పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16471

  1. సుప్తశిల – నాటక పుస్తకం గురించి k dada kalandar అభిప్రాయం:

    02/04/2017 4:01 am

    i want to download all e books. but it not open at least to read. please check it once and give as PDF file as early as possible.

  2. నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    02/03/2017 12:04 pm

    మొదటి సంగతి: ‘అనుక్త మన్యతో గ్రాహ్యమ్’ అన్నట్లు కాళిదాస కుమారసంభవాన్ని ముందుంచుకొని చదివితే గాని ఈ పద్యార్థం బోధపడదు. కాళిదాసు వర్ణించినది పార్వతీ మనోజ్ఞతనువుపై చిలికిన తొలకరి జలకణాల స్థితిగతులను. ఆ కల్పనలోని సౌందర్యాతిశయం, అభినవత్వం, భావధ్వని, ప్రతిపదాన్ని ఆచితూచి ఎన్నుకొన్నప్పటి పరికరాలంకారపు దివ్యశోభ – వ్యాఖ్యాతల మనస్సులనే గాక మహాలంకారికుల దృష్టిని కూడా ఆకర్షించింది. ఆ గంభీరిమను వివరించేందుకు దానిపై లెక్కలేనన్ని వ్యాఖ్యలు వెలిశాయి. అనర్ఘమైన శ్లోకం అది.

    తెలుగు కవి రూపిస్తున్నది అడరు నవాంబుధారలను. అంటే, వర్షర్తువేళ క్రమక్రమంగా విజృంభిస్తున్న నవాంబుధారల స్వస్థితిని. ఎంత నవంనవములైనప్పటికీ అతిశయిస్తున్నవి అంబువుల “ధారలు” కనుకనే అవి జటాటవిలో “విభ్రమించటం” (తిరుగుళ్ళు పడటం) సంభవించింది. తొలుకారు నాటి నీటిచుక్కలైతే జటాటవిలో విభ్రమించే అవకాశమే ఉండేది కాదు. బిందువులకు విభ్రమించటం ఉండదు. జలధారలు కాబట్టే విభ్రమణాన్ని పొందాయి. ఎట్లా పొందాయి? అంటే, పరమేశ్వరుని వలె పార్వతీదేవి కూడా కేశపాశాన్ని కపర్దజటాజూటోపమంగా బంధించి ఉన్నందువల్ల ఆ మహాజటాటవిలో అంబుధారలు చిక్కుకొని కేశావర్తాల వెంబడిని తిరుగుళ్ళుపడవలసివచ్చిందని భావం. దట్టమైన చుట్టుకురులకోసం పాపం పార్వతికి సైతం జటాటవిని కల్పింపవలసివచ్చింది. అంతకు ముందు పద్యంలోనే (6-108) పార్వతి అందమైన జడలపై తొలకరి నీటిబిందువులు ముత్యాల సేసల వలె మనోహరంగా ఉండటాన్ని వర్ణించాడు. అంతలోనే ఆ సంగతిని మర్చిపోయి, లేనిపోని జటాటవిని తెచ్చిపెట్టుకోవటం వల్ల – ఆ జటాటవిలో విభ్రమింపవలసివచ్చిన “అడరు నవాంబుధార”లను తెచ్చిపెట్టుకొని తబ్బిబ్బయ్యాడు. అంతకు క్రితమే నెఱిజడలతో ఉన్న పార్వతీదేవి అంతలోనే వేణీబంధకపర్దిని అయినప్పటికీ, అది సమున్నద్ధశిఖండకం కాక, ఆవర్తాకారంలో కుంభీబంధసంయుక్తమై సముల్లేఖ్యంగా ఉన్నప్పటికీ – దానికి జటాటవితో తాద్రూప్యం సరికాదని చూసుకోలేదు. అననురూపమైన ఆ జటాటవిలో వర్షానవాంబుధారలు విభ్రమిస్తుండటం పార్వతీ కేశవర్ణనకు శోభాహేతువు కాదని కవి గ్రహింపలేదు.

    అంబుధారలు “వెల్వడి, చనుదెంచి” అంటే, పార్వతీజటాటవిలో విభ్రమించి విభ్రమించి, అక్కడినుంచి బైటపడి వచ్చి – అన్నమాట. “వెల్వడి” అంటే సరిపోయేది. “వెల్వడి, చనుదెంచటం” ఎందుకు? వెల్వడిన తర్వాత ఎక్కడికి చనుదెంచినట్లు? పోనీ, ఫాలాగ్రసీమకో ఎక్కడికో అక్కడికి చనుదెంచిన తర్వాత, “రాలుగొనటం” ఎట్లా సాధ్యమైంది? ‘రాలుగొను’ అన్న ఆ విచిత్రమైన ధాత్వర్థానికి కవి అనుకొన్న భావం ఏమిటో కవికే తెలియాలి. ఎంత సూర్యరాయ నిఘంటువు సర్దిచెప్పినా, ‘గళితమై, క్రిందికి జాఱి’ అన్న అర్థంలో ‘రాలు’ ధాతువుపై క్త్వార్థకమైన ‘కొను’ ధాతువు చేరి ‘రాలుగొని’ అని స్వార్థంలో రూపం ఎట్లా ఏర్పడుతుంది? నీళ్ళకు ‘రాలటం’ ఉండదు కనుక జలధారలకు ‘రాలుగొను’ అన్న భావార్థక స్వతంత్రక్రియాకల్పన సార్థకం కాదు. ఆముక్తమాల్యద (4-82) లో “నవమేఘపృథుకములకు రాలె నొయ్యన వడగండ్లు పాలపండ్లు” అన్నప్పుడు అక్కడ శిశువులకు పండ్లు రాలటమూ ఉన్నది; మేఘాల నుంచి వడగండ్లు రాలటమూ ఉన్నది. అది సార్థకమైన ప్రయోగం. ప్రకృతపద్యంలోని నీటిధారలు ‘రాలుగొనటం’ వ్యర్థకల్పితమని గ్రహించాలి. అందుకే దానికి ప్రయోగాంతరాలు దొరకవు.

    కేశబంధం నుంచి (ఫాలస్థలికి కాబోలు) వెల్వడి, (అక్కడినుంచి) చనుదెంచి, రాలుగొంటూ – అంటే, రాలుకుంటూ (క్రిందికి జారుతూ) వచ్చిన జలధారలు కనురెప్పలపై పడి, ఆ పక్ష్మములు (కనురెప్పలు) పక్ష్మలములు (దట్టమైన వెంట్రుకలు కలవి) కావటంవల్ల “వెడ నిల్చి” = కొద్దిసేపు నిలిచిపోయాయన్నమాట. నిలిచినవి ప్రథమోదబిందువులు కాదని, అడరు నవాంబు“ధార”లని అంతలోనే కవి మర్చిపోయాడు. కాళిదాసు వర్ణనలో “ఉదబిందువు-లు” అని బహువచనం ఉన్నది కాబట్టి వాటికి అవిరళత్వం చెప్పబడిన మాట నిజమే. ఎంత అవిరళములైనా, అవి నీటిచుక్కలు. “అడరు నవాంబుధారలు” కావు. ఎంత దట్టమైన కనురెప్ప అయినా, ప్రథమోదబిందువులకు వలె అంబు“ధార”లకు ఆ రెప్పపై నిలుకడ ఎలా సాధ్యమని తెలుగు కవికి తోచలేదు. ‘స్థితాః క్షణం పక్ష్మసు’ అన్నది ‘పక్ష్మములన్ వెడ నిల్చి’ అని తెలుగయింది కాని, అది ఉదబిందువులకు అనువర్తించినట్లుగా అంబుధారలకు వర్తింపదు. “ధార” అన్న తర్వాత, అవిచ్ఛిన్నగతి మూలాన “నిలుకడ”కు వీలుండదు కదా.

    ‘తాడితాధరాః’ అన్న కర్మవాక్యం తెలుగులో ‘మోవిపై పడి’ అయింది. మోవిపై పడిన ధారలు ఏమైనాయో తెలుగు కవి చెప్పకపోవటం వల్ల – క్రిందిపెదవి యొక్క స్వాభావికమృదుత్వం వ్యంజింపబడిన సంగతి శ్లోకాన్ని చదవనివాళ్ళకు తెలియదు. అధ్యాహారవిషయస్ఫురణ కలుగదు. పయోధరముల ఉత్సేధం (ఉన్నతి, కాఠిన్యము), వాటిపై ఉదబిందువుల నిపాతం, తత్ఫలితంగా ఉదబిందువులు చూర్ణితాలు కావటం అన్న కాళిదాసు శ్లోకంలోని అద్భుతావహమైన పరిణామక్రమమంతా తెలుగులో “మోవిపైఁ బడి”, “కుచఘట్టనన్” అన్న కరుకు మాటలతో కుప్పకూలిపోయింది. ఆ కుచఘట్టన వలన – అంటే, స్తనములతోడి ఒరపిడి వలన ఆ అంబుధారలు చెదరి = చెల్లాచెదరై(నందువల్ల); పాఱి = పరువులెత్తి లేదా పునఃప్రవాహగతిని పొంది; రయంబునన్ = వేగంగా (?); ముత్తరంగలన్ = మూడు వళులనెడి విషమరేఖలయందు (తత్తన్మధ్యములందు); మడుగులువాఱి = నిమ్నోన్నతములందు చిక్కినవైనందున మడుగులు కట్టి (?) – అని భావం. ఒక్క వాక్యశకలంలో ఇన్ని అన్వయింపని వ్యర్థపదాలెందుకు?

    కొందరు విమర్శకులు “నాభికిన్ + ఎడము + ఆనక + చొచ్చెను” అని పదచ్ఛేదం చేయటం సరికాదు. ఆ పక్షాన యతిభంగం. కొందరు వ్యాఖ్యాతలు “నాభికిన్ + ఎడ + మానక = చోటువిడువక” అని వ్రాసిన అర్థం కూడా సరిపడదు. నాభికి చోటువిడువకపోవటం ఏమిటి? దానికి ‘స్తనముల రాపుచే చెదరి, ప్రవహించి, మూడు వళులందు మడుగులుగా నయి, నాభియందు సంపూర్ణముగా ప్రవేశించెను’ – అని ముద్రితప్రతులలో ఉన్న తాత్పర్యం ఎట్లా సరిపడుతుంది? ‘మడుగు కట్టిన నీటికి’ అన్న అర్థంలో ‘మడుగులు వాఱటం’ అన్న క్రియారూపం ఎట్లా ఏర్పడుతుంది? “మడుగులుగా” అయిన తర్వాత, మళ్ళీ పాఱే ప్రవాహగతి ఎట్లా సిద్ధిస్తుంది? “చోటు విడువక”, “సంపూర్ణముగా ప్రవేశించటం” ఏమిటి? ఇన్ని వ్యర్థపదాలకు అర్థం ఎట్లా పొందుపడుతుంది?

    అక్కడ నిజానికి, “నాభి + కెడ + మానక” అని చదువుకోవాలి. “కెడ” అంటే పార్శ్వసంగతి. “చెదరి తోఁ బఱతెంచు చెందమ్మిఱేకులు గెడగొని మొగుపుఁ గెంగేలు గాఁగ” అని కుమారసంభవం (9-72) లోనిదే మరొక ప్రయోగం. జలధారలు వళుల వద్ద మడుగులు కట్టి ఆగిపోక, నాభి వైపునకు సైతం పరువులువారటం మానక – అని కవిహృదయం.

    నీటిచుక్కల నాభీప్రవేశాన్ని అభివర్ణించటం నాభియొక్క లోతును సూచించటానికి – అన్నది భావ్యమే. వళులలోనికి జారిన ఉదబిందువులు “చిరేణ” = నెమ్మది నెమ్మదిగా పొక్కిలిని చేరాయని మాత్రమే కాళిదాసు. “మానక చొచ్చెను” అన్నప్పుడు అంబుధారల ప్రవాహగతి అవిచ్ఛిన్నంగా కొనసాగి, శ్లోకభావం భగ్నమైపోయింది. ‘చేరెను’ అనక, “చొచ్చెను” అన్నందువల్ల, అంబుధారలు నాభిలోనికి ప్రవేశించి అంతర్ధానమైపోయినట్లు ఊహింపవలసివస్తుంది. అది నాభియొక్క ప్రకరణోచితమైన గంభీరిమకు తగని పదసంగతి. ఆ విధంగా జటారణ్యంలోనుంచి వెలువడి, చనుదెంచి, రాలుగొని, దట్టమైన కనురెప్పలపైని ఆగి, కుచఘట్టన మూలాన చెల్లాచెదరైన నవాంబుధారలు వళుల వద్ద మడుగులు కట్టి, ఆ మడుగులు మళ్ళీ ప్రవాహగతిని మానక నాభికి అభిముఖంగా పరుగులుతీసి, ఆ నాభియందు చొరబడటం ప్రకృతిసహజం కాదని, కవితాత్మకం అసలే కాదని, నాయికాసౌందర్యవర్ణనలో అనౌచిత్యాపాదకమని కవికి తోచలేదు.

    అద్భుతావహమైన కాళిదాసు శ్లోకానికి అసమర్థమైన అనువాదం ఇది. ఇందులో ఏ అలంకారమూ లేదు. శ్లేష అసలే పొందుపడదు. స్వభావోక్తికి తావులేదు. పరికరం పద్యం మొదట్లోనే భగ్నమైపోయింది.

    పెద్దలు ఈ మాటను అంటున్నందుకు మన్నించాలి. పూర్వకవుల పద్యాలలో ఈ విధంగా ఇన్ని సరిపెట్టుకోవలసిన అన్వయదోషాలు కనబడేది మచ్చుకు ఒకటి కూడా ఉండదు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  3. సూర్య శతకం గురించి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి అభిప్రాయం:

    02/03/2017 11:08 am

    సూర్యశతకం లోని శ్లోకాలు మై ఇండ్ మీడియా సైట్ లో ఫిబ్రవరి 4, 2017 నుండి స్వరమాలిక వారి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి శనివారం మధ్యాహ్నం 1.30 pm IST శ్లోకాలు భావాలు వినవచ్చును.

    వీటి తాత్పర్యానికి శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు ఇచ్చిన ప్రతిపదార్థం తో ప్రచురింపబడిన పుస్తకం ఆధారం.
    వెబ్ సైట్: (లైవ్) — ఆర్కైవ్స్ప్రతిపదార్థం.

  4. తాటిపండుకల్లు గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    02/02/2017 7:12 pm

    Excellent poem.

    కవిత మొత్తంలో అందంగా ఇమడని ఒకేఒక్క మాట, “బుద్ధిమంతుడు.”

    మరో విషయం. తాటికల్లు గురించి నాకు మరుపురాని అనుభవాలున్నాయి. పండిన తాటిపండునుంచి కల్లు రాదనుకుంటాను. ముదిరిన ముంజెలొస్తాయి. కవి ఉద్దేశం వేరుకావచ్చు.

    ఏది ఏమయినా I am a strong believer in Roland Barthes. It’s the reader that really completes a poem.

    అబినందలతో,
    వేలూరి వేంకటేశ్వర రావు.

    ps: When I was the Chief Editor of eemaaTa, where were you? Hybernating?

  5. గజేంద్ర మోక్షం: వెక్కిళ్ళ పురాణం గురించి Uma Kaundinya అభిప్రాయం:

    02/02/2017 3:51 pm

    In the compilation, “The Best of Mc Sweeney’s” (2013) there were several gaps between the words, in addition to the one (dau ghters) cited by Mr. Ramana Murthy. Here are some: ad opt, yo unger, b uyer, b ig, d inner, and so on.

    I think, the story was first published in The Mc Sweeney’s, 6th issue. And, Mc Sweeney’s is a quarterly, editied by Dave Eggers and Jordan Bass.

    Regards.

    Uma Kaundinya

  6. గులకరాళ్ళు గురించి Deepthi అభిప్రాయం:

    02/02/2017 6:02 am

    చాలా బాగా రాసావు మానసా!

  7. గులకరాళ్ళు గురించి బివివి ప్రసాద్ అభిప్రాయం:

    02/02/2017 3:24 am

    Beautiful poem!

  8. చిత్రం – ‘బాపు’రే విచిత్రం! గురించి వేణు అభిప్రాయం:

    02/02/2017 2:54 am

    ఈ వ్యాసం ఆలస్యంగా చదివాను. ఆధునిక తెలుగు సాహిత్యంలో క్లాసిక్స్ గా పేరుపొందిన పుస్తకాలు చాలావాటికి బాపు ముఖచిత్రాలను వేశారని చెప్పవచ్చు. ఎప్పటికీ గుర్తుండిపోయే ముఖచిత్రాలను ఎన్నో వేశారాయన.

    బాపు బొమ్మల ప్రత్యేకత, పరిణామాల గురించి రాస్తూ వాటిని నిరూపించే చిత్రాలను ఇవ్వటం బాగుంది. బాపు చిత్రాల్లో నచ్చిన విషయాలతో పాటు ఆ బొమ్మల పరిమితులను కూడా చర్చించటం మంచి విషయమే. వీలైనంత సమగ్రంగా, సాధ్యమైనంత సమతూకంగా రాయటానికి ప్రయత్నించిన వ్యాసమిది. రచయితకు అభినందనలు!

  9. నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి రవి అభిప్రాయం:

    02/02/2017 2:45 am

    అమోఘమైన పద్యాన్ని గురించి ఇంపుగా చెప్పారు. ఈ పద్యం తూగులోనే కవి భావం ఉందనిపిస్తుంది.

    ఆ రుచిరాననాబ్జదరహాసవిలాసవికాసభాసినీహారకరాతిభాతిన్ అమలాంగశరీరతుషారదీప్తికాంత – ఇంతవరకూ ఎక్కువభాగం అల్పప్రాణాక్షరాలతో, అనుప్రాసలతో సుకుమారంగా అలరారిన ఆ “ఉరునగంబు” తర్వాత పాదాలలో, ఘర్మజలం ప్రస్తావన రాగానే (సమ్మదరసోత్కటఘర్మజలంబు పర్వి పొల్పారె హిమాచలంబు నమరాధిపవాహిని) శబ్దాలకూర్పులో ఓజోగుణాన్ని సంతరించుకుని “కప్పినట్టిదై” అన్న చివరి క్రియతో, ఒకింత బరువుగా, అద్బుతంగా ముగుస్తోంది.

    సంస్కృతమహాకావ్యం కుమారసంభవాన్ని కూడా ప్రస్తావించి వివరించడం బావుంది.

    ఇదే ఘట్టంలో ఈశ్వరుని అవస్థను సంస్కృత”నాటక”రచయిత వామన భట్టబాణుడు చాలా సులభంగా ఇలా వర్ణించాడు.

    తదను యుగపదీశః పార్వతీవక్త్రపద్మే |
    స్మితవికసితగణ్డే ప్రోహిణోల్లోచనాని ||

    (ఆపై సమయస్వరూపుడైన ఈశ్వరుడు పార్వతి ముఖమనే పద్మమున, చిరునవ్వుతో వికసించిన చెక్కిలియందు తన చూపులను సారించాడు. యుగపత్ = అన్న ప్రయోగం గమనార్హం)

    ఆ వెంటనే పార్వతి –

    పులకితతనురంతర్భావమావేదయన్తీ |
    దరనిమితముఖేందుః సా చ సవ్రీడమస్థాత్ ||

    (మనసున ప్రణయభావమును తలంపుచూ తనువు పులకరింపగా, చిరునవ్వుతో చంద్రబింబమువంటి మోమును దించుకుని, లజ్జ అను అవస్థను పొందెను.)

    పై ఘట్టం నిష్కంభకం. అంటే నారదుడు మహేంద్రునికి శివపార్వతుల గురించి చెప్పిన సందర్భంలోనిది. నారద “ముని” నోట ప్రణయోऽదంతం, వచ్చింది కాబట్టి సంక్షిప్తంగా ముగించాడు కవి. ఈ చిన్న శ్లోకాల్లో కూడా శివుని పక్షాన పద్మముఖం అని, పార్వతి పక్షాన (పద్మవైరి అయిన) ఇందుముఖం అని మెలిపెట్టి చమత్కరించాడాయన.

    – మంచి పద్యాన్ని, అద్భుతమైన భావాన్ని వివరించినందుకు, భట్టబాణుని గుర్తు చేయించినందుకు మరోసారి ధన్యవాదాలు.

  10. నేలసంపెంగ గురించి రవి అభిప్రాయం:

    02/02/2017 12:59 am

    70’s లో వచ్చిన ముగ్ధమైన సినిమాను, దానికి మూలమైన కథను చక్కగా అనువదించి వ్రాశారు. ఈ సినిమా చూసిన తర్వాత విద్యా సిన్హా, లత పాట, ఆ రజనీగంధ పరిమళాలే కొన్ని రోజులు అలా నిలిచిపోయాయి.

    అయితే – మనసుకు నచ్చిన వాడు రజనీగంధ పూలను తీసుకువస్తాడని అందమైన కలలు కంటూ, పక్కింటి బాబు వస్తే వాణ్ణి ఒళ్ళో పెట్టుకుని కథలు చెబుతూ ఉండే అందమైన అమ్మాయి ని – టీవీ సీరియళ్ళూ, ఆఫీసులో ఓవర్టైముల ఈ రోజుల్లో ఊహించలేం.

    పూలు తీసుకు వచ్చే మగవాళ్ళు, కలలు కనే అందమైన అమ్మాయిలూ ఇద్దరూ ఇప్పుడు లగ్జురీ యే. 🙂