ద్రౌపది కుమారులు ఐదుగురినీ కోల్పోయిందన్న వార్త నా చెవినపడ్డప్పుడు కూడా అదే జరిగింది. వెంటనే నా మనసు శాంతించింది. ఆమె వెక్కి వెక్కి ఏడవాలి. ఆమె కడుపు మండిపోవాలి. ఆర్యావర్తంలో ముంచుకొచ్చిన ఈ పెనువిపత్తుకు బీజం వేసింది ఆమె అహంకారం కాదా? ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె ధగధగలాడే వజ్రాల కిరీటం ధరించి పట్టమహిషిగా సింహాసనం మీద నవ్వుతూ ఎలా కూర్చుంటుంది?
శీర్షికలు కథలు
ఒక్కక్షణం అతను దారిద్ర్య సంపదలూ, జాతిమత వయోభేదాలూ, సంఘపు అంతస్తుల మెట్టపల్లాలూ, ఆస్థిమాంసాల శరీరపు దౌర్బల్యాలూ, వ్యక్తి చైతన్యపు, అహంకారపు సరిహద్దులూ, అన్నీ అధిగమించి ఆ కుర్రవాడితో, ఒక మానవ జీవిమాత్రుడై, సంపూర్ణ తాదాత్మ్యం అనుభవించాడు. ఆ కుర్రవాడికీ తనకూ ఏమీ విభేదం లేదనీ, అతన్నించి తనను ఎవ్వరూ వేరుచెయ్యలేరనీ అనుకొన్నాడు.
దునియాలో మోసం చెయ్యందెవరు? తోబుట్టువులైనా మొగుడూ పెళ్ళాలైనా, కిళ్ళీకొట్టోడైనా, మందుల షాపోడైనా, బడే బడే నేతాలోగ్ అయినా… చివరికి ఆ అడుక్కునే కొజ్జావోడైనా – మోసం చెయ్యనోడు లేనేలేడంటా!
Read more వరకూ అలా అలా చదివేసి thumbs up emoji కొట్టి, రచయిత ఎవరో కూడా చూడకుండా తన కాంటాక్ట్స్లో కొందరికి, గ్రూపులు కొన్నిటికి forward చేశాడు ప్రసిద్ధ్… నిమిషాల మీద ఆ కథ ప్రపంచమంతా చుట్టేసింది. ఇంకా ఎక్కడో తిరుగుతూనే ఉంది. ఎవరి దృష్టీ తగలకుండా. నకులుని గుఱ్ఱం.
సచ్చిపోనీకి బతకాలన్నంత దైర్నం వుండాల.
కర్ణుడితో ఉన్నదానికంటే మెరుగైన జీవితం అనుకుంటే భౌతికంగా భద్రమైనదే కానీ దిల్లీకి రాకముందు తను నమ్మి, పాటించిన నీతి వేరు, ఇప్పుడు చూస్తున్నది వేరు. ఏది నీతివంతం? ఏది నీతిబాహ్యం?
ఏది నిజం? సిల్కు చీరలా? చింకిగుడ్డలా? మాడినకడుపులా? బలిసిన రొమ్ములా? వృద్ధ వేశ్య ప్రలాపాలా? జవ్వనుల పకపకలా? చీకటిలో ఒంటరితనం? వెలుగులో జంటలు? ఏది నిజం? చావుబ్రతుకుల సంజమసక, కల్తీలేని వెన్నకాచిన నిజం ఏది? ఎలాగుర్తుపట్టటం?
అప్పుడు జరిగింది అనుకోని సంఘటన. రోడ్డుపైన గుంతల్ని, స్పీడు బ్రేకర్లని అడ్డంగా వచ్చే వాహనాలను దాటుకుంటూ ఇంటికి ఇంకా పావు కిలోమీటరు దూరం ఉన్నప్పుడు జరిగింది. అంత జరిగినా ఉరుము ఉరమ లేదు. పిడుగు పడలేదు. తాను ఇంకా ఓడి పోలేదన్నట్లు వర్షం ఇంకా జోరుగా కురుస్తుంది. ఆ జరిగిన సంఘటన చూసినా ఎవరూ పట్టించుకోలేదు. లోకం తీరే అంత. ఏం జరిగిందంటే, ఉన్నట్టుండి కరెంటు పోయింది. దారి కనిపించడం లేదు. స్పీడుగా వస్తున్న యాదయ్య సైకిల్ అడుగులోతు గుంతోలో పడి ఫెడెల్ ఊడిపోయింది.
నాన్న మమ్మల్ని దగ్గరకు తీసుకొని ముద్దు చేసిన జ్ఞాపకమే లేదు. ఆయన ఇంటికి రావడమే అరుదు. ఎక్కువభాగం ప్రయాణాల్లోనే ఉండేవారు! ఆ రోజుల్లో, పాలక్కాడు కొండ ప్రాంతాలలో ఊరూరా తిరుగుతూ దొంగతనాలు చేసే బందిపోట్ల బెడద విపరీతంగా ఉండేది.
“వాళ్ళ తాతలు,తండ్రులు, అందరూ ఈ ఊళ్ళోనే పుట్టారు. ఈ ఊళ్ళోనే చనిపోయారు. వాళ్ళది ఈ వూరు కాకపోతే నీది మాత్రం ఈ వూరు ఎలా అవుతుంది. మీ నాన్న ఎక్కడి నుండో ఉత్తరాదినుండి ఇక్కడకు వచ్చాడు. అక్కడ ఉత్తరాదిలో ఏ వూరో కూడా నీకు తెలియదు.అట్లాగే చిన మస్తాన్ పూర్వీకులు ఎక్కడినుండి వచ్చారో మస్తానుకూ తెలీదు. నీది ఈ వూరైతే, మస్తాన్ దీ ఈ వూరే. మస్తాన్ తాతలు, తండ్రులు అందరూ స్వామివారికి నాద స్వరం తో అర్చన చేస్తూ వచ్చారు. ఖాదర్ వాళ్ళూ అంతే! మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కుదరదు” అన్నాడు రామినాయుడు.
ప్రతి రోజూ ఉదయం పశువులు మేతకొచ్చే సమయానికి చేను దగ్గరకెళ్ళి కాపలా కాయాలి. లేదంటే పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. పశువుల కాపర్లు వాటిని వొదిలేసి ఏ మఱ్ఱిచెట్టు కిందో కూర్చుని తూగుతూనో, గుడి మంటపం దగ్గర కూర్చుని పులీ-మేక ఆట ఆడుతూనో, ఈత పళ్ళు ఏరుకుంటూనో ఉంటారు. వాళ్ళకు తెలీకుండా పశువులు ఏపుగా పెరిగిన పత్తి చేల మీదికి వచ్చేస్తాయి. అది జరిగినప్పుడు పొలి కేకలు పెట్టుకుంటూ నాలుగు దిక్కులా వాటి వెనక పరిగెడుతూ, అరి కాళ్ళకు గుచ్చుకుని చర్మాన్ని చీల్చేసే పల్లేరు కాయల ముళ్ళను కూడా పట్టించుకోకుండా పశువుల్ని అక్కడినించి తరమాల.
“ఈసారి ఆ మస్తానమ్మతో కానీ, ఈ లండీకొడుకుతో గానీ కనబడు చెప్తాను. చెవడాలు ఊడదీస్తా.” చేతిలోని కట్టిపుల్లను దూరంగా విసిరేసి. నేలమీద ఉంచిన బకెట్ ను తిరిగి చేతిలోకి తీసుకుంది తులశమ్మ.
ఇవేం ఆలోచించలేదు. చేతిలోవన్నీ పడేసి నేను కూడా పడిపోయాను. ఒక ఐదు నిమిషాలు ఎదురుగా కనిపిస్తున్న కేదార పర్వత సమూహాన్ని, ఎండలో మెరుస్తున్న ఆ అద్భుతాన్ని… అక్కడక్కడ మంచుతో మాసిపోయి కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని కన్నార్పకుండా చూస్తూ, చారబడితే ఎంత ఉపశమనం!
రాత్రికి రాత్రే సముద్రం రణరంగంగా మారిపోయింది. గాలి భీకరంగా వీచింది. నీరు నిలువెల్లా ఉప్పొంగిపోయింది. ఆకాశం చిమ్మచీకటిగా మారింది. వేటయన్ ఊహించిన విధంగా సముద్రం తన నిజరూపాన్ని చూపిస్తున్నదని గ్రహించాడు. అలలు పడగెత్తి, ఒడ్డుకు ఉరికి పడుతూ, ప్రతీదానికంటే మరొకటి మరింత గర్జనతో ముందుకొచ్చాయి. వేటకు వెళ్లిన బోట్లలో ఒక్కటీ తిరిగి రాలేదు
లాల్గుడి జయరామన్ చిన్నగా నవ్వి “నేను వాయించటానికి నువ్వు ఏమి అట్టేపెట్టావు నాకు? నువ్వు కాఫీ రాగం సంపూర్ణంగా పాడేసావు. అంచేత నాకేమీ మిగల్లేదు. అప్పుడు నేను ఇంక వాయిస్తే బాగుండదు. అందుకనే పాడేయమన్నాను” అన్నారు.
“ఇవాళ మేడే!”
“అంటే?”
“అమెరికాలో, చికాగో నగరంలో కార్మికులు తమ ప్రాణాలనొడ్డి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నారు.”
“ఎవర్నువ్వు?”
“దేవుడిని. నీతో చిన్న పనుంది.”
“ఓహో… నేను అమితాబ్ బచ్చన్ని! నాకు నీతో పనేం లేదు. పోయి ఇంకెక్కడైనా పని చూసుకో.”
మనది పరిశుభ్రత అంటే చాలా పట్టింపు గల వంశం అన్నమాట. అన్నిటినీ శుద్ధి చేసే ఆ అగ్నిదేవుడే కానీ, మనింటోకి రావాలంటే చన్నీళ్ళు స్నానం చేస్తేగానీ రావడానికి వీల్లేదని అర్థం.
పెద్ద ఇల్లు, కార్లు, తన స్థాయికి సరిపోయే భర్త, తన ఎదుగుదలకి అడ్డం కాని ఒకే ఒక కూతురు, ఇటువంటి ప్రవాస భూతల స్వర్గంలాంటి తన జీవితంలో తనను తాను మరిచిపోయి వేగంగా పరుగెత్తే జడపదార్థం ఆమె.
కాలాపత్థర్ శిఖరంనుంచి ఎవరెస్ట్, ఇతర శిఖరాలు ఎంతో స్పష్టంగా కనిపించాయి. ఎదురుగా నిలిచి పలకరించే శిఖరాలేగాకుండా దిగువన ఘనీభవించిన పచ్చల తటాకాలు, గ్లేషియర్లు కనిపించి మురిపించాయి. సాయంకాలపు ఎండలో బంగరుకాంతితో నిండిన ఎవరెస్ట్, సభాగారంలో ముఖ్యాసనంలో కూర్చున్న మహారాజులా కనిపించింది.