ఆ రాళ్ళరక్తపు మరకల్లో
వారి జీవితాల్ని చిదిమేసిన పాదముద్రలే భయపెడ్తాయి
వారి జ్ఞాపకాల్ని పదే పదే కెలికే
వారి నిస్సహాయ క్షణాలే మరీ మరీ బాధిస్తాయి
వారి లేకపోయినతనాన్ని అనుక్షణం అనుభవిస్తున్న
ఆత్మీయుల ఆర్తనాదాలే వినిపిస్తాయి
ఏ కొందరికైనా
మరణించిన ప్రతి మనిషీ స్మారక స్థూపమే!
ఎంత పోరాటం ఆఖరువరకూ?
రచయిత వై. ముకుంద రామారావు గురించి:
9 స్వీయ కవిత్వ సంకలనాలు, 14 అనువాద గ్రంథాలు, ఆంగ్లం కన్నడంలో నా కవిత్వ అనువాద పుస్తకాలు, మరో 5 ఇతరాలు వచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం-సాహితీ పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం, అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం మొదలైన అవార్డులు వచ్చాయి. ఆంగ్లం, పోలిష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, కన్నడం, తమిళం, మలయాళం, ఒడియా, సంతాలీ, మరాఠీల్లోకి ఎన్నో కవితల అనువాదాలు వచ్చాయి.