పాటలో సాహిత్యం గౌణమనే శ్రీపాద వారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. సాహిత్యం సహాయం లేకుండా కర్నాటక సంగీతాన్ని ఆనందించగలగడం కనీసం కొన్ని సందర్భాలలో వీలు పడుతుంది కదా.
ఈమని వీణ మీద విన్న “రఘు వంశ సుధాంబుధి…”, ఎల్.సుబ్రమణ్యం వయొలిన్ పై వినిపించిన “బ్రోవ భారమా…” రెండింటినీ కృతి సాహిత్యంతో పరిచయం లేకుండానే విని ఆనందించగలిగాను నేను. ఆ తరువాత విన్న ఎమ్మెస్ అమ్మ పాడిన “రఘువంశ సుధాంబుధి” నాకు వాద్యం మీద విన్నప్పటి ఆనందాన్నివ్వలేక పోయింది. “బ్రోవ భారమా” సాహిత్యాన్ని చదువుకున్నప్పుడు “ఓస్, ఇంతేనా!” అనిపించింది.
మొన్నెప్పుడో చదివాను: “‘కృష్ణా నీ బేగనే బారో’ పాడినప్పుడు కృష్ణుడి మీద భక్తి కాదు నాకు ముఖ్యం, యమన్ కల్యాణి మీదే నా శ్రద్ధ అంతా” అన్నారట బాంబే జయశ్రీ. సాహిత్యభావం-రాగభావం ఒకటి కావని, గాయకుడికి రాగభావమే ముఖ్యమని రాళ్ళపల్లి వారన్నారు ఓ ఆకాశవాణి సంభాషణలో.
సాహిత్యమే ప్రధానమనుకుంటే – దాని వెనకాలే గాయకుడి ఉచ్చారణా దోషాలు, వాగ్గేయకారుడి భావజాలం, గాయకుడి/శ్రోతల సైద్ధాంతిక నేపథ్యం, కళలను ప్రజల పరం చేయాల్సిన ఆవశ్యకతా… లాంటి “noisy” సమస్యలన్నీ చర్చలోకి ప్రవేశిస్తాయి. అవన్నీ అనవసరమని నేను అనను గానీ ఇంత చర్చలో సంగీతం ఆపాతమధురం కాకుండా పోతుందని భయం.
అన్నట్లు హిందుస్థానీ సంగీతంలో సాహిత్యానికి అట్టే విలువ లేదు కదా…
తః తః గారు, సంగీతానికీ సాహిత్యానికీ సమాన స్థానాన్ని మన పూర్వులు ఇవ్వలేదనే నా అభిప్రాయం.
నేను నా అభిప్రాయాన్ని క్రింది శ్లోకముపైన ఆధారము చేసికొని వ్రాసినాను –
సంగీత మపి సాహిత్యం
సరస్వత్యా స్తనద్వయం
ఏక మాపాత మధురం
అన్య దాలోచనామృతం
నా ఉద్దేశములో ప్రజలు ఎక్కువగా సంగీతాన్ని ఎందుకు ఆదరిస్తారంటే, దానిని వినేటప్పుడు సామాన్యముగా మరే ఆలోచన చేయనక్కరలేదు. కాని సాహిత్యపు సంగతి అలా కాదు. చదివేటప్పుడు కాని, వినేటప్పుడు కాని కొద్దిగానైన ఏకాగ్రత చూపాలి. లేకపోతే ఏమి అర్థము కాదు. నా ఉద్దేశములో కవిత్వము పాడుటకు ఉపయోగపడేటట్లు మాత్రమే వ్రాయాలి. సంగీతము ఆ పాటలోని భావాన్ని బాగుగా బహిర్గతము చేయాలి. అప్పుడే ఆ సరస్వతీదేవికి సంతృప్తి కలుగుతుంది. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అంటే ఆ తల్లిని అవమానించినట్లే. విధేయుడు – మోహన
కామేశ్వర రావు గారు, అక్షర గణాలకు, అంశ గణాలకు గణ మేరువు ఒకటే, అనగా గురువులు లేని వృత్తము, ఒక గురువుతోటి వృత్తములు, రెండు గురువులతోటి వృత్తములు, ఇత్యాదులు. అక్షరమేరువులో ఒక గురువుతోటి వృత్తములన్నిటికి మాత్రల సంఖ్య ఒక్కటే. ఆ వృత్తాలలో వాటి స్థానములు మాత్రము వేరు, అంతే. కాని అంశగణములలో అలా కాదు. బ్రహ్మ గణములు ఉండే రెండవ ఛందములో గురువులు లేనిది III, ఒక గురువుతో రెండు UI, IIU, రెండు గురువులతో UU. ఒక గురువుతో ఉండే రెంటికీ మాత్రల సంఖ్య ఒకటి కాదు. ఒకే మాత్రల సంఖ్యతో ఉండే సంఖ్యలను కలిపినప్పుడే మనకు విరహాంకుని (ఫిబనాచ్చీ) అంకెలు లభిస్తాయి. అందుకే ఒకే మాత్రల సంఖ్యలు గల వృత్తముల సంఖ్యలను వేరుపరచవలసి వచ్చింది. అంశ గణములకు అక్షరగణములవంటి మేరువును నిర్మిస్తే అందులో గురులఘువుల సంఖ్య తప్ప యితరార్థములను ఇచ్చుటకు వీలు కాదు. విధేయుడు – మోహన
మాధవ్ గారు – ఇప్పటి వరకు మీరు రాసిన ఇటాలో కాల్వీనో కధల అనువాదములు అన్నీ చదివాను. నాకు ఇంతకు ముందు ఇటాలో కాల్వీనో గురుంచి తెలేదు కానీ మీ రచనల ద్వారా ఆయన గురుంచి తెలుసుకోవడం జరిగింది. మీ అనువాదములు అన్నీ చక్కగా ఉన్నాయి. ఇంకా రాస్తూ ఉండండి.
అవి రెండు ఆటవెలదులు (ఎత్తుగీతితో కలిపి మూడు) అని మాత్రం సులువుగా చెప్పవచ్చు 🙂
మీరు వివరించాక ఇప్పుడు స్పష్టంగా అర్థమయ్యిందండి ఆ పేరా. అక్షరగణాలూ, అంశగణాలూ, సమరూపాలే (isomorphic)! లఘువుతో మొదలయ్యే ప్రతి అక్షరగణానికీ ముందొక లఘువు తగిలిస్తే చాలు. అందుకే ఈ రెండు రకాల గణాలకూ నిజానికి గణమేరువు ఒకటే. మీరు అంశగణమేరువులో గురువుల సంఖ్య బదులు మాత్రా సంఖ్య తీసుకున్నారు కాబట్టి అక్షరగణ మేరువుకు రెట్టింపు వచ్చింది. ఇక్కడా గురుసంఖ్య తీసుకుంటే రెండూ సరిసమానం!
మరొక విషయం, పాఠకులు గమనించే ఉంటారు – అక్షర, అంశ గణ మేరువులు సుష్ఠైనవి (symmetrical). మాత్రాగణ మేరువు కాదు. ఎందుకో ఊహించడం పెద్ద కష్టం కాదు!
శ్రీ మోహన: సంగీతానికీ సాహిత్యానికీ సమాన స్థానాన్ని మన పూర్వులు ఇవ్వలేదనే నా అభిప్రాయం. గాయకులను నట విటుల్లొ కలిపేశారు. ముఖ్యంగా మన దక్షిణాది సంప్రదాయంలో గాయకులకు గౌరవం వారు పాడు తున్న భక్తి సాహిత్యం నుంచి వచ్చింది. వారు భాగవతారులుగా పరిగణింపబడ్డారు.
వేదాన్ని పాడకూడదన్న నియమం ఉన్నదనీ, కవి అన్న పదం వేదంలో సాక్షాత్తూ భగవంతుని సూచించే పదంగా ఉన్నదనీ కవిని స్వయంభువుగా పరిభువుగా వేదం అభివర్ణిస్తుందనీ పెద్దల నుంచి విన్నాను. [ఈ కారణంగానే పద్యాలను రాగాలు తీసి పాడేవాళ్ళంటే నాకు కొంత చిన్న చూపు. పౌరాణిక నాటకాలలో నటుల్లొ పీసపాటి వారి పద్ధతి నాకు చాలా ఇష్టం ]
సంగీతాన్ని పొగుడు తున్నప్పుడు సాధారణంగా దొర్లించే, ” శిశుర్వేత్తి …” నిజానికి సాహిత్యం యొక్క గొప్పదనాన్ని సంగీతంతో పోల్చి చెప్పినది. కృష్ణ శాస్త్రి గారి ఒక పాటకు వరస చేసి శాస్త్రి గారికి పాడి వినిపిస్తున్నప్పుడు శ్రీ వోలేటి శాస్త్రి గారి పాదాల చెంత కూర్చున్నారని విన్నాను. సచిన్ దేవ్ బర్మన్ తో సాహిర్ లూధియాన్వీ ప్యాసా పాటల విషయంలో ఈ కారణంగానే విబేధించాడు.
మనోధర్మ [కర్ణాటక] సంగీతం అంటె నా అభిప్రాయంలో సాహిత్యాన్ని మనసుకు ఎక్కించుకుని తదనుగుణంగా పాడేదే. “సామజ వర గమన ” అంటే అర్థం తెలీకుండా సంగీతం నేర్పే వాళ్ళను -పెద్ద సంగీత సంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళను – నేను చూశాను అటువంటివాళ్ళు యెంత ‘మనోధర్మ’సంగీతం పాడతారా అన్నది నా మనో ధర్మ సందేహం.
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
09/06/2012 3:16 am
పాటలో సాహిత్యం గౌణమనే శ్రీపాద వారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. సాహిత్యం సహాయం లేకుండా కర్నాటక సంగీతాన్ని ఆనందించగలగడం కనీసం కొన్ని సందర్భాలలో వీలు పడుతుంది కదా.
ఈమని వీణ మీద విన్న “రఘు వంశ సుధాంబుధి…”, ఎల్.సుబ్రమణ్యం వయొలిన్ పై వినిపించిన “బ్రోవ భారమా…” రెండింటినీ కృతి సాహిత్యంతో పరిచయం లేకుండానే విని ఆనందించగలిగాను నేను. ఆ తరువాత విన్న ఎమ్మెస్ అమ్మ పాడిన “రఘువంశ సుధాంబుధి” నాకు వాద్యం మీద విన్నప్పటి ఆనందాన్నివ్వలేక పోయింది. “బ్రోవ భారమా” సాహిత్యాన్ని చదువుకున్నప్పుడు “ఓస్, ఇంతేనా!” అనిపించింది.
మొన్నెప్పుడో చదివాను: “‘కృష్ణా నీ బేగనే బారో’ పాడినప్పుడు కృష్ణుడి మీద భక్తి కాదు నాకు ముఖ్యం, యమన్ కల్యాణి మీదే నా శ్రద్ధ అంతా” అన్నారట బాంబే జయశ్రీ. సాహిత్యభావం-రాగభావం ఒకటి కావని, గాయకుడికి రాగభావమే ముఖ్యమని రాళ్ళపల్లి వారన్నారు ఓ ఆకాశవాణి సంభాషణలో.
సాహిత్యమే ప్రధానమనుకుంటే – దాని వెనకాలే గాయకుడి ఉచ్చారణా దోషాలు, వాగ్గేయకారుడి భావజాలం, గాయకుడి/శ్రోతల సైద్ధాంతిక నేపథ్యం, కళలను ప్రజల పరం చేయాల్సిన ఆవశ్యకతా… లాంటి “noisy” సమస్యలన్నీ చర్చలోకి ప్రవేశిస్తాయి. అవన్నీ అనవసరమని నేను అనను గానీ ఇంత చర్చలో సంగీతం ఆపాతమధురం కాకుండా పోతుందని భయం.
అన్నట్లు హిందుస్థానీ సంగీతంలో సాహిత్యానికి అట్టే విలువ లేదు కదా…
ఒక సరళ నిర్వచనం గురించి నారాయణ. అభిప్రాయం:
09/05/2012 8:55 pm
రవికిరణ్ గారు మరియు శివశంకర్ గారు, మీ అభిప్రాయాలు నాకు చాలా విలువైనవి. ధన్యవాదాలు.
రవికిరణ్ గారు, మీరు కవితాత్మకంగా ఉదహరించిన మనుషులు బాగున్నారు.
నారాయణ.
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి మోహన అభిప్రాయం:
09/05/2012 4:16 pm
తః తః గారు,
సంగీతానికీ సాహిత్యానికీ సమాన స్థానాన్ని మన పూర్వులు ఇవ్వలేదనే నా అభిప్రాయం.
నేను నా అభిప్రాయాన్ని క్రింది శ్లోకముపైన ఆధారము చేసికొని వ్రాసినాను –
సంగీత మపి సాహిత్యం
సరస్వత్యా స్తనద్వయం
ఏక మాపాత మధురం
అన్య దాలోచనామృతం
నా ఉద్దేశములో ప్రజలు ఎక్కువగా సంగీతాన్ని ఎందుకు ఆదరిస్తారంటే, దానిని వినేటప్పుడు సామాన్యముగా మరే ఆలోచన చేయనక్కరలేదు. కాని సాహిత్యపు సంగతి అలా కాదు. చదివేటప్పుడు కాని, వినేటప్పుడు కాని కొద్దిగానైన ఏకాగ్రత చూపాలి. లేకపోతే ఏమి అర్థము కాదు. నా ఉద్దేశములో కవిత్వము పాడుటకు ఉపయోగపడేటట్లు మాత్రమే వ్రాయాలి. సంగీతము ఆ పాటలోని భావాన్ని బాగుగా బహిర్గతము చేయాలి. అప్పుడే ఆ సరస్వతీదేవికి సంతృప్తి కలుగుతుంది. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అంటే ఆ తల్లిని అవమానించినట్లే. విధేయుడు – మోహన
ఛందస్సులో గణితాంశములు గురించి మోహన అభిప్రాయం:
09/05/2012 3:43 pm
కామేశ్వర రావు గారు, అక్షర గణాలకు, అంశ గణాలకు గణ మేరువు ఒకటే, అనగా గురువులు లేని వృత్తము, ఒక గురువుతోటి వృత్తములు, రెండు గురువులతోటి వృత్తములు, ఇత్యాదులు. అక్షరమేరువులో ఒక గురువుతోటి వృత్తములన్నిటికి మాత్రల సంఖ్య ఒక్కటే. ఆ వృత్తాలలో వాటి స్థానములు మాత్రము వేరు, అంతే. కాని అంశగణములలో అలా కాదు. బ్రహ్మ గణములు ఉండే రెండవ ఛందములో గురువులు లేనిది III, ఒక గురువుతో రెండు UI, IIU, రెండు గురువులతో UU. ఒక గురువుతో ఉండే రెంటికీ మాత్రల సంఖ్య ఒకటి కాదు. ఒకే మాత్రల సంఖ్యతో ఉండే సంఖ్యలను కలిపినప్పుడే మనకు విరహాంకుని (ఫిబనాచ్చీ) అంకెలు లభిస్తాయి. అందుకే ఒకే మాత్రల సంఖ్యలు గల వృత్తముల సంఖ్యలను వేరుపరచవలసి వచ్చింది. అంశ గణములకు అక్షరగణములవంటి మేరువును నిర్మిస్తే అందులో గురులఘువుల సంఖ్య తప్ప యితరార్థములను ఇచ్చుటకు వీలు కాదు. విధేయుడు – మోహన
నా కోరిక, నా ప్రార్థన గురించి Rao Vemurio అభిప్రాయం:
09/05/2012 3:37 pm
బ్రహ్మానందం గారూ
వ్యాసం బాగుంది. మీ అనువాదం ఇంకా బాగుంది. అనువాదం చదువుతూన్నట్లు అనిపించనే లేదు. ఇంకా రాయండి.
వేమూరి
ఒక సరళ నిర్వచనం గురించి sivasankar ayyalasomayajula అభిప్రాయం:
09/05/2012 12:35 pm
నారాయణ గారూ- నాగరికత ను చాలా చక్కగా తేలికైన మాటలలో రాసారు. బాగుంది ఇంకా రాస్తూ ఉండండి.
కాల్వీనో కథల నుంచి – 5 గురించి sivasankar ayyalasomayajula అభిప్రాయం:
09/05/2012 12:31 pm
మాధవ్ గారు – ఇప్పటి వరకు మీరు రాసిన ఇటాలో కాల్వీనో కధల అనువాదములు అన్నీ చదివాను. నాకు ఇంతకు ముందు ఇటాలో కాల్వీనో గురుంచి తెలేదు కానీ మీ రచనల ద్వారా ఆయన గురుంచి తెలుసుకోవడం జరిగింది. మీ అనువాదములు అన్నీ చక్కగా ఉన్నాయి. ఇంకా రాస్తూ ఉండండి.
ఇట్లు
శివ
మనం అనుసరించలేకపోయిన భద్రిరాజు కృష్ణమూర్తి గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
09/05/2012 3:39 am
>>కృష్ణమూర్తిగారు ఛందోబద్ధమయిన పద్యాలను కూడ ఎన్నో వ్రాసారని ఎక్కడో చదివినట్లు గుర్తు. ఎవరైనా కొన్ని మచ్చు తునకలను అందిస్తారనుకొంటాను.
భద్రిరాజుగారు చిన్ననాట వ్రాసిన పద్యాలను సంకలనం చేసి “చిన్ననాటి పద్యాలు” అనే పుస్తకంగా ప్రచురించారు. వాటిలో కొన్ని పద్యాలీ కింద లింకులలో చదవవచ్చు:
http://groups.yahoo.com/group/telusa/message/1187
http://groups.yahoo.com/group/telusa/message/1199
భద్రిరాజుగారు స్వయంగా వినిపించిన రెండు మూడు పద్యాలు ఈమాట శబ్దతరంగాలలోనే ఉన్నాయి.
ఛందస్సులో గణితాంశములు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
09/05/2012 3:03 am
మోహనరావుగారు,
>>కాని దానిని సీసము అని చెప్పడము కష్టమే 🙂
అవి రెండు ఆటవెలదులు (ఎత్తుగీతితో కలిపి మూడు) అని మాత్రం సులువుగా చెప్పవచ్చు 🙂
మీరు వివరించాక ఇప్పుడు స్పష్టంగా అర్థమయ్యిందండి ఆ పేరా. అక్షరగణాలూ, అంశగణాలూ, సమరూపాలే (isomorphic)! లఘువుతో మొదలయ్యే ప్రతి అక్షరగణానికీ ముందొక లఘువు తగిలిస్తే చాలు. అందుకే ఈ రెండు రకాల గణాలకూ నిజానికి గణమేరువు ఒకటే. మీరు అంశగణమేరువులో గురువుల సంఖ్య బదులు మాత్రా సంఖ్య తీసుకున్నారు కాబట్టి అక్షరగణ మేరువుకు రెట్టింపు వచ్చింది. ఇక్కడా గురుసంఖ్య తీసుకుంటే రెండూ సరిసమానం!
మరొక విషయం, పాఠకులు గమనించే ఉంటారు – అక్షర, అంశ గణ మేరువులు సుష్ఠైనవి (symmetrical). మాత్రాగణ మేరువు కాదు. ఎందుకో ఊహించడం పెద్ద కష్టం కాదు!
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి తఃతః అభిప్రాయం:
09/05/2012 2:24 am
శ్రీ మోహన: సంగీతానికీ సాహిత్యానికీ సమాన స్థానాన్ని మన పూర్వులు ఇవ్వలేదనే నా అభిప్రాయం. గాయకులను నట విటుల్లొ కలిపేశారు. ముఖ్యంగా మన దక్షిణాది సంప్రదాయంలో గాయకులకు గౌరవం వారు పాడు తున్న భక్తి సాహిత్యం నుంచి వచ్చింది. వారు భాగవతారులుగా పరిగణింపబడ్డారు.
వేదాన్ని పాడకూడదన్న నియమం ఉన్నదనీ, కవి అన్న పదం వేదంలో సాక్షాత్తూ భగవంతుని సూచించే పదంగా ఉన్నదనీ కవిని స్వయంభువుగా పరిభువుగా వేదం అభివర్ణిస్తుందనీ పెద్దల నుంచి విన్నాను. [ఈ కారణంగానే పద్యాలను రాగాలు తీసి పాడేవాళ్ళంటే నాకు కొంత చిన్న చూపు. పౌరాణిక నాటకాలలో నటుల్లొ పీసపాటి వారి పద్ధతి నాకు చాలా ఇష్టం ]
సంగీతాన్ని పొగుడు తున్నప్పుడు సాధారణంగా దొర్లించే, ” శిశుర్వేత్తి …” నిజానికి సాహిత్యం యొక్క గొప్పదనాన్ని సంగీతంతో పోల్చి చెప్పినది. కృష్ణ శాస్త్రి గారి ఒక పాటకు వరస చేసి శాస్త్రి గారికి పాడి వినిపిస్తున్నప్పుడు శ్రీ వోలేటి శాస్త్రి గారి పాదాల చెంత కూర్చున్నారని విన్నాను. సచిన్ దేవ్ బర్మన్ తో సాహిర్ లూధియాన్వీ ప్యాసా పాటల విషయంలో ఈ కారణంగానే విబేధించాడు.
మనోధర్మ [కర్ణాటక] సంగీతం అంటె నా అభిప్రాయంలో సాహిత్యాన్ని మనసుకు ఎక్కించుకుని తదనుగుణంగా పాడేదే. “సామజ వర గమన ” అంటే అర్థం తెలీకుండా సంగీతం నేర్పే వాళ్ళను -పెద్ద సంగీత సంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళను – నేను చూశాను అటువంటివాళ్ళు యెంత ‘మనోధర్మ’సంగీతం పాడతారా అన్నది నా మనో ధర్మ సందేహం.
सुकविता यद्यस्ति राज्येन किम् ॥
“సుకవితాయద్యస్తి రాజ్యేన కిం”
నమస్కారాలతో
తఃతః