తః తః గారికీ, మోహన గారికీ మీ అభినందనలకి సంతోషించాను.
తఃతః గారిచ్చిన లింకులో వ్యాసం చదివాను. పినాకపాణి లాంటి మేధావులు పాటల్లో సాహిత్యం గురించి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. పాటల్లో సాహిత్యం నిజంగా పిప్పి అయితే మరెందుకు క్షేత్రయ్య పదాలకి ఆయన వరసలు కట్టారో అర్థం కావడం లేదు. మరీ ఘాటుగా చూస్తే క్షేత్రయ్య పదాల్లో శృంగారం పాలు ఎక్కువే. అది సాహిత్య పరంగా ఇబ్బంది కానప్పుడు మామూలు పాటల్లో సాహిత్యం తుక్కు అనడం వింతగా వుంది. రాళ్ళపల్లి వారు కూడా త్యాగయ్య కృతుల్లో సాహిత్యం పాలు తక్కువన్నారు. అన్నమయ్య పాటల్లో సాహిత్య గుబాళింపులే ఎక్కువని పొగిడారు. సంగీతానికి సాహిత్యం ఉంటేనే ప్రజల నాలుకల మీద నానుతుంది. పూర్వం సాహిత్యం లేకుండానే కచేరీలు చేసుకునే వారు. అందుకే మామూలు జనం సంగీతానికి దూరంగా పారిపోయారు. పురందరదాసూ, రామదాసూ, త్యాగయ్యా, అన్నమయ్యా వంటి వారు కాస్తో కూస్తో సాహిత్యపు మెరుగులు అద్దాకే ప్రజలకి సంగీతం పట్ల అభిరుచి ఎక్కువయ్యింది. కేవలం స్వరాలతోనే పాడితే అది అనుభూతి రహితంగా ఉంటుంది. ఏ కళయినా అనుభూతికి దూరంగా మనలేదు.
ఇహ బాలమురళి గురించి చాలామంది పలురకాలుగా విమర్శలు చేసారు. నటులందరూ దర్శకులు కాలేనట్లే, గాయకులందరూ వాగ్గేయకారులూ, సంగీతజ్ఞులూ కాలేరు. కొంతమందికి అలా అనిపించుకోవాలన్న కోరిక వుండచ్చు.
కొత్తవి కనుక్కోవాలన్న ముచ్చట తప్పేమీ కాదు. త్యాగరాజు ఒకటే పాటని కొన్ని కొన్ని రాగాల్లో కట్టాడనుకున్నా, అవన్నీ చక్కటి పాటలే కదా? పాట వినేటప్పుడు చెవిని మొదట చేరేది స్వరాలు కావు. దాన్ని అంటిపెట్టుకున్న అక్షరాలే రసస్పందన్ని కలిగిస్తాయి. ఏమయినా సంగీతకారులకి సాహిత్యం అంటే తక్కువ అభిప్రాయమే ఉండడం అనాదిగా చూస్తూనే ఉన్నాం. ఇదేమీ కొత్త కాదు.
మీ వ్యాసం అద్భుతం. ఒక పి.హెచ్.డి థీసిస్ లా వుంది, చదువుతూంటే.
సంగీతంలో రాగతాళాల విభజనకీ, ఫ్రీక్వెంసీ ల సమన్వయానికీ గణితానికీ ఎంతో దగ్గరసంబంధం వుంది. హర్మొనిక్ ప్రొగ్రషన్స్, జామెట్రిక్ ప్రొగ్రషన్స్ లతో వీటికి చాలా పోలికలు కనిపిస్తాయి. మీ వ్యాసం నాలాంటి వారికి ప్రేరణ ఇస్తుంది. వేలూరి గారు చెప్పినట్లు ఇంగ్లీషులో రాయండి. తెలుగునాట చందస్సు ఎప్పుడో మర్చిపోయారు.
మోహన గారికీ, ఇంద్రాణి గారికి, రమగారికీ మీకు నా అనువాదం నచ్చినందుకు కృతజ్ఞతలు.
సాధారణంగా నేను అనువాదాలు చెయ్యడానికి ఇష్టపడను. అనువాదం ఒక ప్రత్యేక కళ. నాకది లేదని నా నమ్మకం.
ఈ బల్రాజ్ సహని వ్యాసం నాకు మిత్రుడు శ్యామ్ పంపిచారు. అది చదివాక ఆపుకోలేక ఎలాగయినా అందరికీ ఇది తెలియాలన్న తపనతో చేసిన అనువాదం.
ఎనభయ్యో పడిలో వున్నా, ఇంకా గెంతుతానూ, పలానా అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుంది ( పెళ్ళి సభా మర్యాద, లోపల మాత్రం అనుభవించాలనే ) వంటి నటులున్న మనకి, ఇటువంటి ప్రసంగం వినే అదృష్టం ఎప్పటికయినా వస్తుందా? డాక్టరేట్లూ, బిరుదులూ అన్నీ అమ్మకానికి కొనుక్కునే నటచక్రవర్తులే నేటి యువతకి ప్రేరణ కలిగించే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. కనీసం నూటికొక్కరయినా ఇది చదివితే నా శ్రమ ఫలించినట్లేనని భావించాను.
రమగారూ, అనువాదం చేసేటప్పుడు సామ్యవాదమా, సమాజ వాదమాని కాస్త తర్జన భర్జన పడిన మాట వాస్తవం, సామ్యవాదం వాడకూడదని కాదు, సమాజవాదం బావుందనిపించింది. ముఖ్యంగా బల్రాజ్ సాహని చెప్పిన విషయాలకి. అంతకు మించి ఏవీ లేదు. మీరు చెప్పినదంతా నూటికి నూరుపాళ్ళూ వాస్తవం. రాజకీయ నాయకులు అన్ని రంగాలని ఆవరించుకోవడం వల్ల పట్టిన దౌర్భాగ్యం ఇది. ప్రజలు కూడా స్తబ్ధుగానే ఉంటున్నారు. ఎవరికి వారికి వారి పనయిపోతే చాలన్న ధోరణే ప్రస్తుత పరిస్థితులకి కారణం.
విజయ వర్ధన్ గారూ, మీరిచ్చిన లింకుకి థాంక్స్! భలే పట్టుకున్నారే!
తెలుగులో కంటే ఇంగ్లీషయితే బాగా ఎక్కుతుందనా?
ఎలా చెప్పాలో తెలీదు, మీ కవితకి హేట్స్ అప్ చెప్పడం తప్ప. అద్భుతంగా వుందండి. కవిత ఎంత సరళంగా వుందో, మీ ధ్రుక్కోణం అంత నిశితంగా వుంది. చాలా బాగుంది.
-రవికిరణ్ తిమ్మిరెడ్డి
కవిత బాగుంది. మీ అనాలసిస్, మీ వ్యక్థీకరణ బాగున్నాయి. కానీ మీరు ఇంకా కొంత మంది మనుషుల గురించి కూడా వ్రాయవలసింది. ఇది మీ కవిత నేను యుసర్ప్ చెయ్యటం పద్దతి కాదు. కానీ మీరు పిలుపిస్తే మన ఈమాట పాఠకులు ఇంకా చాలా మంది, ఇంకా చాలా రకాల మనుషుల గురించి చెప్పగలరు. మచ్చుకి, వీళ్ళు….
వీళ్ళకి ఒక అబిప్రాయం అంటూ వుండదు
ఏ గాలి బలంగా వుంటే ఆ గాల్లో కొట్టుకపోతారు
డ్రాయింగ్ రూం లో పులులైపోయే వీళ్ళు
బయట పిల్లులుగా కూడా వుండలేరు
బొద్దింకలై పారిపోతారు
పిల్లలకి నీతుల్ని నూరి పోస్తారు
బతుకంతా అవినీతికి అవకాశం ఇస్తారు
వీరు ఋషుల్లాటి వారు, కళ్ళు మూసిన వారు
వారు మూసిన కళ్ళు మాత్రం దేవుడి కోసం కాదు
వారు నీతులు చెప్పరు, చెయ్యగలిగింది ఏదో చేస్తారు
మనం తప్పు చేసినా వారు చలించరు
తామరాకు మీద నీటి బొట్లు వారు
మనుషులతో, సంఘం తో వారికి పనిలేదు
వారి మూసిన కళ్ళకి అందరూ దొంగలే
వీరు పైవాళ్ళ కంటే కనిష్టులు
వీళ్ళకి రెండు చేతులు, కాళ్ళు,
వాటి మధ్య ఎప్పుడూ కరకర లాడే పొట్ట
బుర్రలో అందరి లాగే గుజ్జున్నా
ఏ అవకాశం, ఎప్పుడూ ఏ కిటికీ
కూడా వీరి కోసం తెరుచుకోదు
నవ్వనేది మనిషికి తప్పదు కానీ
బతుకంతా కలిపినా ఒక దోసిడు
కూడా నింపలేరేవో వీరు
మంచి వ్యాసము, ఎన్నో క్రొత్త విషయాలు తెలిసినాయి. ఆసక్తి ఉంటే ఏ విభాగములోనైనా రాణించవచ్చును అనే నమ్మకము కలుగుతుంది ఈ వ్యాసము చదివిన తరువాత. ఆ కాలములో తిరుపతిలో పినాకపాణిగారి సంగీత కచ్చేరి విన్నట్లు గుర్తు. 50 ఏళ్ల విషయము, అంశాలు గుర్తుకు రావడము లేదు. బ్రహ్మానందంగారికి అభినందనలు.
తఃతః గారు తెలిపిన వ్యాసాన్ని చదివినాను – అందులోని కొన్ని చర్చనీయమైన అంశాలను క్రింద ఇస్తున్నాను –
పాణిగారు: చెరకు గడను మెషీన్లో పెడితే ఏం వస్తుంది? రసం వస్తుంది. ఆ రసం సంగీతం, పిప్పి సాహిత్యం.
సం: కీర్తన చెరుకుగడ అయితే, సాహిత్యము పిప్పి, సంగీతము రసమూను, కీర్తన ఒక వర్ణ చిత్రమనుకొంటే, సాహిత్యము వర్ణలేపనాని కాధారమైన పటము మాత్రమే అని రాశాడు గోపాలకృష్ణముర్తిగారు (పినాకపాణి అన్న). ఇది 1951 భారతిలోని వ్యాసమట. నా దగ్గర ఉందో లేదో చూడాలి.
పాణిగారు: అవును, అంతే.
సం. కాని అన్నమయ్య సాహిత్యంలో ఈ మాదిరి ప్రాబ్లం లేదు కదా?
పాణిగారు: అన్నమయ్య సాహిత్యము అంతేనండి, అది కూడ అంతే. అన్నమయ్య సాహిత్యంలో అచ్చ తెలుగు ఎక్కువ. త్యాగయ్య తెలుగుతోబాటు సంస్కృతం కూడా కలిపాడు. అంతే.
నా కచ్చేరి జరిగిన మరునాడు వారిని (మంగళంపల్లి పట్టాభిరామయ్య) సమీపించి సలహా అర్థించగా “నేను 50 అసంవత్సరాలనుండి పెద్ద విద్వాంసుల పాట విన్నాను, వారిలోనున్న గుణవిశేషాలన్నీ మీలో నున్నాయి” అని మూడు క్షణాలు ఆగి “మరెక్కడా లేవు” అని గొంతు రెట్టించి అన్నారు.
అప్పుడూ, ఇప్పుడూ, బహుశా ఎప్పుడూ ఇంతే. కవులకన్న గాయకునికే అందరూ పెద్ద పీట పెడుతారు. సాహిత్యానికి సంగీతానికి ఒకే స్థానము కల్పించబడినా, సాహిత్యాన్ని చిన్న చూపుతోనే చూస్తారు. చిన్న సందేహం, సినీరంగములో గాయకునికి, కవికి ఒకే విధమైన పారితోషికమా లేక తరతమ భేదము ఉన్నదా? సంగీతమే అంత ప్రధానమయితే మఱుగేలరా ఓ రాఘవా కు బదులు లలలాలలా లా లాలలా అని ఎందుకు పాడుకోరాదో?
అసలు వ్యాసం తర్జుమా చేయబడినది అనే సంశయమే కలగలేదు, బాగా వ్రాశారు.
ఈ విధంగా తను చెప్పదలచుకున్న కథాస్వరూపాన్ని ఆకళించుకున్నాక, రచయిత వీథిన పడాలి – తన నాయకుడు నివసించిన ప్రదేశాలు, అక్కడి నైసర్గిక, వాతావరణ పరిస్థితులు …
…కాని నైసర్గిక పరిస్థితులు, మనం ఎవరి మీద / గురించి వ్రాస్తున్నామో, వారి కాలానికి, ఇప్పుడు వ్రాయబడుతున్న కాలానికి చాల వరకు మారే అవకాశం ఉంది కదా, అలాంటప్పుడు ఆ ప్రదేశాలకు వెళ్లి కేవలం చూడడం, పరీక్షించడం ద్వారా ఆనాటి నైసర్గిక పరిస్థితులను మనం ఏమి అవగతం చేసుకోగలుగుతాము…?
ప్రశంసనీయమైన సంపాదకీయము. కృష్ణమూర్తిగారు ఛందోబద్ధమయిన పద్యాలను కూడ ఎన్నో వ్రాసారని ఎక్కడో చదివినట్లు గుర్తు. ఎవరైనా కొన్ని మచ్చు తునకలను అందిస్తారనుకొంటాను.
విభాగాల ఈ compartmentalisation భారతదేశములో ఎక్కువ. భౌతికశాస్త్రము వేరు, గణితశాస్త్రము వేరు, రసాయనశాస్త్రము వేరు, ఇలా చేయబట్టి ఈ విభాగాల మధ్య పరస్పర సంబంధాలు లేకపోయాయి. అదే విధముగా తెలుగు వేరు, భాషాశాస్త్రము వేరు, ఇలా. దీనికి ఒక కారణము విశ్వవిద్యాలయాలలో PhD పట్టా పొందడానికి ఎక్కువగా emphasis సిద్ధాంత వ్యాసముపైన. అసలు ఈ ఆద్యయన శాఖలను ద్వీపములనడము సమంజసమేమో? విధేయుడు – మోహన
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి Brahmanandam Gorti అభిప్రాయం:
09/05/2012 12:36 am
తః తః గారికీ, మోహన గారికీ మీ అభినందనలకి సంతోషించాను.
తఃతః గారిచ్చిన లింకులో వ్యాసం చదివాను. పినాకపాణి లాంటి మేధావులు పాటల్లో సాహిత్యం గురించి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. పాటల్లో సాహిత్యం నిజంగా పిప్పి అయితే మరెందుకు క్షేత్రయ్య పదాలకి ఆయన వరసలు కట్టారో అర్థం కావడం లేదు. మరీ ఘాటుగా చూస్తే క్షేత్రయ్య పదాల్లో శృంగారం పాలు ఎక్కువే. అది సాహిత్య పరంగా ఇబ్బంది కానప్పుడు మామూలు పాటల్లో సాహిత్యం తుక్కు అనడం వింతగా వుంది. రాళ్ళపల్లి వారు కూడా త్యాగయ్య కృతుల్లో సాహిత్యం పాలు తక్కువన్నారు. అన్నమయ్య పాటల్లో సాహిత్య గుబాళింపులే ఎక్కువని పొగిడారు. సంగీతానికి సాహిత్యం ఉంటేనే ప్రజల నాలుకల మీద నానుతుంది. పూర్వం సాహిత్యం లేకుండానే కచేరీలు చేసుకునే వారు. అందుకే మామూలు జనం సంగీతానికి దూరంగా పారిపోయారు. పురందరదాసూ, రామదాసూ, త్యాగయ్యా, అన్నమయ్యా వంటి వారు కాస్తో కూస్తో సాహిత్యపు మెరుగులు అద్దాకే ప్రజలకి సంగీతం పట్ల అభిరుచి ఎక్కువయ్యింది. కేవలం స్వరాలతోనే పాడితే అది అనుభూతి రహితంగా ఉంటుంది. ఏ కళయినా అనుభూతికి దూరంగా మనలేదు.
ఇహ బాలమురళి గురించి చాలామంది పలురకాలుగా విమర్శలు చేసారు. నటులందరూ దర్శకులు కాలేనట్లే, గాయకులందరూ వాగ్గేయకారులూ, సంగీతజ్ఞులూ కాలేరు. కొంతమందికి అలా అనిపించుకోవాలన్న కోరిక వుండచ్చు.
కొత్తవి కనుక్కోవాలన్న ముచ్చట తప్పేమీ కాదు. త్యాగరాజు ఒకటే పాటని కొన్ని కొన్ని రాగాల్లో కట్టాడనుకున్నా, అవన్నీ చక్కటి పాటలే కదా? పాట వినేటప్పుడు చెవిని మొదట చేరేది స్వరాలు కావు. దాన్ని అంటిపెట్టుకున్న అక్షరాలే రసస్పందన్ని కలిగిస్తాయి. ఏమయినా సంగీతకారులకి సాహిత్యం అంటే తక్కువ అభిప్రాయమే ఉండడం అనాదిగా చూస్తూనే ఉన్నాం. ఇదేమీ కొత్త కాదు.
-బ్రహ్మానందం
ఛందస్సులో గణితాంశములు గురించి Brahmanandam Gorti అభిప్రాయం:
09/05/2012 12:15 am
మోహన గారూ,
మీ వ్యాసం అద్భుతం. ఒక పి.హెచ్.డి థీసిస్ లా వుంది, చదువుతూంటే.
సంగీతంలో రాగతాళాల విభజనకీ, ఫ్రీక్వెంసీ ల సమన్వయానికీ గణితానికీ ఎంతో దగ్గరసంబంధం వుంది. హర్మొనిక్ ప్రొగ్రషన్స్, జామెట్రిక్ ప్రొగ్రషన్స్ లతో వీటికి చాలా పోలికలు కనిపిస్తాయి. మీ వ్యాసం నాలాంటి వారికి ప్రేరణ ఇస్తుంది. వేలూరి గారు చెప్పినట్లు ఇంగ్లీషులో రాయండి. తెలుగునాట చందస్సు ఎప్పుడో మర్చిపోయారు.
-బ్రహ్మానందం
నా కోరిక, నా ప్రార్థన గురించి Brahmanandam Gorti అభిప్రాయం:
09/05/2012 12:04 am
మోహన గారికీ, ఇంద్రాణి గారికి, రమగారికీ మీకు నా అనువాదం నచ్చినందుకు కృతజ్ఞతలు.
సాధారణంగా నేను అనువాదాలు చెయ్యడానికి ఇష్టపడను. అనువాదం ఒక ప్రత్యేక కళ. నాకది లేదని నా నమ్మకం.
ఈ బల్రాజ్ సహని వ్యాసం నాకు మిత్రుడు శ్యామ్ పంపిచారు. అది చదివాక ఆపుకోలేక ఎలాగయినా అందరికీ ఇది తెలియాలన్న తపనతో చేసిన అనువాదం.
ఎనభయ్యో పడిలో వున్నా, ఇంకా గెంతుతానూ, పలానా అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుంది ( పెళ్ళి సభా మర్యాద, లోపల మాత్రం అనుభవించాలనే ) వంటి నటులున్న మనకి, ఇటువంటి ప్రసంగం వినే అదృష్టం ఎప్పటికయినా వస్తుందా? డాక్టరేట్లూ, బిరుదులూ అన్నీ అమ్మకానికి కొనుక్కునే నటచక్రవర్తులే నేటి యువతకి ప్రేరణ కలిగించే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. కనీసం నూటికొక్కరయినా ఇది చదివితే నా శ్రమ ఫలించినట్లేనని భావించాను.
రమగారూ, అనువాదం చేసేటప్పుడు సామ్యవాదమా, సమాజ వాదమాని కాస్త తర్జన భర్జన పడిన మాట వాస్తవం, సామ్యవాదం వాడకూడదని కాదు, సమాజవాదం బావుందనిపించింది. ముఖ్యంగా బల్రాజ్ సాహని చెప్పిన విషయాలకి. అంతకు మించి ఏవీ లేదు. మీరు చెప్పినదంతా నూటికి నూరుపాళ్ళూ వాస్తవం. రాజకీయ నాయకులు అన్ని రంగాలని ఆవరించుకోవడం వల్ల పట్టిన దౌర్భాగ్యం ఇది. ప్రజలు కూడా స్తబ్ధుగానే ఉంటున్నారు. ఎవరికి వారికి వారి పనయిపోతే చాలన్న ధోరణే ప్రస్తుత పరిస్థితులకి కారణం.
విజయ వర్ధన్ గారూ, మీరిచ్చిన లింకుకి థాంక్స్! భలే పట్టుకున్నారే!
తెలుగులో కంటే ఇంగ్లీషయితే బాగా ఎక్కుతుందనా?
-బ్రహ్మానందం
చెట్టు కింది మనుషులు గురించి ravikiran timmireddy అభిప్రాయం:
09/04/2012 9:33 pm
ఇంద్రాణి గారు,
ఎలా చెప్పాలో తెలీదు, మీ కవితకి హేట్స్ అప్ చెప్పడం తప్ప. అద్భుతంగా వుందండి. కవిత ఎంత సరళంగా వుందో, మీ ధ్రుక్కోణం అంత నిశితంగా వుంది. చాలా బాగుంది.
-రవికిరణ్ తిమ్మిరెడ్డి
ఒక సరళ నిర్వచనం గురించి ravikiran timmireddy అభిప్రాయం:
09/04/2012 9:16 pm
గరిమెళ్ళ గారు,
కవిత బాగుంది. మీ అనాలసిస్, మీ వ్యక్థీకరణ బాగున్నాయి. కానీ మీరు ఇంకా కొంత మంది మనుషుల గురించి కూడా వ్రాయవలసింది. ఇది మీ కవిత నేను యుసర్ప్ చెయ్యటం పద్దతి కాదు. కానీ మీరు పిలుపిస్తే మన ఈమాట పాఠకులు ఇంకా చాలా మంది, ఇంకా చాలా రకాల మనుషుల గురించి చెప్పగలరు. మచ్చుకి, వీళ్ళు….
వీళ్ళకి ఒక అబిప్రాయం అంటూ వుండదు
ఏ గాలి బలంగా వుంటే ఆ గాల్లో కొట్టుకపోతారు
డ్రాయింగ్ రూం లో పులులైపోయే వీళ్ళు
బయట పిల్లులుగా కూడా వుండలేరు
బొద్దింకలై పారిపోతారు
పిల్లలకి నీతుల్ని నూరి పోస్తారు
బతుకంతా అవినీతికి అవకాశం ఇస్తారు
వీరు ఋషుల్లాటి వారు, కళ్ళు మూసిన వారు
వారు మూసిన కళ్ళు మాత్రం దేవుడి కోసం కాదు
వారు నీతులు చెప్పరు, చెయ్యగలిగింది ఏదో చేస్తారు
మనం తప్పు చేసినా వారు చలించరు
తామరాకు మీద నీటి బొట్లు వారు
మనుషులతో, సంఘం తో వారికి పనిలేదు
వారి మూసిన కళ్ళకి అందరూ దొంగలే
వీరు పైవాళ్ళ కంటే కనిష్టులు
వీళ్ళకి రెండు చేతులు, కాళ్ళు,
వాటి మధ్య ఎప్పుడూ కరకర లాడే పొట్ట
బుర్రలో అందరి లాగే గుజ్జున్నా
ఏ అవకాశం, ఎప్పుడూ ఏ కిటికీ
కూడా వీరి కోసం తెరుచుకోదు
నవ్వనేది మనిషికి తప్పదు కానీ
బతుకంతా కలిపినా ఒక దోసిడు
కూడా నింపలేరేవో వీరు
-రవికిరణ్ తిమ్మిరెడ్డి
చెట్టు కింది మనుషులు గురించి Seetha kumari అభిప్రాయం:
09/04/2012 7:11 pm
చక్కని పదచిత్రం. ఎప్పటిలానే మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా ఉంది మీ కవిత.
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి మోహన అభిప్రాయం:
09/04/2012 3:34 pm
మంచి వ్యాసము, ఎన్నో క్రొత్త విషయాలు తెలిసినాయి. ఆసక్తి ఉంటే ఏ విభాగములోనైనా రాణించవచ్చును అనే నమ్మకము కలుగుతుంది ఈ వ్యాసము చదివిన తరువాత. ఆ కాలములో తిరుపతిలో పినాకపాణిగారి సంగీత కచ్చేరి విన్నట్లు గుర్తు. 50 ఏళ్ల విషయము, అంశాలు గుర్తుకు రావడము లేదు. బ్రహ్మానందంగారికి అభినందనలు.
తఃతః గారు తెలిపిన వ్యాసాన్ని చదివినాను – అందులోని కొన్ని చర్చనీయమైన అంశాలను క్రింద ఇస్తున్నాను –
పాణిగారు: చెరకు గడను మెషీన్లో పెడితే ఏం వస్తుంది? రసం వస్తుంది. ఆ రసం సంగీతం, పిప్పి సాహిత్యం.
సం: కీర్తన చెరుకుగడ అయితే, సాహిత్యము పిప్పి, సంగీతము రసమూను, కీర్తన ఒక వర్ణ చిత్రమనుకొంటే, సాహిత్యము వర్ణలేపనాని కాధారమైన పటము మాత్రమే అని రాశాడు గోపాలకృష్ణముర్తిగారు (పినాకపాణి అన్న). ఇది 1951 భారతిలోని వ్యాసమట. నా దగ్గర ఉందో లేదో చూడాలి.
పాణిగారు: అవును, అంతే.
సం. కాని అన్నమయ్య సాహిత్యంలో ఈ మాదిరి ప్రాబ్లం లేదు కదా?
పాణిగారు: అన్నమయ్య సాహిత్యము అంతేనండి, అది కూడ అంతే. అన్నమయ్య సాహిత్యంలో అచ్చ తెలుగు ఎక్కువ. త్యాగయ్య తెలుగుతోబాటు సంస్కృతం కూడా కలిపాడు. అంతే.
నా కచ్చేరి జరిగిన మరునాడు వారిని (మంగళంపల్లి పట్టాభిరామయ్య) సమీపించి సలహా అర్థించగా “నేను 50 అసంవత్సరాలనుండి పెద్ద విద్వాంసుల పాట విన్నాను, వారిలోనున్న గుణవిశేషాలన్నీ మీలో నున్నాయి” అని మూడు క్షణాలు ఆగి “మరెక్కడా లేవు” అని గొంతు రెట్టించి అన్నారు.
అప్పుడూ, ఇప్పుడూ, బహుశా ఎప్పుడూ ఇంతే. కవులకన్న గాయకునికే అందరూ పెద్ద పీట పెడుతారు. సాహిత్యానికి సంగీతానికి ఒకే స్థానము కల్పించబడినా, సాహిత్యాన్ని చిన్న చూపుతోనే చూస్తారు. చిన్న సందేహం, సినీరంగములో గాయకునికి, కవికి ఒకే విధమైన పారితోషికమా లేక తరతమ భేదము ఉన్నదా? సంగీతమే అంత ప్రధానమయితే మఱుగేలరా ఓ రాఘవా కు బదులు లలలాలలా లా లాలలా అని ఎందుకు పాడుకోరాదో?
విధేయుడు – మోహన
నా కోరిక, నా ప్రార్థన గురించి indrani Palaparthy అభిప్రాయం:
09/04/2012 2:44 pm
ప్రసంగం చాలా బాగుంది. అనువాదం కూడా.
ఓపిక,ఆసక్తి ఉంటే: ఈ వ్యాసం
పాలపర్తి ఇంద్రాణి.
జీవిత నవల – 1 గురించి Rajesh Devabhaktuni అభిప్రాయం:
09/04/2012 2:03 pm
అసలు వ్యాసం తర్జుమా చేయబడినది అనే సంశయమే కలగలేదు, బాగా వ్రాశారు.
ఈ విధంగా తను చెప్పదలచుకున్న కథాస్వరూపాన్ని ఆకళించుకున్నాక, రచయిత వీథిన పడాలి – తన నాయకుడు నివసించిన ప్రదేశాలు, అక్కడి నైసర్గిక, వాతావరణ పరిస్థితులు …
…కాని నైసర్గిక పరిస్థితులు, మనం ఎవరి మీద / గురించి వ్రాస్తున్నామో, వారి కాలానికి, ఇప్పుడు వ్రాయబడుతున్న కాలానికి చాల వరకు మారే అవకాశం ఉంది కదా, అలాంటప్పుడు ఆ ప్రదేశాలకు వెళ్లి కేవలం చూడడం, పరీక్షించడం ద్వారా ఆనాటి నైసర్గిక పరిస్థితులను మనం ఏమి అవగతం చేసుకోగలుగుతాము…?
మనం అనుసరించలేకపోయిన భద్రిరాజు కృష్ణమూర్తి గురించి మోహన అభిప్రాయం:
09/04/2012 11:48 am
ప్రశంసనీయమైన సంపాదకీయము. కృష్ణమూర్తిగారు ఛందోబద్ధమయిన పద్యాలను కూడ ఎన్నో వ్రాసారని ఎక్కడో చదివినట్లు గుర్తు. ఎవరైనా కొన్ని మచ్చు తునకలను అందిస్తారనుకొంటాను.
విభాగాల ఈ compartmentalisation భారతదేశములో ఎక్కువ. భౌతికశాస్త్రము వేరు, గణితశాస్త్రము వేరు, రసాయనశాస్త్రము వేరు, ఇలా చేయబట్టి ఈ విభాగాల మధ్య పరస్పర సంబంధాలు లేకపోయాయి. అదే విధముగా తెలుగు వేరు, భాషాశాస్త్రము వేరు, ఇలా. దీనికి ఒక కారణము విశ్వవిద్యాలయాలలో PhD పట్టా పొందడానికి ఎక్కువగా emphasis సిద్ధాంత వ్యాసముపైన. అసలు ఈ ఆద్యయన శాఖలను ద్వీపములనడము సమంజసమేమో? విధేయుడు – మోహన