త.త గారు మీ కవిత లాంటి తవిక చదివేను. 17వ శ తాబ్దంలో యిలాంటి చిత్ర కపిత్వం వచ్చేదని విన్నాను. బహుశ వారు కడుపులు ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీ కవిత్వం రాసేవారు. (నిండా ఉంటే శృంగార కవిత్వమే రాద్దురు. యివాల కవులకు ఎసిడిటీ ప్రొబ్లమనుకుంటా ను. ‘వెనుకబడీ’ కడుపు మంట వచ్చినపుడల్ల కవిత్వం రాసేస్తున్నారు.
[అభిప్రాయాలు వెలిబుచ్చే వారు, చర్చించేవారు, దయచేసి అభిప్రాయం పంపే ముందు అచ్చు తప్పులు సరిచేసుకోమని సవినయంగా మనవి చేస్కుంటున్నాం. – సం.]
రవిశంకర్ గారు – అందరు అలానే ఉంటారా !చిరునవ్వుతో ఎదురేగిన వారు ఎందరు లేరు. తోటి మనుషులతో సంబంధం లేకుండ తన గూటిలో తనకోసం బ్రతికే వారికి మాత్రమే యిలా
“క్రమక్రమంగా
మరణానికి అలవాటుపడటమే
జీవితంగా మారిపోతుంది.
పావురాలకి బదులు తీతువు పిట్టలు
ఉత్తరాలు మోసుకువస్తాయి.”
మరణం అనివార్యం అని తెలుసుకున్నవారు, సమాజం కోసం పనిచేసిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు.వాళ్ళు ఎవరు యిలా శరీరాన్ని ‘ఓటికుండ’గా భావించరు అనుకుంటాను. నిరాశా జీవులు మాత్రమే యిలాంటి భావాలను కలిగి ఉంటారు.
ఆదిత్యా! ఎప్పుడైనా ఎవరి మాటా చివరి మాట కాదు. ఏ విశ్లేషణలో బలముంటుందో అది తప్పక నిలబడుతుందనే నేను నమ్ముతాను. నేను విద్యాసాగర్ రాసిన విమర్శని, యజ్ఞం కధ మీద, చదవలేదు గనక దాని గురించి ఏమీ మాట్లాడలేను. చదివి ఉంటే తప్పక మాట్లాడగలిగి ఉండేదాన్ని. నిజానికి సి యెస్ రావు గారు రాసిన ఈ వ్యాసాన్ని తప్ప మిగిలినవాటిని వేటినీ నేను చదవలేదు. నా అభిప్రాయాలు కేవలం నా పఠనానుభవాన్ని ఆధారం చేసుకుని చెప్పినవే మాస్టారి కధ మీద. నాకు గుర్తున్నంత వరకూ ఆ కధని నేను చదివినప్పుడు అది నన్ను ఇబ్బంది పెట్టలేదని మాత్రం చెప్పగలను. ఆ కధని నేను అర్ధం చేసుకున్న తీరు వేరనుకుంటాను. బహుశా నా దృష్టికోణం వేరై ఉండవచ్చును కదా?? చర్చ సత్యాన్వేషణ కోసమే అయితే జరగవచ్చు దేనిమీదనైనా! సాధారణంగా తెలుగులో సాహిత్య చర్చల్లో అసలు విషయం మరుగున పడిపోయి అదేదో బలాబలాలు తేల్చుకోవడం లాగా మారిపోతూంటుంది చాలాసార్లు. ముఖ్యంగా భావస్పందనలు ముందుకు తోసుకుని వచ్చేయడం ఎక్కువగా జరుగుతుంది. ఇంక విషయం మీద ఖచ్చితమైన అభిప్రాయాలు గనక ఉన్నప్పుడు కూడా చర్చ ఒక సంయమనంతో సాగే వీలుండదు. ఇదేమీ గోదాం లోని కుస్తీ పోటీ లాంటిది కాదు. ఒకరు గెలవడమో ఒకరు ఓడడమో ఖచ్చితంగా నిర్ణయింపబడదు. పాఠకులు కానివ్వండి, విమర్శకులు కానివ్వండి భిన్న దృష్టి కోణాలలో ఒక అంశాన్ని చూసే వీలుంది. అర్ధం చేసుకునే వీలూ ఉంటుంది. అందువలన ఎప్పుడైనా ఏ విమర్శా సంపూర్తి కాలేదు. అందులో ఎందరో పాల్గొని దానిని పరిపుష్టి చేయగలగడమే ఆ రచనకి ఉన్న బలం! అందువలన చర్చని దెబ్బలాట మార్గంలో నడపకుండా మాట్లాడుకోగలిగితే ఏ చర్చ అయినా ఒక విషయాన్ని పట్టి చూపించే వీలుంది. పాఠకులూ, విమర్శకులూ కూడా పొరపాటు పడే వీలు ఉంటుంది. అలాగే ఒక్కోసారి రచయిత తన రచనలో చూడలేని అంశాలని పాఠకులూ విమర్శకులూ చూసే సందర్భమూ ఉంటుంది. రెండూ సాధ్యమే సుమా! అయితే రచయిత తన రచనని గురించి అనుకునే మాటకి ఒక విలువ ఉంది. ఆ కధ అన్నది ఆయన సృష్టి గనక. దాన్ని చెరిపేసే తీరు విమర్శలో నిలబడదు. ఆయన మాటలు ముఖ్యమైనవే!! వాటిని ఎవరు ఒప్పినా మానినా!
ఇంక నావరకూ క్లుప్తంగా చెప్పవలసి వస్తే నాకు అహింసా మార్గం ఇస్టం . గాంధేయ మార్గం ఇస్టం. ఆ మనసుతోనే నేను ఈ కధని గురించి అనుకున్నది ఏమంటే, అర్ధం చేసుకున్నది ఏమంటే, కాళీపట్నం రామారావు గారు తన యజ్ఞం కధ ద్వారా ప్రత్యేకించి హింసా మార్గాన్ని ప్రోత్సహించారనో, లేదా దానిని ఒక ఆదర్శంగా చూపించారనో కాదు. అలా మరి నాకు అనిపించలేదు. ఆ కధలో తాను బానిసగా ఉండదలుచుకోనప్పుడు బహుశా అప్పల్రాముడి కొడుకు గనక స్వయంగా పోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే గనక అప్పుడది పాఠకుల మనసులలో సానుభూతిగా మిగులుతుంది . అయితే అది రచయిత ఉద్దేశ్యం కాదు (ఈ విషయాన్నే మాస్టారు చెబుతున్నారు.) అలాంటి సానుభూతిని చోటు లేకుండా చేయాలని రచయిత లక్ష్యం గనకే అక్కడ అతడు కొడుకుని చంపుకున్నాడు. ఇది అనైతికమనీ, అమానుషమనీ మీ చర్చ సారాంశమా? సి యెస్ రావు గారు అలాగే అనుకుంటున్నారు. చిన్నపిల్లడిని హత్య కావించడం అన్న అంశాన్ని కధ లోని ప్రధాన అంశంగా చూసి మనం మాట్లాడలేము. అది ఆ తండ్రి చాతకాని చర్య. అతడి లో జనించిన నిర్వేదం. ఒక నిస్సహాయత, మితిమీరిన ఆవేశం కలిసిన చర్య. కోపంతో వివేకం నశించి చేసిన చర్య. అది పాఠకులని “షాక్” చేయాలని అలా చేసానని కారా మాస్టారు అన్నమాటని నేను ముందటి అభిప్రాయంలో ప్రస్తావన చేసింది అందుకనే! ఎవరిని నెపం పెట్టాలో తెలియక, సంతకాలు చేసిన తన తండ్రిని ఏమీ అనలేక, పోయి బాలుడైన తన కొడుకుని చంపుకున్నాడు. అది సమర్ధనీయం కాదు “సభ్య సమాజానికి” (కానీ కోపం వచ్చినప్పుడల్లా ఇప్పటికీ మగవాళ్ళు వాళ్ళ భార్యలనో, వాళ్ల సంతానానినో చంపుకుంటున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయే మన వర్తమానంలోనూ?? అక్కడ అది మగవాడి హక్కుగా కదా ఈ సమాజం అర్ధం చేసుకుంటోందీ? వాటి పట్ల ఇవాళ్టికీ కోర్టులూ చట్టాలూ పెద్దగా స్పందించవని మీకు గణాంకాలు చూస్తే తెలుస్తుంది. గృహహింసలో మన తెలుగు వాళ్ళూ మొదటి స్థానం లోకి వచ్చిన విషయం మీకు తెలుసునా?) దీన్నటుంచితే, గమనించి చూడండి ఇంక యజ్ఞం కధలో. ఆ కొడుకుని చంపిన కోపమే అటు తరవాత పెరిగి విస్తరించి చివరికి “వర్గ శత్రు నిర్మూలన” వైపు మళ్ళింది కదా శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో? నేను చెప్పిందీ, ఆ కధ ద్వారా నేను చూసిందీ ఇది. ఈ చర్చని చూసేకనే నా సందేహాన్ని నివృత్తి చేసుకుందికనే నేను యజ్ఞం కధ వాటి పూర్వా పరాల మీద మాస్టారితో మొన్నీమధ్య మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలలో కొన్నింటిని నేను నా అభిప్రాయం లొంచి ఈమాట అభిప్రాయాలలో అవసరమని అనిపించి వ్యక్త పరిచేను. ఇంక ఈ కధ “తిరోగమన కధ “ఎలా అయ్యిందని మీరు భావిస్తున్నారో నాకు తెలియదు గనక దాని మీద నేను ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేను. హింస తాలూకు మూలాలని వదలి మనం బాలుని హత్యని కేంద్రంగా చేసుకుని యజ్ఞం కధని చర్చ చేయకూడదనుకుంటాను. అలా చేసినందువలన జరిగేదేమంటే సున్నిత స్వభావులకి అది ఇబ్బందిగా అనిపించి, తద్వారా కధ రాసిన రచయితని నెపం పెట్టి, నిందించడం జరుగుతుందే తప్ప మరో విషయం బహిర్గతం కాదు. యజ్ఞం కధ మాత్రమే కాదు తన మిగిలిన కధలలోనూ మాస్టారు ఎన్నుకున్న ఇతివృత్తాలనీ వాటి నిర్వహణనీ చూసినప్పుడు మాస్టారు హింసావాదిగా నాకు అనిపించలేదు. అందువలన యజ్ఞం కధ ముగింపు మీద నేను పాఠకురాలి గానూ విమర్శకురాలి గానూ నా విమర్శని ఎక్కుపెట్టలేను. అది దళితుల మీద భూస్వాముల ఆధిపత్యమూ హింసా అనే నేను ఇప్పటికీ అర్ధం చేసుకుంటాను. ఆ శ్రీకాకుళం లోనే, అదే తిరిగీ మళ్ళీ మొన్నటి మద్దువలస రిజర్వాయర్ భూముల దగ్గర బయట పడింది. లక్షింపేటలో మారణ హోమం అంత దారుణంగా జరిగింది. బొత్స వాసుదేవనాయుడు బహుశా ముదిరిన యజ్ఞం కధలోని శ్రీరాములు నాయుడేనేమో అని మీరెందుకని అనుకోలేదో? ఏం మారిందీ పరిస్థితి ఇవాళ్టికైనా? అని మాస్టారు అన్న ప్రశ్నకి ఏం జవాబు ఉంది గనకా తెలుగు మేధావుల ముందు? యజ్ఞం కధని ఎవరు ఏ దృష్టితో చూస్తున్నారు అనే దాన్ని బట్టీ ఆ కధ వారికి ఆ దృష్టి లోంచి అర్ధమవుతుంది.
చివరగా నేను బాలుని హత్యని సమర్ధించడం లేదు అని చెబుతున్నాను. అదే సమయంలో మాస్టారు పిల్లల్ని చంపుకోవడాన్ని ఆ కధలో సందేశం గానో సూచనగానో చెప్పారని కూడా నేను అనుకోవడం లేదనీ చెబుతున్నాను. ప్రస్తుతానికి ఇంతకు మించి ఈ విషయంలో నాకు మాట్లడవలసింది మరి లేదు.
రాధ గారికి అభినందనలు. మాతృమూర్తికి మన సంస్కృతిలో గల స్థానాన్ని వివరిస్తూ, యశోదమ్మనూ, పోతన్ననూ, సంస్మరిస్తూ సాగిన మీ రచన, మీ భావోద్వేగాలతో బాటు, మీ రచనానైపుణ్యాన్ని అద్దం పట్టి చూపిస్తుంది. ఇలాంటి రచనలు మీ కలం నుండి ఇంకా రావాలని కోరుతూ…
జయప్రభ గారూ: మీ పేరు తప్పుగా పడినందుకు క్షమించండి. మీ పేరు తెలియక కాదు. మీరు తెలుగులో మంచి కవయిత్రి అని తెలుసును. అన్నమయ్య సాహిత్యంపై పరిశోధన చేసారని తెలుసును. ఆ మధ్య విశాఖపట్నం సభలో పాల్గొనటమూ తెలుసును. కాకపొతే పొరపాటు పడింది. యిక విషయనికి వస్తాను.
1) మీరు మళ్ళీ పొరపాటు పడుతున్నారు. “విద్యాసాగర్ కి మాత్రమే నేను జవాబు రాసేను” అంటున్నారు. కానీ, పత్రికలొ రాస్తున్న విషయం మరిచిపోతున్నారు.
2) మీరు “యజ్ఞం కధ నాది కాదు. రామారావు గారిది. అందువలన ఆ కధని గురించి ఎప్పుడైనా ఎవరికైనా ఆయన చెప్పిన మాటలు తప్పక వినవలసినవే అవుతాయి!“అన్నారు. తప్పక వినవలసిందే, వింటాం. కాని ఆయన (కా.రా) చెప్పారు గాబట్టి నమ్మవలసిందే అంటే మాత్రం నమ్మం.
3) లక్షిం పేట హత్యల ప్రస్తావన తెచ్చారు. అగ్ర వర్ణ దురహాంకారంతో చేసే హత్యలకు,కన్న బిడ్డను చేసే హత్యకు పోలికా…!
4) మీరు “మీకు ఆ కధ ఒప్పుదల కాకపోయి ఉండవచ్చు. అంతమాత్రాన యజ్ఞం కధ ఉత్తమ కధా కాక పోదు.“అన్నారు. కాకూడదని మాకేమి కోరిక లేదు. ఎందుకంటే అది ఎలాగు ఉత్తమ కధ కాదు గనక. యాభయ్యేళ్ళ క్రితం నుంచి వేసిన వీరతాళ్ళు ఉన్నాయి గనక మరి కొన్నాళ్ళు వాటిని మోసే వీరాభిమానులు ఉంటారు. నిజానికి అదో పెద్ద తిరోగమన భావజాలాన్ని ప్రచారం చేసే కధ.
5) మీరు “ఒకవేళ ఈ నా అభిప్రాయం మీకు ఆమోదం కాకపోతే మీరు దీన్ని చదవకండి. చదివినా పట్టించుకోకండి. ఈ అభిప్రాయానికి మీరు పాఠకులు కారన్నమాట 🙂” అని అన్నారు. మీరు చర్చకు నిలబడరని అర్థమయింది. కాబట్టి, అనవసరమనుకున్న చోట నేనూ చర్చించను.
ఇటు నేనే – అటు నేనే గురించి aditya reddi అభిప్రాయం:
07/06/2012 8:00 pm
త.త గారు మీ కవిత లాంటి తవిక చదివేను. 17వ శ తాబ్దంలో యిలాంటి చిత్ర కపిత్వం వచ్చేదని విన్నాను. బహుశ వారు కడుపులు ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీ కవిత్వం రాసేవారు. (నిండా ఉంటే శృంగార కవిత్వమే రాద్దురు. యివాల కవులకు ఎసిడిటీ ప్రొబ్లమనుకుంటా ను. ‘వెనుకబడీ’ కడుపు మంట వచ్చినపుడల్ల కవిత్వం రాసేస్తున్నారు.
[అభిప్రాయాలు వెలిబుచ్చే వారు, చర్చించేవారు, దయచేసి అభిప్రాయం పంపే ముందు అచ్చు తప్పులు సరిచేసుకోమని సవినయంగా మనవి చేస్కుంటున్నాం. – సం.]
ఆఖరి మనిషి గురించి aditya reddi అభిప్రాయం:
07/06/2012 7:33 pm
రవిశంకర్ గారు – అందరు అలానే ఉంటారా !చిరునవ్వుతో ఎదురేగిన వారు ఎందరు లేరు. తోటి మనుషులతో సంబంధం లేకుండ తన గూటిలో తనకోసం బ్రతికే వారికి మాత్రమే యిలా
“క్రమక్రమంగా
మరణానికి అలవాటుపడటమే
జీవితంగా మారిపోతుంది.
పావురాలకి బదులు తీతువు పిట్టలు
ఉత్తరాలు మోసుకువస్తాయి.”
మరణం అనివార్యం అని తెలుసుకున్నవారు, సమాజం కోసం పనిచేసిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు.వాళ్ళు ఎవరు యిలా శరీరాన్ని ‘ఓటికుండ’గా భావించరు అనుకుంటాను. నిరాశా జీవులు మాత్రమే యిలాంటి భావాలను కలిగి ఉంటారు.
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి jayaprabha అభిప్రాయం:
07/06/2012 4:56 pm
ఆదిత్యా! ఎప్పుడైనా ఎవరి మాటా చివరి మాట కాదు. ఏ విశ్లేషణలో బలముంటుందో అది తప్పక నిలబడుతుందనే నేను నమ్ముతాను. నేను విద్యాసాగర్ రాసిన విమర్శని, యజ్ఞం కధ మీద, చదవలేదు గనక దాని గురించి ఏమీ మాట్లాడలేను. చదివి ఉంటే తప్పక మాట్లాడగలిగి ఉండేదాన్ని. నిజానికి సి యెస్ రావు గారు రాసిన ఈ వ్యాసాన్ని తప్ప మిగిలినవాటిని వేటినీ నేను చదవలేదు. నా అభిప్రాయాలు కేవలం నా పఠనానుభవాన్ని ఆధారం చేసుకుని చెప్పినవే మాస్టారి కధ మీద. నాకు గుర్తున్నంత వరకూ ఆ కధని నేను చదివినప్పుడు అది నన్ను ఇబ్బంది పెట్టలేదని మాత్రం చెప్పగలను. ఆ కధని నేను అర్ధం చేసుకున్న తీరు వేరనుకుంటాను. బహుశా నా దృష్టికోణం వేరై ఉండవచ్చును కదా?? చర్చ సత్యాన్వేషణ కోసమే అయితే జరగవచ్చు దేనిమీదనైనా! సాధారణంగా తెలుగులో సాహిత్య చర్చల్లో అసలు విషయం మరుగున పడిపోయి అదేదో బలాబలాలు తేల్చుకోవడం లాగా మారిపోతూంటుంది చాలాసార్లు. ముఖ్యంగా భావస్పందనలు ముందుకు తోసుకుని వచ్చేయడం ఎక్కువగా జరుగుతుంది. ఇంక విషయం మీద ఖచ్చితమైన అభిప్రాయాలు గనక ఉన్నప్పుడు కూడా చర్చ ఒక సంయమనంతో సాగే వీలుండదు. ఇదేమీ గోదాం లోని కుస్తీ పోటీ లాంటిది కాదు. ఒకరు గెలవడమో ఒకరు ఓడడమో ఖచ్చితంగా నిర్ణయింపబడదు. పాఠకులు కానివ్వండి, విమర్శకులు కానివ్వండి భిన్న దృష్టి కోణాలలో ఒక అంశాన్ని చూసే వీలుంది. అర్ధం చేసుకునే వీలూ ఉంటుంది. అందువలన ఎప్పుడైనా ఏ విమర్శా సంపూర్తి కాలేదు. అందులో ఎందరో పాల్గొని దానిని పరిపుష్టి చేయగలగడమే ఆ రచనకి ఉన్న బలం! అందువలన చర్చని దెబ్బలాట మార్గంలో నడపకుండా మాట్లాడుకోగలిగితే ఏ చర్చ అయినా ఒక విషయాన్ని పట్టి చూపించే వీలుంది. పాఠకులూ, విమర్శకులూ కూడా పొరపాటు పడే వీలు ఉంటుంది. అలాగే ఒక్కోసారి రచయిత తన రచనలో చూడలేని అంశాలని పాఠకులూ విమర్శకులూ చూసే సందర్భమూ ఉంటుంది. రెండూ సాధ్యమే సుమా! అయితే రచయిత తన రచనని గురించి అనుకునే మాటకి ఒక విలువ ఉంది. ఆ కధ అన్నది ఆయన సృష్టి గనక. దాన్ని చెరిపేసే తీరు విమర్శలో నిలబడదు. ఆయన మాటలు ముఖ్యమైనవే!! వాటిని ఎవరు ఒప్పినా మానినా!
ఇంక నావరకూ క్లుప్తంగా చెప్పవలసి వస్తే నాకు అహింసా మార్గం ఇస్టం . గాంధేయ మార్గం ఇస్టం. ఆ మనసుతోనే నేను ఈ కధని గురించి అనుకున్నది ఏమంటే, అర్ధం చేసుకున్నది ఏమంటే, కాళీపట్నం రామారావు గారు తన యజ్ఞం కధ ద్వారా ప్రత్యేకించి హింసా మార్గాన్ని ప్రోత్సహించారనో, లేదా దానిని ఒక ఆదర్శంగా చూపించారనో కాదు. అలా మరి నాకు అనిపించలేదు. ఆ కధలో తాను బానిసగా ఉండదలుచుకోనప్పుడు బహుశా అప్పల్రాముడి కొడుకు గనక స్వయంగా పోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే గనక అప్పుడది పాఠకుల మనసులలో సానుభూతిగా మిగులుతుంది . అయితే అది రచయిత ఉద్దేశ్యం కాదు (ఈ విషయాన్నే మాస్టారు చెబుతున్నారు.) అలాంటి సానుభూతిని చోటు లేకుండా చేయాలని రచయిత లక్ష్యం గనకే అక్కడ అతడు కొడుకుని చంపుకున్నాడు. ఇది అనైతికమనీ, అమానుషమనీ మీ చర్చ సారాంశమా? సి యెస్ రావు గారు అలాగే అనుకుంటున్నారు. చిన్నపిల్లడిని హత్య కావించడం అన్న అంశాన్ని కధ లోని ప్రధాన అంశంగా చూసి మనం మాట్లాడలేము. అది ఆ తండ్రి చాతకాని చర్య. అతడి లో జనించిన నిర్వేదం. ఒక నిస్సహాయత, మితిమీరిన ఆవేశం కలిసిన చర్య. కోపంతో వివేకం నశించి చేసిన చర్య. అది పాఠకులని “షాక్” చేయాలని అలా చేసానని కారా మాస్టారు అన్నమాటని నేను ముందటి అభిప్రాయంలో ప్రస్తావన చేసింది అందుకనే! ఎవరిని నెపం పెట్టాలో తెలియక, సంతకాలు చేసిన తన తండ్రిని ఏమీ అనలేక, పోయి బాలుడైన తన కొడుకుని చంపుకున్నాడు. అది సమర్ధనీయం కాదు “సభ్య సమాజానికి” (కానీ కోపం వచ్చినప్పుడల్లా ఇప్పటికీ మగవాళ్ళు వాళ్ళ భార్యలనో, వాళ్ల సంతానానినో చంపుకుంటున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయే మన వర్తమానంలోనూ?? అక్కడ అది మగవాడి హక్కుగా కదా ఈ సమాజం అర్ధం చేసుకుంటోందీ? వాటి పట్ల ఇవాళ్టికీ కోర్టులూ చట్టాలూ పెద్దగా స్పందించవని మీకు గణాంకాలు చూస్తే తెలుస్తుంది. గృహహింసలో మన తెలుగు వాళ్ళూ మొదటి స్థానం లోకి వచ్చిన విషయం మీకు తెలుసునా?) దీన్నటుంచితే, గమనించి చూడండి ఇంక యజ్ఞం కధలో. ఆ కొడుకుని చంపిన కోపమే అటు తరవాత పెరిగి విస్తరించి చివరికి “వర్గ శత్రు నిర్మూలన” వైపు మళ్ళింది కదా శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో? నేను చెప్పిందీ, ఆ కధ ద్వారా నేను చూసిందీ ఇది. ఈ చర్చని చూసేకనే నా సందేహాన్ని నివృత్తి చేసుకుందికనే నేను యజ్ఞం కధ వాటి పూర్వా పరాల మీద మాస్టారితో మొన్నీమధ్య మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలలో కొన్నింటిని నేను నా అభిప్రాయం లొంచి ఈమాట అభిప్రాయాలలో అవసరమని అనిపించి వ్యక్త పరిచేను. ఇంక ఈ కధ “తిరోగమన కధ “ఎలా అయ్యిందని మీరు భావిస్తున్నారో నాకు తెలియదు గనక దాని మీద నేను ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేను. హింస తాలూకు మూలాలని వదలి మనం బాలుని హత్యని కేంద్రంగా చేసుకుని యజ్ఞం కధని చర్చ చేయకూడదనుకుంటాను. అలా చేసినందువలన జరిగేదేమంటే సున్నిత స్వభావులకి అది ఇబ్బందిగా అనిపించి, తద్వారా కధ రాసిన రచయితని నెపం పెట్టి, నిందించడం జరుగుతుందే తప్ప మరో విషయం బహిర్గతం కాదు. యజ్ఞం కధ మాత్రమే కాదు తన మిగిలిన కధలలోనూ మాస్టారు ఎన్నుకున్న ఇతివృత్తాలనీ వాటి నిర్వహణనీ చూసినప్పుడు మాస్టారు హింసావాదిగా నాకు అనిపించలేదు. అందువలన యజ్ఞం కధ ముగింపు మీద నేను పాఠకురాలి గానూ విమర్శకురాలి గానూ నా విమర్శని ఎక్కుపెట్టలేను. అది దళితుల మీద భూస్వాముల ఆధిపత్యమూ హింసా అనే నేను ఇప్పటికీ అర్ధం చేసుకుంటాను. ఆ శ్రీకాకుళం లోనే, అదే తిరిగీ మళ్ళీ మొన్నటి మద్దువలస రిజర్వాయర్ భూముల దగ్గర బయట పడింది. లక్షింపేటలో మారణ హోమం అంత దారుణంగా జరిగింది. బొత్స వాసుదేవనాయుడు బహుశా ముదిరిన యజ్ఞం కధలోని శ్రీరాములు నాయుడేనేమో అని మీరెందుకని అనుకోలేదో? ఏం మారిందీ పరిస్థితి ఇవాళ్టికైనా? అని మాస్టారు అన్న ప్రశ్నకి ఏం జవాబు ఉంది గనకా తెలుగు మేధావుల ముందు? యజ్ఞం కధని ఎవరు ఏ దృష్టితో చూస్తున్నారు అనే దాన్ని బట్టీ ఆ కధ వారికి ఆ దృష్టి లోంచి అర్ధమవుతుంది.
చివరగా నేను బాలుని హత్యని సమర్ధించడం లేదు అని చెబుతున్నాను. అదే సమయంలో మాస్టారు పిల్లల్ని చంపుకోవడాన్ని ఆ కధలో సందేశం గానో సూచనగానో చెప్పారని కూడా నేను అనుకోవడం లేదనీ చెబుతున్నాను. ప్రస్తుతానికి ఇంతకు మించి ఈ విషయంలో నాకు మాట్లడవలసింది మరి లేదు.
సెలవు,
జయప్రభ.
స్మృతి గురించి thummuri rammohan rao అభిప్రాయం:
07/06/2012 1:33 pm
సావాసపు చెరగని స్మృతి, సంవేదనాభరితమై, కన్నీటి కెరటమై, కవితా తరంగమై, నాయని వారిని గుర్తుకు తెచ్చింది.
అమ్మ గోపెమ్మ గురించి thummuri rammohan rao అభిప్రాయం:
07/06/2012 1:19 pm
రాధ గారికి అభినందనలు. మాతృమూర్తికి మన సంస్కృతిలో గల స్థానాన్ని వివరిస్తూ, యశోదమ్మనూ, పోతన్ననూ, సంస్మరిస్తూ సాగిన మీ రచన, మీ భావోద్వేగాలతో బాటు, మీ రచనానైపుణ్యాన్ని అద్దం పట్టి చూపిస్తుంది. ఇలాంటి రచనలు మీ కలం నుండి ఇంకా రావాలని కోరుతూ…
వేసవి గురించి thummuri rammohan rao అభిప్రాయం:
07/06/2012 12:58 pm
గ్రీష్మతాపోపశమన కవిత. చిన్న మార్పులు చేస్తే నిర్దుష్టంగా వుంటుంది.
1st లైనులో – రయ్యిమనే, 5th లైను – రెక్కలను; 9th లైను – మండే ఎండను; 12th లైను – కాయలతొ
లయాత్మక కవిత శ్రీశ్రీ గారి దారిలో ఉంది.
స్నానాల గదిలో గురించి thummuri rammohan rao అభిప్రాయం:
07/06/2012 8:11 am
స్నానాల గది నుంచి కాగితం మీదికి ఎక్కించేదాకా తడి ఆరని ఊహలకు జోహార్లు.
జనరంజని: మహానటి సావిత్రి గురించి bhavya అభిప్రాయం:
07/06/2012 2:32 am
ఇది నేను మా అమ్మకి మా అత్తయ్యకి ఇవ్వగలిగే అద్భుతమైన ఆశ్చర్యపరిచే బహుమతి!
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aditya reddi అభిప్రాయం:
07/05/2012 9:18 pm
జయప్రభ గారూ: మీ పేరు తప్పుగా పడినందుకు క్షమించండి. మీ పేరు తెలియక కాదు. మీరు తెలుగులో మంచి కవయిత్రి అని తెలుసును. అన్నమయ్య సాహిత్యంపై పరిశోధన చేసారని తెలుసును. ఆ మధ్య విశాఖపట్నం సభలో పాల్గొనటమూ తెలుసును. కాకపొతే పొరపాటు పడింది. యిక విషయనికి వస్తాను.
1) మీరు మళ్ళీ పొరపాటు పడుతున్నారు. “విద్యాసాగర్ కి మాత్రమే నేను జవాబు రాసేను” అంటున్నారు. కానీ, పత్రికలొ రాస్తున్న విషయం మరిచిపోతున్నారు.
2) మీరు “యజ్ఞం కధ నాది కాదు. రామారావు గారిది. అందువలన ఆ కధని గురించి ఎప్పుడైనా ఎవరికైనా ఆయన చెప్పిన మాటలు తప్పక వినవలసినవే అవుతాయి!“అన్నారు. తప్పక వినవలసిందే, వింటాం. కాని ఆయన (కా.రా) చెప్పారు గాబట్టి నమ్మవలసిందే అంటే మాత్రం నమ్మం.
3) లక్షిం పేట హత్యల ప్రస్తావన తెచ్చారు. అగ్ర వర్ణ దురహాంకారంతో చేసే హత్యలకు,కన్న బిడ్డను చేసే హత్యకు పోలికా…!
4) మీరు “మీకు ఆ కధ ఒప్పుదల కాకపోయి ఉండవచ్చు. అంతమాత్రాన యజ్ఞం కధ ఉత్తమ కధా కాక పోదు.“అన్నారు. కాకూడదని మాకేమి కోరిక లేదు. ఎందుకంటే అది ఎలాగు ఉత్తమ కధ కాదు గనక. యాభయ్యేళ్ళ క్రితం నుంచి వేసిన వీరతాళ్ళు ఉన్నాయి గనక మరి కొన్నాళ్ళు వాటిని మోసే వీరాభిమానులు ఉంటారు. నిజానికి అదో పెద్ద తిరోగమన భావజాలాన్ని ప్రచారం చేసే కధ.
5) మీరు “ఒకవేళ ఈ నా అభిప్రాయం మీకు ఆమోదం కాకపోతే మీరు దీన్ని చదవకండి. చదివినా పట్టించుకోకండి. ఈ అభిప్రాయానికి మీరు పాఠకులు కారన్నమాట 🙂” అని అన్నారు. మీరు చర్చకు నిలబడరని అర్థమయింది. కాబట్టి, అనవసరమనుకున్న చోట నేనూ చర్చించను.
ఆఖరి మనిషి గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
07/05/2012 6:46 pm
బ్రతుకు నాటకం ముగిసాక, రంగు కడిగేసిన పాత్ర కి ప్రతిబింబం – ఈ కవిత..
జీవితం అంటే – ‘ అసలైన విషాదాన్ని ‘ తెలుసుకోడం!