ప్రపంచ నలుమూలలకూ వెలుగునిచ్చిందీ, అనేక పరిశ్రమలకు ఆయువుపట్టు అయినదీ, ఆవిరి యంత్రాలతోనో మహాజలపాతాలతోనో ఘనమైన చక్రాలను తిప్పి పుట్టించే విద్యుత్తే. ఆ పుట్టుకకి ఆధారం ఫారడే కనుగొన్న డైనమో.
డిసెంబర్ 2025
కేంద్ర సాహిత్య అకాడమీ 2025 సంవత్సరానికిగాను, తెలుగులో బాలసాహిత్య పురస్కారాన్ని ప్రముఖ రచయిత గంగిశెట్టి శివకుమార్ గారి ‘కబుర్ల దేవత’ అనే కథా సంపుటికి ప్రకటించడం ముదావహం. ఇది తెలుగు బాలసాహిత్యానికి దక్కిన గౌరవం. ఒకప్పుడు తెలుగునాట పిల్లల చేతిలో చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి వంటి పత్రికలు కనిపించేవి. ఆ కథలు వారిలో అద్భుతమైన ఊహాశక్తిని, భాషాపటిమను, నైతిక విలువలను పెంచేవి. కానీ నేడు, ఆ స్థానాన్ని స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, యూట్యూబ్ వీడియోలు ఆక్రమించాయి. దృశ్యమాధ్యమాలు, సోషల్ మీడియాలు మెదడుకు శ్రమ లేకుండా సులభమైన వినోదాన్ని అందిస్తాయి. అంతేకాకుండా, నేటి విద్యావిధానంలో ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యం పెరగడంతో, పిల్లలు తెలుగును ధారాళంగా చదివే నైపుణ్యాన్ని కోల్పోతున్నారు. ఫలితంగా, అక్షరాలను కూడబలుక్కుంటూ, వాక్యాలను అర్థం చేసుకుంటూ, సన్నివేశాలను మనసులో ఊహించుకుంటూ తెలుగు పుస్తకాలు చదివే ఓపిక నేటి తెలుగుపిల్లల్లో సన్నగిల్లుతోంది. ఇది కేవలం ఒక అలవాటు మారడం కాదు, ఒక జాతి భవిష్యత్ తరం తన సొంత భాషకు, సంస్కృతికి దూరమవుతున్న ప్రమాద ఘంటిక.
మరైతే, ఆంగ్ల డిజిటల్ ప్రవాహంలో కొట్టుకుపోతున్న మన పిల్లలకు తెలుగు పుస్తకాలతో బంధాన్ని ఎలా ఏర్పర్చాలి? నేటితరం పిల్లలు తెలుగు పుస్తకాలు చదవకపోతే, వారు పెద్దవారైన తరువాత తెలుగు భాషను, సాహిత్యాన్ని ఎలా ఆదరించగలరు? వచ్చేతరం తెలుగు చదవలేకపోతే అప్పుడు భాష మనుగడనే ప్రశ్నార్థకమౌతుంది కాదా? నేటి తరం పిల్లలను ఆకట్టుకోవాలంటే, వారి అభిరుచులకనుగుణంగా, కేవలం పాతకాలపు నీతికథలే కాకుండా, సమకాలీన అంశాలతో కూడిన సాహసగాథలు, వైజ్ఞానిక కథలు, కార్టూన్ కథలు ఉన్నత ప్రమాణాలతో అందజేయాలి. ప్రచురణకర్తలు కూడా నాణ్యమైన కాగితంతో, ఆకట్టుకునే రంగుల బొమ్మలతో పుస్తకాలను ముద్రించి పిల్లలను ఆకర్షించాలి. ఆంగ్ల డిజిటల్ కంటెంట్తో పోటీపడేలా పిల్లలకోసం తయారుచేసే తెలుగు కంటెంట్ ఉన్నతమైన ప్రమాణాలతో ఆధునిక హంగులు అద్దుకోవాలి. మన పిల్లల్లో తెలుగు భాషపట్ల అభిమానం, వారిలో తెలుగు పఠనాసక్తిని పెంచడం కేవలం బడి బాధ్యతో, ప్రభుత్వ బాధ్యతో కాదు, ఇది ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. ఇంట్లో తెలుగు పుస్తకాలకు ఒక చిన్న అరను కేటాయించాలి. రోజూ కాసేపైనా వారికి తెలుగు కథలు చదివి వినిపించాలి; వారితో తెలుగు చదివించాలి. రాబోయే హైదరాబాద్, విజయవాడవంటి నగరాల్లో జరిగే పుస్తక ప్రదర్శనలు కూడా ఇందుకు ఒక చక్కటి వేదిక. ఈసారి మీ పిల్లలను బుక్ ఎగ్జిబిషన్కు తీసుకెళ్లి, ఖరీదైన ఆంగ్ల పుస్తకాలతో పాటు వారికి నచ్చిన తెలుగు కథల పుస్తకాలను కొనివ్వండి. ఒక మంచి పుస్తకం వారి చేతిలో పెట్టడం అంటే, వారికి ఒక కొత్త ప్రపంచాన్ని బహుమతిగా ఇవ్వడమే. రేపటి తరాన్ని తెలుగు చదివే తరంగా తీర్చిదిద్దడానికి ఈరోజే శ్రీకారం చుట్టేద్దాం.
నన్ను వ్యక్తిగతంగా ‘నువ్వు ఏ ట్రెక్ను ఎక్కువగా ఇష్టపడ్డావు’ అని అడిగితే ఖచ్చితంగా ఇదీ అని చెప్పలేను. దేని ప్రత్యేకత దానిది. కానీ నాకు అన్నపూర్ణ ట్రెక్ను సమన్వయం చెయ్యడం ఎవరెస్ట్కన్నా పెద్ద సవాలుగా నిలిచిందని చెప్పుకోవాలి.
ఆ యిద్దరిలో ఒకరికి అదృష్టవశాత్తు మతిపోయింది, మరొకరు శాయశక్తులా ఆ పిచ్చిని కాపాడుతున్నారు. ఎవరికి పిచ్చి, ఆ పిచ్చిని పోషిస్తున్నది ఎవరు అని మాత్రం చెప్పడం దుస్సాధ్యం.
ఎప్పటికీ
వెలుగు చూడకుండా
రాత్రి రథం మీద
సూర్యుడుండని చోటుకి
వెళ్ళిపోవాలని ఉంది
రాత్రికంటే
రహస్యమైనది ఏది?
ఆ ఐస్క్రీమ్-బాయ్
ఇద్దరికోసం ఒక్కటే ఐస్క్రీమ్ కొన్నప్పుడు
నాపైకి విసిరిన చూపుల్ని
పోల్చుకోగలవా ఎప్పుడైనా?
తెలుగులో ప్రథమాంధ్రకవి నన్నయ నుంచి ఆధునిక భావకవి కృష్ణశాస్త్రి వరకు, ఒక పాత్ర ఔన్నత్యాన్ని వర్ణించటంలో ఒకే కవిసమయాన్ని తమదైన శైలిలో ఎంత వైవిధ్యంగా ప్రయోగించారో చూపించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం.
“లేదు, ఇంకా సీరియస్గా ఎలా చెప్పాలో నాకు తెలియదు! నేను కామెడీ, నువు రొమాంటిక్. మనకు బాగా కుదురుతుంది.”
“నీమీద నాకే ఫీలింగ్సూ లేవు. నీ హ్యూమర్ ఏ కొంచెమో నచ్చబట్టే నీతో స్నేహం చేస్తున్నా. అయినా ఆ మిస్టరీ కథ వెనకపడుతున్నానని చెప్పావు కదా!”
ఆ మాటలకు ఒక నిమిషం మనసు కెలికినట్టయినా, “ ఊకో మావాఁ, పేకాట గురించి నా పెళ్ళాంకీ నీకూ ఏటి తెలుసు! ఒక్క పాలి పైసలు వొచ్చినాయంటే కట్టాలన్నీ తీరిపోవూ,” అని అటు అతనికీ ఇటు తన మనసుకూ సర్ది చెప్పుకొన్నాడు.
కుందేలంటే సరే అంత కవ్వింపు బేరం అనుకోవచ్చు, తాబేలు కూడా ఇష్టం మా వాడికి. విజయనగరంలో అమ్మమ్మ ఇంటికి వెళ్తే, పక్కనే కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయముంటుంది. అక్కడి సిమెంటు నీటి తొట్టెలో కొన్ని పదుల తాబేళ్ళు – చిన్నవీ పెద్దవీ, కుదురుగా ఒదిగి కనపడతాయి.
“అంత సౌమ్యంగా పిలిచినపుడే అనిపించింది, ఏదో కొంప మీదకి తెస్తున్నారని. దూడని పెంచుతారా? ఆవుని చేస్తారా? పాలు పితుకుతారా? మీకేం వచ్చని ఈ పనులన్నీ?” అని గట్టిగా అడిగేసింది.
భారత కథలో దైవాంశ సంభూతులైన వీరులు, అక్కడక్కడ అవతార పురుషులు, దేవతలు కనబడినట్లే ఇలియాడ్, ఓడిస్సీలలో కూడా మానవులు, దేవతలు కలగాపులగంగా కనబడతారు. భారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగితే ఇలియాడ్లో ట్రోయ్ యుద్ధం పది సంవత్సరాలపాటు జరుగుతుంది. ట్రోయ్ యుద్ధం ముగిసిన తరువాత ఆ యుద్ధంలో పోరాడి, బ్రతికి బయటపడిన ఒక వీరుడు ఇంటికి తిరుగుముఖం పట్టినప్పుడు, మరొక పదేళ్లపాటు కష్టాలు పడుతూ చేసిన సాహసయాత్రలోని భయంకరమైన అనుభవాలే ఓడిస్సీలోని కథ.
యుద్ధంలో ఎప్పుడో ఒడిస్సియస్ చచ్చిపోయి ఉంటాడనుకొని, పెనలొపీని పెళ్ళాడి… ఇథకా రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఆశతో పెక్కురు రాకుమారులు నిత్యం ఆమెను అనేక విధాలుగా ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వారి బారినుండి తప్పించుకోడానికి పెనలొపీ రకరకాల పన్నాగాలు పన్నుతూనే ఉంటుంది.
తెలుగు భావకవిత్వరచనకు కృష్ణశాస్త్రిగారు ఆద్యులు కాకపోయినా అగ్రగణ్యులుగా సాహితీ లోకం గుర్తించింది. ఆయన భావనైశిత్యం, ఆయన కవితోహల లాలిత్యం, మృదుమధురమైన శబ్దసౌందర్యం ఆయన కవితారచన లోని విలక్షణతలుగా భావించవచ్చు.
మంచి పద్యం రాయగలవాడు మంచి గద్యం కూడా రాయగలడని, టి.ఎస్.ఎలియట్ అన్నాడు. మంచి కవి రాసిన పద్యానికీ గద్యానికీ మధ్య భేదం లేదంటాను నేను. వామనుడనే ప్రాచీన ఆలంకారికుడు కూడ ‘గద్య రచన కవికి గీటురాయి అనదగు’ అనే అర్థం వచ్చేట్లు సంస్కృతంలో చెప్పాడు.
అసలు నాకు నెమరువేత డోకు. అంటే, వెనక్కి తిరిగి చిన్ననాడో, ఎన్నడో జరిగినవి జ్ఞాపకం చేసుకోడం. అది అసహ్యం.
అప్పటికి జనవ్యవహారంలోనే తెలుగు భాష ఉంది. అక్కడక్కడ శాసనాలలో మాత్రమే సాహిత్య(ఛందస్సు) స్పర్శ ఉంది. ఆ దశలో మహాభారతం వంటి గ్రంథాన్ని ఆంధ్రీకరించడానికి అవసరమైన ఛందస్సాహిత్యాలను సమకూర్చుకొనవలసి వచ్చింది నన్నయకు నారాయణభట్టు సహకారమూ లభించింది. సఫలుడయ్యాడు నన్నయ్య, ఇప్పటికీ ఆ బాట ఆంధ్ర సాహిత్యంలో అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంది.
డాలీ జూమ్ షాట్ పద్ధతిలో ప్రధాన వస్తువు నుంచీ జూమ్ అవుట్(Zoom out) అవుతూ దృశ్యీకరించడానికి అనువైన పద్యం ఇది. త్రివిక్రముడిని స్థిరంగా ఉంచి, సూర్యబింబాన్ని ప్రధాన వస్తువుగా తీసుకుని, జూమ్ అవుట్ చేస్తూ పోతే – పెద్ద ఛత్రంగా వున్న సూర్యబింబం, క్రమక్రమంగా క్రిందకు దిగుతూ శిరోరత్నం, చెవి పోగు, కంఠాభరణం…చివరగా పాద పీఠం అవుతుంది.
“లల్లేశ్వరి తత్వం శాశ్వతమైనది. దాని అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం, ఇంకా ఎక్కువైనా పట్టొచ్చు,” నాన్న బదులు పలికాడు. “అందుకే నా అనుసృజన ఎప్పటికీ అసంపూర్ణమే!”
. కన్నడంలో ‘మంకుతిమ్మన కగ్గ’ వెలువబడి ఎనిమిది దశాబ్దాలే దొర్లినవి. అయినా ఇలాంటి మహాగ్రంథం కర్ణాటక రాష్ట్రానికి పక్కనే ఉన్న తెలుగునాట సాహితీప్రియులకి అందలేదంటే అది ఉభయభాషల బాంధవ్యానికే తీరని తలవంపు.
సైనికదళాల్లోని వృత్తి వాతావరణాన్ని గురించిగానీ, యూనిఫారం ధరించిన వారి జీవన విధానాల గురించిగానీ ప్రజాబాహుళ్యంలో తెలిసింది చాలా తక్కువ కావడం వల్లనే ఇటువంటి కొన్ని అపోహలు చలామణీ అవుతున్నాయి.
తెలుగువారికి, మధుమేహం గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తం ఒక వరం. మూర్తిగారు అన్నీ కూలంకషంగా చర్చించారు, అసలు మధుమేహం అంటే ఏమిటి అని మొదలుపెట్టి, క్లోమగ్రంథి ఎలా పనిచేస్తుంది, మధుమేహంలో రకాలు, అది మనకి వచ్చాక కలిగే లక్షణాలు, వచ్చినట్టు నిర్ధారించి కనుక్కోవడానికి చేసే పరీక్షలు, ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం వచ్చేముందు పూర్వదశ ఎలా ఉంటుంది, మధుమేహం దారిలో పెట్టడానికి లేదా కంట్రోల్ చేయడానికి ఏయే మందులు ఉన్నాయి, అవి ఎవరికి ఎలా పనిచేస్తాయి, ఎవరు వాడకూడదు అనేవన్నీ 35 ఛాప్టర్లుగా విడగొట్టి చెప్పారు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ!