“వర్షాలు మొదలయ్యాయి. కొండలు పచ్చగా మెరిసే సమయం. సెలయేళ్ళు గలగల పారే సమయం. ఇంట్లోనే ఉండిపోతే ఎలా?” సలహా, కన్సర్న్, మందలింపు ఆ స్వరంలో. ఎవరదీ? ఎవరదీ? చుట్టూ చూశాను. కనబడలేదు. మరో క్షణానికల్లా అర్థమయింది–గత పది రోజులుగా కురుస్తోన్న వానలు పలుకుతోన్న పలుకులవి.
Category Archive: వ్యాసాలు
నాకు నచ్చిన వృత్తములలో మందాక్రాంతము ఒకటి. అందులో ఒక గాంభీర్యము, ఒక విభిన్నమైన గతి దాగి ఉన్నాయి. కాలిదాసకవి వ్రాసిన మేఘదూతము ద్వారా ఈ వృత్తము మిక్కిలి ప్రసిద్ధి కెక్కినది. ఈ వృత్తపు పుట్టుక, ఇందులో వ్రాయబడిన సందేశ కావ్యములనుగుఱించి ఇంతకు ముందే నేను ఆషాఢస్య ప్రథమ దివసే అనే వ్యాసములో చర్చించి యున్నాను.
గెలుపు అనే విన్నింగ్ పాయింట్ లేని పరుగులో నన్ను ఒక్క క్షణం కూడా నిలబడనీయక పరిగెత్తించేది బొమ్మ కాక మరేమిటని. బొమ్మ తప్ప మనల్ని నడిపించగలిగేది, పరిగెత్తించగలిగేది మరేదైనా ఉందా? బొమ్మని మించిన అత్యాశని మించిన సంపద ఏదైనా కనుగొనగలిగేనా?
మూడేళ్ళ ఫిలిం ఇన్స్టిట్యూట్ తర్వాత కూడా నేనేమీ నేర్చుకోలేదనీ, ఎప్పటిలాగే అహంకారం నిండిన వదరుబోతుగా కొనసాగుతున్నాననీ అర్థమయింది. నన్ను నేను మాయబుచ్చుకుంటున్నాననీ తెలిసివచ్చింది. అటు ఓమ్ పురిని చూస్తే తన వినమ్రతా స్వభావంతో అంకితభావంతో ఎంతో ఎంతో నేర్చుకుంటున్నాడన్నదీ స్పష్టం.
సంస్కృతములో విసమ లేక విషమ వృత్తములలో మూడు పాదములు ఒక విధముగా, ఒక పాదము వేఱొక విధముగా లేకపోతే అన్ని పాదములు వేఱువేఱు విధములుగా ఉంటాయి. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము విషమ వృత్తమైన ఉద్గతా(త) వృత్తమును వివరించి అందులో దాగియున్న తాళవృత్తముల మూసలను కూలంకషముగా చర్చించుటయే.
చిన్న పల్లెటూరులో పుట్టిపెరగటం వెలుపలి జీవనంతో ఆవిడకు ఎక్కువ పరిచయాన్ని ఇవ్వలేదు. పుస్తకాలే ఆవిడ లోకం. ఆ పల్లెపట్టు సౌందర్యాన్ని లోపలికి తీసుకోగలిగే భావుకత స్వతహా వచ్చింది. లోపలేదో స్రవంతి… సరళంగా సహజంగా పొంగుతూ బయటపడింది. కథలు రాయటం మొదలైంది.
పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారి కథల్లో తరుచుగా కనిపించే ప్రకృతి నేపథ్యం. అన్ని కథల వెనుక సన్నగా వయొలిన్ మీద వినిపించే విషాదపు జీర. ఆ విషాదపు జీరకు మూలం తెలుసుకుంటే కోపమూ కరుణా ముప్పిరిగొని ప్రపంచమంతా దిగులు మేఘాలు కమ్మినా, ముఖం చూపించని సూర్యుడి మీద అసహాయతతో కూడిన కోపం వస్తుంది పాఠకులకి.
తనకు తెలిసిన జీవితాన్నే, తనకు అనుభవంలోకి వచ్చిన సామాజికాంశాలనే తన కథల్లో ప్రదర్శించినాడు సుబ్బరామయ్య. ఆయన తన కథల్లో కల్పననూ, ఊహలనూ ఎప్పుడూ ఆశ్రయించలేదు. తాను జీవించిన విజయవాడ పట్టణమే ఆయన కథల్లో వేదికగా వుండటాన్ని కూడా మనం గుర్తుపట్టవచ్చు. పెద్దిభొట్ల అనగానే మధ్యతరగతి అని గుర్తుండిపోయేలే చాలా కథలు రాసినాడు ఆయన.
రజని రచించి కూర్చిన పద్యనాటికలను విశ్వవీణ అనే పేరుతో సంపుటం చేశారు. ఈమాట గ్రంథాలయం కోసం అరుదైన ఈ పుస్తకం పరుచూరి శ్రీనివాస్ ఈమాటకు పిడిఎఫ్ రూపంలో అందించారు. ఆ సందర్భంగా ఆ పుస్తకపు ముందుమాటగా రజని రాసిన సంగీతనాటకాలు అనే వ్యాసం ఇక్కడ ప్రచురిస్తున్నాం. – సం.
రేచన వ్రాసిన కవిజనాశ్రయము మొదటి తెలుగు గ్రంథము కాదని శాసనముల, తదితర ఆధారముల ద్వారా నిరూపించబడినది. కొన్ని శతాబ్దములకు ముందు ఛందోనియమముల కొఱకు వాడబడిన హలంతములైన పదములను అజంతములుగా ఉచ్చరించేవారని శాసనముల ద్వారా నిరూపించడమైనది.
సాహిత్యం జీవితాన్ని ఉన్నతీకరిస్తుంది. విమర్శ సాహిత్యాన్ని ఉన్నతీకరిస్తుంది. పొరలు పొరలుగా, గజిబిజిగా, గందరగోళంగా, సంక్లిష్టంగా ఉన్న మానవజీవితాన్ని సాహిత్యం వడకట్టి, దాని సారాంశం తేటతెల్లం చేస్తుంది. అటువంటి సాహిత్యాన్ని పరిశీలించి, శోధించి, తాలు తప్ప వేరు చేసి, విలువ కట్టి, అందులో ఉత్తమమైనదేదో వెలికితీస్తుంది విమర్శ. (డీటీఎల్సీవారు ప్రచురించిన తెలుగు విమర్శ: కొన్ని ఆలోచనలు అన్న సంకలనం నుంచి పునర్ముద్రణ.)
అయితే కన్విన్స్ కండి, కాకపోండి. ఫరక్ కుచ్ భీ నహీ పడేగా. జరగాల్సింది ముందుగా వ్రాసిపెట్టినట్లుగానే జరుగుతుంది కాదనడానికి మై కౌన్ హుఁ? ఇదంతా నా థియరీ అనబడు ఒక సత్య శోధన, స్ట్రయిట్గా సూటిగా తార్కికంగా మీ పిల్లల సృజనాత్మకతని మీ తెలీని తనంతో హత్య చేయనీయకుండా ఆపే ప్రయత్నం.
ముఠాతత్వం అన్నది విమర్శలో కూడ ఇప్పుడు కనిపిస్తోంది. ఒక్కొక్కసారి ఈనాటి కవులు, రచయితలు తమ విమర్శకులను తామే సృష్టించుకుంటున్నారేమో అన్న అనుమానం, తమపై విమర్శ (ప్రశంస) తామే రాయించుకుంటున్నారేమో అన్న అనుమానం కూడ సహజంగానే కలుగుతుంది. అది సత్యదూరం కూడ కాదు. (డీటీఎల్సీవారు ప్రచురించిన తెలుగు విమర్శ: కొన్ని ఆలోచనలు అన్న సంకలనం నుంచి పునర్ముద్రణ.)
ధ్వని ప్రధానంగా తీసుకున్నంతసేపూ రేడియో సంగీత నాటకం బాగా వస్తుంది. కళ్ళు మూసుకున్నా సరే, శ్రోతకి కథ అంతా అర్థం కావాలి. పాత్ర స్వరూపం వాచకం ద్వారా, పాటద్వారా తెలియాలి. ఎక్కువ పాత్రలున్నా సరే, కథాకథనం ఆ దృశ్యం ద్వారా అవగతమవ్వాలి. ఆరుగురి గొంతులతో నూరుగురు గొంతుకుల ప్రభావం శాబ్దిక రూపంలో వినిపించవచ్చు.
నిజానికి వర్షం కురుస్తున్న భావం కావాలంటే చిన్న చిన్న చినుకుల జలతరంగిణి కిణికిణులకు తోడు ధారాపాతపు పొడుగాటి చినుకుల జల్లును సూచించే ఐదారు వయొలినుల ధనుర్వాదనం కావాలి. మేఘాలు గర్జిస్తున్నాయన్న భావం కావాలంటే అనుమంద్ర స్వరంలో మృదంగ స్వరతరంగిణి కావాలి.
నాలుగు గోడల మధ్యనేగాకుండా ప్రకృతి ఒడిలో, సాగర తీరంలో, జలపాతాల పొరుగున, పర్వతాల నడుమన కథకులను చేర్చి ఒకే కుటుంబంగా గడిపే అవకాశం కథా ఉత్సవం కలిగించింది. ‘శిబిరాలు, శిబిరాలు’ అని పదేపదేపదే వాపోయే సాహితీ ప్రియులకు చెప్పని సమాధానాలు ఈ కథా ఉత్సవాలు.
లలిత సంగీతం అనేదానికి ఓ కొత్త శైలిని, సరికొత్త రూపాన్ని సృష్టించినవారిలో రజనీకాంతరావు చాలా ముఖ్యులని చెప్పాలి. లలిత సంగీతమైనా మరే సంగీతమైనా శాస్త్రీయ సంగీతం అనబడే సంగీతంలో ఓ భాగమే. శాస్త్రీయ సంగీతంలోని కొన్ని లోపాలను సరిదిద్దితే అది లలిత సంగీతం అవుతుంది.
గురువుల వంటి చిత్రకారుల పనితనం చూడ్డం, చిత్రకళా పుస్తకాలు చూపించిన తోడన్, తోన్ తోడ కూడనే కాకుండా వీలయినంత మంచి రచనలు చదువుకుంటూ తృతీయా విభక్తి కూడా తెలుసుకోవాలి. గొప్ప గొప్ప రచనలను చదవాలి. ఆ చదువు ఏం చేస్తుందంటే, మనం కళ్ళు మూసుకున్నప్పుడు కూడా గొప్ప ఊహాశక్తిని మన మనసుకు ఊదుతుంది.