“నన్నొదిలి వెళ్ళిపోతావా నువ్వు?”
అన్నది తను! నాని, పెచ్చులు ఊడిపోతోన్న
ఆ ఇంటిని గట్టిగా మరి నా ప్రాణం
పోతున్నంతగా హత్తుకుని అన్నాను ఇక:
‘లేదు. ఉంటాను, నీతోనే నేను’

రుషులను చూడటానికి వారి ఆశ్రమాలకు దేవతలు వచ్చినట్లే, ఆ అరణ్యంలో సీతారాములను చూడటానికి, జగత్తులోని పూర్వపరాలలోని ప్రేమికుల జంటలు -రోమియో జూలియట్; ముంతాజ్ షాజహాన్; పార్వతి శివుడు; లైలా మజ్నూ; వీనస్ అడోనిస్; క్లియొపాట్రా ఏంటొనీ; భాగ్యమతి కులీకుతుబ్ షా; ఎంకి నాయుడుబావ; ఎలిజబెత్ ఫిలిప్; జేన్ టార్జాన్; హెలెన్ పారిస్; అనార్కలి సలీమ్, మరియా వాన్ట్రాప్ -ఎందరెందరో ఆ చుట్టు పట్ల చరించారేమో మరి!

మళ్ళీ –
ఆకుల కదలికలకు కూడా
ఉలిక్కిపడుతూ
కొమ్మపైన వాలిన పిట్ట అరుపులో
సమాధానాన్ని వెతుక్కుంటుంటావు
వసంతంలో పూచే
పూల పలకరింపుకై ఎదురుచూస్తూ.

చాలా దయతో బోలెడంత దూరాన్ని ప్రేమగా
దోసిలినిండుగా ఇచ్చి
మెడచుట్టూ ఖాళీ కాగితాన్ని
చీకటి శాలువాలా చుట్టి ఆకాశమనుకోమనీ
అక్షరాల నక్షత్రాలను అంటించుకోమనీ
వెళ్ళిపోయావు.

తడి తడిగా కబుర్లు చెప్పుకుంటూ
కదులుతున్న కాలువ నీళ్ళు
గెనం మీద పచ్చిక ఒడిలో
కునుకేసి కలలు కంటున్న మిడత
నా ఎత్తు ఎదిగిన చెరుకు తోటలో
ఎగిరి పోతున్న చిలకల జంట

అతడు తనువంతా అశ్రుకణమయ్యాడు
విలపించాడు విలవిల్లాడాడు
చిగురుటాకులా కంపించిపోయాడు
వేయి దేవుళ్ళను వేడుకొన్నాడు
అదే ప్రేమతో అదే ఇష్టంతో
ఆమె చేతిని తాకాడు

నేనూ, నాది, నాకు అనే నా రోజువారి ప్రతిబింబాల నుండి ఒక్కసారిగా ఈ మాటలు నన్ను కాలం వెనక్కి తీసుకెళ్ళి సుడిగాలిలో చిక్కి అంతర్ధానమైన జ్యోతింద్రనాథ్ వంటి అవ్యవసాయకులను పరిచయం చేసుకోవడం, వారి చేతుల్లో మొహన్ని దాచుకోవడం, వాటిని ముద్దాడుకోవడం చేస్తాయి. దేశం కోసమని, మన కాళ్ళ మీద మనం నిలబడి చూపాలని ప్రయత్నించి – అప్పులతో, నష్టాలతో సర్వనాశనంతోనూ మిగిలిన మనుష్యులు ఎంతమందో!

సంతోష సన్నివేశములకు, త్వరితగతిని సూచించుటకు, ప్రాసానుప్రాసలను ఉపయోగించి గానయోగ్యముగా నుండు వృత్తములలో మానిని, కవిరాజవిరాజితములు అత్యుత్తమ శ్రేణికి చెందినవి. నేను కొన్ని సంవత్సరములుగా పరిశోధించి కనుగొన్న విశేషమేమంటే, తాళవృత్తములను మాత్రాగణములకు తగినట్లు పదములను ఎన్నుకొని వ్రాసినప్పుడు అవి గానయోగ్యముగా నుండి ఛందస్సు సంగీత సాహిత్యముల రెండు ముఖములని తెలుపుతుంది.

ఒక పాఠకుడిగా ఝాన్సీ రాణి ప్రతి కదలికకు చలించిపోయాను. ఆవిడ ప్రేమలో పడ్డట్టే లెక్క. ఆపై, తెలివయిన గుర్రాన్ని అధీనంలో వుంచుకోడం, సకాలంలో గొప్ప వ్యూహరచన చేయడం, స్వదేశీ విదేశీ వీరులకు ధీటుగా ధైర్య ప్రదర్శన! గట్టి పట్టుదలతో తనని మోసం చేసినవారిని సైతం ఆశ్చర్యంలో పడేసే ఎత్తుగడలు! భలే మనిషి- పోనీ, భలే రాణి!

2021వ సంవత్సరానికి తానా బహుమతి గెల్చుకున్న రెండు నవలల్లో చింతకింది శ్రీనివాసరావుగారి మున్నీటి గీతలు ఒకటి. సిక్కోలు (శ్రీకాకుళం) మత్స్యకారుల జీవితాలను హృద్యంగా అక్షరబద్ధం చేసిన 210 పేజీల నవల ఇది. కేవలం జాలర్ల బతుకులను ఆధారంగా చేసుకుని రాసిన మొట్టమొదటి తెలుగు నవల.

అడ్డం ఈ నవరాత్రులో పూజింపబడే అనేకమైన చేతులు కలిగిన దేవత (5) సమాధానం: షోడశభుజ గాలి తగలగానే మండే ధాతువు (3) సమాధానం: భాస్వరం […]

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

ఆంగ్లోపన్యాసకులుగా ఉద్యోగజీవితాన్ని కొనసాగించిన సూరపరాజు రాధాకృష్ణమూర్తి ప్రాచ్య పాశ్చాత్య తత్వరీతులను మథించి విశ్వసాహిత్యాన్ని ప్రాచ్య దృష్టితో, ఆత్మతో పరిశీలించి, భారతీయ సాహిత్యంతో అనుసంధానించి విశ్లేషించి తెలుగు పాఠకలోకానికి ఒక కొత్త దృక్కోణాన్ని పరిచయం చేసిన విమర్శకులు. షేక్స్‌పియర్, ఎలియట్, బోద్‌లేర్, హాప్కిన్స్, దాన్తె, కాఫ్కా తదితరుల రచనలపై వారి విమర్శ, విశ్లేషణ భారతీయ చింతనతో ముడిపెట్టి చేసిన వ్యాఖ్యానం ఇరుభాషల సాహిత్యంతో సుదీర్ఘకాలంగా మమేకమైనందువల్ల దక్కిన సాధికారత వలన మాత్రమే కాక, ఉపనిషత్తులనీ గీతనీ నిశితంగా చూసిన చూపుతో ముడిపెట్టినందువల్ల కూడా బహు ప్రత్యేకం. ఏ వాదానికి ముడిపడివున్నా, ఆ వాదపు లోతుపాతులు కేవలం నామమాత్రంగానో, అరకొరగానో అర్థం చేసుకున్నవారి రచనలు బలహీనమైన చట్రాల్లో ఇరుక్కుని ఉండి, కేవలం శుష్కనినాదాలు, సందేశాలుగానే మిగలడం, వాటిలో సాహిత్య విలువలు మృగ్యమవడం సర్వసాధారణం. అందుకు భిన్నంగా రచనావ్యాసంగాలను కొనసాగించిన కా.రా. కథలను, శ్రీశ్రీ, బైరాగుల కవిత్వాన్ని రాధాకృష్ణమూర్తి గమనించిన తీరు, ‘మార్క్సిజాన్ని, సనాతనధర్మాన్ని, కలిపి ఒక్క ముక్కలో పట్టుకున్నాడు శ్రీశ్రీ, మరొకడు కా.రా.’ అన్న వారి పరిశీలన ఎన్నదగినవి. ‘ఎత్తగలడా సీత జడను’ అన్న వేటూరి సినీగీత సాహిత్యంలోని శ్లేషను, సౌందర్యాన్ని విప్పి చెప్పినా, కృష్ణుని పిలుపు పేరిట భగవద్గీతకు వ్యాఖ్య రాసినా అటు పండితులను మెప్పించేదిగానూ, సామాన్య పాఠకుల స్థాయిని పెంచేదిగానూ ఉండటం అబ్బురపరుస్తుంది. అగ్నిమీళేతో 2012లో తన తొలి కవితా సంపుటి ప్రచురించిన ఈ కవి, తిరిగి 2021లో జ్ఞానదేవ్ మరాఠీ రచన అమృతానుభవంను తెలుగులోకి అనువాదం చేశారు. మాణిక్యవాచకుల తిరువాచకపు స్ఫూర్తిని మాణిక్యవాణి పేరిట తెలుగులోకి తెచ్చారు. శివభక్తతన్మయతలో నడిచే ఈ చిన్న పుస్తకానికి కూడా మధ్య మధ్యలో కనపడే వ్యాఖ్యలే అసలైన ఆకర్షణ. శంకరభాష్యసహిత గీతకు వీరు చేసిన తెలుగు అనువాదం, ఈశ, కేన, కఠ, మాండూక్య ఉపనిషత్‌లకు ఈయన రాసిన అతిసరళమైన వ్యాఖ్య ఎలాంటివారినైనా ఆ ఆధ్యాత్మిక, తాత్విక లోకంలోకి సాదరంగా స్వాగతిస్తుంది. ఇరుకైన చూపులతో జీవితాన్ని, సమాజాన్ని, సాహిత్యాన్ని దర్శిస్తున్న రోజుల్లో ఉన్నాం. తత్వమీమాంస మనిషి హృదయాన్ని ఎలా విశాలం చేస్తుందో సూటిగా స్పష్టంగా చెప్పే రచనలు రాధాకృష్ణమూర్తిగారివి. జీవితాన్నైనా సాహిత్యాన్నైనా పరికించడానికి మన దగ్గర ఉండాల్సిన ప్రశ్నలను, బుద్ధిని పరిచయం చేస్తాయీ రచనలు. గొప్ప గొప్ప రచనలన్నింటిని లోతుల దాకా తీసుకెళ్ళి చూడగల సమర్థులంటూ ఉంటే, వాటిని సరిపోల్చి చూసినప్పుడు కనపడే సారూప్యాలెంత ఆశ్చర్యకరంగా ఉంటాయో వారి విశ్లేషణ ద్వారా గమనించవచ్చు. ఆయా సాహిత్య రసనిధులకు రహస్యంగా దాచిన తాళంచెవులను తన విమర్శల్లో పొందుపరిచి తెలుగు విమర్శను సంపద్వంతం చేసిన సాహితీకృషీవలురు సూరపరాజుగారు. వారి నిష్క్రమణతో ఆంధ్రాంగ్లసంస్కృత సాహిత్యాలనిట్లా కలబోసి విచారించి ఆ వివేచనను పదిమందికీ పంచగల ముందటితరం మహనీయుల్లో మరొకరిని కోల్పోయాం.

అందరూ ఏమన్నా బామ్మా నాన్నా నన్ను ఎప్పుడూ ఏమన్రు. అలాంటిది ఇవాళ నే చేసిన పనికి బామ్మా కోప్పడుతోంది. అయితే నాన్నా దెబ్బలాడతాడు. నాన్నని చూస్తే ఎప్పుడూ భయం లేదా – అలాంటిది ఇప్పుడు తనవేపు చూడ్డానికి భయం వేసింది. బుర్రొంచుకుని అలాగే దిమ్మసాచెక్కలా చీడీ మీదికి ఎక్కకుండా నిలబడిపోయా.

చురుకుదనం మూర్తీభవించినట్టు కనిపించే జానకమ్మ తన అయిదు నెలల నివాసాన్ని, రెండు నెలల పైచిలుకు సాగరయానాన్నీ వింతలూ విశేషాలూ వినోదాలకూ పరిమితం చెయ్యలేదు. ఉన్న సంపదతో, తమతో తీసుకువెళ్ళిన ముగ్గురు సేవకుల సాయంతో సుఖంగా, విలాసంగా గడపలేదు. జిజ్ఞాస, ఆలోచన, పరిశీలన, పరిశోధన ఆమెను అనుక్షణం నడిపించాయి.

అక్కడినుండి వెళ్ళిపోదామనుకున్న సమయంలో ఆయన తన తపస్సునుండి కొద్దిగా కదిలి ‘నువ్వు కార్టూనిస్ట్‌గా ఎందుకు ఉండాలనుకుంటున్నావు? కార్టూన్లు వేయడంలో అంత గొప్ప ఏమున్నదబ్బా? పనికి వచ్చే వేరే పని ఏదయినా చేసుకోవచ్చు కదా?’ కళ్ళు తెరవకుండా సలహా ఇచ్చాడు. నేను మౌనంగా లేచి నిలబడ్డాను.

ఓరి నాయనో! చాలామందికి ఒళ్ళు జలదరించింది. ఇప్పుడు ‘బడా పిట్ఠూ’తో సహా రావాలంటే, అవన్నీ తగిలించుకోవడానికి కనీసం పది నిముషాలు పడుతుంది. తప్పేదేముంది! పరుగు పెట్టాం బారక్ లోకి. అసలెందుకు ధగ్లారామ్ మమ్మల్నందరినీ పరుగులు తీయిస్తున్నాడు? అతనికి ఇంత కోపం రావడం మాలో ఎవరమూ ఎప్పుడూ చూడలేదు. తగిలించుకుంటున్నాం. బూట్లు తొడుక్కుంటున్నాం. బయటికి వచ్చి ఫాలిన్‍లో చేరేసరికి పది నిముషాలు పట్టింది.