ప్రాప్తం

మళ్ళీ ఉదయం వచ్చి వెలుతురు మరకల్ని అంటించేవరకూ
ఈ రాత్రి స్వచ్ఛంగా మలుగుతుంది.

పచ్చని ఆకు జీవితానికి –
పట్టుమని ఒక్కగానొక్క వసంతం వరంగా దొరుకుతుంది.

చంచల చిత్తానికి-
పంచేంద్రియాలతో పంచుకోలేని ధ్యాన భిక్ష క్షణమాత్రపు సౌఖ్యాన్నిస్తుంది

మృత్యువు పాదాలమీద పడ్డ అనుభవం
జ్ఞానం వైపు చూసి ఏదో సంకేతాన్నిస్తుంది.


స్వాతికుమారి బండ్లమూడి

రచయిత స్వాతికుమారి బండ్లమూడి గురించి:

స్వాతిగారి రచనలతో మూడు కవిత్వ పుస్తకాలను, అరసున్నా అనే కథా సంపుటిని ప్రచురించారు. హెమ్మింగ్వే రాసిన “ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ” ను తెలుగులోకి అనువదించారు. పొద్దు మరియు వాకిలి వెబ్ పత్రికలకు ఎడిటర్ గా వ్యవహరించారు. ఈవిడ రచనలను గడ్డిపోచలు బ్లాగ్ లో చదవవచ్చు. వృత్తిరీత్యా ఛార్టర్డ్ ఎకౌంటెంట్ గాను, ఉపాధ్యాయురాలిగాను పని చేస్తున్నారు.

 ...