కండలు తిరిగిన కుర్రాడొకడు
ఎక్కాడు మొరటుగా రెక్కలు నలిగేట్టు
వాడి చేతిలో చిట్లిన గాజు
చనిపోయిన తన ప్రేయసి పెట్టిన
తొలిముద్దు జ్ఞాపకపు ముక్క

ఎవరన్నారు మనిషంటే ఘన పదార్ధమని?
చెట్టిక్కిన వాడూ మనిషే
ఎక్కిన కొమ్మను నరుక్కున్న వాడు మనిషే
కింద పడి విలవిలలాడి మృత్యువును ముద్దాడిన వాడూ మనిషే

దానికన్నా నిరుపయోగమైనది లేదు
రూపం లేదు భాషా రాదు
నడవడం తెలియదు నవ్వీ ఎరుగదు
కష్టాలు తీర్చదు కరచాలనానికీ అందదు

పున్నాగములు కొన్ని మూర్ధంబునందు,
కాంచనంబులు కొన్ని కంఠంబునందు,
మల్లెపూవులు కొన్ని యుల్లంబునందు,
హల్లకంబులు కొన్ని హస్తంబులందు,
పంకజంబులు కొన్ని పాదంబులందు,

తడారిన గాలి, వడి వడిగా నడుస్తూ నిప్పులోకి దూకుతోంది.
తన చివరి పరిమళపు జావళిని వినిపిస్తూ ఓ మల్లె
మట్టిలో రాలిన చప్పుడవుతోంది.

కనపడని ఒక విచ్ఛేదం
కడుపులో పొంచి వున్నట్టు
బద్దలవబోయే బాంబు ఒకటి
లోపల బస చేసి టిక్ టిక్ టిక్ అంటున్నట్టు
దేహం లోని అంతరింద్రియంపై
దాడి చేసేందుకు క్రూరమృగమొకటి

శరీరంతో
మీరు లేని ప్రపంచంలో
నేనూ కొంతకాలం నివసిస్తాను త్రిపురా…!
మనిషి ఉన్నప్పటి ప్రపంచాన్ని
లేనప్పటి ప్రపంచంతో పోల్చుకుంటూ –
కొన్ని కాంతి సమయాల్ని తింటూ –
వింత ఆటలో పాల్గొంటూ…

సంధ్యా సముద్రమూ చెరోవైపు నుంచి మీదకొచ్చి పడుతుంటే తిరిగి వెళ్ళే ప్రతి అలతో పాటు ఇసుకలోకి కూరుకుపోయే పాదాల్ని పైకి లాక్కుంటూ ప్రయాసపడే వాడు దీపస్థంభానికి చిక్కుకుని రెపరెపలాడుతున్న గాలిపటంతో గుసగుసగా అన్నాడు నాకు తెలుసు ఓడిపోవడానికే మొదలెట్టాను ఈ ఆటని

ఈ పావురాలు ఎగిరేందుకు పుట్టినవికావు
ఇవి వాలేందుకే ఈ లోకంలోకి వచ్చాయి
కాస్త నీడా కాస్త శాంతీ ఉన్నచోట వాలి
నీడ లాంటి శాంతి లోకి వృత్తంలా మరలి

అతడూ అమ్మాయి విడిపోయేప్పుడు పంచుకోడానికి
విడిపోయే ఆలోచన రావడానికి ముందు కొనుక్కున్న
సింగిల్ ఫ్యామిలీ హౌస్ కిటీకీలో ఏదో కదలిక

నీ ఊరు దగ్గరయ్యేకొద్దీ
ఎదగూటిలో ప్రాణం కాగుతూవుంది
నిలుచున్న చెట్లు నడుస్తున్నట్టూ
నడిచే వాహనం ఆగున్నట్టూ
అబద్ధం చెప్తుంది రహదారి!
పురివిప్పి ఆడుతున్నాయి
నెరవేరని కలలు!

సూటిదనం మొహం చాటేసి
ముసుగేసుకున్న పదచిత్రాల కన్నెల
ముద్దొచ్చే మోహన రూపాలెన్నో –
జల్లెడ లోంచి జారిపోయే నీళ్ళు
అందనితనపు అశాంతిలో ముంచేస్తయ్

నెరవేరని కాంక్షలతో సహజీవనం
కన్నీరుతో చిరునవ్వుతో సహజీవనం
పట్టువిడుపులు తెలియని స్వార్ధపు బిగింపులతో
జనం మెచ్చిన చట్రాలతో సహజీవనం

ప్రతివాది భయంకర శ్రీనివాస్‌ గొప్ప గాయకులు మాత్రమే కాదు, గొప్ప కవి కూడ. వారు 26 అక్షరములకన్న ఎక్కువ అక్షరములు గల వృత్తములను, సార్థక నామ వృత్తములను సృష్టించియున్నారు. వారి స్మృతి చిహ్నముగా వారి పేరుతో పాదమునకు 34 అక్షరములు గల సి-రి-ని-వా-స వృత్తమును కల్పించి వారిపై ఒక పద్యమును వ్రాసినాను.