పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం:

    07/27/2008 10:22 am

    “ఐనా రాధాకృష్ణన్ యేమంత చెప్పుకోదగ్గ ఫిలాసఫర్ కాదు. యూనివర్సిటీ పంతులు. మంచి స్కాలర్. భారతీయ దర్శన గ్రంధాలు బాగా చదివినవాడు. ప్రెసిడెంటు సింహాసనం అధిష్ఠించాడు. అలాంటి వున్నత రాజకీయస్థితిలోని వాడి ప్రాపకం కోసం గొప్ప తత్వవేత్త అంటూ వందిమాగధ గీతాలు వోండ్ర పెట్టటం ప్రారంభించారు. ఆయన సొంతం అంటూ చెప్పుకోదగ్గదేం లేదు.”

    –దాదాపుగా ఈ అర్ధమొచ్చేట్టే మామిడిపూడి వెంకటరంగయ్య గారు రాసినట్లు గుర్తు…

  2. ప్రజాస్వామ్యం – పత్రికాస్వాతంత్ర్యం గురించి Krishna అభిప్రాయం:

    07/26/2008 12:15 pm

    మీ సంపాదకీయం రెండుసార్లు చదివాను. పొగడతాండా, తిడతాండా అన్నట్లు ఉంది. ఎవరు ఏమి చేసినా గూండాగిరీ, దౌర్జన్యం సమర్ధనీయాలు కావు. పత్రిక yellow journalism చేస్తే దానిని ఎదుర్కొనడానికి ప్రజాస్వామిక మార్గాలు ఉన్నాయి – న్యాయవ్యవస్థ, అదే పత్రికలో rebuttal మొదలైనవి. ఇక్కడ జరిగినది పత్రికాస్వేఛ్చ పైన మాత్రమే దాడి కాదు. ప్రాథమిక హక్కు అయిన వాక్స్వాతంత్ర్యము మీదనే దాడి.

  3. సామాజిక నవలల్లో కథనా శిల్పం గురించి Kameswara Rao అభిప్రాయం:

    07/26/2008 10:45 am

    శ్రోతలని కట్టిపడేసేలా మాట్లాడే నేర్పు మృణాళినిగారి గొప్పదనం. మంచి ఉపన్యాసాన్ని అందరికీ అందించిన సాయిగారికి ఈమాటకీ ధన్యవాదాలు. శీర్షిక మాత్రం కాస్త తప్పుదోవపట్టించేదిగా ఉంది. ఇది “తెలుగు నవలా చరిత్ర” గురించిన ఉపన్యాసం కాని “సాంఘిక నవలల్లోని కథన శిల్పా”న్ని గురించి కాదు కదా.
    ఉపన్యాసం, తర్వాత ప్రశ్నలకిచ్చిన జవాబులూ విన్నాక వచ్చిన అనుమానం. మృణాళినిగారు తెలుగులో హాస్యరచనలకి ప్రాముఖ్యం ఇవ్వటం లేదని ఆవేదన చెందారు. మరి తన ఉపన్యాసంలో హాస్య నవలలని ఆవిడ పేర్కోకపోవడానికి కారణం ఏమిటి? అలానే, ఈ కాలంలో ఉద్యమాలకతీతమైన నవలలు మంచివి వస్తున్నా వాటికి గుర్తింపు రావడం లేదని కూడా చింతించారు. అటువంటి వాటి గురించి తన ఉపన్యాసంలో ఎందుకు ప్రస్తావించలేదు? ప్రశ్నకి సమాధానంగా అంపశయ్య నవీన్ మొదలైనవాళ్ళని గురించి చెప్పారు. అది తన ఉపన్యాసంలోనే ప్రస్తావించి ఉంటే బావుండేది.

  4. ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/25/2008 11:06 pm

    బాబ్జీలు గారూ,

    దాదాపు ఇరవై ఏళ్ళపాటు సాహిత్యాన్ని పెద్దగా పట్టించుకోకుండా గడిపేసి, కాస్త బుద్ధొచ్చింతర్వాత, కొంచం దగ్గరయాను. చండీదాస్ చనిపోయినప్పుడు బాధపడి రాసిన వ్యాసం నా మొదటి రచన. మెచ్చుకున్నందుకు కృతజ్ఞతలు.

    పతంజలి గారన్న మాటకి అర్థం తెలియలేదు. నిఘంటువులో వెతికి అవాక్కయ్యాను.

    రావిశాస్త్రిని చండీదాస్ రచనలు చదివారా అని అడిగితే, బుచ్చిబాబులా రాయాలనుకునే రచయిత రచనలని చదవాల్సిన అవసరం తనకు లేదన్నాడు!

    ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. వీలు చూసుకొని “అనుక్షణికం” మీద మరో వ్యాసం రాయాలన్నది నా కోరిక కూడా.

    కొడవళ్ళ హనుమంతరావు

  5. పునశ్చరణం గురించి baabjeelu అభిప్రాయం:

    07/25/2008 7:41 am

    ఇదీ “ఈ మాట” గొప్పతనం.
    క్లుప్తత గురించి వొకరు, దానికి ప్రతివాదం తో ఇంకొకరు. అద్భుతం.
    కవయిత్రి వొక్క ముక్క కూడా రాయలేదు, కవిత తప్ప. అది సరైన పధ్ధతి.
    రాస్తూ వుండడవే, విమర్శకులకీ, అభిమానులకీ సరైన సమాధానం.
    మీరు రాస్తూ వుండండి వైదేహి గారూ. భావవ్యక్తీకరణ ముఖ్యం. భావాన్ని ఏదో వొక నడకతో చకచకా నడిపించడం కవిత. అంతే కదా కవులూ, కవయిత్రులూ చెయ్యవలసిన పని.
    అభిప్రాయాల్ని జాగ్రత్తగా చదవండి. మీ కవితల్లో కవిత్వం, మీ ఈ కవితలో చెప్పిన పసికందులాగా పెరిగి పెద్దవాడయిపోతుంది. మామూలుగా కాదు, “ఏడాదికే నాలుగేళ్ళు రావాలీ….. ఎప్పటికి ముప్ఫయ్యిలోపె వుండాలీ…” లాగ.

  6. ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి baabjeelu అభిప్రాయం:

    07/25/2008 7:16 am

    అద్భుతవయిన వ్యాసం. అనుక్షనికం “ఆంధ్రజ్యోతి” లో సీరియల్ గా వచ్చిన రోజుల్లోకి వెళిపోయేను.

    ఒకసారి కె.ఎన్. వై. పతంజలి గార్ని కలిసినపుడు “అనుక్షనికం” గురించి అడిగితే “వుపస్థ మీద రాసిన..” అంటూ ఏదో చెప్పేరు ఆయన. చివుక్కుమంది మనసు.

    తనివి తీరలేదు, “అనుక్షనికం” మీద ఇంకో పెద్ద వ్యాసం రాయండి.

    రావి శాస్త్రి గారి నవలల తరవాత “అనుక్షనికం” అంత గొప్ప గా వుంటుంది.

    ధన్యోస్మి.

  7. ఏకాకితనం గురించి baabjeelu అభిప్రాయం:

    07/25/2008 6:30 am

    సాయిగారూ,
    ఎంత చక్కని భావ వ్యక్తీకరణ. హ్రుదయ విస్తారం కేంద్రంలోకి కుచించుకు పోవడం, చోటూ(టు) చాలని మనసులో మనసులో కుటుంబం ఇరుకుగా సర్దుకోవడం, నీకు నువ్వే అయిన ప్రపంచంలో జనాభా ఒంటరి సంఖ్య, పరిమితులకలవాటయిపోయిన మనం నిజంగానే మరుగుజ్జులం. మీరు రాసినట్టు పక్కింట్లో చావూ, పెళ్ళీ ఒకటే.
    మహాప్రభో, మీకో దండం.

    బావి గోడల్ని దాటించెస్తే, మరుగుజ్జులు అమితాబ్ లయిపోతారని రాయడానికి చాలా దమ్ము కావాలి. వుంది కాబట్టే రాయ గలిగేరు.

    మహాప్రభో మీకు మళ్ళీ మరో దండం.

    స్పెల్లింగ్ మిస్టేకులెలా వచ్చేయి. జివిత నిఘంటువు వేవిటి? జాగ్రత్తగా చూసుకోండి. పాత సంచికల్లో కవితలేవేనా రాసేరా? నేను వెతుక్కుంటాను లెండి. మీ వచనం మీ కవితంత అందంగా వుండదెందుకని?

  8. ఈ-మెయిలు గురించి baabjeelu అభిప్రాయం:

    07/25/2008 3:36 am

    ఇది కవిత్వం. తేటయిన కవిత్వం. హాయి హాయి కవిత్వం.”గరళమును ఇత్తువో” ఇస్తే ఇయ్యి గరళాన్ని కూడా నిభాయించుకోగలనన్న ధీమా,”మరల అమ్రుతమునిత్తు” మళ్ళీ అమ్రుతాన్నే ఇస్తానని భరోసా ఇవ్వడం. బేహద్బీగా వుంది.”ఇత్తువో” బదులు “నిత్తువో” అని వుంటే ఇంకా సాఫీగా వుండేదేమో?ఏ ఛందస్సయినా అవనీండి. నడక చక్కగా వుంది. నడత చక్కగా వుంది. “నను జూడకుండినను, నీ కుశలమే చాలు” గరళమిచ్చినా అమ్రుతమే ఇస్తాను లాటివి చూసి స్త్రీ వాద కవిత్వం రాసీ వాళ్ళందరూ ఉదయకళ గారిని దెబ్బలాడతారేమో? అయితే వాళ్ళు దెబ్బలాడీది కవిత లో కవిత్వం లేదని కాదు. కవిత లోని వస్తువు ని చూసి అనుకుంటాను. ఈ మెయిల్ చూసి, రిప్లై మీద క్లిక్ కొట్టి, సారీ బాస్ చెయ్యి కాళీ లేదు సెండ్ క్లిక్ కొడితే, స్త్రీ వాద కవిత్వం రాసీ వాళ్ళందరూ ఈ కవితని ఊరూరా మోసుకు తిరుగుతారు. ఆహా, ఓహో అంటారు.
    వాళ్ళదీ తప్పు కాదు కాబోలు. పెద్దలెవరయినా వివరిస్తే బాగుంటుంది.

     

  9. ఈమాట గురించి గురించి baabjeelu అభిప్రాయం:

    07/24/2008 7:19 pm

    కాలంతోపాటూ పరుగెత్తడవంటే వుదాహరణ “ఈ మాట”.
    టెక్నాలజీ ని మనక్కావల్సినట్టు వాడుకోడానికి కూడా వుదాహరణ “ఈ మాట”
    మామూలు పత్రికలో ఒక వుపన్యాసం చదువుతాం, ఇక్కడ వింటాం.
    మామూలు పత్రికలో ఒక పాట పాఠం చదువుతాం, ఇక్కడ పాట వింటాం.
    మామూలు పత్రికకి అభిప్రాయం సాధారణంగా ఇలావుంటుంది:
    “ఎడిటర్జీ, ఇలియానా ముఖచిత్రంతో మీ(మా) పత్రిక సర్వాంగసుందరంగా వుంది.
    సాయి బ్రహ్మానందం గారి మనోవైజ్ఞానిక సీరియల్ మా ఇంటిల్లిపాదినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. లక్ష్మన్న గారి కవిత మమ్మల్నందరినీ అలోచింపచేసింది. రోహిణీప్రసాదుగారి కార్టూనులు మమ్మల్ని కడుపుబ్బ నవ్వించేయి.
    కొడవళ్ళ వారి వ్యాసం ఆవునేతితో అరటికాయ బజ్జీలు అద్భుతం…”
    ఈ మాట లో అలాటి ముసుగులో గుద్దులాటల్లేవు.
    పాఠకుల “పార్టిసిపేషన్” వల్ల, అదికూడా అతి సులువుగా, పత్రిక ఇంకా “లైవ్లీ” గా వుండడానికి ఆస్కారం ఏర్పడింది.
    పాత సంచికలలో ని శీర్షికలు కూడా ప్రస్తుతం అభిప్రాయ వేదికలోకి రాగలగడం, మళ్ళీ దానిమీద అభిప్రాయాలూ నిజంగానే వింత.
    పాఠకుల అభిప్రాయాలు విమర్శలు కావు. విమర్శలని పట్టించుకోవాలి అవి రచయత బాగుపడ్డానికి పనికొస్తే, లేకపోతే “వోటర్ల” లిస్ట్ లోంచీ తీసెయాలి ఆ విమర్శని. అభిప్రాయాల్ని మామూలు పాఠకులు రాసినవి గానే తీసుకోవాలి. అంతేగానీ, “..తాడి ఎత్తు గాండీవము తో ముత్తాడి ఎత్తుగా ఎదిగి, చండకోపముతొ..” “సెట్ పట్” లాడించకూడదు.
    (సాక్షి దినపత్రికలో,జూలై 21న, చేరా తో మొదలెట్టి కొంతమంది విమర్శకులు తమతమ అభిప్రాయాలు రాసేరు)
    “చూపుల కన్నా ఎదురుచూపులే తీయన..”. ఒప్పుకుంటాం.
    ద్వై మాసిక ఎదురుచూపులు చూడ్డం చాలా కష్టమయిపోతోంది. ఆదివిష్ణుగారి స్నేహితులు “ఆషాఢ మాసం” ఎన్ని నెలలుంటుంది అని అడిగినట్టు.
    కనీసం “వీక్లీ” కూడా అవదా?

  10. సామాజిక నవలల్లో కథనా శిల్పం గురించి baabjeelu అభిప్రాయం:

    07/24/2008 6:50 am

    సాయి బ్రహ్మానందం గారూ,

    అద్భుతవయిన వుపన్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

    ఇలాటి ప్రక్రియల్లో సహజంగానే నిరాశలుంటాయి. నా వరకైతే రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారి “రాజు-మహిషి”, “రత్తాలు,రాంబాబు” అక్కినేని కుటుంబరావు గారి “సొరాజ్జెం”, అంగర వారు, ముళ్ళపూడి వారు నవలలు లాంటివాటి గురించి ప్రస్తావించకపోవడం. కాలపరిమితి వల్ల అయివుండొచ్చు. అయితే మ్రుణాళిని గారిని ఈ సారి కలిసినప్పుడు రావిశాస్త్రి గారి వి, ముళ్ళపూడి గారివి, మిగిలినవి చర్చించొచ్చు.

    చిత్రం ఏవిటంటే, “ఫక్తు” నవల చర్చలో శ్రీశ్రీ “రిఫరెన్సులు”. వుద్యమాలంటే అంత భయమెందుకు? వుద్యమం బతుకు బాగుపడడానికి, బతుకులోంచీ సాహిత్యం వస్తుంది. రాజశేఖర చరిత్రము సంస్కరణోద్యమం లోంచి వచ్చిందంటున్నారు. మాలపల్లి హరిజనోద్యమం “ప్లస్” జాతీయోద్యమం వల్ల వచ్చింది కాదా? మీరు క్షమించకపోయినా నా “కామెంట్” కి వున్నవ వారు నవ్వి వూరుకుంటారు. అలాగే మిగిలిన సాహిత్యం కూడా.

    ఒకటే ఇబ్బందికరవయిన తప్పు దొర్లింది. అది మ్రుణాళిని గారి మీ పరిచయం. మొదటి మూడు పంక్తులు, తరవాత వాక్యంలోని”కానీ,” వరకు నా దృష్టిలో నిజంగా అవసరం లేని వాక్యాలు. ఈ “పేరాగ్రాఫ్” ని చేరా గారికో, భద్రిరాజు గారికో, బూదరాజు గారికో పంపించండి. నవల విమర్శలేకపోవడానికీ రచయిత్రులు అన్ని అంత అద్భుతవయిననవలలు రాయడానికీ సంబంధం ఏవిటీ? (అయితే నవలామణి పదప్రయోగానికి, “సెబాస్” అనాలనిపించింది. “సెహబాస్”).

    మామూలు పాఠకులవి అభిప్రాయాలు మీ లాటి వారు రాస్తే విమర్శ.