాసాలని వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఏ రకంగా ఇంగ్లీషు చదువులు అందుకు ప్రేరణని ఇచ్చాయో మాత్రమే కాకుండా ఆయా భాషలలో వారు, వారి వారి ఇతిహాసాలని ఆధునికంగా మార్చుకున్నారా అన్నది సైతం చెప్పాలి. అందుకూ నేను ఆ దేశాలలో ఏం జరిగిందీ కూడా తెలిస్తే బాగుంటుందని అన్నది. ఎందుకంటే రామాయణాలలోని ఆధునికమైన మార్పు ఆధునిక విద్యల కారణంగా వచ్చింది గనుకా, అది “రాజకీయ పరిణామం” అని వ్యాస రచయిత చెబుతున్నారు గనకాను! ఏసు పాత్రని గురించిన ప్రశ్నని నేను అందుకనే వేశాను. అది ఈ వ్యాసపు పరిధిలోకి రానివ్వకపోవడం విమర్శకులకి ఒక సులువు. ఎందుకంటే తెలుగు పాఠకులకి తెలుగులో వచ్చిన రామాయణాల గురించి తెలిసే వీలుందేమో గానీ ఇంగ్లీషు వారి విద్యా విధానమూ వారి రాజకీయాలూ ఈ ఆధునిక రామాయణ రచనల మీద ఏ రకంగా ప్రభావం చూపాయో తెలిసే వీలు లేదు. అలా తెలియాలంటే అసలు ముందు ఆ భాషల్లో ఇటువంటి మార్పులు ఎలా పనిచేసాయో తెలియాలి. ఆ జోలికి మాత్రం పోకుండా ఒక్క ఇంగ్లీషు విమర్శకుల ధోరణిని పాటిస్తూ తెలుగు రచనలమీద వ్యాఖ్యానం చేయడం తెలుగు పాఠకులని అయోమయపరచడమే అని నేను అనుకుంటాను.
ఇంక అసలు ఈ ఆధునిక తెలుగు రామాయణాల గురించీ తెలియని వాళ్ళూ ఆ బ్రిటీషు వలస పాలనని గురించీ తెలియని వాళ్ళూ – ఇప్పటికీ రామాయణాలని అన్ని కులాల వాళ్ళూ కూడా సుబ్బరంగా పఠిస్తున్నారు. పఠిస్తారు కూడాను. వాళ్లకి చాగంటి కోటేశ్వరరావుల వ్యాఖ్యానం కావాలి గానీ, ఈ వ్యాఖ్యానాలతో పని లేదు. “ఆధునిక” కాలం లోనే ఆ ఇంగ్లీషు చదువులు చదువుకున్న వాళ్ళే ఆధునిక వేషధారణ తోనే ఈ మార్గం లో వెళుతూ కనిపిస్తూ ఉంటారు నిత్యమూ! అందువలన నాకు “ఆధునికత” తాలూకు పరిధి బోధపడలేదు. అటువంటి ఒక వ్యాఖ్యానమూ అంతే బోధపడలేదు. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రంగా మనం ఈ ఆధునికతని పాటిస్తూ ఉన్నట్టు ఉండటమే పెద్ద అబధ్ధం అని అర్ధం అవుతూన్నప్పుడు ఈ వ్యాఖ్యానాల పరిధి మాత్రం ఎంతా? ఏవో కొన్ని కొత్త తరహా మాటలు అంటున్నారు ఈ వ్యాస రచయిత అని అనుకుని మళ్ళి వాల్మీకీ రామాయణాన్నో కనీసం కంకటి పాప రాజు రామాయణాన్నో పఠించేందుకో వినేందుకో తెలుగువాళ్ళూ సిధ్ధపడుతూనే ఉంటారు. [అన్ని కులాల వాళ్ళూ సుమా!] ఎందుకూ? అంత మాత్రం చేత వారంతా వెర్రి వారని మనం అననూ లేము. అనుకోనూ లేము. కదా? ఈ “ఆధునికత” అన్నది సర్వే సర్వత్రా అమలు జరగదు. కావాలంటే ఎలా అమలు జరుగుతుందో మీరు చెప్పండి వింటాను.
ఆచార్య భద్రిరాజు కన్ను మూత – వారి గురించి, వారి విద్వత్తు గురించి తెలిసిన వారికి ఎంత లొటో నాకు తెలుసు . ఒక మహా పండితుదు మాయమై పోతే వారితొ పాటే ఒక నిధి మాయమై పొతుంది ఆబాధ నాకు తెలుసు.’ఎవరితొ మాట్లాడుతాం ఆవిషయాలని’ తెంపుకోలేని దుఃఖం వస్తుంది. ఈమాట లో వారి తిక్కన మీది వ్యాసం చదివి ఆనందం పట్టలేకపోయాను. వారు ఆంధ్ర విశ్వకళా పరిషత్తు లొ కొన్నాళ్ళు ఉపాధ్యాయులుగా గడిపారని నాకు చాలా గర్వంగా ఉంటుంది. వారికి నా నివాళులు
తఃతః
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
08/13/2012 4:13 pm
లైలా గారన్న మాటలకి చిరు సమాధానం: ఇది రాసి తొమ్మిదేళ్లు దాటింది. ఇప్పుడు నాదగ్గర మూలం లేదు కూడ. లైలా గారు ఆంధ్రాంగ్లాల్లో మంచి ప్రావీణ్యం ఉన్నవారిలా కనిపిస్తున్నారు కనక వారే చివరి పేరాని అనువదిస్తే బాగుంటుందని నా నమ్మకం. మేము పద్నాలుగేళ్ల నాడు ఈ పత్రికని ప్రారంభించాలనుకున్నప్పుడు కోరుకున్న ఒక పరిణామం దూరదూరంగా వున్నవారు Internet ద్వారా సహకరించి రచనలు చేస్తారని. వారు ఈ వ్యాసంలో మెరుగుపడగలవన్న ఏ భాగాల్నైనా తిరిగి రాయటానికి నాకెలాటి అభ్యంతరమూ లేదు. కావలసింది రచన మూలానికి తగ్గ స్థాయిని చేరుకోవటం. దానికి వారి వంతుగా ఎలాటి మార్పులూ చేర్పులూ చేసినా అది హర్షించదగింది. వారికిదే నా ఆహ్వానం.
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
08/13/2012 4:01 pm
నారాయణ రావు గారు తను “ఆధునిక” దృష్టితో ఈ వ్యాసాన్ని రాస్తున్నానని ఎక్కడా అనలేదు, నా అనువాదంలో నేనూ అనలేదు. రమ గారు వేసిన ముద్ర అది – పదేపదే కోట్స్ లో పెట్టి మరీ. ఇక ఇప్పుడు నా దృష్టిలో ఆ “ఆధునికత” ఏమిటో నేను స్పష్టపరచాలట, ! ఆవిడ తయారుచేసిన దాన్ని నేనెలా స్పష్టపరచగలనో నాకు బోధపడదు !!
సరే, అలాటి దృష్టి ఒకటి వుందనుకుందాం, ఎలాగో నారాయణ రావు గారు దాన్ని పట్టుకుని ఆ దృష్టితోనే ఈ వ్యాసాన్ని రాశారనీ అనుకుందాం. ఆయన ఆ దృష్టితో కాదు, మరో “ఫలానా” దృష్టితోనే తన విశ్లేషణ చెయ్యాలని దబాయించటానికి మనమెవరం? సాహిత్య విమర్శలో ఎన్నో మార్గాలున్నాయని మన ఆలంకారికులన్నారు, పాశ్చాత్యులూ అన్నారు. అనుభవజ్ఞుడైన విమర్శకుడు ఏ విషయానికి ఎలాటి మార్గం సరైందో ఎన్నుకుని ఆ మార్గంలో తన పరిశోధన కొనసాగిస్తాడు. కాదనే హక్కు పాఠకుడికెక్కడిది? ముందుగా పాఠకులందరి అనుమతి తీసుకునిగాని పరిశోధకుడు పనిచెయ్యటానికి లేదా?
ఐతే, ఆయన ఇలాటి దృష్టితో ఈ సమస్యని చూడటం “సులువు” కనక అలా చేశాడని ఒక ఆరోపణ. ఆయనకి అదెంత కష్టమో సులువో రమ గారికో మరొకరికో ఎలా తెలుస్తుంది? “విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం” ఆయన ఎన్నెన్ని దారుల్లో తిరిగి తిరిగి చివరికి ఆ దారి చేరారో, దానికి ఎంత కష్టపడ్డారో ఎలా లెక్కకట్టటం? ఇతరుల కష్టాన్ని తేలిగ్గా కొట్టిపారెయ్యటం కన్నా సులువైన పని మరొకటుందా?
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి rama bharadwaj అభిప్రాయం:
08/13/2012 2:41 pm
రామారావు గారు పోలాక్ గారి ప్రస్తావన తెచ్చారు గనుక మాత్రమే నేను ఇది కూడా ప్రస్తావన చేస్తున్నాను. పోలాక్ గారి వ్యాసం “crisis in the classics” లో పోలాక్ తనని తాను “non-modernist” గా సంభావించుకుంటూ, ప్రపంచం మొత్తం మీద classics తాలుకు భవిష్యత్తు ని గురించి తన భావాలనీ తన ఆందోళననీ కూడా చెప్పారు. విశ్వవిద్యాలయాలలో classics ని బోధించగలిగిన వాళ్ళు క్రమేపీ తగ్గిపోతున్న వైనం గురించి ఆయన బాధ పడ్డారు. non-brahminism, islamophobia లాంటి ethno chauvinist movements ప్రభావాలని ఆయన ప్రస్తావన చేసారు.
నారాయణ రావు వ్యాసంలో పోలాక్ చూసే ప్రమాదాలు ఏమన్నా ఉన్నాయా అని రామారావు గారు అనుకోలేదు. మనకి “ఆధునికత” అంటే అర్ధం కాని ఒక మోజు, అలా మాట్లాడక పోతే ఏమన్నా వెనకబడిపోతామేమో అన్న భయం, అంధ విశ్వాసం లాంటి ఆరాధనా భావం [హీరో వర్షిప్] వెరసి విమర్శకి తలుపులు మూసేస్తున్న ధోరణి బాగా పెరిగి చివరికి ప్రతిదాన్నీ ఆధునికతా ముసుగు కప్పి మాట్లాడటాన్ని ఒక తప్పనిసరి విధానంగా చేసుకుంటున్నాం!
అసలిప్పటిదాకా మనం ఎవ్వరం కూడా “ఆధునికత” అన్నదానిని మన సమాజాలకి సంబంధించి ఇధమిథ్థంగా నిర్వచించి చూసుకున్న దాఖలా ఎక్కడా కనిపించదు. అది ఫలానాగా స్పష్టపడనిదే మన సాహిత్య విమర్శ గతి కూడా నిజం గా స్పష్టపడదు.
రమ.
నోట్ : పై అభిప్రాయం లో కలిపి రాయాలని అనుకున్నా అప్పటికే type చేసిందీ అచ్చు తప్పులు దిద్దుకున్నదీ కలిపి శ్రమ అవడంతో ఆపివేసాను. గనుక దీన్ని నా పై అభిప్రాయానికి కలగలుపుకుని చదువుకోమని మనవి.
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి తఃతః అభిప్రాయం:
08/13/2012 5:54 am
‘వాల్మీకమూ అవాల్మీకమూ అయిన రచనలని పోల్చి చూసి వచ్చిన మార్పులని సవివరంగా తెలిపే పరిశీలన మనకి రాలేదు‘: rama bharadwaj అభిప్రాయం.
ఈ విషయాన్నె నేను మరొక రకంగా చెప్పాను కొచెం తీవ్ర ధోరణిలో ఊర్మిళా దేవి నిద్ర, సీత గడియల మీద వ్యాసాలు చదివి అభిప్రాయాలు చెప్పినప్పుడు.
వాల్మీకి రాసిన దానిని మాత్రమే (సాంకేతికంగా) ‘రామాయణం’ అనాలి. గణిత శాస్త్రాలలో వాడే ‘దూర సూచి’ ‘Metric / Distance Function’ లాంటి ఒక సమంజసమైన కొలమాన పరికరాన్ని సాహిత్య విమర్శ కూడా తయారుచేసుకోవాలి. మూలం నుంచి అనువాదం గానీ, కొత్తగా ఆ పాత్రల పేర్లూ, వాతావరణమూ ఉంచుతూ రాసిన కల్పనలు గానీ, వాటి ఆధారమైన రచన నుంచి యెంత దూరంగా ఉన్నాయి అన్నది చర్చకు చాలా అవసరం. ఊర్మిళా దేవి నిద్ర, సీత గడియ లాంటి వాటిని రామాయణ పాటలని / కథలని/ గాధలని అనటానికి వీలు లేదు అని రాశాను [ఇక్కడ వాటిలొ ఉన్న రస విషయాలతో సంబంధం లేదు]. రచయిత తను రాసినదానికి ‘రామాయణ కల్పతరువు’ అని పేరు పెట్టుకొవచ్చు, వానికి ఆ స్వేచ్చ ఉంది. విమర్శకులు ‘దూరాన్ని’ ఎంచకుండా ఆ రచన కు ‘రామాయణ’ సంబంధం పెట్ట గూడదు. ఇది కొంచెం కష్టమైనదే గానీ అట్లా కాని పక్షంలో విమర్శకు శాస్త్రీయత ఉండదు. నేనొక ప్రశ్న అడిగాను – రామాంజనేయ నాటకం [గయోపాఖ్యానం] రామాయణ [మహాభారత] కథ అవుతుందా అని. మూలాన్నించి దూరాన్ని యెంచి ఈ విషయాన్ని గురించి చెప్పకుండా చెప్పే ‘రామాయణ రి టొల్డ్’,’ రామాయణ క్వస్చెండ్’ లాంటి వాటికి అర్ఠం లేదు. వాల్మీకి రామాయణాన్ని గానీ దానికి ‘తగినంత చేరువ’ లో ఉన్నవాటిని గానీ చేసిన శాస్త్రీయమైన యే రకమైన పరిశీలన అయినా అభిలషణీయమే. అటువంటి దానిని మాత్రమే ‘రామాయణ’ అన్న మాటతొ అభివర్ణించడం సబబు. ఇతరములకు వాల్మీకి అనే కవి రాసిన కావ్యంతొ ఏ రకమైన సంబంధమూ అంట కట్ట గూడదు. అలాచేస్తే దాన్ని ఒకరకమైన మోసం గానే అనుకోవాలి.
తఃతః
చరిత్రాత్మక నవల అంటే? గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
08/13/2012 5:08 am
ఏ రకమైన కొలబద్ద అయినా మంచి అవగాహనకు కొద్దిగానో గొప్పగనో ఉపకరిస్తుంది. అయితే , ప్రతీ విషయమూ, ప్రతీ వస్తువూ, ప్రతీ సిధ్ధాంతమూ చివరికి ప్రతీ వ్యక్తి కూడా మనకు తెలిసిన కొలబద్దలకూ తూకంరాళ్ళకూ లొంగి తీరవలసినదే నన్న ఆలోచన సరైనది కాదని నా అభిప్రాయం.
విషయానికి వస్తే, లూకాచ్ అనే ఒకాయన తనకు దొరికిన వాటిలో నచ్చిన కొన్ని నవలలను మార్క్సిష్టు దృక్పధంతో పరిశీలించి చారిత్రకనవలల లక్షణాలను క్రోడీకరించటం జరిగిందని తెలుస్తోంది యీ వ్యాసం వలన నాకు. ప్రపంచంలో ఆయన దృష్టికి రాని అనేక చారిత్రకనవల లుండవచ్చును గదా? అనేక దేశాలలో అనేక సంస్కృతులలో అనేక భాషలలో అనేకానేక చారిత్రకనవలలు ఉంటే అన్నిటినీ పరిశీలించటం లూకాచ్ గారికి వీలుపడేపనీ కాదు. ఆయన ఒక గుప్పెడు నవలలను పరిశీలించి ఒక సిధ్ధాంతం చేస్తే అది శిరోధార్యం కానవుసరం లేదు. మంచం పొట్టిదయిందని కాళ్ళు నరుకుకోరు కదా? ఈ సిధ్ధాంతం చట్రంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని సాహిత్యాలలోనూ వచ్చిన చారిత్రక నవలలను ఇమడ్చాలన్న ఆదుర్దాతో అలా ఇమడని వాటిని అక్షరాలా ఖండించటమేనా చేయవలసినది? ఇది శాస్త్ర్రీయదృక్పధం అనిపించుకుంటుందా?
పాశ్చాత్యులైతే మనకన్న తెలిసిన వారు తెలివైన వారు అనే బూజుపట్టిన భావదారిద్యం నుండి మనకు యెప్పుడూ విడుదల? ఎంతసేపూ తెల్లవాడి సిధ్ధాంతాల మూసల్లోకి భారతీయ సాహిత్యాన్ని పోసి గుండెలు బాదుకోవటం జుగుప్స కలిగిస్తోంది. భారతీయవిమర్శనాసిద్ధాంతాల ప్రతిపదికగా పాశ్చాత్య సాహిత్యాన్ని యెందుకు బేరీజువేయరు అనే యెదురు ప్రశ్న వేసి తీరాలనిపిస్తోంది. (నిజానికి రెండూ సరైన ధోరణులు కావని తెలిసినా కూడా!)
ఈ వ్యాసకర్తగారి ఒక వాక్యం “చివరికి విశ్వనాథ సత్యనారాయణగారి పురాణవైర గ్రంధమాల పేరున వచ్చిన నవలలు కూడా ఒక విధముగా చరిత్రాత్మక నవలలే!” అన్న మాటలో ఎంత హేళన ఉన్నది. పాపం విశ్వనాధ భారతోయుడై పోవటం కారణాన, ఇంకా దుడుగ్గా చెప్పాలంటే సాటి తెలుగువాడై పోయిన కారణాన ఎంత పలుచనై పోయాడు. పాపం ఆయనకు ‘లూకాచ్’ అనే ఆయన బిగించిన సిధ్ధాంతం ప్రకారం వ్రాయక పోవటం మరింత అవమానానికి గురి చేసిందా? నోరివారు విశ్వనాధ కొంత విశృంఖలంగా వ్రాసారన్నది నవలల చారిత్రకను ప్రశ్నించటం కాకపోవచ్చని నా అభిప్రాయం.
“నోరి వారి లెక్కలో అడివి బాపిరాజు రాసిన హిమబిందు, గోనగన్నారెడ్డి చారిత్రక నవలలే” అన్న వేరొక వాక్యం వ్యాసకర్త గారు చెప్పారు. బాపిరాజుగారిని లూకాస్ శిక్షకు గురిచేస్తున్నా రన్నమాట. వేరే రకంగా ఎలా అర్థం చేసుకోవాలీ వాక్యాన్ని?
ఇటువంటి ధోరణులు అసంతృప్తిని కలిగిస్తున్నాయి. భగవద్గీతనుండి బాపిరాజుదాకా, మీదాకా నాదాకా అందరి మీద పెత్తనం చేసే అధికారం ఈ మార్క్సిజానికీ దానిపేరు చెప్పుకొని పుట్టే సవాలక్ష సిధ్ధాంతోపసిధ్దాంతాలకీ ఎవరిచ్చారు?
ఈ మార్క్సిజం అనే ఇనప చట్రంలో ఇమడవలసిన అగత్యం ప్రపంచాని కేమీ లేదు. ఎవరు హర్షించినా మానినా సాహిత్యకారులు ఏ సిధ్ధాంతాల చట్రాలకూ అనుగుణంగా వ్రాసితీరాలన్న వెట్టి చాకిరీ యేమీ లేదు చెల్లదు.
మేరు నగ మేధావి గురించి Rao Vemuri అభిప్రాయం:
08/12/2012 1:18 pm
అచార్య కృష్ణమూర్తి గారిని హైదరాబాదులో, వారింట్లో ఒకసారి, కేలిఫోర్నియాలో మా స్నేహితుడి ఇంట్లో ఒకసారి కలుసుకునే అదృష్టం నాకు కలిగింది. నిండుగా ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుందనే దానికి కృష్ణమూర్తిగారు ఒక ఉదాహరణ.
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి lyla yerneni అభిప్రాయం:
08/11/2012 1:26 pm
“ఏకైక రామాయణ కథనానికి దారితీసే అవాంఛనీయ ప్రయత్నాల్ని ఇవి కొంతవరకు అడ్డుకొంటున్నాయి.” -K.V.S. Ramarao
అనువాదము చాలా బాగుంది. Terrific. ఆఖరు పేరా, original English essay లో ఉన్నంత అర్థవంతము కాదు. The writer who translated the essay didn’t capture the essence of original writer’s conclusion.
Narayana Rao uses the word ‘discourse’ three times in the last paragraph of his English essay. The word’s meaning is kept consistant. The English essay’s last sentence (It is a difficult sentence in itself, and it has its problems; :-), seriously, how many independent and dependent clauses can a compound-complex English sentence support, before it loses track of it’s verbs and its thoughts :-)) conveys a different meaning.
అనువాదపు ఆఖరు పేరా తిరగ రాయవచ్చును. ఇంత గొప్పగా అనువదించిన వారికి అదెంత పాటి కష్టం?
“Questioning Ramayanas” పుస్తకములోని ఇతర వ్యాసాలు ఇంకేమైనా తెలుగులోకి అనువదింపబడినవా?
లైలా
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి rama bharadwaj అభిప్రాయం:
08/11/2012 1:22 pm
రామారావు గారూ! నా అభిప్రాయాన్ని కూడా నేను మరి కొంచెం వివరించి రాసి ఉండవలసింది. నేను ఎక్కువ సేపు టైపు చెయ్యలేకపోవడం ఒక కారణం కాగా అభిప్రాయాలనే వ్యాసాలుగా విస్తరించి రాసే ఆసక్తి లేకపోవడం మరొక కారణం కావడంతో క్లుప్తంగానే నా అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది.
మీరే అన్నారు ” ఆధునిక” దృష్టి కానిది ఎలా ఉంటుందో నాకు అర్ధం కావడం లేదు అని. ఇది చెప్పడం లేదా మనం ఎంతగా ఈ “ఆధునిక ” స్పృహలో కూరుకుని పోయామో తెలుసుకోవడానికి? మీ ఉద్దేశ్యంలో “ఆధునికత”ని ముందు స్పష్టపరచండి. అసలు మనం ఏ పాటి “ఆధునికులమో” తెలుస్తుంది. అది అటుంచితే ఎందుకని మనకి విమర్శ తప్పనిసరిగా ఇంగ్లీషువారి మార్గాన్ని అనుసరించి వారిని ఉల్లేఖిస్తూ వారి మార్గంలో వారికి ఒప్పుదలగా సాగడం ఒక ఆనవాయితీగా మారిపోయింది? ఇది తప్ప వేరే మార్గం ఎందుకని లేదని మీరు అనుకుంటున్నారూ? మనకి ముందున్న ప్రమాణాలాన్నీ వట్టిపోయినవేననీ మన సమకాలంలోని అమెరికన్ విశ్వవిద్యాలయాలలోని విమర్శ మాత్రమే బలమైనదనీ ఎలా భావిస్తున్నారూ? దీన్నే “అంటగట్టడం” అని అంటాం. నాకు పోలాక్ ఏం చెప్పేరో ఎంతగా తెలియాలో అంతకన్నా ముఖ్యంగా భవభూతి ఏమని అనుకున్నాడో కూడా అంతే ముఖ్యంగా తెలియాలి. నాకు “కాలస్పృహ” లేదు. ఆ ప్రమాణంతో నేను ఆధునికతనే తప్పనిసరి కొలమానంగా ఎంచను. అందునా సాహిత్యంలో అసలే లేదు.
పై వ్యాసంలో ఎంతగా నారాయణ రావు తెలుగున వచ్చిన పాత రామాయణాల ప్రస్తావన తెచ్చినా ఆయన విశ్లేషణ చేసింది మొత్తంగా వలస పాలన ప్రభావంతో మారిన ఆధునికుల చూపుని గురించే! ఇది ఒక ఫ్యాషన్. ఇదేమీ సత్యమూ శాశ్వతమూ కానఖ్ఖరలేదు. నేను భాగవతం లోని కృష్ణుని ప్రస్తావన తెచ్చినది ఎందుకంటే ప్రతిలో లేని దానిని మనం వ్యాఖ్యానం చెయ్యడం కాదు. కవి చెప్పిన దాని మీద మాత్రమే మాట్లాడటం విమర్శకి ముఖ్యం గనక. ఆ వ్యాసంలో చేసిన పని అదే! అంతే గానీ రామాయణాన్ని ఆధునికంగా మార్చిన రచనల మీద ఆధునికతా దృష్టితో ఇతిహాసాలని వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఏ రకంగా ఇంగ్లీషు చదువులు అందుకు ప్రేరణని ఇచ్చాయో మాత్రమే కాకుండా ఆయా భాషలలో వారు, వారి వారి ఇతిహాసాలని ఆధునికంగా మార్చుకున్నారా అన్నది సైతం చెప్పాలి. అందుకూ నేను ఆ దేశాలలో ఏం జరిగిందీ కూడా తెలిస్తే బాగుంటుందని అన్నది. ఎందుకంటే రామాయణాలలోని ఆధునికమైన మార్పు ఆధునిక విద్యల కారణంగా వచ్చింది గనుకా, అది “రాజకీయ పరిణామం” అని వ్యాస రచయిత చెబుతున్నారు గనకాను! ఏసు పాత్రని గురించిన ప్రశ్నని నేను అందుకనే వేశాను. అది ఈ వ్యాసపు పరిధిలోకి రానివ్వకపోవడం విమర్శకులకి ఒక సులువు. ఎందుకంటే తెలుగు పాఠకులకి తెలుగులో వచ్చిన రామాయణాల గురించి తెలిసే వీలుందేమో గానీ ఇంగ్లీషు వారి విద్యా విధానమూ వారి రాజకీయాలూ ఈ ఆధునిక రామాయణ రచనల మీద ఏ రకంగా ప్రభావం చూపాయో తెలిసే వీలు లేదు. అలా తెలియాలంటే అసలు ముందు ఆ భాషల్లో ఇటువంటి మార్పులు ఎలా పనిచేసాయో తెలియాలి. ఆ జోలికి మాత్రం పోకుండా ఒక్క ఇంగ్లీషు విమర్శకుల ధోరణిని పాటిస్తూ తెలుగు రచనలమీద వ్యాఖ్యానం చేయడం తెలుగు పాఠకులని అయోమయపరచడమే అని నేను అనుకుంటాను.
ఇంక అసలు ఈ ఆధునిక తెలుగు రామాయణాల గురించీ తెలియని వాళ్ళూ ఆ బ్రిటీషు వలస పాలనని గురించీ తెలియని వాళ్ళూ – ఇప్పటికీ రామాయణాలని అన్ని కులాల వాళ్ళూ కూడా సుబ్బరంగా పఠిస్తున్నారు. పఠిస్తారు కూడాను. వాళ్లకి చాగంటి కోటేశ్వరరావుల వ్యాఖ్యానం కావాలి గానీ, ఈ వ్యాఖ్యానాలతో పని లేదు. “ఆధునిక” కాలం లోనే ఆ ఇంగ్లీషు చదువులు చదువుకున్న వాళ్ళే ఆధునిక వేషధారణ తోనే ఈ మార్గం లో వెళుతూ కనిపిస్తూ ఉంటారు నిత్యమూ! అందువలన నాకు “ఆధునికత” తాలూకు పరిధి బోధపడలేదు. అటువంటి ఒక వ్యాఖ్యానమూ అంతే బోధపడలేదు. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రంగా మనం ఈ ఆధునికతని పాటిస్తూ ఉన్నట్టు ఉండటమే పెద్ద అబధ్ధం అని అర్ధం అవుతూన్నప్పుడు ఈ వ్యాఖ్యానాల పరిధి మాత్రం ఎంతా? ఏవో కొన్ని కొత్త తరహా మాటలు అంటున్నారు ఈ వ్యాస రచయిత అని అనుకుని మళ్ళి వాల్మీకీ రామాయణాన్నో కనీసం కంకటి పాప రాజు రామాయణాన్నో పఠించేందుకో వినేందుకో తెలుగువాళ్ళూ సిధ్ధపడుతూనే ఉంటారు. [అన్ని కులాల వాళ్ళూ సుమా!] ఎందుకూ? అంత మాత్రం చేత వారంతా వెర్రి వారని మనం అననూ లేము. అనుకోనూ లేము. కదా? ఈ “ఆధునికత” అన్నది సర్వే సర్వత్రా అమలు జరగదు. కావాలంటే ఎలా అమలు జరుగుతుందో మీరు చెప్పండి వింటాను.
రమ.
మేరు నగ మేధావి గురించి indrani Palaparthy అభిప్రాయం:
08/11/2012 11:49 am
రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఈమాటలోను, ఫేస్ బుక్ లోనూ ఈ విషాద వార్తను చూసాను. చాలా విచారం కలిగింది.
పండితులకి,పరిశోధకులకి బహుశా మరణం లేదనుకుంటాను.
వారు వ్రాసిన పుస్తకాల్లోను, పరిశోధనా పత్రాల్లోనూ వారు సదా చిరంజీవులై ఉంటారు.
పాలపర్తి ఇంద్రాణి.
మేరు నగ మేధావి గురించి తఃతః అభిప్రాయం:
08/11/2012 4:28 am
ఆచార్య భద్రిరాజు కన్ను మూత – వారి గురించి, వారి విద్వత్తు గురించి తెలిసిన వారికి ఎంత లొటో నాకు తెలుసు . ఒక మహా పండితుదు మాయమై పోతే వారితొ పాటే ఒక నిధి మాయమై పొతుంది ఆబాధ నాకు తెలుసు.’ఎవరితొ మాట్లాడుతాం ఆవిషయాలని’ తెంపుకోలేని దుఃఖం వస్తుంది. ఈమాట లో వారి తిక్కన మీది వ్యాసం చదివి ఆనందం పట్టలేకపోయాను. వారు ఆంధ్ర విశ్వకళా పరిషత్తు లొ కొన్నాళ్ళు ఉపాధ్యాయులుగా గడిపారని నాకు చాలా గర్వంగా ఉంటుంది. వారికి నా నివాళులు
తఃతః