కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె


సొంత ఊరు:
తలుపులపల్లె
ప్రస్తుత నివాసం:
వృత్తి:
తెలుగు పండితులు
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

కథలు, నాటకాలు, వ్యాసాలు లెక్కలేనన్ని వెలువరించిన కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె (1936-2016) ఒక నడిచే గ్రంథాలయంలాంటి వారని ఆయన్ని ఎరిగిన వారందరికీ తెలుసు. వారు సంస్కృతంలో రాసిన కలిచెర్ల పట్టాభిరామ సుప్రభాతం, సీతాష్టకం, పోలేరిమాతాస్తోత్రాలను నేటికీ చిత్తూరులోని పలు దేవాలయాల్లో సుప్రభాత సమయాన వేస్తారు. తెలుగు పద్యకావ్యం “విషాద మాథవి”, పద్యకావ్యాలు “చరిత్రకెక్కిన మారణహోమం”, “ఒక రాఘవరెడ్డి కథ”, “ఓరుగల్లు-వీరగల్లు” రచించారు. వీరి ప్రముఖ రచన, చారిత్రక నవల “బోయకొట్టములు పండ్రెండు”.


 

‘‘దీన్ని నక్క తిన! పదైదు దినాలుగా నన్ను సతాయిస్తా ఉండాది చేతికి చిక్కకుండా. వలకూ దొరకదూ, ఉచ్చుకూ దొరకదూ, బరిసెకూ అందదు. దీన్ని ఎట్లా పట్టాలో అర్థం కావడంలేదు. ఒక పక్క రెడ్డోరబ్బాయి తొందర చేస్తా ఉండాడు. ఎవరెవరికో డిన్నరు పెట్టాలంట. వాళ్ళందరూ కలిసి ఈయనకు పెద్ద కాంట్రాక్టులు ఇప్పించినారంట. జింక పిల్ల దొరికితే ఒకరోజు అనుకని అందరికీ ఫోన్లుకొట్టి పిలస్తాడంట. ఏం చేసేది. ఎట్లా పట్టేది ఈ కంతిరీ జింక పిల్లను. ఆఖరి ప్రయత్నంలోనైనా చిక్కుతుందో లేదో చూడాల.’’

ఇరవయ్యవ శతాబ్ది మధ్య భాగంలో తెలుగు సాహిత్యంలో విప్లవాత్మకమైన మార్పులు అనేకం చోటుచేసుకున్నాయి. ఒకవైపు పాండిత్య ప్రదర్శనే కవిత్వమనే అపోహతో సుదీర్థ సంస్కృత సమాసాలతో పొంతనలేని అలంకారాలతో, భయం కొలిపే శబ్ద విన్యాసంతో కొందరు కావ్యాలు వ్రాస్తూ ఉండగా, మరోవైపు జాషువా, కరుణశ్రీ, దువ్వూరి, రాయప్రోలు వంటి పండిత కవులే క్రత్త పుంతలు త్రొక్కి సామాన్య విద్యావంతులను సైతం ఆకట్టుకొనేలాగా ఖండకావ్యాలూ, లఘుకావ్యాలూ సరళమైన భాషలో వ్రాయసాగారు.