ఉయ్యాల బల్లమీద కూర్చుని తనివి తీరేదాకా ఊగింది. తర్వాత దగ్గర్లో ఉన్న అంగటికెళ్ళి ఒకే ఒక్క చాప మాత్రం కొనుక్కొచ్చుకుంది. హాల్లో చాప పరిచి పడుకుంది. ఇది తన ఇల్లు. తను మాత్రమే ఉండబోయే ఇల్లు. ఇలాంటొక ఇల్లు ఉండటం ఎవరికీ తెలియకూడదు. ఈ ఇంటిలో తనతో ఎవరూ ఉండరు. తాను మాత్రమే ఇక్కడ ఉండబోతున్నాను అన్నది ఆమెకు వల్లమాలినంత సంతోషాన్ని ఇచ్చింది.
శీర్షికలు సంచికలు
మామూలుతనపు రోడ్డులెంబడి
నొప్పి సూది గుచ్చుతూ
అంబులెన్సు
కుట్లేసి పోయినట్టు
సాల్ గిరా తేదీల్లోనో మరి
ఎక్కడ నక్కిందో
ఎనెన్ని భూముల కింద పారుతుందో
కుస్తీలో జగా ప్రావీణ్యం విని, అతడికి మరి కొన్ని ఉద్యోగావకాశాలు వచ్చి పడ్డాయి. తుపాకీ పట్టుకుని ఒక ఇంటి ముందు గార్డుగా కూచోడం, దానికి మంచి జీతం. ఇంకో ఉద్యోగం మరీ గొప్పది. కావలసినంత తిండి, జీతం, అందరూ తనని చూసి భయపడే ఉద్యోగం. యజమాని చెప్పినపుడు, ఎవరిదన్నా కాలు విరగ్గొట్టడం, మొహం పగలగొట్టడం, మెడ విరిచేయడం… ఇదీ అతని పని అక్కడ.
తను రాస్తాడు. ఇవ్వాళే మొదలుపెడతాడు. చివరికొచ్చేసరికి స్ట్రాంగ్గా మారుతోంది ఆఫ్టర్ లంచ్ సిగరెట్. అరుంధతీ రాయ్ అన్నట్లు. మానెయ్యాలి. అరుంధతీ రాయ్నా? జోకులా? సిగరెట్లు. కాలిస్తే బాగుంటుంది. కాల్చకపోతే, తపనని తట్టుకోవడం కష్టం. అసలైనా ఇష్టమైంది, ఈరోజు చేస్తున్నది ఎప్పుడూ ఎందుకని నచ్చదు? ఒకప్పటి జులపాల, బెల్బాటమ్ల రోజులే బాగున్నాయనిపిస్తాయేం? అవన్నీ తర్వాత. ముందు రాయాలి. ఇవాళ్టినుంచీ. రాస్తాడు. రాయగలడు తను.
లైబ్రరీ మెట్లమీద
మనం
చేజార్చుకున్న ఊహలన్నీ
ఏ నిద్ర పట్టని రాత్రో
నా వెంటబడి తరుముతాయి
తీరంలో మనం
అల్లుకున్న కవితలన్నీ
కెరటాల్లా హోరెత్తుతాయి
లైబ్రరీ దగ్గర రావుగారు చూస్తూ ఉంటాడేమో పర్వాలేదు సాయంత్రం కలవచ్చు అర్జంట్ విషయాలు ఏమున్నాయి. రోజూ ఉండే విషయాలే. ఆయన నిన్న వచ్చిన ఫోన్ గురించి చెప్తాడు ‘అబ్బాయి రమ్మంటున్నాడు ఎలా వెళ్ళడం. ఇక్కడ పంటలు వచ్చాక రైతు దగ్గర కౌలు వసూలు చేసుకుని వెళ్ళాలి’ అంటాడు రైతు బ్యాంకులో వేస్తాడు డబ్బులు అంటే వినడు. ఎప్పుడూ ఉండేదే ఆయన చెప్పడం నేను వినడం నేను చెప్పడం ఆయన వినడం.
కావున నా సూచన ఏమనగా ఋ-కారమునకు యతి బహుళము చేయవలయునని. అనగా రి-కారము, రు-కారము రెండింటితో చెల్లించుటకు శాస్త్రబద్ధముగా అనుమతి నొసగవలెనని. ఈ శాస్త్రసమ్మతి విశ్వవిద్యాలయముల ద్వారా, భాషాశాస్త్రజ్ఞులద్వారా, పండితులద్వారా, ప్రభుత్వము ద్వారా జరుగవలయును. అంతేకాక విలోమ ఉపయోగమును కూడ బహిష్కరించవలెను.
రవివర్మ అనే ఆనాటి కళాకారుని జీవితకథలో ఒకటి రెండు మలుపులను వెదికి పెన్సిల్ చెక్కినట్టు రాసిపడెయ్యటం, కిట్టించడం కుదరదు–నాటి ప్రాంతీయ చరిత్ర, వలస కళల వాతావరణం, తైనాతీల వస్తుప్రపంచం, బ్రిటిష్ జమీందారీ అడుగుబొడుగు నీడలు సర్వసమగ్రంగా శోధించి నేతపని చేయడంవల్ల పాఠకుడికి ‘రవి’ కళాప్రపంచపు ‘అదనపు విలువలు’ బహుళ ప్రయోజనం చేకూర్చాయి.
పెళ్ళాడటానికి ప్రేమ ఒక్కటే అర్హతగా నిలిస్తే బాగుంటుంది కాని, మానవ సహజమైన కుతూహలం అవతలి వ్యక్తిలోని ప్రత్యేకతలు తెలుసుకోనిదే, ఎందెందులో అతడు/ఆమె తనకు సరిజోడో తెలుసుకోనిదే అంత త్వరగా శాంతించదు. తృప్తి చెందదు. ఈ కథానాయకుడు అలాంటి కుతూహలపరుడు.
అడ్డం ఖడ్గధారి (5) సమాధానం: కటారికాడు పుణ్య క్షేత్రంలో రేగుచెట్టు (3) సమాధానం: బదరి అవతారపురుషుడిని ఎలాగైనా మనువాడు (4) సమాధానం: వామనుడు బూజులుపట్టిన […]
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
కాలాతీతమైన సాహిత్యం అని అనడం కొన్ని సందర్భాల్లో కొన్ని రచనలకు సంబంధించి మంచి విశేషణమే కాని, అలా కాని సాహిత్యాన్ని కొట్టిపారేయడానికి లేదు. కాలానుగుణమైన సాహిత్యం కూడా ఒక సామాజిక అవసరం. సమకాలీన సమాజపు పోకడలను నిశితంగా గమనించి చాప కింద నీరులా పాకే దుష్ప్రభావాలను ఎత్తి చూపుతూ సాహిత్య సృజన చేయడం కొన్నిసార్లు ప్రథమ చికిత్స లాంటి అవసరం. ఎనభైల దశకంలో తెలుగునాట స్త్రీవాద సాహిత్యం చేసింది దాదాపు అలాంటి పనే. స్త్రీ చేతన కోసం రచయిత్రులు కూడి పరిశ్రమ చేసిన ఉద్యమకాలమది. తమ తమ జీవితాల పట్ల, హక్కుల పట్లా స్త్రీలకు ఉండాల్సిన అవగాహన గురించి, గౌరవం గురించీ గొంతెత్తి మాట్లాడిన తరమది. హద్దుల్లేని జీవనోత్సాహం కోసం కనపడ్డవన్నీ కూల్చేయమని ప్రబోధించిన వేలంవెర్రి అచ్చు కాగితాల మధ్య మానసిక శారీరక ఆరోగ్యాల గురించి, స్త్రీ తనకు తానుగా మొదటగా మిగుల్చుకోవలసిన హుందాతనం గురించి, కన్నబిడ్డలైనా వేలెత్తి చూపే వీల్లేని వ్యక్తిగతనిర్ణయ స్వాతంత్రాల గురించి, జీవించే హక్కు గురించీ మాట్లాడిన సత్యవతిగారి కథల్లోని సూక్ష్మదృష్టికి వెలకట్టలేం. అభ్యుదయ సాహిత్యం అంటే మొహం మీద కొట్టినట్టుండే ఆవేశాలో ఉపదేశాలో, నినాదాలో సందేశాలో కావని, చుట్టూ ఉన్న సమాజంలో నుండి నడిచి వచ్చినట్టుండే పాత్రల సంఘర్షణ, పోరాటం, నిబ్బరం, నిజాయితీతో కూడిన లోచూపు ఉన్న కథలే ఆలోచనలను రగిలించగలవని, నిజమైన అభ్యుదయానికి దారి తీయగలవని పి. సత్యవతి కథలు రుజువు చేస్తాయి. నిన్ను నువ్వు చూసుకోవడం నేరం కాదని, నీ కోసం నువ్వు బతకడం ఒక జీవనావసరమని, నీ గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించడమొక కనీస బాధ్యత అనీ స్త్రీలకు లోపల నిండు ధైర్యాన్ని కలిగించిన అభయవచనాలామె కథలు. రెచ్చగొట్టడానికీ ఆలోచన కలిగించి భరోసానివ్వడానికీ మధ్య ఉన్న తేడాని పట్టుకుని రాశారు కనుకే, కాలానుగుణంగా వచ్చిన ఆ కథలు ఇప్పటికీ గుర్తింపుకి నోచుకుంటున్నాయి. అవకాశం ఉండి కూడా, ఆమె తెలుగులో నేరుగా చేసిన కృషి కళ్ళబడనట్టు, సాహిత్య అకాడెమీ ఆమెకు అనువాద కేటగిరీలో అవార్డు ప్రకటించి తన హ్రస్వదృష్టిని చూపుకుంది. ఇదేమీ ఆశ్చర్యం కాదు – అకాడెమీ అవార్డులు కనీసం తెలుగుకి సంబంధించి ఎన్నేళ్ళుగానో మూసలో ఇరుక్కుని ఉన్నాయి. అవార్డులు ఒక పరిమితిగా మారిన కాలమిది. రచనా ప్రక్రియ, ప్రాంతం, వాదం, చివరిగా వయసు – ఇలాంటి బేరీజుల మధ్య నలిగిపోతూ తెలుగు సాహిత్య అకాడెమీ అవార్డు విలువ నానాటికీ దిగజారుతోంది. అయితే నిజమైన సాహిత్యం ఎల్లలు దాటి తన ఉనికిని చాటుకుంటుంది. కన్నడిగుల ప్రతిష్టాత్మకమైన కువెంపు జాతీయ సాహిత్యపురస్కారం మొట్టమొదటిసారి ఒక తెలుగు రచయితకు రావడం, సత్యవతిగారి సాహిత్యప్రతిభకు నిదర్శనం. సాహిత్యానికి పైవరుసల్లో ఎన్నో గళ్ళలో టిక్ మార్కులు పడితే తప్ప అవార్డులు వరించని ఈ కాలంలో, తాము పొందడం ద్వారా అవార్డుల గౌరవాన్ని పెంపొందించే సాహిత్యం సత్యవతిగారి లాంటి ఏ కొద్దిమంది రచయితలకే సొంతం. అలాంటి సాహిత్యమే మనకిప్పుడు అవసరం.
కవులను, సాహిత్యకారులను దేశంనుంచి తరిమేయడంలో రష్యా ప్రతిభే వేరు. అలా స్వదేశం నుంచి పారిపోక తప్పని పరిస్థితి ఎదురైన ఒక రచయిత్రి కరొలీనా పావ్లోవా . ఆమె పారిపోవడానికి కారణం జార్ ప్రభువు కాదు. తోటి సాహితీవేత్తలు పెట్టిన మానసిక హింస. మగరచయితల బహిష్కరణకు రాజ్యం కారణమైతే, ఈ రచయిత్రి పారిపోవడానికి కారణం ఆ మగ రచయితలే. వినడానికి ఎంత దారుణంగా ఉన్నా అదే నిజం.
“పెద్దింటి అమ్మడమ్మ కోడలే! చిట్టెమ్మను ఎరగవూ? అమ్మడమ్మకీ చెప్పే. కోడలు పిల్ల చిట్టెమ్మ చిన్నదీ. దానికి తెలీదూ – గ్రహణం నాడు గదిలోంచి బయటికి రావొద్దనూ. నీళ్ళోసుకుందన్నావు. జాగ్రత్తా! అని. ఆవిడేం చెప్పిందో, అదేం విందో! మొదటి కాన్పు! గ్రహణం మొర్రి రాకేమవుతుందీ! పిల్లాడు చూడబోతే పనసపండులా ఉన్నాడు. మీది పెదవేమో చీలిపోయి ఉంది!
మామిడి పళ్ళ కాలం వచ్చిందంటే చాలు ఆ కాలం గడిచేదాకా దాదాపు ఋతువంతా మేము మామిడి చెట్లమీదే గడిపేవాళ్ళం. ఆ మామిడి కొమ్మల మీదికి వెళ్ళే ముందు వంటింట్లోంచి ఉప్పూ, కారం పొట్లాలు కట్టుకోడం మాత్రం మరిచేవాళ్ళం కాదు. డుబ్బుగాడయితే కళ్ళు మూసి, కాళ్ళు మడిచి, చిలకలా ఎగిరినట్లే ఎగిరి చెట్టు మీదికి వాలేవాడు. అప్పుడప్పుడు నేను చెట్టు ఎక్కలేక జారేవాణ్ణి.
ఫెజ్లో ప్రతి ఏడాదీ జరిగే ప్రపంచ ధార్మిక సంగీతోత్సవం ఒక విలక్షణ కార్యక్రమం. ఈ ఉత్సవం గురించి షఫియా రైలు ప్రయాణంలో చెప్పింది కూడానూ. ఈ సంగీతోత్సవానికి ప్రపంచపు నాలుగు మూలలనించీ విద్వాంసులు వస్తారట. సూఫీ ఖవ్వాలీల నుంచి హిందూ భజనల దాకా, క్రైస్తవ గీతాల నుంచి బౌద్ధమతపు మంత్రోచ్ఛారణ దాకా విభిన్న బాణీల సంగీత ప్రపంచం.
వికీర్ణం (radiation) అనేది ప్రాణాంతకమైన ప్రమాదాన్ని తీసుకొచ్చే ‘అమ్మవారు’ కాదని తెలుస్తున్నాది కదా! మనం అంతా బహుకొద్ది మోతాదులలో అసంకల్పంగా వికీర్ణం ప్రసారం చేస్తూనే ఉన్నాం, మన ఎముకలలో ఉండే అనిశ్చల పొటాసియం కారణంగా. మన వంటగదులలో నల్లసేనపురాయితో చేసిన తీనెలు కాని ఉంటే అవి కూడా కాసింత వికీర్ణాన్ని ప్రసారం చేస్తూనే ఉంటాయి.
వానలో తడవనివారు, కాఫ్కా పేరు విననివారు ఉండరు. అతడి గురించి రెండు విషయాలు లోకానికి తెలుసు, అతన్ని చదవనివారికి కూడా. ఒకటి, తన రచనలను అన్నిటిని తన మరణానంతరం చింపి చెత్తలో వేయమని కోరాడని. రెండు, ఇద్దరమ్మాయిలతో మూడుసార్లు పెళ్ళి నిశ్చయమై, మూడుసార్లు భగ్నమయిందని. చివరకు పెళ్ళి చేసుకోకుండానే చనిపోయాడు. తన నలభయ్యవ ఏట.
నీ మాటలతో నన్ను కాల్చివేయచ్చు
నీ చూపులతో నన్ను ముక్కలు చేయచ్చు
నీ విద్వేషంతో నన్ను చంపివేయచ్చు
కానీ మళ్ళీ,
నేను గాలిలా
ఇంకా పైకి లేస్తాను.
నా కాంక్షాపటుత్వం నిన్ను కలవరపరుస్తుందా?