1. “భర్త తన పేరు భార్యకి చెప్పడం అనేది మనకు ముందునుంచీ ఉన్నదే అని మీరనుకుంటున్నారా?”
మా పెద్దవాళ్ళని అడిగాను. ఇలాంటి ఆచారమేదీ (భర్త తన పేరు భార్యకి చెప్పకపోవడం) వారికి తెలియదు. రాజులలో ఉందేమో, లేదా కొన్ని ప్రాంతాలలో ఉన్నదేమో. అయినా నా పాయింటు అది కాదు. అక్కడ లక్ష్మణుడన్న మాటలని వివరించడానికి అసలు దాని ప్రసక్తే అనవసరం అన్నది నా అభిప్రాయం. “దశరథకుమారుడను” అనో, “సుమిత్రానందనుడను” అనో చెప్పుకొని ఉంటే ఆ వివరణ అవసరముండేదేమో. కాని అతను చెప్పిన విధానం చూస్తే, కచ్చితంగా ఊర్మిళ ప్రస్తావించిన వాళ్ళనే తాను ప్రస్తావించడమన్నదే ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. అది సంభాషణలో చాతుర్యం.
2. ఇక్కడ నేనిచ్చిన అన్వయం ఒక్కటే సరైనదని చెప్పడం నా ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. నారాయణరావుగారు కూడా తన అన్వయం గురించి అలా అంటారని నేననుకోను. ఎందుకంటే మీరన్నట్టుగా నేపథ్యాన్ని బట్టి, దృక్పథం బట్టి అన్వయించుకోడంలో తేడాకి చాలా అవకాశం ఉంది యిక్కడ. ఉదాహరణకి మీరు ప్రస్తావించిన ఇల్లిందుల సరస్వతీదేవిగారి పుస్తకంలో ఆ పాటకి వారిచ్చిన వ్యాఖ్యానం కూడా నారాయాణరావుగారి వ్యాఖ్యానం కన్నా చాలా వేరుగా ఉంది. 1940లో దేవేంద్ర సత్యార్థి యీ ఊర్మిళాదేవి నిద్ర పాటని ఇంగ్లీషులో అనువదించి Modern Review జర్నల్లో ప్రచురించారు (ఇల్లిందల సరస్వతీదేవిగారి పుస్తక పీఠికలో సురవరం ప్రతాపరెడ్డిగారు దీని గురించి ప్రస్తావించారు). ఆ అనువాదంలో వారు నాకు తోచిన అన్వయాన్నే తీసుకున్నారు. ఇది కూడా డిజిటల్ లైబ్రరీలో లభ్యమవుతోంది [ఈమాటలో అనుబంధంగా ఈ వ్యాసాన్ని ఇక్కడ చదవండి – సం.]
నేను చెప్పదలుచుకున్నదల్లా, సరళమైన అన్వయం ఉన్నప్పుడు దాన్ని కాకుండా క్లిష్టాన్వయాన్ని తీసుకోడం ఎంతవరకు సమంజసమో ఆలోచించమని. అందులోనూ అలాంటి అన్వయాన్ని ఒక సిద్ధాంతానికి ప్రాతిపదికగానో ఉదాహరణగానో తీసుకుంటున్నప్పుడు.
మీ 2A వివరణతో నేను ఏకీభవిస్తాను.
4. “విపరీత వ్యాఖ్యానం”, “అతిశయోక్తి” అనే పదాల వాడుకలో నాకు బాధపడాల్సిన అంశమేదీ కనిపించడం లేదు. ఒకరి వివరణో వ్యాఖ్యానమో విపరీతమనో అతిశయోక్తి అనో అనిపించడం నేరం కాదు కదా. అది చెప్పడం వారిని కించపరచడమూ అవ్వదు. (ఆ మాటకొస్తే నా అభిమాన కవి విశ్వనాథవారి వ్యాఖ్యానం కూడా కొన్ని చోట్ల అతిశయోక్తి, విపరీతమూ అనిపిస్తూ ఉంటుంది!). నాకు చేతనైనంత వరకూ నా అభిప్రాయానికి కారణాలుకూడా చెప్పాను.
వాల్మీకి రామాయణం ప్రసక్తి వచ్చింది కాబట్టి, తహతహగారి వ్యాఖ్య చూసాక నాకు కనిపించిన మరొక చిన్న గందరగోళం: “మారీచుడు ‘హా లక్ష్మణా! హా సీతా!’ అని అరిచాడట. మనకు తెలిసిన రామాయణంలో మారీచుడు హా లక్ష్మణా అని మాత్రమే అంటాడు.” అన్న వాక్యం. ఇక్కడ నారాయణరావుగారి ఉద్దేశంలో “మనకి తెలిసిన రామాయణం” ఏమిటో నాకు తెలియదు కాని, వాల్మీకిరామాయణంలో లక్ష్మణుడు “హా సీతా! హా లక్ష్మణా!” అనే అరుస్తాడు. అంచేత అది స్త్రీ హృదయానికి ఉదాహరణగా ఇవ్వడం సమంజసం కాదు. విశ్వనాథ కల్పవృక్షంలో మాత్రం మారీచుని పాత్రని ఔన్నత్యం పెంచడానికి, అతనికి అనృతదోషం కలగకుండా అతను “లక్ష్మణాగ్రజా!” అని అరిచాడనీ, అది దూరానికి “లక్ష్మణా” అని మాత్రమే వినిపించిందని ఒక తమాషా మార్పు చేసారు.
ఈమాట పాత వ్యాసాలపై నా కామెంట్స్ ఇప్పుడు పోస్ట్ చెయ్యవచ్చా?
[Yes! నిరభ్యంతరంగా ఏ వ్యాసం మీద, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పవచ్చును. దయచేసి తెలుగు లేదా ఇంగ్లీష్లోనే రాయండి. తెంగ్లీషు వాడకండి. – సం.]
“నియమ కవిత్వం” అని అన్నప్పుడు పాటించవలసిన నియమాలు అందులోనే ఉన్నై కదండి. ఛందోభంగం సూచించడమే పీర్ల ఉద్దేశ్యం అయితే మంచిదే, కానీ రివ్యూ పేరిట కవిభావంలో ఇతరులు కల్పించుకోవటం భావస్వాతంత్ర్యానికి అడ్డుచెప్పటమే అవుతుంది.
మోహన గారూ – గోపిక మధ్యలో ఉద్విగ్న అయినట్టుంది కొంచెం అడుగులు అటూ, ఇటూ పడ్డాయి. మట్టు గురించి, ముందు నేను ‘ఆప్ కీ నజరోన్ నె సమ్ ఝా’ (అన్ పఢ్ ) మట్టుకు రాద్దా మనుకుని ‘ఆగవే రజనీ విభావరి ఎచటికే నీ పరుగులు” అని రాశాను ముందుకెళ్ళటం చేతకాలేదు. చివరికి అచ్చులో ఇలావచ్చి పెద్దల (మీ) దృష్టి కి వచ్చింది.
శ్రీనివాస్ గారూ – రజని ” ఓ విభావరీ” ఒక గొప్ప పాట చిన్న తనం నుంచీ ఆ పాట చెవుల్లో మోగుతునే వుంది. ఈమధ్య కూడా రజని గొంతులో యూ ట్యూబ్ లో దొరుకుతున్న ఆయన పాట చాలా సార్లు విన్నాను. రజనీని విభావరినీ కలిపి ఒక పాట రాయాలనే కోర్కె అంతర్లీనంగా ఉన్న మాట నిజం. ‘రుక్ జా రాత్… ‘ (దిల్ ఏక్ మందిర్ ) పాట సాహిత్యం, ఎత్తుగడ గూడా కొంత స్పూర్తి .
ఈ విషయం మీద నేను సైతమ్ ప్రతిస్పందించి ఉన్నాను గనక పరుచూరి శ్రీనివాస్ ఎవరికి జవాబు రాసినా లేక ఎవరి తరుపున జవాబు రాసినా నేను ఆయన రాసిన వైఖరి మీద నాకున్న సందేహాలని మళ్ళి వెలిబుచ్చుతున్నాను.
నేను నా ప్రతిస్పందనలో స్పష్టంగానే కొన్ని విషయాలని సూచించి ఉన్నాను. వాటిని పరుచూరి సరిగ్గా అర్ధం చేసుకున్నట్టు కనబడదు. బహుశా పరుచూరి కూడా ఒక పాఠకుడి గానే దీని మీద మాట్లాడుతున్నారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఈ మౌఖిక/ లిఖిత సాహిత్యాల మీద పరిశోధనని వెలయించిన వారు అయి ఉండరు.
స్త్రీల రామాయణపు పాటలు అని ఒక పుస్తకమ్ మీద అచ్చు వేసినంత మాత్రానికే వాటిని యధాతధంగా మనమ్ స్వీకరించనఖ్ఖరలేదు. అందులో స్త్రీల గొంతుకలున్నాయి. అవి స్త్రీలు రాసినవి అయి ఉండవచ్చు. ఒకానొక కవయిత్రి అని కాకుండా కాలక్రమేణా అనేకమంది స్త్రీలు ఆయా పాటలని తమ ఊహలతో విస్తరించుకుని ఉండవచ్చు. ఖచ్చితమైన కర్తృత్వం అన్నది మౌఖిక సాహిత్య లక్షణమ్గా పరిశోధకులు ఒప్పరు. ఒకటి కన్నా మించి దానికి పాఠాంతరాలు దొరికినప్పుడు కూడా అది దాని వ్యాప్తికి ముఖ్య ఉదాహరణగా పరిగణించడమ్ మౌఖిక జానపద రీతులని గుర్తు పట్టడంలో మరొక ఉదాహరణగా చెప్తారు. ఇంక ఆడవాళ్ళ కోసం మగవాళ్ళు సాహిత్యాన్ని సృష్టించిన ఉదాహరణలు కూడా మనకి మౌఖిక సాహిత్యంలో మెండుగానే దొరుకుతాయి. అప్పుడు ఆ పాట చివరి చరణం లో ఆ రాసిన కవి పేరు సైతమ్ వస్తుంది. స్త్రీలు పాడుకునే పాటలలో ఇటువంటివి కూడా ఉండటమ్ బహుశా పరుచూరికి తెలిసి ఉండదు.
లిఖిత సాహిత్యంలో క్షేత్రయ్య పదాలు దేవదాసీల కోసం రాజాస్థానమ్లో నృత్యమ్ చేసే స్త్రీల కోసమ్ రాయబడిన పాటలే! ఇలా అన్ని సంప్రదాయాలలోనూ అందరూ చేయి చేసుకోవడం స్పష్టం గానే కనిపిస్తుంది మనకి. అందులో గొంతుకలు స్త్రీల గొంతుకలే! వాళ్ళ వాళ్ళ మనస్సులోని ఈర్ష్యా ద్వేషాలే! వాళ్ళ వాళ్ళ అంతరంగాలే! అలాగే అన్నమయ్య నాయికలలో సైతం మనకి చాలా సందర్భాలలో స్త్రీల గొంతుకలు బలంగా వినిపిస్తాయి. కేవలం సమర్తలనీ ..పురిటి నొప్పుల్నీ వేవిళ్లనీ రాసిన కారణానికే అవి స్త్రీలు రాసేరని చెప్పనఖ్ఖర లేదు. రాసి ఉండవచ్చు. కాకపోయీ ఉండవచ్చు. ఒక మూల పదం ఉండగా వాటిని పాడుకునే క్రమంలో భిన్నమైన అంశాలు వచ్చి చేరడానికి సైతమ్ ఆస్కారం ఉంటుంది. ఇది కూడా మౌఖిక సాహిత్యపు ప్రధాన లక్షణమే! నేను ఖచ్చితంగా వ్యాసకర్త “కవయిత్రి” అంటూ ప్రస్తావన చేయడాన్ని అభ్యంతరం పెట్టడంలో ఇన్ని అంశాలూ ఇన్ని పరిశోధనలూ ఉన్నాయి. ఇక్కడే నేను వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ప్రస్తావన తెచ్చాను. అది ఎందుకు తెచ్చానో కూడా పరుచూరికి బోధపడినట్టు లేదు. వేటూరి గారు ఒక తాళ్లపాక తిమ్మక్కని ఈ సరికే “తొలి తెలుగు కవయిత్రి”గా తయారు చేసి పెట్టారు. అందుకు సరిపడా రుజువులు ఏవీ స్పస్టమ్గా లేకుండానే! అటు తర్వాత నించీ తెలుగులో మొదటి కవయిత్రి స్టేటస్సు అలా తాళ్ళపాక తిమ్మక్క ఆక్రమించుకుంది. అసలు అలాంటి ఆమె ఒకరున్నారొ లేరో తెలియకుండానే! అందువలన పండితులన్నవారేదో పొరపాట్లు చేయరన్న భ్రమలో తెలుగు వాళ్ళు కనీసమ్ తరచి చూసుకోకుండానే ఆమెని “తొలితెలుగు కవయిత్రి” అంటూ సంభావించేస్తున్నారు. ఇలాంటివి ఆయా పండితుల ఊహలు మాత్రమే! పరిశోధనలో తెలియనివాటిని అలాగే పేర్కోవడమ్ సముచితమని అనడమ్ “వ్యంగ్యం”గా శ్రీనివాస్ కి అర్ధమ్ కావడం వింత మరి.
నేను చాలా వరకూ నారాయణరావు వ్యాసాలని చదివినదాన్ని. ఆయన అభిప్రాయాలలో మొదటి రోజులలో కనిపించిన విలక్షణత క్రమంగా కనుమరుగవడాన్ని గమనించవచ్చు ఎవరైనా! ఆయన మాటల్లో ఇతర విమర్శకుల ప్రభావం కూడా గుర్తు పట్టవచ్చు. ఎ.కె. రామానుజన్ ప్రభావం లోంచి నారాయణరావు బయటకు రాలేకపోవడాన్ని ఆయన వ్యాస రచనలన్నీ తెలియజేస్తున్నాయి. ఇది తెలుగు సాహిత్యమ్ మీద పట్టు ఉన్న వాళ్లకి స్పస్టమ్ గానే తెలుస్తుంది. అయితే మన దగ్గర పొగడ్తలకి ఉన్న విశేషమైన విలువ.. ప్రాధాన్యమ్.. విబేధించడానికి ఉండదు. ఇది ఎక్కువగా తెలుగు వాళ్ళ లక్షణమ్ జాతి పరంగా! నారాయణరావు భావాలూ వ్యాసాలూ విమర్శకి అతీతమైనవా ఏమి??
మనం విమర్శని పట్టించుకోవాల్సిన స్థితి నించీ విమర్శ చేసిన వారి గొంతుకల్ని అణచివేయాలనే ధోరణి లోకి మళ్ళిపోతున్నాం . “మీరు కూడా” అంటూ పరుచూరి శ్రీనివాస్ కామేశ్వరావుగారిని ఉద్దేశ్యించి అనడం దీనికి మరొక ఉదాహరణ. ఆయన అభిప్రాయాలు రాసిన వారి మీద వివక్ష చూపడమ్ ఏమిటో?
ఇంక ఈమాట గనక కేవలం సాహిత్యానికి ఒక చర్చా వేదిక గనక అయితే అప్పుడు అన్ని రకాల అభిప్రాయాలకీ చోటు ఇస్తుంది. ఇస్తుందన్న నమ్మకం వల్లనే ఇక్కడ రాయడం. లేకపోతే అసలు రాయవలసిన పనేముందీ? ఈమాటకే రాయవలసిన అవసరమ్ ఏముందీ ఎవరైనా? నీతిబోధలూ, ప్రవచించడాలూ ఎదటి వారికి ఏమీ తెలియదన్నట్టు మాట్లాడటమ్ చేసినప్పుడే అటువంటి వాటికి జవాబుగా చురకలు గానీ వ్యంగ్యాలు గానీ రాయడమ్ అవసరమ్ అవుతుంది. సాహిత్య అభిప్రాయాలకి ఒక చరిత్ర తప్పక అవసరమని భావించే దానిని గనక నేను ప్రతిస్పదించడమ్. ఎందుకంటే ఏ అభిప్రాయానికైనా రాసే వాళ్ళు మాత్రమే కాక ఇతర పాఠక వర్గమ్ కూడా ఉంటుందనీ తెలిసిన దానినీ! పాఠక వర్గం మీద నమ్మకమూ గౌరవమూ ఉన్నదానినీను! తెలిసిన పాఠకులని ఆలోచించనిద్దామ్!
విద్యా, చదువురాని చాకలివాడే ఇస్త్రీ చేస్తున్నప్పుడు, పిహెచ్.డి చేస్తున్న మీరు చెయ్యలేరా అని సవాలు విసిరింది.
కొడుకుని వాళ్ళమ్మ కోడలి చేతిలో పెట్టి…
‘రేపటి సుఖం కోసం ఈ వేళ కాలిపొండి’
ఆ సమయంలో కూడా నేను ఇంటిలో ఒక మూల నుంచుని ఇస్త్రీ చేసుకుంటూ నిలబడే ఉన్నాను.”
“నేను పరిగెత్తుకు వస్తే ఇస్త్రీ ఆగిపోతుంది, పొదుపు ఆగిపోతుంది, అమ్మాయి డాక్టరీ ఆగిపోతుంది.”
మూడవ నంబరు ప్రణయ సూచిక ఎగరవేయబడి,
కెవ్వ్వ్వవ్వ్. గురూజీ… ఎప్పటిలాగానే… చాలా రొటీన్ గా అదిరిపోయింది పోస్టు..
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
01/09/2012 12:56 pm
శ్రీనివాస్ గారు,
మీ వివరణకు కృతజ్ఞతలు.
1. “భర్త తన పేరు భార్యకి చెప్పడం అనేది మనకు ముందునుంచీ ఉన్నదే అని మీరనుకుంటున్నారా?”
మా పెద్దవాళ్ళని అడిగాను. ఇలాంటి ఆచారమేదీ (భర్త తన పేరు భార్యకి చెప్పకపోవడం) వారికి తెలియదు. రాజులలో ఉందేమో, లేదా కొన్ని ప్రాంతాలలో ఉన్నదేమో. అయినా నా పాయింటు అది కాదు. అక్కడ లక్ష్మణుడన్న మాటలని వివరించడానికి అసలు దాని ప్రసక్తే అనవసరం అన్నది నా అభిప్రాయం. “దశరథకుమారుడను” అనో, “సుమిత్రానందనుడను” అనో చెప్పుకొని ఉంటే ఆ వివరణ అవసరముండేదేమో. కాని అతను చెప్పిన విధానం చూస్తే, కచ్చితంగా ఊర్మిళ ప్రస్తావించిన వాళ్ళనే తాను ప్రస్తావించడమన్నదే ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. అది సంభాషణలో చాతుర్యం.
2. ఇక్కడ నేనిచ్చిన అన్వయం ఒక్కటే సరైనదని చెప్పడం నా ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. నారాయణరావుగారు కూడా తన అన్వయం గురించి అలా అంటారని నేననుకోను. ఎందుకంటే మీరన్నట్టుగా నేపథ్యాన్ని బట్టి, దృక్పథం బట్టి అన్వయించుకోడంలో తేడాకి చాలా అవకాశం ఉంది యిక్కడ. ఉదాహరణకి మీరు ప్రస్తావించిన ఇల్లిందుల సరస్వతీదేవిగారి పుస్తకంలో ఆ పాటకి వారిచ్చిన వ్యాఖ్యానం కూడా నారాయాణరావుగారి వ్యాఖ్యానం కన్నా చాలా వేరుగా ఉంది. 1940లో దేవేంద్ర సత్యార్థి యీ ఊర్మిళాదేవి నిద్ర పాటని ఇంగ్లీషులో అనువదించి Modern Review జర్నల్లో ప్రచురించారు (ఇల్లిందల సరస్వతీదేవిగారి పుస్తక పీఠికలో సురవరం ప్రతాపరెడ్డిగారు దీని గురించి ప్రస్తావించారు). ఆ అనువాదంలో వారు నాకు తోచిన అన్వయాన్నే తీసుకున్నారు. ఇది కూడా డిజిటల్ లైబ్రరీలో లభ్యమవుతోంది [ఈమాటలో అనుబంధంగా ఈ వ్యాసాన్ని ఇక్కడ చదవండి – సం.]
నేను చెప్పదలుచుకున్నదల్లా, సరళమైన అన్వయం ఉన్నప్పుడు దాన్ని కాకుండా క్లిష్టాన్వయాన్ని తీసుకోడం ఎంతవరకు సమంజసమో ఆలోచించమని. అందులోనూ అలాంటి అన్వయాన్ని ఒక సిద్ధాంతానికి ప్రాతిపదికగానో ఉదాహరణగానో తీసుకుంటున్నప్పుడు.
మీ 2A వివరణతో నేను ఏకీభవిస్తాను.
4. “విపరీత వ్యాఖ్యానం”, “అతిశయోక్తి” అనే పదాల వాడుకలో నాకు బాధపడాల్సిన అంశమేదీ కనిపించడం లేదు. ఒకరి వివరణో వ్యాఖ్యానమో విపరీతమనో అతిశయోక్తి అనో అనిపించడం నేరం కాదు కదా. అది చెప్పడం వారిని కించపరచడమూ అవ్వదు. (ఆ మాటకొస్తే నా అభిమాన కవి విశ్వనాథవారి వ్యాఖ్యానం కూడా కొన్ని చోట్ల అతిశయోక్తి, విపరీతమూ అనిపిస్తూ ఉంటుంది!). నాకు చేతనైనంత వరకూ నా అభిప్రాయానికి కారణాలుకూడా చెప్పాను.
వాల్మీకి రామాయణం ప్రసక్తి వచ్చింది కాబట్టి, తహతహగారి వ్యాఖ్య చూసాక నాకు కనిపించిన మరొక చిన్న గందరగోళం: “మారీచుడు ‘హా లక్ష్మణా! హా సీతా!’ అని అరిచాడట. మనకు తెలిసిన రామాయణంలో మారీచుడు హా లక్ష్మణా అని మాత్రమే అంటాడు.” అన్న వాక్యం. ఇక్కడ నారాయణరావుగారి ఉద్దేశంలో “మనకి తెలిసిన రామాయణం” ఏమిటో నాకు తెలియదు కాని, వాల్మీకిరామాయణంలో లక్ష్మణుడు “హా సీతా! హా లక్ష్మణా!” అనే అరుస్తాడు. అంచేత అది స్త్రీ హృదయానికి ఉదాహరణగా ఇవ్వడం సమంజసం కాదు. విశ్వనాథ కల్పవృక్షంలో మాత్రం మారీచుని పాత్రని ఔన్నత్యం పెంచడానికి, అతనికి అనృతదోషం కలగకుండా అతను “లక్ష్మణాగ్రజా!” అని అరిచాడనీ, అది దూరానికి “లక్ష్మణా” అని మాత్రమే వినిపించిందని ఒక తమాషా మార్పు చేసారు.
వెంటాడుతున్న ఊడుగపూత పరిమళం గురించి srinivas అభిప్రాయం:
01/09/2012 11:33 am
Dear sir,
ఈమాట పాత వ్యాసాలపై నా కామెంట్స్ ఇప్పుడు పోస్ట్ చెయ్యవచ్చా?
[Yes! నిరభ్యంతరంగా ఏ వ్యాసం మీద, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పవచ్చును. దయచేసి తెలుగు లేదా ఇంగ్లీష్లోనే రాయండి. తెంగ్లీషు వాడకండి. – సం.]
శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి Bharadwaz అభిప్రాయం:
01/09/2012 8:34 am
చాలా చాలా బాగుందండి!!
కొత్త ఏడాదికి కొత్త తీర్మానాలు గురించి రవి అభిప్రాయం:
01/09/2012 7:03 am
“నియమ కవిత్వం” అని అన్నప్పుడు పాటించవలసిన నియమాలు అందులోనే ఉన్నై కదండి. ఛందోభంగం సూచించడమే పీర్ల ఉద్దేశ్యం అయితే మంచిదే, కానీ రివ్యూ పేరిట కవిభావంలో ఇతరులు కల్పించుకోవటం భావస్వాతంత్ర్యానికి అడ్డుచెప్పటమే అవుతుంది.
పొదుపు సమీకరణాలు గురించి Peram Kiran Kumar అభిప్రాయం:
01/09/2012 6:02 am
చాలా బాగా వ్రాశారు బులుసు సుబ్రహ్మణ్యం గారు.
ఆగవే రజనీ! విభావరి! గురించి TahaTaha అభిప్రాయం:
01/09/2012 4:13 am
మోహన గారికీ , శ్రీనివాస్ గారికీ నమస్కారాలు.
మోహన గారూ – గోపిక మధ్యలో ఉద్విగ్న అయినట్టుంది కొంచెం అడుగులు అటూ, ఇటూ పడ్డాయి. మట్టు గురించి, ముందు నేను ‘ఆప్ కీ నజరోన్ నె సమ్ ఝా’ (అన్ పఢ్ ) మట్టుకు రాద్దా మనుకుని ‘ఆగవే రజనీ విభావరి ఎచటికే నీ పరుగులు” అని రాశాను ముందుకెళ్ళటం చేతకాలేదు. చివరికి అచ్చులో ఇలావచ్చి పెద్దల (మీ) దృష్టి కి వచ్చింది.
శ్రీనివాస్ గారూ – రజని ” ఓ విభావరీ” ఒక గొప్ప పాట చిన్న తనం నుంచీ ఆ పాట చెవుల్లో మోగుతునే వుంది. ఈమధ్య కూడా రజని గొంతులో యూ ట్యూబ్ లో దొరుకుతున్న ఆయన పాట చాలా సార్లు విన్నాను. రజనీని విభావరినీ కలిపి ఒక పాట రాయాలనే కోర్కె అంతర్లీనంగా ఉన్న మాట నిజం. ‘రుక్ జా రాత్… ‘ (దిల్ ఏక్ మందిర్ ) పాట సాహిత్యం, ఎత్తుగడ గూడా కొంత స్పూర్తి .
మీ
తః తః
ఒక్క క్షణం గురించి sineevaali అభిప్రాయం:
01/09/2012 3:33 am
Poem is good. At the same time a feeling that some thing is missing remains after reading it. What could it be?
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి rama bharadwaj అభిప్రాయం:
01/09/2012 3:11 am
ఈ విషయం మీద నేను సైతమ్ ప్రతిస్పందించి ఉన్నాను గనక పరుచూరి శ్రీనివాస్ ఎవరికి జవాబు రాసినా లేక ఎవరి తరుపున జవాబు రాసినా నేను ఆయన రాసిన వైఖరి మీద నాకున్న సందేహాలని మళ్ళి వెలిబుచ్చుతున్నాను.
నేను నా ప్రతిస్పందనలో స్పష్టంగానే కొన్ని విషయాలని సూచించి ఉన్నాను. వాటిని పరుచూరి సరిగ్గా అర్ధం చేసుకున్నట్టు కనబడదు. బహుశా పరుచూరి కూడా ఒక పాఠకుడి గానే దీని మీద మాట్లాడుతున్నారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఈ మౌఖిక/ లిఖిత సాహిత్యాల మీద పరిశోధనని వెలయించిన వారు అయి ఉండరు.
స్త్రీల రామాయణపు పాటలు అని ఒక పుస్తకమ్ మీద అచ్చు వేసినంత మాత్రానికే వాటిని యధాతధంగా మనమ్ స్వీకరించనఖ్ఖరలేదు. అందులో స్త్రీల గొంతుకలున్నాయి. అవి స్త్రీలు రాసినవి అయి ఉండవచ్చు. ఒకానొక కవయిత్రి అని కాకుండా కాలక్రమేణా అనేకమంది స్త్రీలు ఆయా పాటలని తమ ఊహలతో విస్తరించుకుని ఉండవచ్చు. ఖచ్చితమైన కర్తృత్వం అన్నది మౌఖిక సాహిత్య లక్షణమ్గా పరిశోధకులు ఒప్పరు. ఒకటి కన్నా మించి దానికి పాఠాంతరాలు దొరికినప్పుడు కూడా అది దాని వ్యాప్తికి ముఖ్య ఉదాహరణగా పరిగణించడమ్ మౌఖిక జానపద రీతులని గుర్తు పట్టడంలో మరొక ఉదాహరణగా చెప్తారు. ఇంక ఆడవాళ్ళ కోసం మగవాళ్ళు సాహిత్యాన్ని సృష్టించిన ఉదాహరణలు కూడా మనకి మౌఖిక సాహిత్యంలో మెండుగానే దొరుకుతాయి. అప్పుడు ఆ పాట చివరి చరణం లో ఆ రాసిన కవి పేరు సైతమ్ వస్తుంది. స్త్రీలు పాడుకునే పాటలలో ఇటువంటివి కూడా ఉండటమ్ బహుశా పరుచూరికి తెలిసి ఉండదు.
లిఖిత సాహిత్యంలో క్షేత్రయ్య పదాలు దేవదాసీల కోసం రాజాస్థానమ్లో నృత్యమ్ చేసే స్త్రీల కోసమ్ రాయబడిన పాటలే! ఇలా అన్ని సంప్రదాయాలలోనూ అందరూ చేయి చేసుకోవడం స్పష్టం గానే కనిపిస్తుంది మనకి. అందులో గొంతుకలు స్త్రీల గొంతుకలే! వాళ్ళ వాళ్ళ మనస్సులోని ఈర్ష్యా ద్వేషాలే! వాళ్ళ వాళ్ళ అంతరంగాలే! అలాగే అన్నమయ్య నాయికలలో సైతం మనకి చాలా సందర్భాలలో స్త్రీల గొంతుకలు బలంగా వినిపిస్తాయి. కేవలం సమర్తలనీ ..పురిటి నొప్పుల్నీ వేవిళ్లనీ రాసిన కారణానికే అవి స్త్రీలు రాసేరని చెప్పనఖ్ఖర లేదు. రాసి ఉండవచ్చు. కాకపోయీ ఉండవచ్చు. ఒక మూల పదం ఉండగా వాటిని పాడుకునే క్రమంలో భిన్నమైన అంశాలు వచ్చి చేరడానికి సైతమ్ ఆస్కారం ఉంటుంది. ఇది కూడా మౌఖిక సాహిత్యపు ప్రధాన లక్షణమే! నేను ఖచ్చితంగా వ్యాసకర్త “కవయిత్రి” అంటూ ప్రస్తావన చేయడాన్ని అభ్యంతరం పెట్టడంలో ఇన్ని అంశాలూ ఇన్ని పరిశోధనలూ ఉన్నాయి. ఇక్కడే నేను వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ప్రస్తావన తెచ్చాను. అది ఎందుకు తెచ్చానో కూడా పరుచూరికి బోధపడినట్టు లేదు. వేటూరి గారు ఒక తాళ్లపాక తిమ్మక్కని ఈ సరికే “తొలి తెలుగు కవయిత్రి”గా తయారు చేసి పెట్టారు. అందుకు సరిపడా రుజువులు ఏవీ స్పస్టమ్గా లేకుండానే! అటు తర్వాత నించీ తెలుగులో మొదటి కవయిత్రి స్టేటస్సు అలా తాళ్ళపాక తిమ్మక్క ఆక్రమించుకుంది. అసలు అలాంటి ఆమె ఒకరున్నారొ లేరో తెలియకుండానే! అందువలన పండితులన్నవారేదో పొరపాట్లు చేయరన్న భ్రమలో తెలుగు వాళ్ళు కనీసమ్ తరచి చూసుకోకుండానే ఆమెని “తొలితెలుగు కవయిత్రి” అంటూ సంభావించేస్తున్నారు. ఇలాంటివి ఆయా పండితుల ఊహలు మాత్రమే! పరిశోధనలో తెలియనివాటిని అలాగే పేర్కోవడమ్ సముచితమని అనడమ్ “వ్యంగ్యం”గా శ్రీనివాస్ కి అర్ధమ్ కావడం వింత మరి.
నేను చాలా వరకూ నారాయణరావు వ్యాసాలని చదివినదాన్ని. ఆయన అభిప్రాయాలలో మొదటి రోజులలో కనిపించిన విలక్షణత క్రమంగా కనుమరుగవడాన్ని గమనించవచ్చు ఎవరైనా! ఆయన మాటల్లో ఇతర విమర్శకుల ప్రభావం కూడా గుర్తు పట్టవచ్చు. ఎ.కె. రామానుజన్ ప్రభావం లోంచి నారాయణరావు బయటకు రాలేకపోవడాన్ని ఆయన వ్యాస రచనలన్నీ తెలియజేస్తున్నాయి. ఇది తెలుగు సాహిత్యమ్ మీద పట్టు ఉన్న వాళ్లకి స్పస్టమ్ గానే తెలుస్తుంది. అయితే మన దగ్గర పొగడ్తలకి ఉన్న విశేషమైన విలువ.. ప్రాధాన్యమ్.. విబేధించడానికి ఉండదు. ఇది ఎక్కువగా తెలుగు వాళ్ళ లక్షణమ్ జాతి పరంగా! నారాయణరావు భావాలూ వ్యాసాలూ విమర్శకి అతీతమైనవా ఏమి??
మనం విమర్శని పట్టించుకోవాల్సిన స్థితి నించీ విమర్శ చేసిన వారి గొంతుకల్ని అణచివేయాలనే ధోరణి లోకి మళ్ళిపోతున్నాం . “మీరు కూడా” అంటూ పరుచూరి శ్రీనివాస్ కామేశ్వరావుగారిని ఉద్దేశ్యించి అనడం దీనికి మరొక ఉదాహరణ. ఆయన అభిప్రాయాలు రాసిన వారి మీద వివక్ష చూపడమ్ ఏమిటో?
ఇంక ఈమాట గనక కేవలం సాహిత్యానికి ఒక చర్చా వేదిక గనక అయితే అప్పుడు అన్ని రకాల అభిప్రాయాలకీ చోటు ఇస్తుంది. ఇస్తుందన్న నమ్మకం వల్లనే ఇక్కడ రాయడం. లేకపోతే అసలు రాయవలసిన పనేముందీ? ఈమాటకే రాయవలసిన అవసరమ్ ఏముందీ ఎవరైనా? నీతిబోధలూ, ప్రవచించడాలూ ఎదటి వారికి ఏమీ తెలియదన్నట్టు మాట్లాడటమ్ చేసినప్పుడే అటువంటి వాటికి జవాబుగా చురకలు గానీ వ్యంగ్యాలు గానీ రాయడమ్ అవసరమ్ అవుతుంది. సాహిత్య అభిప్రాయాలకి ఒక చరిత్ర తప్పక అవసరమని భావించే దానిని గనక నేను ప్రతిస్పదించడమ్. ఎందుకంటే ఏ అభిప్రాయానికైనా రాసే వాళ్ళు మాత్రమే కాక ఇతర పాఠక వర్గమ్ కూడా ఉంటుందనీ తెలిసిన దానినీ! పాఠక వర్గం మీద నమ్మకమూ గౌరవమూ ఉన్నదానినీను! తెలిసిన పాఠకులని ఆలోచించనిద్దామ్!
రమ.
పొదుపు సమీకరణాలు గురించి Raj kumar అభిప్రాయం:
01/09/2012 2:48 am
కెవ్వ్వ్వవ్వ్. గురూజీ… ఎప్పటిలాగానే… చాలా రొటీన్ గా అదిరిపోయింది పోస్టు..
కన్నెవాన గురించి Vamsi Krishna K అభిప్రాయం:
01/08/2012 10:02 pm
దమయంతి గారు, కృష్ణ గారు
మీ అభినందనకు ధన్యవాదాలు
-వంశీ