రచయిత వివరాలు

పూర్తిపేరు: ఎమ్వీ రామిరెడ్డి
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

పలుగులు పట్టిన
మేధావుల తవ్వకాల్లోనూ
కాలుష్యం పొర్లి ప్రవహిస్తుంటుంది

ఎవరి పల్లకీ ఎవరు
ఎందుకు మోస్తున్నారో
బోయీలకు సైతం బోధ పడదు

‘వందేళ్ల కథకు వందనాలు’ అర్పిస్తూ సమర్పించిన 118 కథనాల్లో కేవలం 12 మంది రచయిత్రులు మాత్రమే దర్శనమిచ్చారు. రచయిత్రి శీలా సుభద్రాదేవిగారిని ఆ విషయం బాధించింది. వ్యక్తిగత ఆసక్తితో కథాసాహిత్య నిర్మాణంలో రచయిత్రుల భాగస్వామ్యం గురించి ఆమె ఆరా తీస్తూ పోతే, ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి.

పాఠకుణ్ని కథల్లోకి లాక్కెళ్ళటానికి ప్రతి రచయితకూ తనదైన ఓ మంత్రదండం ఉండాలి. దేశరాజు సొంతం చేసుకున్న ఆ మంత్రదండం: శైలి. ఉపోద్ఘాతం లేకుండా సరళసుందరమైన వాక్యాలతో నేరుగా కథను ప్రారంభిస్తాడు. సంపుటిలో మొదటి కథ ‘కమ్యూనిస్టు భార్య’లోని మొదటి వాక్యంలోనే ఆ విద్యను ప్రదర్శించాడు.