తెలుగు భావకవిత్వరచనకు కృష్ణశాస్త్రిగారు ఆద్యులు కాకపోయినా అగ్రగణ్యులుగా సాహితీ లోకం గుర్తించింది. ఆయన భావనైశిత్యం, ఆయన కవితోహల లాలిత్యం, మృదుమధురమైన శబ్దసౌందర్యం ఆయన కవితారచన లోని విలక్షణతలుగా భావించవచ్చు.
సి. ఎస్. రావ్
ఆత్మకూరు, పల్నాడు
హైదరాబాద్
విశ్రాంత ఆంగ్ల విభాగాధిపతి
జీవిత విశేషాలు
సి. ఎస్. రావు ఆంగ్ల, ఆంధ్రభాషలలో విమర్శకులు, అనువాదకులు, కవి. వీరి అనేక ఆంగ్ల ప్రసంగాలు ఆలిండియా రేడియోలో ప్రసారమయాయి. శ్రీ వెలిచాల కొండలరావుగారు స్థాపించిన విశ్వనాథ పీఠం ఆధ్వర్యంలో ప్రచురించబడిన A Thousand Hoods ను వీరు ఇతర అనువాదకులతో కలిసి అనువదించటమే కాక సంపాదకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఇది విశ్వనాధ వేయిపడగలు’కు మొట్టమొదట ప్రచురించబడిన ఆంగ్లానువాదం. తిలక్ అమృతం కురిసిన రాత్రిని A Night Nectar Rained గా ఆంగ్లంలోకి అనువదించారు. Shakespeare’s Sonnets, MK Gandhi -An Indian Patriot in South Africa లను తెలుగులోకి అనువదించారు. ఇంగ్లీష్, తెలుగు భాషలలో అనువాదాలు, స్వీయరచనలు కలిపి ఆరు పుస్తకాలు ప్రచురించారు. వీరికి అనువాదసాహిత్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంనుండి కీర్తి పురస్కారం లభించింది. పది కాలాలు నిలిచే సాహిత్య విమర్శ-సమగ్రమైన, సునిశితమైన విషయ విశ్లేషణతోపాటు రమ్యమైన వ్యక్తీకరణ కూడా కలిగి ఉంటుంది అని వీరి ప్రగాఢ విశ్వాసం.
సి. ఎస్. రావ్ రచనలు
కంఠవశమయే గుణం కవిత్వం యొక్క అతిముఖ్యమైన లక్షణాలలో ఒకటి. సాపేక్షంగా చెప్పాలంటే ఛందోబద్ధమైన కవిత్వానికి కంఠవశమయే గుణం ఎక్కువగా వుంటుంది. ఆ కవి గొప్పవాడు కావచ్చు, కాకపోవచ్చు. ఆ పద్యం గొప్ప పద్యం అవొచ్చు, అవకపోవచ్చు. ఛందోభంగం కాకుండా వ్రాయబడితే చాలు కంఠవశమవుతుంది.
రామారావుగారి కధ మంచి ఫోటో గ్రాఫర్ తీసిన ఫోటోలా ఉంటుంది. కానీ మంచి చిత్రకారుడు గీసిన చిత్రంలా ఉండదు. రచయిత దృక్పధాన్ని కధను మధించి పట్టుకోవటానికి వీలుగా ఉండాలి. ఈ కధ ద్వారా రామారావుగారు ఇంతకూ చెప్పదలచుకున్నది ఏమిటంటే అదేదో చెప్పటం కష్టం. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండా కధ సాగుతుంది.
కళ కళ కోసమే అనడం కళ ప్రజల కోసమే అనేదానికి వ్యతిరేకం కాదు. జాగ్రత్తగా గమనిస్తే ప్రజల కోసమే కళ. అంటే మొదట దేనినైతే మనం కళ అని పిలవదలచుకున్నామో అది కళ కావాలి కదా. కళ కాని దానిని కళ అని పిలిచి ఇది ప్రజల కోసం అనడం అసంబద్ధమయిన విషయం. కళ కళ కోసం కానిది ప్రజల కోసం కానేరదు.
రా.రా. ‘తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు’ శీర్షికతో దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ మీద వ్రాసిన సమీక్ష వారి స్థాయికి, వారి రీతికి తగినట్లుగా లేకపోవటం ఆశ్చర్యం వేస్తుంది.
సాంప్రదాయకవులనీ, భావకవులనీ, అభ్యుదయకవులనీ, విప్లవకవులనీ చేసే విభజన కృత్రిమమైనది. అసలు కవితాతత్వాన్ని పక్కదారి పట్టించేది. కదిలించే కవిత్వాన్ని రాయలేనివాళ్ళకు కవులుగా ఏదోవిధంగా అస్తిత్వాన్ని కలిగించటానికి చేసే వ్యర్ధప్రయత్నం.
నిర్జన ప్రదేశాలలో వంగిన ఆకాశం మీదుగా
చల్లని గాలి మోసుకొచ్చే జనవాసాల హోరు
అవలీలగా
ప్రాణత్యాగం చేయగలిగే
ఆరోజులు నీవెలా మరచిపోగలవు!!