అక్కడ! వెలసిపోయినా పాత చీరలో
కళ్ళు చికిలించి
పగుళ్ళిచ్చిన అరిపాదంపై పెగిలిన

చర్మాన్ని, నీ వొణికే వేళ్ళతో లాగుతూ
గేటు వంకా, ఆపై
వీధి వంకా, మాటి మాటికీ చూస్తూ

హైస్కూల్ చదువు పూర్తయ్యాక పై చదువులకి డబ్బు అవసరమైంది. చెల్లి ఇంకా బడిలో చదువుతుండడం, ఓ రిసెప్షనిస్టు‍గా పని చేసే అమ్మ జీతం కుటుంబానికి సరిపోకపోవడం వల్ల, రెండేళ్ళు చదువు ఆపి, ఏదైనా పని చేసి డబ్బు ఆదా చేయాలని, ఆ తరువాత చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. తనకి ఇష్టమైన సైకాలజీ చదవాలనుకున్నాడు. అయితే, ఆపాటి చదువుతో ఉద్యోగం సంపాదించడం కష్టం. పైగా కోవిడ్-19 మాంద్యం నుంచి నగరం ఇంకా కోలుకోలేదు.

ఊరికే ఉండడం కన్నా
క్షేమమైన దారేదీ లేదనుకుంటా ఇక్కడ.
క్షేమం అంత అవసరమా అని ప్రశ్న
జవాబు తెలిస్తే
వెయ్యి లోకాలకి ఒకేసారి తెరుచుకుంటావు
స్వేచ్ఛ లోకి వెళ్ళటం ఉన్మాదమా
అంటావు భయం భయంగా

చూపుడు వేలుకు గోరునామ
తడ తడ పెట్టినట్టు బాధ పడడం ఎందుకు
ఇంతకీ ఏమైంది అనడిగాను.

మా చిన్నన్న చేయించి
తీసుకొచ్చి ఇచ్చిన వస్తువు
విరిగిపోయిందంది.

మొసళ్ళ వంటి మనుషులకు
కట్టుకథల చేపలు విసిరి ఇద్దరం
సాయంత్రాలు పూచే పసుపు ఎండలో
తడిసినప్పుడు
నిరీక్షలు చొక్కాల్లా ఆరేసి
చలి నీడల కంబళిలో తలలుంచి దాక్కున్నప్పుడు

నువ్వొక పల్చని కాగితమై వస్తావు
నేను కుంచెనై
నీకు వేవేల రంగులద్దుతాను

నువ్వొక మట్టి ప్రమిదై వస్తావు
నేను చమురై
నిన్ను దేదీప్యమానంగా వెలిగిస్తాను

రోజువారీ జీవితం
నీ ఊహల్ని చెదరగొట్టకముందే
ఆ రాత్రికో తర్వాతరోజు ఉదయానికో
వేళ్ళు ప్రసవించనీ

అప్పుడిక మళ్ళీ నువ్వు
నీ చెట్టురూపంతో సహా అదృశ్యమైపోవచ్చు

అడ్డం తాదూర లేనిదానికి మరో రూపము(4) సమాధానం: సొరంగము పరిశీలించలేదుట ఎవరూ, పాపం (5) సమాధానం: అనాలోచిత ఎదలోన కదలే తుమ్మెద పాట దాగిన […]

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

ఇక్కడ నేనిస్తున్నది మక్కికిమక్కి అనువాదం కాదు. ముఖ్యమైన భాగాలను సరళీకరించి మూలం నాటకరూపంలో వున్నా ఇక్కడ కథారూపంగా ఇచ్చాను. ఇది చదివాక ఇంకా వివరాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగినవారు మూలాన్ని గాని లేక తమకు నచ్చిన అనువాదాన్ని గాని చదువుకోవచ్చు.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మంగళకైశికి రాగంపై చేసిన ప్రసంగం; లలిత సంగీతం అంటే ఏమిటి? నలుగురు ప్రముఖుల – రజని, మంగళంపల్లి, ఈమని, ఎమ్. ఎన్. శ్రీరాం – అభిప్రాయాలు, ఆలిండియా రేడియో ప్రసారం; మరికొన్ని లలితగీతాలు, ఈ ప్రత్యేక సంచికలో మీకోసం.

పుస్తక ప్రచురణ ఒక అరుదైన గౌరవం అనుకునే రోజుల నుండీ, నా అల్లిబిల్లి రాతలన్నీ నా సంతోషం కోసం నేనే అచ్చు వేసుకుంటానని ఎవరికి వారే ఓ ముల్లెతో ముందుకు వస్తున్న రోజుల దాకా ప్రచురణ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అవి అక్కడే ఆగితే ఎవరికీ పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ, నా పుస్తకాలు ఎవరూ కొనట్లేదు, తెలుగులో సాహిత్యాభిలాష కనుమరుగయింది, ఉచితంగా ఇచ్చినా ఎవరూ ఒక మంచిమాట చెప్పరు, పత్రికలు గమనించి సమీక్షలు రాయవు, ఆ ప్రచురణకర్తలు ఎన్ని అమ్మారో ఆ డబ్బు ఏమైందో చెప్పరు అంటూ వాపోయే రచయితల రద్దీ గత కొంతకాలంగా ఎక్కువయింది. మార్పు ఎలా అయితే అనివార్యమో, మార్పు తాలూకు ప్రభావాలను అన్ని కోణాలనుంచీ విశ్లేషించుకోవడమూ అంతే అనివార్యం. ప్రచురణ నాణ్యత, రచన నాణ్యత అన్నవి ఒకదానికొకటి సంబంధం లేని విషయాలు. ప్రచురణలో నాణ్యత సరే, తమ రచనలో నాణ్యతను నిజాయితీగా అంచనా వేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది? కొన్ని కవితలనో, కథలనో, తమ అభిప్రాయాలనో కూర్చుకుని ఏ బుక్ ఎక్జిబిషన్‌‌ కోసమో హడావుడిగా ప్రచురించుకునే ముందు, అందులో సాహిత్యపు విలువ ఎంత అన్న ప్రశ్న వినపడే వాతావరణం ఇంచుమించుగా పోగొట్టుకున్నాం. ఇందుకు రచయితల అహాలు, అపోహలు తప్ప వేరే కారణాలు లేవు. తమ వాక్యాన్ని, తమ వస్తువుని నిశితంగా, నిరాపేక్షగా అంచనా వేసుకోలేని వారు, నా రచనను ఇంకెవరూ విమర్శించలేరు అని అహం ఒలకపోస్తారు. పొగడ్త లేకున్నా బతుకుతుంది కాని విమర్శ లేకుంటే సాహిత్యం బతకదని వీరికి తెలియదు. అందుకే వీరు తమ రచనలను పత్రికలకు పంపరు. సంపాదకుల సూచనలు, పరిష్కరణ పట్ల ఏవగింపు, ఆవేశంలో పెల్లుబికిన రచనలో ఉండే నిజాయితీ పరిష్కరణలో పోతుందన్న అజ్ఞానం, ఇంకా సాహిత్యసమాజంలో విస్తృతంగానే ఉన్నాయి. శబ్దవమనం సాహిత్యం కాదని చెప్పడానికి మనకి గురువులంటూ ఎవరున్నారు తాలు సాహిత్య పీఠాధిపతులు, రాయాలి రాయండని ఎగదోసే ముఠాకోర్లూ తప్ప! చాలా మంది రచయితలు బెంగపడుతుంటారు కాని, వాక్యం శ్రద్ధగా రాస్తే నిజాయితీ మాయమవడం, పదును పెడితే రచన విలువ పోవడం ఉండవు. పరిష్కరణ రచన డొల్లతనాన్ని రచయితకు పట్టిస్తుంది, అంతే. వాక్యపుబలిమితో కథలు చెప్పి మెప్పించిన రచయితలు మనకు లేరా? వారెవరూ ఆదర్శం కాదా? అసలు సంగతేంటంటే ఈ తరహా రచయితలది మేకపోతు గాంభీర్యం. విమర్శ అంటే జంకు. వాక్యం మీద శ్రమను వెచ్చించడానికి బద్ధకం. అర్థరాహిత్యాన్ని ప్రశ్నిస్తే వివరణ ఇవ్వడానికి అహం. అనవసరమైన పదాలో వాక్యాలో తీసేయమంటే ఎందుకు ఉంచాలో చెప్పలేని అయోమయం. రాయలేమన్న నిజాన్ని అంగీకరించడం రాసేవాళ్ళకు కష్టం. ఆ నిజం చెప్పినవారిపై తమ గొంతు నొక్కుతున్నారని అఘాయిత్యం చేయడం సులభం. అలా చేస్తూ కూడా, ప్రచురణకర్తలు తమ రచనలు ప్రచురించరేమని ప్రశ్నించే రచయితలు కొందరు. తమ రచనలకు ఇవ్వాల్సిన రాయితీలు, పారితోషకాలు ఇతర దేశాల్లో మాదిరిగానో, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానో లేవని వాపోయే వారు ఇంకొందరు. ఇతర దేశాల్లో ఉన్న పబ్లిషింగ్ హౌస్‌లు ఎన్నెన్ని నియమాలతో ఫుస్తక ప్రచురణ అంగీకరిస్తాయో, రచన నాణ్యతకు సంబంధించి ఎన్ని కఠినమైన పరిశీలనల్లో నెగ్గాలో వీళ్ళకు తెలుసని అనుకోలేం. తెలుసుకునే ఆసక్తి ఉందనీ ఆశించలేం. ఇక్కడ రచయితలకు ప్రచురణకర్త సమయం పట్ల, అతని వనరుల పట్లా చిన్నచూపు, తమ సాహిత్యస్థాయి పట్ల మాత్రం అమితమైన విశ్వాసం. అందుకేనేమో, నా పుస్తకాన్ని ఒక పాఠకుడు తన సమయమూ ధనమూ వెచ్చించి ఎందుకు చదవాలి? అని వీరెవరూ తమను తాము ప్రశ్నించుకోరు. పుస్తకం అమ్ముడు పోవాలంటే అది అచ్చులోకి రాకముందే మంచి రచయితగా పాఠకులలో గుర్తింపు తెచ్చుకోవడం ఒక పద్ధతని గుర్తించరు. సాహిత్య పరిశ్రమ, సాధనతో కూడిన రచన, పత్రికలకు పంపడం, పరిష్కరణ, ప్రచురణ, తద్వారా సమకాలీనులలో తమ రచనల పట్ల ఏర్పడే ఆసక్తి, గౌరవం, ఆదరణ, దరిమిలా ప్రచురణకర్తల ఆహ్వానం – ఇలా ఎన్నో మెట్లు దాటి ప్రచురించబడిన పుస్తకానికి, ఏ మెట్టు ఎక్కని పుస్తకానికీ ఎంతో తేడా ఉంటుంది. ఆ తేడా తెలుసుకోకుండా తమ పుస్తకాలు అమ్ముడు పోవటం లేదని ప్రచురణకర్తలను, పాఠకులనూ ఆడిపోసుకోవడంలో అర్థం లేదు. పుస్తకం అన్నది రచన, ప్రచురణ కలిసి జీవం పోసుకొనే కళాత్మక వస్తువు. ఆ రెండు విలువలూ పరస్పర పూరకంగా ఉంటేనే అంతిమంగా కళకు విలువ. శ్రీరమణ ఒక రచయితకు ముందు మాట వ్రాస్తూ ఇలా అన్నారు: “మనం ఒక పుస్తకం అచ్చుకి ఇస్తున్నాము అంటే దాని అర్థం, ఒక వెదురు పొదను సమూలంగా నాశనం చేస్తున్నామని. ఒక వెదురు పొద పచ్చగా బ్రతకాలా? లేదా మీ పుస్తకం బయటికి రావాలా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.” పుస్తకాలు అచ్చు వేసుకుంటున్న ఎందరో తెలుగు రచయితలకు ఈ విజ్ఞత అత్యవసరం.

ఇక్కడ గమనించవలసింది ఏమంటే, డెత్ బై వాటర్‌ను ఎలియట్ తన మిత్రుడి మరణంతో కలిగిన శోకంలో, తన వివాహవైఫల్యంలో మొదలుపెట్టాడు. ఆ ప్రారంభభాగాన్ని పౌండ్ కత్తిరించేశాడు. ఎలియట్ వద్దనలేదు. ఏమిటి దీని అర్థం పరమార్థం? కవి లేకుండా, కవి కష్టసుఖాలు, కవి అనుభూతి లేకుండా, కవిత్వం లేదు.

గ్రనాద నడకరాయుళ్ళ స్వర్గసీమ. పెద్దగా దూరాలేమీ లేవు. ఏ వీధిని చూసినా రంగులీనుతూ కళకళలాడుతూ కనిపించింది. నాలో ఉత్సాహం నింపింది. ఎలాంటి అభద్రతాభావమూ కలుగలేదు. జనజీవితం నింపాదిగా సాగిపోతోంది. మనుషులు సౌమ్యుల్లా కనిపించారు. ఆప్యాయంగా పలకరించారు. స్నేహంగా సాయపడేవారిలా అనిపించారు.

మా ఊళ్ళో రథయాత్ర పూరీలో జరిగే రథయాత్ర లాగా ఘనంగా చేస్తారు. దాసన్నపేట చివారన రథాన్ని పెడతారు. మూడు కోవెళ్ళ ముందు, కన్యకాపరమేశ్వరి గుడి ముందూ ఊళ్ళోనూ రథాలు పెడతారు. అవీ పెద్ద రథాలే. దాసన్నపేట దూరం అనుకున్నవాళ్ళు ఊళ్ళో పెట్టిన ఈ రథాల దగ్గరికి ఎవరికి వీలైన చోటుకు వారు వెళతారు.

మేరే ప్యారే జవానోఁ… చెరగని చిరునవ్వుతో మీరు సమర్పించిన మీ విలువైన యవ్వనాన్ని ఈ దేశమే కాదు, ఆ దేవుడు కూడా మీకు తిరిగి ఇవ్వలేడు. కొద్ది రోజుల్లో మీరు ఈ రెజిమెంట్‌కీ, భారతీయ సైన్యానికీ వీడ్కోలు పలికి, ఇన్నేళ్ళూ మీరు సగర్వంగా ధరించిన మీ యూనిఫామ్‌ని మీ ఇంట్లో హాంగర్‌కి తగిలించబోతున్నారు. భారతీయ సైన్యం నుంచి రిటైర్ అవుతున్న మీరు అందించిన సేవలకి, ఈ దేశం మీకు సదా ఋణపడి ఉంటుంది.

నా సమస్య కొంతమందికి నవ్వులాట. కొంతమంది శ్రేయోభిలాషుల్లా సలహాలు కూడా ఇచ్చారు. ఇంకొంతమంది వెటకారాలు చేస్తారు ‘ఏంటి, ఈ సారి ఏమైంది’ అని. శరవణన్ మాత్రం ఎప్పుడూ సలహాలు ఇవ్వడం, పెద్దగా తీర్పులు చెప్పడం చేసేవాడు కాదు. అది ఒక్క నా విషయంలోనే కాదు. ఎవరి గురించైనా ఆరా తీసినట్లు కాని, ఎవరికైనా సహాయమో, హానో చేసినట్లు కానీ నేను చూడలేదు. అతను తన కోసం తప్ప ఎవరికీ ఏ పని చేయడు.

అన్ని కంప్యూటర్ ఎంట్రీ పాయింట్లకి మనుషులను నియమించాక ఒక మనిషి ఎక్కువగా ఉన్నారని తెలిసింది. అది ఎవరా అని చూసినప్పుడు అతనితోపాటు ఉద్యోగంలో చేరడానికి వచ్చిన ఆ అమ్మాయేనని గుర్తుకు వచ్చింది. ఆమెను రప్పించాడు. ఆమె వణుకుతూ, కంగారుగా వచ్చి అతని గది గాజు తలుపు బయట నిల్చుంది. నెమ్మదిగా ఆమెకేసి చూశాడు. ఆమె వణుకు స్పష్టంగా కనబడుతోంది. గాలిలో ఆకులు అల్లాడుతున్నట్టు వణుకుతోంది అనుకున్నాడు.