పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16484

  1. వేణునాదం ఆగింది! గురించి Rohiniprasad అభిప్రాయం:

    01/10/2012 12:00 pm

    లైలాగారూ, నా వెర్రి మీకు తెలియదు లెండి.

    2007లో అట్లాంటాలో ఉన్నప్పుడు అప్నా అనే ఒక సంస్థ మొదలయింది. దాన్ని ప్రారంభించిన వ్యక్తులు నాకు తెలుసు గనక ప్రారంభోత్సవానికి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో బాటుగా విజయరాఘవరావుగారిని కూడా ఆహ్వానిస్తే బావుంటుందని నేను సూచించాను. కాస్త తటపటాయించి ఆ ప్రయత్నం విరమించారు.

    నాకు వీలున్నంతవరకూ ఇంకా చాలా సందర్భాల్లో చాలామందితో ఈ సంగతి చెప్పి, ఒక పద్మశ్రీ అవార్డుతో అయినా ఆయనను మనం గుర్తించాలని చెప్పాను.

    బతికుంటేనేం, లేకపోతేనేం అనే మీవంటివారి వైఖరి ఉంటే ఏమీ జరగదు కదా. పైగా మీకు ఆయనొక పబ్లిక్ ఫిగర్ కావచ్చు. నాకు పరిచయం ఉంది కనక కాస్త సీరియస్‌గా అనిపిస్తుంది. అర్థం చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు.

  2. వేణునాదం ఆగింది! గురించి lyla yerneni అభిప్రాయం:

    01/10/2012 11:38 am

    ఉత్తమ కళాకారులను మరణించాక తలుచుకోవడంకూడా తప్పేనని లైలాగారివల్ల తెలిసింది!- రోహిణీప్రసాద్

    మరణించినప్పుడే ఉత్తమ కళాకారులు యాదిలొకి వస్తారా? లేక మరణించినందువలన అప్పుడు ఉత్తమ శ్రేణిలోకి జేరతారా. ఒక కళాకారుని చనిపోయినప్పుడే, ఎందుకు పరిచయం చెయ్యటం? కళ అంతకు ముందునుండీ ఉందిగా. తర్వాత కూడా ఉంటుంది. ఇతర పత్రికలు, సాహిత్య సంగీత కళల విషయాలు ఎప్పటికప్పుడు పరిచయం చేస్తుంటారు. విషయాలు మారుతూ ఉంటాయి. ఆసక్తి దాయకంగా ఉంటాయి. ట్రిబ్యూట్లు మీకొక రిపొర్టింగ్ సెన్సేషనలిసమ్. అది మీ ఆచారం. ప్రజలందర్నీ ఈ వ్యక్తి చనిపోయాడు, చనిపోయాడు, ఇప్పుడు స్పందించండో అని synchronise చెయ్యటం. ఒక వ్యక్తి మరణిస్తేనే వేణు నాదం ఆగిపోతుందా? ఏమిటా హెడ్డింగ్ ? ఏమిటీ వెర్రి? రోహిణీ ప్రసాద్?

    మరణించినప్పుడే కళాకారులను గుర్తు చేసుకోటానికి, పరిచయం చెయ్యటానికి, మీరిచ్చే కారణం?

    లైలా.

  3. కవిత్వంలో శ్రీశ్రీ ప్రస్థానం, పరిణామం గురించి k s hareesh kumar అభిప్రాయం:

    01/10/2012 11:06 am

    రావు గారు వ్రాసినది నిజము. Sri Sri కవిత ప్రస్థానము మహా ప్రస్థానముతొనె ఆగిపొయినది. I fully agree with the views of Sri Rao. We do not know much about his earlier works. So therefore, it can be safely concluded that other than Mahaprasthanam, there is vacuum pre- Mahaprasthanam and Post -Mahaprasthanam. It’s a great analaysis by Rao. It would have been useful for the readers had he analyzed the reasons for which Sri Sri could not or did not produce anything worth after Mahaprasthanam. I have read about the life journey of Sri Sri from various angles and the reasons for such a vacuum in my opinion are as under: (of course, everyone of us knew about it-but for recapitulation).

    Sri Sri had struggled to make his both ends meet. Except for showering empty praises on him by the people, nothing has been done by any one to come to his rescue. He was being called as a Mahakavi when he was in terrible penury. If he were not born as a Telugu, probably he would have lived a dignified life. So, it is purely because of our Telugus that we could not get any thing more than Mahaprasthanam from Sri Sri. We have to blame ourselves for that. So, in the melee, he had lost himself and could not produce any literature that is worth. Sri Sri lived from hand to mouth before entering cinema field. He could make money on entering cinema industry but lost his poetic glory and had to confine himself to routine cinema stuff and involve himself in nitty gritty of film making. In the process, he had alienated himself from main stream poetry and has become a part-time poet.

    The other reason for the downfall of Sri Sri was his staunch belief in Communism/Marxism etc., He thought them to be panacea for all problems. But, I believe, he was not a practicing communist. This conflict also added to his confusion. Mahaprasthanam had become a great work since it was an outcome of his heart felt feelings whereas Post-Mahaprasthanam, he was being identified as a Communist and not as a Poet. So, he stooped to the level of a communist from poet and therefore he did not contribute anything thereafter.

    This is my opinion. I would request the author Mr.Rao himself to evaluate the reasons for his degeneration as a poet.

  4. నన్ను ఎవరో చదివారు గురించి కెక్యూబ్ వర్మ అభిప్రాయం:

    01/10/2012 10:19 am

    చాలా నచ్చింది Sir..

  5. వేణునాదం ఆగింది! గురించి Rohiniprasad అభిప్రాయం:

    01/10/2012 10:03 am

    ఉత్తమ కళాకారులను మరణించాక తలుచుకోవడంకూడా తప్పేనని లైలాగారివల్ల తెలిసింది!

  6. ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి రవి అభిప్రాయం:

    01/10/2012 8:30 am

    కామేశ్వరరావు గారు సూచించిన అంశాలకు నా ఊహలు.

    1. ఈ విషయం లో పరుచూరి శ్రీనివాస్ గారి భావనే సబబనుకుంటున్నాను.
    పదునాలుగేళ్ళు నిద్రలో ఉన్న ఊర్మిళతో లక్ష్మణుడు ‘సంభాషణా చాతుర్యం’ చూపిస్తూ సమాధానాలు చెప్పాడనడం అంత బావోలేదు. ఏ మగవాడికైనా పదునాలుగేళ్ళ తర్వాత భార్యను నిద్రలేపి మాట్లాడించేప్పుడు నేను “నీ భర్తను ఫలానా వాణ్ణి” అని నేరుగా చెప్పుకోవడం ఊహాపరంగా ఇబ్బందికరమే.

    ఇది కొన్ని ప్రాంతాల సాంప్రదాయం కూడానూ. మా ఇంట ఈ సాంప్రదాయం ఉంది. భర్త భార్యకు నేను నీ భర్తను అని చెప్పడు. సూచిస్తాడు. (దురదృష్టవశాత్తూ :)). మౌఖికము, పైగా స్త్రీల పాటలలో వస్తువైచిత్రి, సంభాషణాశబలత కన్నా స్త్రీ మనసుకు నచ్చిన ఊహలు కల్పించుకోవడంలో ఉన్న ఆనందమే గణనీయమని నేననుకుంటున్నాను.

    2. శ్రీరాము తమ్ముండనే!
    అతడనగ సృష్టిలో నొకరు గలరా?
    జనకునల్లుని గానటే?
    భూమిలో జనకులనగా నెవ్వరు?
    శతపత్రమున బుట్టినా చేడెరో
    సీతకూ మరిదిగానా?
    సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ]
    సృష్టిలో నేను యెరుగ

    స్త్రీల పాటలకు, పురుషుల నిస్సహాయత ను వారు ఊహించి ఆనందించే మౌఖిక సాహిత్యం లో అన్వయాన్ని వస్తుతః లేదా రచనా సంవిధానపరంగా కాక, పాడుకునే వారికి కలిగే ఆనందాన్ని అనుసరించి ఊహించడం సబబేమో.

    ఆ పాటలలో ఊర్మిళ ఆక్షేపణ ఇచ్చినంత ఆనందం, సరసమైన లక్ష్మణుడి సమాధానం వల్ల కలిగే అవకాశం పాడుకునే వారికి లేదనుకుంటున్నాను.

  7. ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి TahaTaha అభిప్రాయం:

    01/10/2012 5:07 am

    “…..తహతహగారి వ్యాఖ్య చూసాక నాకు కనిపించిన మరొక చిన్న గందరగోళం:”

    కామేశ్వర రావు గారూ గందరగోళం ఏమీ లేదు. ఒక సిద్ధాంతాన్నో , ఆలోచననో ప్రతిపాదిస్తున్న వ్యాసకర్త /ఉపన్యాసకుడు నిరాధారంగా ‘మనం’, మనకు తెలుసు’ అనటం తార్కికంగా నేరం. ఏ మూడు వందల రామయణాలో కాక కేవలం వాల్మీకి రామాయణం మాత్రమే ఆధారంగా ఊర్మిళను గురించి వ్యాసకర్త రాస్తున్నట్టుగా తోపింప జేసేటట్లుగా వ్యాసోపక్రమణిక ఉంది కాబట్టి ‘వాల్మీకి మనకేమీ చెప్పలేదు’ అంటూనే వ్యాసకర్త ‘మనకు తెలుసు’ అనటం నిరాధారంగా ‘మనం’, ‘మనకు తెలుసు’ అంటే ఎంత నేరమో అంత కన్నా ఎక్కువ నేరం. ఈ విషయమే నేను మరో రకంగా చెప్పాను.[ఇది రమ (భరద్వాజ్) గారు గమనించారని ఆమె వ్యాఖ్య ద్వారా నాకు అర్థమయింది ]

  8. ఈమాట జనవరి 2012 సంచికకు స్వాగతం గురించి lyla yerneni అభిప్రాయం:

    01/09/2012 11:03 pm

    2012 సంవత్సరము వచ్చింది. ఈ సారి “ఈ మాట” తెలుగు పత్రిక ముందుమాట మారుతుందా? మారుతుంది అని 🙂 ఒకరు నాతో అంటే, నే నవ్వుకున్నా.

    అంతకు ముందు చచ్చిన మగవారి బొమ్మలూ, వారిని స్మరించమని ఆదేశాలతో ముందు మాట మొదలెట్టేవారు. ( “Remember me. Adieu. Adieu” అన్న Hamlet’s Father’s Ghost) లాగా.

    ఈ సారి సంచిక రిలీజ్ టైం కి ఎవరూ సాహితీ – సంగీత ప్రముఖులు మరణించలేదేమో, ఏమో మరి – సంచిక ముఖ చిత్రంగా ఒక భారతీయ ఇతిహాసము నుండి 14 సంవత్సరాలు నిద్రలో గడిపిన ఒక స్త్రీ పాత్ర – బొమ్మ, ఆ పురాణ స్త్రీ ద్వారా (తెలుగువారి 16 వ శతాబ్దపు ఆధునికత) తెలిపే రాతలు ఎన్నుకున్నారు.

    ఇది ప్రోగ్రెస్సేనా? అని నేను ఇతర పత్రికల ఫేమిలీ డాక్టర్లనడిగితే, చావు సంస్మరణ వదిలి కోమా లాటి నిద్రమాటలు /పాటలలోకి వచ్చింది కదా, బహుశా ఇక, ఈ పత్రిక ‘ముందుమాట’ మెల్లిగా బ్రతుకు వైపు పయనిస్తుందేమో. ఇప్పటి ప్రపంచంలో పడుతుందేమో అని ఆశా భావం వెలిబుచ్చారు.

    ఇంతలో, ఈ మాట ముందుమాటలో 🙂 వచ్చిన ఆకస్మిక మార్పు, ఇది.

    “09 జనవరి: ఆకస్మిక ప్రచురణ – వేణునాదం ఆగింది! ఏల్చూరి విజయరాఘవరావుగారికి రోహిణీప్రసాద్ నివాళి.”

    అదండి సంగతి.

    ఇప్పుడు అసలు సిసలు నివాళి జేర్చారు. ‘ఈ మాట’ ‘ముందు మాట’ కు మునుపటి ( ప్రేత) కళ వచ్చింది.

    Ritual జిందాబాద్ !

    ఆ ‘ఎవరో’ నాకు చెప్పింది పొల్లు. ఆ వైద్యులు తప్పు. “ఈ మాట” పత్రిక ముందుమాట మారలేదు. నే మళ్ళీ డాలర్ బెట్ గెలుచుకున్నా.

    లైలా

  9. ఉరి: కధ నచ్చిన కారణం గురించి madhukar అభిప్రాయం:

    01/09/2012 4:10 pm

    The writing style, narration and plot seems a bit similar to Mark Twain with putting irony of life as theme.

  10. వేటూరి పాట గురించి అల్లకలలాంలం అభిప్రాయం:

    01/09/2012 1:27 pm

    మొదటి నుంచి చివరిదాకా చదివాను. దిమాక్ తిరిగిపొయ్యింది. మరీ ఇంత analysis ఈ కాలంలో కూడా జనాలు చేస్తున్నారని expect చెయ్యలేదు!